బెంగళూరు పేలుడు కేసులో ఒకరి విచారణ | NIA detains 1 in Bengaluru Rameshwaram Cafe blast probe | Sakshi
Sakshi News home page

బెంగళూరు పేలుడు కేసులో ఒకరి విచారణ

Published Thu, Mar 14 2024 6:22 AM | Last Updated on Thu, Mar 14 2024 6:22 AM

NIA detains 1 in Bengaluru Rameshwaram Cafe blast probe - Sakshi

సాక్షి, బళ్లారి: కర్ణాటక రాజధాని బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌ రామేశ్వరం కేఫ్‌లో ఇటీవల జరిగిన బాంబు పేలుడు ఘటనలో బళ్లారిలో షబ్బీర్‌ అహ్మద్‌ అనే వ్యక్తిని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేఫ్‌లో బాంబు పెట్టి వెళ్లిపోయిన నిందితుడి కోసం గాలిస్తూ బుధవారం షబ్బీర్‌ ఆచూకీని కనుగొన్నారు. బళ్లారిలో మోతీ సర్కిల్‌ సమీపంలోని కొత్త బస్టాండ్‌కు వెళ్లే దారిలో షబ్బీర్‌ను అతడి ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు.

అక్కడ కొంతసేపు విచారించి బెంగళూరుకు తరలించారు. బాంబు పెట్టిన వ్యక్తికి, షబ్బీర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అనుమానాలున్నాయి. షబ్బీర్‌ బళ్లారి సమీపంలో తోరణగల్లు వద్ద ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఎలక్ట్రిíÙయన్‌గా పని చేస్తున్నాడు. బాంబు పేలుడు తర్వాత ప్రధాన నిందితుడు బెంగళూరు నుంచి బళ్లారికి బస్సులు మారుతూ వచ్చాడు. ఆపై షబ్బీర్‌ ఇంటికి వచ్చి అతడిని కలిసినట్లు ఎన్‌ఐఏ అధికారులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్లు తెలిసింది. కాగా, షబ్బీర్‌ను విచారించి రాత్రి వదిలిపెట్టినట్లు
సమాచారం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement