మనమే నా గ్రాఫ్‌ పెంచుతుంది: దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య | Director Sriram Aditya About Manamey movie | Sakshi
Sakshi News home page

మనమే నా గ్రాఫ్‌ పెంచుతుంది: దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య

Published Mon, Jun 3 2024 6:10 AM | Last Updated on Mon, Jun 3 2024 6:10 AM

Director Sriram Aditya About Manamey movie

‘‘ఇండస్ట్రీలో సక్సెస్‌ ఉంటేనే మన కెరీర్‌ గ్రాఫ్‌ పెరుగుతుంటుంది. నా గత చిత్రం ‘హీరో’ ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్‌ కాలేదు. కొంత కరోనా ప్రభావం కూడా ఉంది. ఇప్పుడు ‘మనమే’ సినిమా విజయంపై నమ్మకంతో ఉన్నాను. నా కెరీర్‌ గ్రాఫ్‌ మళ్లీ పెరుగుతుంది’’ అన్నారు దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య. శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా, చైల్డ్‌ ఆర్టిస్టు విక్రమాదిత్య ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మనమే’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో శ్రీరామ్‌ ఆదిత్య మాట్లాడుతూ – ‘‘పేరెంటింగ్‌ ఎమోషన్స్‌ గురించి కొంచెం వినూత్నంగా చెప్పాలన్న ఉద్దేశం నాకు ఎప్పట్నుంచో ఉంది. కాకపోతే ఈ ఎమోషన్స్‌కు ఫన్‌ జోడించి, ఫుల్‌ ఎనర్జీతో చెప్పాలనుకున్నాను. అదే ‘మనమే’ కథ. ఈ సినిమాలో శర్వానంద్‌–కృతీ శెట్టిల క్యారెక్టర్స్‌ టామ్‌ అండ్‌ జెర్రీలా ప్రేక్షకులను అలరిస్తాయి. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ‘మనమే’ నా ఫేవరెట్‌.

ఈ సినిమాలో నా కొడుకు చైల్డ్‌ ఆర్టిస్టుగా చేశాడని నేను ఇలా చెప్పడం లేదు. అందమైన భావోద్వేగాలు ఉన్న మంచి సినిమా ఇది. ఈ సినిమాలో శివ కందుకూరి పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ‘మనమే’లో 16 పాటల వరకూ ఉన్నాయి. ఇవి సినిమా ఫ్లోకు ప్లస్‌గానే ఉంటాయి కానీ అడ్డుగా అనిపించవు. హేషమ్‌ మంచి సంగీతం అందించారు’’ అని చెప్పుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement