ఉద్దేశపూర్వకంగానే దాడి:బండ్ల రాజశేఖర్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

ఉద్దేశపూర్వకంగానే దాడి:బండ్ల రాజశేఖర్‌రెడ్డి

Published Thu, Apr 18 2024 9:40 AM | Last Updated on Thu, Apr 18 2024 9:40 AM

- - Sakshi

‘తాము అసెంబ్లీ ఎన్నికల్లో సొంత బంధువర్గాన్ని కాదని బీసీ అభ్యర్థి అయిన సరితకు అండగా నిలబడి పార్టీ కోసం పనిచేశాం. అయితే వారు తమను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగానే పార్టీలో అణచివేయాలని చూస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గద్వాలకు వచ్చిన మంత్రి జూపల్లి, ఎంపీ అభ్యర్థి మల్లురవిని మా ఇంటికి అల్పాహారానికి ఆహ్వానించాం. అనంతరం ప్రచారం నిమిత్తం నేను మా సోదరుడు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి కలిసి మల్దకల్‌కు వెళ్లాం. తాను ప్రచార వాహనంలో ఎక్కేందుకు వెళ్లగా అక్కడే సరిత వర్గానికి చెందిన పెద్దొడ్డి రామకృష్ణ అకారణంగా మాపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ముందుగా వేసుకున్న ప్లాన్‌లో భాగంగానే జరిగింది. మళ్లీ బీసీలపై దాడి చేశారని అబద్దపు ప్రచారం చేయడం మంచిది కాదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం’ అని బండ్ల రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

నాపై దాడికి పాల్పడ్డారు:పెద్దొడ్డి రామకృష్ణ

‘తాను ప్రచార వాహనంపై ఉంటే బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి అకారణంగా నాపైకి వచ్చి నన్ను బూతులు తిడుతూ చొక్కా పట్టుకుని కిందకు లాగి దాడికి పాల్పడ్డారు. నాపై జరిగిన దాడి బీసీలపై జరిగిన దాడిగా అభిప్రాయపడుతూ ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. బీసీలు రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్వలేకనే ఇలాంటి దాడులు చేశారు’ అని పెద్దొడ్డి రామకృష్ణ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1/1

Advertisement
 
Advertisement
 
Advertisement