YSRTP Chief YS Sharmila House Arrest At Lotus Pond In Hyderabad - Sakshi
Sakshi News home page

వైఎస్‌ షర్మిల హౌజ్‌ అరెస్ట్‌.. లోటస్‌ పాండ్‌ వద్ద ఉద్రిక్తత!

Published Fri, Aug 18 2023 9:43 AM | Last Updated on Fri, Aug 18 2023 4:44 PM

YSRTP YS Sharmila House Arrest At Hyderabad Lotus Pond - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో లోటస్‌ పాండ్‌లోని ఆమె నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో, అక్కడ ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. వైఎస్‌ షర్మిలను పోలీసులు శుక్రవారం ఉదయం హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. అయితే, షర్మిల నేడు సిద్దిపేటలోని గజ్వేల్‌ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. కాగా, జగదేవ్‌పూర్‌ మండలంలోని తీగుల్‌ గ్రామంలో షర్మిల పర్యటించాల్సి ఉండగా.. శుక్రవారం ఉదయమే పోలీసులు ఆమె నివాసానికి చేరుకున్నారు. అనంతరం, జవదేవ్‌పూర్‌ వెళ్లకుండా షర్మిలను హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. కాగా, దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయని ఇటీవల తీగుల్‌ గ్రామ ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఈనేపథ్యంలో వారిని కలిసేందుకు షర్మిల ప్లాన్‌ చేసుకున్నారు. దీంతో, పోలీసులు వైఎస్‌ షర్మిలను అడ్డుకున్నారు. 

ఇది కూడా చదవండి: వర్షాలపై అప్రమత్తంగా ఉండండి: హైకోర్టు ఆదేశాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement