TS: మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్‌ | Petition Filed In Telangana High Court On Free Travel For Women In RTC Buses, Details Inside - Sakshi
Sakshi News home page

TS: మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్‌

Published Thu, Jan 18 2024 11:13 AM | Last Updated on Thu, Jan 18 2024 12:05 PM

Petition In Telangana High Court On Free Travel For Women - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష కిందకే వస్తుందని నాగోల్‌కి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి పిటిషన్‌ వేశారు. కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో ఉచిత పథకంపై అధికారం రాష్ట్రానికి లేదని.. జీవో 47 రద్దు చేయాలని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని నిలిపివేస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానాకి పిటిషనర్‌ విజ్ఞప్తి చేశారు.

ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండడంతో సీట్ల కోసం గొడవలు కూడా జరుగుతున్నాయి. పురుషులకు సీట్లు కూడా దొరకని పరిస్థితి ఉంది. మహిళల రద్దీ కారణంగా టికెట్లు కొనుగోలు చేసి వెళ్లే పురుష ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషనర్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement