పటమట(విజయవాడ తూర్పు): ప్రియుడితో కలిసి అంతమొందించడానికి కుట్ర పన్నిన భార్యపై భర్త ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. పటమట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురులో నివసించే భావన యామిని నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అకౌంటెంట్గా చేస్తోంది. ఆమె గతంలో ఎన్ఆర్ఐని వివాహమాడింది. ఆమెకు ఉన్న వివాహేతర సంబంధం అతనికి తెలియడంతో ప్రశ్నించాడు.
ఆ తర్వాత నుంచి ఆమె భర్తను వేధించడమే కాకుండా అతనిపై కేసు పెట్టింది. ఆ కేసు నుంచి బయటపడటంతో పాటు యామినికి రూ.40 లక్షలు ఇచ్చి విడాకులు తీసుకున్నాడు. తర్వాత ఆమె కానూరి గౌరీశంకర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే యామిని.. స్కూల్లో పని చేస్తున్న గుణదలకు చెందిన చిన్నం రమేష్తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఇది తెలిసిన గౌరీశంకర్ భార్యను నిలదీశాడు.
దీంతో ఆమె ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేయడానికి పథక రచన చేసింది. దీన్ని పసిగట్టిన భర్త గౌరీశంకర్.. భార్య యామిని నుంచి తన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందని పటమట పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment