పకడ్బందీగా చేపడతాం: కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా చేపడతాం: కలెక్టర్‌

Published Thu, Apr 18 2024 9:40 AM | Last Updated on Thu, Apr 18 2024 9:40 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వాన్ని పకడ్బందీగా చేపడతామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జి.రవినాయక్‌ అన్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ ఆయా జిల్లా కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ బదులిస్తూ ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు అభ్యర్థులతో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఈపాటికే రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. తుది ఓటర్ల జాబితా రూపకల్పనలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఓటరు స్లిప్పులు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌, రెవెన్యూ అడిషనల్‌ కలెక్టర్‌ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement