తెలుగు టైటాన్స్‌కు నిరాశ | Disappointment for Telugu Titans | Sakshi
Sakshi News home page

తెలుగు టైటాన్స్‌కు నిరాశ

Published Thu, Dec 7 2023 12:28 AM | Last Updated on Thu, Dec 7 2023 12:28 AM

Disappointment for Telugu Titans - Sakshi

అహ్మదాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. మాజీ చాంపియన్‌ పట్నా పైరేట్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 28–50 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. టైటాన్స్‌ తరఫున కెపె్టన్‌ పవన్‌ సెహ్రావత్‌ 11 పాయింట్లతో రాణించాడు.

పట్నా తరఫున సచిన్‌ 14 పాయింట్లు స్కోరు చేశాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌ 57–27తో హరియాణా స్టీలర్స్‌పై ఘనవిజయం సాధించింది. యూపీ యోధాస్‌ తరఫున సురేందర్‌ 13 పాయింట్లు, ప్రదీప్‌ నర్వాల్‌ 12 పాయింట్లు స్కోరు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement