![కల్యాణ ఘట్టం నిర్వహిస్తున్న ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్ - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/18/17mbnrl852-210066_mr_0.jpg.webp?itok=EFx1ZuRz)
ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజు మన్యంకొండలో శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకీలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను గర్భగుడి నుంచి దేవస్థానం సమీపంలోని రామసదనం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి, స్వామివారి కల్యాణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించారు. వేదమంత్రోచ్ఛారణలు, సన్నాయి వాయిద్యాలు, అశేష భక్తజనం నడుమ అమ్మవారికి మంగళసూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకీలో మళ్లీ గర్భగుడి వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి తదితరులు పాల్గొన్నారు.
మన్యంకొండలో సంప్రదాయబద్ధంగా..
Comments
Please login to add a commentAdd a comment