టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

Published Thu, Apr 18 2024 9:40 AM | Last Updated on Thu, Apr 18 2024 9:40 AM

మాట్లాడుతున్న టీపీఆర్టీయూ 
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ    - Sakshi

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: 2010 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీపీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ కోరారు. జిల్లా కేంద్రంలోని యూనియన్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్‌సీటీఈ నుంచి సవరణ ఉత్తర్వులు ఇచ్చేవిధంగా ప్రభుత్వం కృషి చేయడంతో పాటు వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయులకు కొన్నేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న మెడికల్‌, జీపీఎఫ్‌, సరెండర్‌ బిల్లులను విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో టీపీఆర్టీయూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ యుగంధర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంబాబు, రమాకాంత్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నాగిరెడ్డి, రాకేష్‌రెడ్డి, సతీష్‌కుమార్‌, శ్రీధర్‌, భూపతిసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement