రైతు వర్సెస్‌ యూట్యూబర్‌.. పీఎస్‌కు చేరిన పంచాయితీ Farmer Versus Youtuber Clash Creates Nuisance In Peddapalli | Sakshi
Sakshi News home page

పెద్దపల్లి: రైతు వర్సెస్‌ యూట్యూబర్‌.. పీఎస్‌కు చేరిన పంచాయితీ, ఇంతకీ తప్పెవరిది?

Published Fri, Jun 28 2024 11:47 AM | Last Updated on Fri, Jun 28 2024 12:38 PM

Farmer Versus Youtuber Clash Creates Nuisance In Peddapalli

పెద్దపల్లి, సాక్షి: వాడలో మొదలైన చిన్న గొడవ.. చిలికి చిలికి గాలివానగా మారింది. హైవే మీదకు చేరి ఆందోళన చేపట్టే దాకా పోయింది. చివరకు పోలీసుల ఎంట్రీతో ఆ పంచాయితీ.. పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. 

పెద్దపల్లి పట్టణంలో గౌరెడ్డిపేటకు చెందిన ఓ రైతు తన ఎడ్లబండిని రోడ్డుపై ఉంచాడు. దీంతో అక్కడ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈలోపు స్థానికంగా ఉండే ఓ యూట్యూబర్‌ ఆవేశంతో ఊగిపోతూ అక్కడికి వచ్చాడు. సదరు రైతును దుర్భాషలాడుతూ కొట్టాడు. అది భరించలేకపోయిన ఆ రైతు.. ఆ ఎడ్ల బండితో రాజీవ్‌ రహదారిపై చేరి ఆందోళన చేపట్టాడు. ఈ క్రమంలో అక్కడా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు. రైతుతో పాటు సదరు యూట్యూబర్‌ను అర్ధరాత్రి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి పంచాయితీ నిర్వహించారు. అయితే ఈ వివాదం ఎలా ముగిసిందన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement