ఉపాధి భేష్‌ | - | Sakshi
Sakshi News home page

ఉపాధి భేష్‌

Published Sat, Apr 20 2024 1:25 AM | Last Updated on Sat, Apr 20 2024 1:25 AM

గంట్యాడ మండలం పెదవేమలి గ్రామంలో పని చేస్తున్న వేతనదారులు - Sakshi

జిల్లాలో జాబ్‌ కార్డులు 3.45 లక్షలు

జిల్లాలో జాబ్‌ కార్డులు 3.45లక్షలు ఉన్నాయి. వీటిలో 3.21లక్షల జాబ్‌ కార్డులు యాక్టివ్‌లో ఉన్నాయి. వీటి పరిధిలో 6.06 లక్షల మంది వేతనదారులు ఉన్నారు. వీరిలో 5.04 లక్షల మంది వేతనదారులు పనులకు వెళ్తున్నారు.

ఒక్కో వేతనదారుడికి రూ.25 వేల వరకు లబ్ధి

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్లే వేతనదారుడికి వేలాది రుపాయిలు ఏటా అందుతున్నాయి. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.25 వేల నుంచి రూ. 30 వేల వరకు లబ్ధి చేకూరుతుంది. ప్రతి ఏటా ప్రభుత్వం కోట్లాది పనిదినాలు వేతనదారులకు కల్పిస్తోంది. ఏడాదికి 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు పనిదినాలు కల్పిస్తున్నారు. ఇందుకోసం రూ.500 నుంచి రూ.700 కోట్ల వరకు వేతనదారులకు ఏటా చెల్లిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement