కరోనాతో మరణించిన జర్నలిస్టులకు రూ. 2 లక్షలు  | TSMA To Distribute Financial Assistance Of 2 Lakhs Each To Journalists Who Died With Civid-19 | Sakshi
Sakshi News home page

కరోనాతో మరణించిన జర్నలిస్టులకు రూ. 2 లక్షలు 

Published Tue, Dec 7 2021 3:59 AM | Last Updated on Tue, Dec 7 2021 3:59 AM

TSMA To Distribute Financial Assistance Of 2 Lakhs Each To Journalists Who Died With Civid-19 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనాతో మరణించిన జర్నలిస్టులకు మీడియా అకాడమీ తరఫున రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని ఈనెల 15న ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. 63 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఈ సాయం అందిస్తామని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నిధులు సమకూర్చిన సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మార్చి నుంచి డిసెంబర్‌ 6వ తేదీ వరకు ఇతర కారణాలతో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబాలకు కూడా అదేరోజు రూ.లక్ష చెక్కుల పంపిణీ చేస్తారని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement