-
PKL 10: పుణేరీ... తొలిసారి చాంపియన్గా
అద్భుతమైన ఆటతో లీగ్ దశలో అగ్ర స్థానం... 22 మ్యాచ్లలో 17 విజయాలు... స్కోరు తేడాలో ఎవరికీ అందనంత ఎత్తులో ముందంజ... ఈ సీజన్లో ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన పుణేరీ పల్టన్ తమ జోరును తగ్గించకుండా అసలు పోరులోనూ సత్తా చాటి తమ స్థాయిని ప్రదర్శించింది... గత సీజన్లో త్రుటిలో చేజారిన ట్రోఫీని ఈసారి ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా ఒడిసి పట్టుకుంది... ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తొలిసారి చాంపియన్గా సగర్వంగా నిలిచింది. మొదటిసారి ఫైనల్ చేరిన హరియాణా స్టీలర్స్ ఆరంభంలో ఆకట్టుకున్నా... ఒత్తిడిలో తలవంచి రన్నరప్కే పరిమితమైంది. సాక్షి, హైదరాబాద్: కబడ్డీ అభిమానులను 91 రోజుల పాటు అలరించిన ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ అట్టహాసంగా ముగిసింది. అన్ని విధాలా ఆధిపత్యం ప్రదర్శించిన పుణేరీ పల్టన్ మొదటిసారి లీగ్ చాంపియన్గా అవతరించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఆసక్తికరంగా జరిగిన ఫైనల్లో పల్టన్ 28–25 పాయింట్ల తేడాతో హరియాణా స్టీలర్స్పై విజయం సాధించింది. తొలి అర్ధ భాగం ముగిసేసరికి 13–10తో ఆధిక్యంలో నిలిచిన పల్టన్ బలమైన డిఫెన్స్తో చివరి వరకు దానిని నిలబెట్టుకోవడంలో సఫలమైంది. గత సీజన్ ఫైనల్లో ఓడిన పుణేరీ వరుసగా రెండోసారి తుది పోరుకు అర్హత సాధించి టైటిల్ను సొంతం చేసుకుంది. మ్యాచ్లో ఇరు జట్లు ఆరంభం నుంచి జాగ్రత్తగా ఆడుతూ డిఫెన్స్కే ప్రాధాన్యతనిచ్చాయి. ఫలితంగా తొలి 10 నిమిషాల్లోనే 13 ఎంప్టీ రైడ్లు వచ్చాయి. ప్రతీ పాయింట్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడగా... ఒకదశలో పుణేరీ 9–7తో స్వల్ప ఆధిక్యంలోనే ఉంది. అయితే ఈ దశలో 19వ నిమిషంలో పంకజ్ మోహితే డు ఆర్ డై రెయిడ్ మ్యాచ్ దిశను మార్చింది. ఒకేసారి 4 పాయింట్లు సాధించి అతను పుణేను ముందంజలో నిలిపాడు. ఆ తర్వాత ఈ అంతరాన్ని తగ్గించడంలో స్టీలర్స్ విఫలమైంది. 23వ నిమిషంలో స్టీలర్స్ను పల్టన్ జట్టు ఆలౌట్ కూడా చేయడంతో ఆట పూర్తిగా వారివైపు మొగ్గింది. చివరి పది నిమిషాల్లో హరియాణా పుంజుకున్నా అది విజయానికి సరిపోలేదు. రెండో అర్ధ భాగంలో ఇరు జట్లూ 15 పాయింట్లు చొప్పున సమానంగా స్కోరు చేసినా... తొలి అర్ధ భాగంలో వెనుకబడిన 3 పాయింట్లే చివరకు స్టీలర్స్ ఓటమికి కారణమయ్యాయి. పల్టన్ తరఫున పంకజ్ మోహితే 9 పాయింట్లు సాధించగా... మోహిత్ 5, కెప్టెన్ అస్లమ్ 4 పాయింట్లు సాధించారు. స్టీలర్స్ ఆటగాళ్లలో అత్యధికంగా శివమ్ 6, సిద్ధార్థ్ దేశాయ్ 4 పాయింట్లు స్కోరు చేశారు. విజేతగా నిలిచిన పుణేరీ జట్టుకు రూ. 3 కోట్లు, రన్నరప్ హరియాణా జట్టుకు రూ. 1 కోటీ 80 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ విజేత జట్టుకు ట్రోఫీని అందజేశాడు. -
నేడే ‘ఫైనల్’ కూత...
సాక్షి, హైదరాబాద్: మూడు నెలలుగా క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తోన్న ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ ఆఖరి అంకానికి రంగం సిద్ధమైంది. గచ్చిబౌ లి ఇండోర్ స్టేడియంలో నేడు జరిగే ఫైనల్ పోరుతో పదో సీజన్కు తెర పడనుంది. తొలిసారి తుది సమరానికి చేరుకున్న హరియాణా స్టీలర్స్తో గత ఏడాది రన్నరప్ పుణేరి పల్టన్ అమీతుమీ తేల్చుకోనుంది. రాత్రి 8 గంటలకు మొదలయ్యే ఈ ఫైనల్కు సంబంధించి టికెట్లన్నీ అమ్ముడుపోవడం విశేషం. ఇప్పటి వరకు తొమ్మిది సీజన్లు జరగ్గా... పుణేరి పల్టన్ రెండోసారి... హరియాణా స్టీలర్స్ తొలిసారి ఫైనల్ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అంతిమ సమరంలో ఏ జట్టు గెలిచినా తొలిసారి ప్రొ కబడ్డీ లీగ్ ట్రోఫీ టైటిల్ను ముద్దాడుతుంది. ఈ లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు పుణేరి పల్టన్, హరియాణా స్టీలర్స్ జట్లు ముఖాముఖిగా 14 సార్లు తలపడ్డాయి. 8 సార్లు పుణేరి జట్టు... 5 సార్లు హరియాణా జట్టు గెలుపొందాయి. ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. తాజా సీజన్లో నిర్ణీత 22 లీగ్ మ్యాచ్లు పూర్తి చేసుకున్న పుణేరి జట్టు 17 మ్యాచ్ల్లో నెగ్గి, రెండింటిలో ఓడి, మూడింటిని ‘టై’ చేసుకొని 96 పాయింట్లతో ‘టాపర్’గా నిలిచి నేరుగా సెమీఫైనల్ చేరుకుంది. మరోవైపు హరియణా 70 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్–2లో గుజరాత్ జెయింట్స్ను ఓడించి, సెమీఫైనల్ చేరిన హరియాణా ఈ కీలక పోరులో 31–27తో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ను బోల్తా కొట్టించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. పుణేరి పల్టన్ తరఫున మోహిత్ గోయట్ ఈ సీజన్లో అత్యధికంగా 117 రెయిండింగ్ పాయింట్లు సాధించాడు. డిఫెన్స్ విభాగంలో మొహమ్మద్ రెజా 97 ట్యాకిల్ పాయింట్లు సంపాదించాడు. పుణేరి పల్టన్ జట్టు కెపె్టన్ అస్లమ్ ఇనామ్దార్ ఆల్రౌండ్ ప్రదర్శనతో 164 పాయింట్లతో అదరగొట్టాడు. మరోవైపు హరియాణా స్టీలర్స్ రెయిడర్ వినయ్ ఏకంగా 160 పాయింట్లు కొల్లగొట్టాడు. డిఫెండర్ రాహుల్ 71 పాయింట్లు, కెపె్టన్ జైదీప్ 69 పాయింట్లతో ఆకట్టుకున్నారు. -
టైటిల్ పోరుకు పుణేరి, హరియాణా
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్లో కొత్త చాంపియన్ ఖాయమైంది. నిరుటి రన్నరప్ పుణేరి పల్టన్తో అమీతుమీకి తొలిసారి ఫైనల్కు చేరిన హరియాణా స్టీలర్స్ సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శుక్రవారం హైదరాబాద్లోనే ఫైన ల్ పోరు జరుగనుంది. సెమీఫైనల్స్లో ‘హ్యాట్రిక్’ టైటిళ్ల విజేత పట్నా పైరేట్స్, రెండు సార్లు చాంపియన్గా నిలిచిన జైపూర్ పింక్పాంథర్స్ ప్రత్యర్థుల చేతుల్లో పరాజయం చవిచూశాయి. తొలి సెమీస్లో పుణేరి పల్టన్ ధాటికి 37–21తో టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన పట్నా పైరేట్స్ నిలువలేకపోయింది. పుణేరి తరఫున కెపె్టన్, ఆల్రౌండర్ అస్లామ్ ముస్తఫా (7పాయింట్లు), రెయిడర్ పంకజ్ మోహితే (7) అదరగొట్టారు. మిగతా వారిలో మొహమ్మద్ రెజా చియనె 5, మోహిత్ గోయత్ 4, సంకేత్, అభినేశ్ చెరో 3 పాయింట్లు చేసి జట్టు విజయంలో భాగమయ్యారు. పట్నా జట్టులో రెయిడర్ సచిన్ చేసిన 5 పాయింట్లే అత్యధిక స్కోరు! మిగిలిన వారిలో మన్జీత్, సుధాకర్ చెరో 4 పాయింట్లు చేశారు. అనంతరం హోరాహోరీగా జరిగిన రెండో సెమీ ఫైనల్లో హరియాణా స్టీలర్స్ 31–27తో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్పాంథర్స్ను కంగుతినిపించింది. స్టీలర్స్ రెయిడర్ వినయ్ 20 సార్లు కూతకు వెళ్లి 11 పాయింట్లు తెచ్చిపెట్టాడు. శివమ్ పతారే (7) కూడా అదరగొట్టాడు. మిగతావారిలో ఆల్రౌండర్ ఆశిష్ 4, డిఫెండర్లు రాహుల్ సేథ్పాల్ 3, మోహిత్ 2 పాయింట్లు సాధించారు. జైపూర్ తరఫున రెయిడర్ అర్జున్ దేస్వాల్ (14) ఒంటరి పోరాటం చేశాడు. డిఫెండర్ రెజా మిర్బగెరి 4, భవానీ రాజ్పుత్ 3 పాయింట్లు చేశారు. -
ప్రొ కబడ్డీ ‘ప్లే ఆఫ్స్’కు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: పదో సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) కీలక దశ మ్యాచ్లకు హైదరాబాద్ వేదికవుతోంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమ, బుధ, శుక్రవారాల్లో ‘ప్లే ఆఫ్స్’ మ్యాచ్లు జరుగుతాయి. ఈ సందర్భంగా శనివారం ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. లీగ్ చైర్మన్ అనుపమ్ గోస్వామి టోర్నీ విశేషాలను వెల్లడించారు. గత తొమ్మిదో సీజన్లతో పోలిస్తే ఈ సారి టోర్నీ ఇంకా ఎక్కువ సంఖ్యలో అభిమానులకు చేరువైందని... 12 ఫ్రాంచైజీలకు చెందిన నగరాలు అన్నింటిలో మ్యాచ్లను విజయవంతంగా నిర్వహించగలిగామని ఆయన అన్నారు. గ్రూప్ దశలో టాప్–2లో నిలిచిన పుణేరీ పల్టన్, జైపూర్ పింక్ పాంథర్స్ ఇప్పటికే సెమీఫైనల్కు చేరుకున్నాయి. సెమీస్లో తలపడే ఇతర రెండు జట్లను ఖరారు చేసేందుకు రెండు ఎలిమినేటర్ మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో ఢిల్లీని పటా్న, గుజరాత్ను హర్యానా ఢీకొంటాయి. ఈ నెల 26న ఎలిమినేటర్ మ్యాచ్లు, 28న సెమీఫైనల్స్, మార్చి 1న ఫైనల్ నిర్వహిస్తారు. హైదరాబాద్ నగర అభిమానులు ఈ మ్యాచ్లను ప్రత్యక్షంగా చూసేందుకు రూ. 250 – రూ. 3000 మధ్య ‘బుక్మైషో’లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. -
PKL 10: ‘టాప్’ పుణెరి పల్టన్.. ప్లే ఆఫ్స్ సమరానికి సై
Pro Kabaddi League- పంచ్కులా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో పుణేరి పల్టన్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బుధవారంతో లీగ్ దశ మ్యాచ్లు ముగిశాయి. పుణేరి పల్టన్ 40–38తో యూపీ యోధాస్పై గెలిచి ఓవరాల్గా 96 పాయింట్లుతో టాప్ ర్యాంక్లో నిలిచింది. A comeback of the 𝚑̶𝚒̶𝚐̶𝚑̶𝚎̶𝚜̶𝚝̶ 𝐏𝐚𝐥𝐭𝐚𝐧 order 💪 Aslam & Co. turned things around in style against Yoddhas to confirm their No. 1️⃣ spot 🫡#ProKabaddiLeague #ProKabaddi #PKLSeason10 #PKL10 #PKL #HarSaansMeinKabaddi #PUNvUP #PuneriPaltan #UPYoddhas pic.twitter.com/wOG3cEARlu — ProKabaddi (@ProKabaddi) February 21, 2024 హైదరాబాద్లో మిగిలిన మ్యాచ్లు మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 53–39తో హరియాణా స్టీలర్స్ను ఓడించింది. పుణేరి పల్టన్, జైపూర్ పింక్ పాంథర్స్, దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హరియాణా స్టీలర్స్, పట్నా పైరేట్స్ టాప్–6లో నిలిచి ప్లే ఆఫ్స్ దశకు అర్హత సాధించాయి. ఈనెల 26 నుంచి మార్చి 1 వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్లే ఆఫ్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. మరోవైపు.. తెలుగు టైటాన్స్ తాజా సీజన్లోనూ గత వైఫల్యాలు కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. League stage ✅ Playoffs ⏳ Here’s what the points table looks like after the last league-stage game of #PKLSeason10 🤩#ProKabaddi #HarSaansMeinKabaddi #ProKabaddiLeague #PKL #PKL10 #PUNvUP #HSvBLR pic.twitter.com/KVfiBs14cS — ProKabaddi (@ProKabaddi) February 21, 2024 -
‘టై’తో టైటాన్స్ ముగింపు
పంచ్కులా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ను తెలుగు టైటాన్స్ జట్టు ‘టై’తో ముగించింది. యు ముంబా, తెలుగు టైటాన్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్ 45–45 వద్ద ‘టై’ అయింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ 14 పాయింట్లు స్కోరు చేసి టైటాన్స్ జట్టును ఓటమి నుంచి కాపాడాడు. నిర్ణీత 22 మ్యాచ్లు పూర్తి చేసుకున్న తెలుగు టైటాన్స్ 19 మ్యాచ్ల్లో ఓడిపోయి, ఒక మ్యాచ్ను ‘టై’ చేసుకొని, రెండు మ్యాచ్ల్లో నెగ్గి 21 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంతో సరిపెట్టుకుంది. తొమ్మిదో సీజన్లోనూ టైటాన్స్ చివరి స్థానంలోనే నిలిచింది. నేడు జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో పుణేరి పల్టన్తో యూపీ యోధాస్; హరియాణా స్టీలర్స్తో బెంగళూరు బుల్స్ ఆడతాయి. -
PKL 10: బెంగాల్ వారియర్స్ అవుట్
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్ ‘ప్లే ఆఫ్స్’ రేసులో నిలవాలంటే మిగిలివున్న రెండు మ్యాచ్ల్ని కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో బెంగాల్ వారియర్స్ 26–29తో పుణేరి పల్టన్ చేతిలో ఓడిపోయింది. దీంతో హరియాణా స్టీలర్స్కు నాలుగో సెమీస్ బెర్తు దాదాపు ఖాయమైంది. బుధవారం జరిగిన మ్యాచ్లో పుణేరి రెయిడర్లు ఆకాశ్ షిండే 10, పంకజ్ మోహితే 6 పాయింట్లు సాధించగా, బెంగాల్ జట్టులో నితిన్ కుమార్ (5), మణిందర్ (4) రాణించారు. మరో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 45–43తో తమిళ్ తలైవాస్పై గెలిచింది. ఢిల్లీ తరఫున అశు మలిక్ (18) అదరగొట్టాడు. తలైవాస్ జట్టుల -
ప్లే ఆఫ్స్కు పట్నా పైరేట్స్ అర్హత
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో ప్లే ఆఫ్స్కు అర్హత పొందిన ఐదో జట్టుగా పట్నా పైరేట్స్ నిలిచింది. తెలుగు టైటాన్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 38–36తో గెలిచింది. పట్నా తరఫున మంజీత్ 8 పాయింట్లు, సందీప్ 7 పాయింట్లు స్కోరు చేశారు. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ 16 పాయింట్లతో ఆకట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఈ టోర్నీలో 21 మ్యాచ్లు ఆడి 11 విజయాలు అందుకున్న పట్నా 68 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. 20 మ్యాచ్లు పూర్తి చేసుకున్న తెలుగు టైటాన్స్ 18వ పరాజయంతో 17 పాయింట్లతో చివరిదైన 12వ స్థానాన్ని ఖరారు చేసుకుంది. మిగిలి ఉన్న తమ చివరి రెండు మ్యాచ్ల్లో టైటాన్స్ గెలిచినా 29 పాయింట్లతో 11వ స్థానంలో ఉన్న యూపీ యోధాస్ను దాటే అవకాశం లేదు. ఇప్పటికే జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టన్, గుజరాత్ జెయింట్స్, దబంగ్ ఢిల్లీ, పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్స్కు చేరుకోగా... చివరిదైన ఆరో బెర్త్ కోసం హరియాణా స్టీలర్స్, బెంగాల్ వారియర్స్ జట్లు రేసులో ఉన్నాయి. అయితే స్టీలర్స్ ఒక మ్యాచ్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకుంటుంది. -
Pro Kabaddi League: సెమీస్లో పింక్ పాంథర్స్
Pro Kabaddi League 10-కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. యూపీ యోధాస్తో జరిగిన మ్యాచ్లో పింక్ పాంథర్స్ 67–30తో గెలిచింది. జైపూర్ ప్లేయర్ అర్జున్ 20 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ గెలుపుతో పింక్ పాంథర్స్ 82 పాయింట్లతో టాప్ ర్యాంక్లోకి రాగా... పుణేరి పల్టన్ 81 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మిగతా మ్యాచ్ల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ రెండు జట్లు టాప్–2లో నిలవనున్నాయి. దాంతో ఈ రెండు జట్లకు సెమీఫైనల్ బెర్త్లు ఖరారయ్యాయి. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 46–34తో యు ముంబాను ఓడించింది. చదవండి: Paris olympics: బ్రెజిల్కు బిగ్ షాక్.. పారిస్ ఒలింపిక్స్కు అర్జెంటీనా -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్లో తమ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ తెలుగు టైటాన్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. శనివారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 55–35 స్కోరుతో టైటాన్స్పై విజయం సాధించింది. తెలుగు జట్టు తరఫున మిలాద్ జబారి 9, ప్రఫుల్ జవారే 8, పవన్ సెహ్రావత్ 6 పాయింట్లు సాధించగా...బెంగాల్ ఆటగాళ్ళలో నితిన్ కుమార్ 13 పాయింట్లతో చెలరేగాడు. టైటాన్స్కు ఓవరాల్గా 19 మ్యాచ్లలో ఇది 17వ పరాజయం. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 44–23 స్కోరుతో యు ముంబాపై గెలుపొందింది. -
‘టాప్’లోకి జైపూర్ పింక్ పాంథర్స్
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ దశకు అర్హత సాధించిన జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు మళ్లీ అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. బుధవారం జరిగిన మ్యాచ్లో పింక్ పాంథర్స్ 27–22తో దబంగ్ ఢిల్లీని ఓడించింది. జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ 10 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ లీగ్లో పింక్ పాంథర్స్కిది 13వ విజయం కావడం విశేషం. ప్రస్తుతం పింక్ పాంథర్స్ 77 పాయింట్లతో టాప్ ర్యాంక్లోకి వచ్చింది. పుణేరి పల్టన్ 76 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో పుణేరి పల్టన్ 40–31తో బెంగళూరు బుల్స్పై గెలిచింది. నేడు విశ్రాంతి దినం. శుక్రవారం జరిగే మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో గుజరాత్ జెయింట్స్; హరియాణా స్టీలర్స్తో యూపీ యోధాస్ తలపడతాయి. -
PKL 10: ‘ప్లే ఆఫ్స్’ చేరిన పుణేరి పల్టన్
PKL 10- న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్లో పుణేరి పల్టన్ జట్టు ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించింది. సోమవారం పుణేరి పల్టన్, దబంగ్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ ‘టై’గా ముగిసింది. ఇరు జట్లూ 30–30 పాయింట్ల స్కోరుతో సమంగా నిలిచాయి. పుణేరి తరఫున అస్లామ్ ముస్తఫా 10 పాయింట్లు స్కోరు చేయగా... దబంగ్ కెప్టెన్ అషు మలిక్ 8 పాయింట్లు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ అనంతరం 17 మ్యాచ్ల ద్వారా మొత్తం 71 పాయింట్లు సాధించిన పుణేరి ‘ప్లే ఆఫ్స్’కు చేరింది. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 36–33 పాయింట్ల తేడాతో పింక్ పాంథర్స్పై విజయం సాధించింది. పట్నా తరఫున కెప్టెన్ సచిన్, సుధాకర్ చెరో 10 పాయింట్లతో చెలరేగగా జైపూర్ ఆటగాళ్లలో అర్జున్ దేశ్వాల్ (12 పాయింట్లు) రాణించాడు. ఇదిలా ఉంటే.. జైపూర్ పింక్ పాంథర్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో పాంథర్స్ తర్వాత టాప్-4కు చేరుకున్న రెండో జట్టుగా పుణేరి పల్టన్ నిలిచింది. అయితే, తెలుగు టైటాన్స్ మాత్రం ఈసారి కూడా కనీస ప్రదర్శన కనబరచలేక ఇప్పటికే పదహారు మ్యాచ్లలో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. చదవండి: Ind vs Eng: హైడ్రామా.. అలా నాటౌట్.. ఇలా కూడా నాటౌటేనా?.. రోహిత్ సీరియస్ Admin's next task: Adding 𝐐 in the #PKLSeason10 Points Table graphic 😉@PuneriPaltan 🧡 join defending champions Jaipur Pink Panthers in confirming a #PKLPlayoffs spot 🔥#ProKabaddi #ProKabaddiLeague #PKL #HarSaansMeinKabaddi #PuneriPaltan pic.twitter.com/gBCs3zGJ6s — ProKabaddi (@ProKabaddi) February 5, 2024 సహజ సంచలన విజయం ముంబై: తెలుగమ్మాయి సహజ యమలపల్లి ముంబై ఓపెన్ (డబ్ల్యూటీఏ–125) టెన్నిస్ టోర్నీలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. తొలి రౌండ్లో సహజ 6–4, 1–6, 6–4 స్కోరుతో వరల్డ్ నంబర్ 92, టాప్ సీడ్ కేలా డే (అమెరికా)ను ఓడించింది. మ్యాచ్లో 2 ఏస్లు కొట్టిన సహజ 4 డబుల్ఫాల్ట్లు చేసింది. -
ప్రొ కబడ్డీ లీగ్ ప్లే ఆఫ్స్, ఫైనల్కు హైదరాబాద్ ఆతిథ్యం
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్ ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు ఈ పోటీలు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతాయని పీకేఎల్ నిర్వాహకులైన మషాల్ స్పోర్ట్స్ తెలిపింది. మొత్తం 12 జట్లు పోటీపడుతున్న ప్రొ కబడ్డీ లీగ్లో పాయింట్ల పట్టికలో టాప్–6లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. టాప్–2 జట్లకు నేరుగా సెమీఫైనల్ బెర్త్లు లభిస్తాయి. మిగతా నాలుగు జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ల్లో తలపడతాయి. ఫిబ్రవరి 26న ఎలిమినేటర్–1లో ఆరో స్థానం పొందిన జట్టుతో మూడో స్థానంలో నిలిచిన జట్టు... ఎలిమినేటర్–2లో ఐదో స్థానంలో నిలిచిన జట్టుతో నాలుగో స్థానం పొందిన జట్టు ఆడతాయి. ఫిబ్రవరి 28న ఎలిమినేటర్–1 విజేత తొలి సెమీఫైనల్లో లీగ్ ‘టాపర్’తో... ఎలిమినేటర్–2 విజేత లీగ్లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో పోటీపడతాయి. ఫైనల్ మార్చి 1న జరుగుతుంది. -
PKL10: మనోళ్లు అట్టడుగున.. ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా పాంథర్స్
Pro Kabaddi League- పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో ప్లే ఆఫ్స్ దశకు అర్హత పొందిన తొలి జట్టుగా డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ నిలిచింది. బుధవారం జరిగిన మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 42–27తో తమిళ్ తలైవాస్పై గెలిచింది. ఈ టోర్నీలో పింక్ పాంథర్స్కిది 12వ విజయం కావడం విశేషం. 12 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్లో పింక్ పాంథర్స్ 71 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. తలైవాస్తో మ్యాచ్లో పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ అత్యధికంగా 13 పాయింట్లు స్కోరు చేశాడు. అట్టడుగున తెలుగు టైటాన్స్ పట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 29–29తో ‘డ్రా’గా ముగిసింది. శుక్రవారం జరిగే మ్యాచ్ల్లో దబంగ్ ఢిల్లీతో బెంగాల్ వారియర్స్; గుజరాత్ జెయింట్స్తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. ఈ జట్ల సంగతి ఇలా ఉంటే.. తెలుగు టైటాన్స్కు మాత్రం ఈ సీజన్ కూడా కలిసిరాలేదు. ఆడిన పదిహేడింట కేవలం రెండు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. Panthers first team through to the #PKLSeason10 playoffs 💥🤩 After some fiery action on the mat 🔥 Here’s how the standings look like after the final day of the Patna leg ⚡#ProKabaddiLeague #ProKabaddi #PKL #HarSaansMeinKabaddi #PATvBLR #JPPvCHE pic.twitter.com/t3zYwuCwl0 — ProKabaddi (@ProKabaddi) January 31, 2024 -
PKL 2024: తీరు మార్చుకోని తెలుగు టైటాన్స్.. మరో ఘోర ఓటమి
ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ 15వ పరాజయాన్ని చవిచూసింది. మంగళవారం పట్నాలో పుణేరి పల్టన్తో జరిగిన పోరులో పవన్ సెహ్రావత్ నాయకత్వంలోని తెలుగు టైటాన్స్ 29–60 తో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో పుణేరి ఆల్రౌండ్ దెబ్బకు టైటాన్స్ జట్టు నాలుగుసార్లు ఆలౌటైంది. పల్టన్ తరఫున ఆకాశ్ 11 పాయింట్లతో రాణించాడు. టైటాన్స్ ప్లేయర్ సంజీవి అత్యధికంగా 8 పాయింట్లు సాధించాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో (17 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలు) టైటాన్స్ చివరి స్థానంలో ఉండగా.. పుణేరి పల్టన్ 16 మ్యాచ్ల్లో 12 విజయలతో అగ్రస్థానంలో నిలిచింది. -
Pro Kabaddi 2024: పట్నా పైరేట్స్కు ఎనిమిదో గెలుపు
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో సొంతగడ్డపై పట్నా పైరేట్స్ జట్టు అదరగొట్టింది. గుజరాత్ జెయింట్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ జట్టు 32–20 పాయింట్ల తేడాతో నెగ్గింది. ఈ టోర్నీలో పైరేట్స్కిది ఎనిమిదో విజయం కావడం విశేషం. పట్నా తరఫున సందీప్ (7 పాయింట్లు), అంకిత్ (6 పాయింట్లు) రాణించారు. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 41–36తో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. హరియాణా తరఫున శివమ్ 12 పాయింట్లు, సిద్ధార్థ్ 11 పాయింట్లు, వినయ్ 6 పాయింట్లు స్కోరు చేశారు. -
తెలుగు టైటాన్స్ జట్టుకు 14వ పరాజయం
ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టుకు 14వ పరాజయం ఎదురైంది. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో పవన్ సెహ్రావత్ కెపె్టన్సీలోని తెలుగు టైటాన్స్ 29–54తో తమిళ్ తలైవాస్ చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 35–32తో హరియాణా స్టీలర్స్పై గెలిచింది. బుధవారంతో హైదరాబాద్ అంచె పోటీలు ముగిశాయి. గురువారం విశ్రాంతి దినం. శుక్రవారం పటా్నలో జరిగే మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో పట్నా పైరేట్స్; గుజరాత్ జెయింట్స్తో యు ముంబా తలపడతాయి. -
Pro Kabaddi League: పుణేరి, ముంబా మ్యాచ్ ‘టై’
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో పుణేరి పల్టన్ తొలి ‘టై’ నమోదు చేసింది. యు ముంబా, పుణేరి పల్టన్ జట్ల మధ్య గచ్చి»ౌలి స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్ 32–32 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. యు ముంబా ప్లేయర్ గుమన్ సింగ్ 15 పాయింట్లు స్కోరు చేయడం విశేషం. నేడు జరిగే మ్యాచ్ల్లో హరియాణా స్టీలర్స్తో దబంగ్ ఢిల్లీ; తెలుగు టైటాన్స్తో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
తీరు మారని తెలుగు టైటాన్స్.. 13వ ఓటమి
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ ఖాతాలో 13వ పరాజయం చేరింది. హరియాణా స్టీలర్స్తో సోమవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 30–37తో ఓడిపోయింది. టైటాన్స్ తరఫున సంజీవి, ప్రఫుల్ 6 పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 42–25తో బెంగాల్ వారియర్స్పై గెలిచింది. చదవండి: ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీకి సాత్విక్ జోడీ దూరం -
బెంగళూరుపై తమిళ్ తలైవాస్ విజయం..
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తమిళ్ తలైవాస్ 45–28 స్కోరుతో బెంగళూరు బుల్స్పై గెలుపొందింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ పోరులో తమిళ్ రెయిడర్లు నరేందర్ (14), అజింక్యా పవార్ (11) క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చి పెట్టారు. డిఫెండర్లలో సాగర్ (5), సాహిల్ గులియా (4) రాణించారు. బెంగళూరు తరఫున రెయిడర్ అక్షిత్ (12) ఒంటరి పోరాటం చేశాడు. సుశీల్ 6 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో పుణేరీ పల్టన్ 32–24 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై గెలుపొందింది. పుణేరీ తరఫున మొహమ్మద్ రెజా 9 పాయింట్లు మోహిత్ గోయత్ 7 పాయింట్లు సాధించారు. గుజరాత్ ఆటగాళ్లలో మొహమ్మద్ నబీబక్ష్ 7, ప్రతీక్ దహియా 5 పాయింట్లు నమోదు చేశారు. చదవండి: WI vs AUS: 29 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. ఆసీస్ జట్టులో ఛాన్స్ కొట్టేశాడు! -
ఎట్టకేలకు తెలుగు టైటాన్స్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు రెండో విజయాన్ని సాధించి సొంత ప్రేక్షకుల్ని మురిపించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 49–32 స్కోరుతో యూపీ యోధాస్పై విజయం సాధించింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ (16 పాయింట్లు), ఓంకార్ (10) రాణించారు. అంతకుముందు జరిగిన తొలిపోరులో దబంగ్ ఢిల్లీ 39–33తో యు ముంబాపై నెగ్గింది. -
తెలుగు టైటాన్స్కు మరో ఓటమి.. ఏకంగా 12వ పరాజయం
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం హైదరాబాద్ అంచె పోటీలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సొంతగడ్డపై తెలుగు టైటాన్స్ జట్టు 26–42 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టుకిది 12వ పరాజయం కావడం గమనార్హం. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ ఏడు పాయింట్లు స్కోరు చేశాడు. అదే విధంగా.. బెంగళూరు జట్టు తరఫున సుర్జీత్ ఏడు పాయింట్లు, వికాశ్ ఆరు పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 34–31తో యూపీ యోధాస్ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్ల్లో దబంగ్ ఢిల్లీతో యు ముంబా; తెలుగు టైటాన్స్తో యూపీ యోధాస్ తలపడతాయి. -
Pro Kabaddi League: పట్నా పైరేట్స్కు షాక్
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్కు షాక్ తగిలింది. నిన్న జరిగిన మ్యాచ్లో ఆ జట్టు తమిళ్ తలైవాస్ చేతిలో 25-41 తేడాతో పరాజయంపాలైంది. ఈ సీజన్లో పట్నాకు ఇది ఏడో పరాజయం. తలైవాస్ తరఫున అజింక్య పవార్ 10 పాయింట్లు, అభి 7 పాయింట్లు, నరేందర్ 6 పాయింట్లు స్కోరు చేశారు. పట్నా తరఫున సుధాకర్ 8 పాయింట్లు సాధించాడు. -
PKL 2023-24: పుణేరీ పల్టన్కు షాక్
జైపూర్: సొంతగడ్డపై జైపూర్ పింక్ పాంథర్స్ వరుసగా రెండో విజయంతో సత్తా చాటింది. ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో జైపూర్ 36–34 స్కోరుతో పుణేరీ పల్టన్ను ఓడించింది. జైపూర్ తరఫున కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 16 పాయింట్లతో చెలరేగాడు. పుణేరీ ఆటగాళ్ళలో కెప్టెన్ అస్లామ్ ముస్తఫా 8 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ గెలుపుతో పాంథర్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఓడినా పుణేరీ పల్టన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ సీజన్లో పల్టన్ 10 విజయాలు సాధించి, కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే ఓడింది. ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. -
PKL: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్.. పదకొండో పరాజయం
Pro Kabaddi League Telugu Titans 11th Defeat- జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. జైపూర్ పింక్ పాంథర్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 35–38తో పోరాడి ఓడిపోయింది. ఈ లీగ్లో టైటాన్స్కిది 11వ ఓటమి కావడం గమనార్హం. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ 12 పాయింట్లు స్కోరు చేయగా... సందీప్ ధుల్, రాబిన్ 5 పాయింట్ల చొప్పున సాధించారు. జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ అత్యధికంగా 14 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మరో మ్యాచ్లో పుణేరి పల్టన్ 37–17తో గుజరాత్ జెయింట్స్ను ఓడించింది. పుణేరి పల్టన్ కెప్టెన్ అస్లమ్ ముస్తఫా 10 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో పుణేరి పల్టన్; యూపీ యోధాస్తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. చదవండి: Ind vs Eng: ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు భారత్ జట్టు ప్రకటన