ఉదయాన్నే నిద్రలేచి చూసేసరికి.. | - | Sakshi
Sakshi News home page

ఉదయాన్నే నిద్రలేచి చూసేసరికి..

Published Mon, Oct 30 2023 1:24 AM | Last Updated on Mon, Oct 30 2023 10:06 AM

- - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: పాము కాటుతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలో జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన గుంజె స్వాతి, రాజు దంపతులు తమ కుమారుడు నిఖిల్‌(12)తో కలిసి ఇంట్లో కింద నిద్రించారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున బాలుడి నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన తల్లిదండ్రులు వెంటనే ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. గమనించిన వైద్యులు బాలుడు మృతి చెందాడని నిర్ధారించారు. కాగా, ఒక్కగానొక్క కొడుకు పాము కాటుతో మృతి చెందడంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
చదవండి: సినిమాల్లో అవకాశాలు రాలేదని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement