కల్లూరు/కల్లూరు రూరల్: కల్లూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను అదనపు కలెక్టర్ స్నేహలత, అసిస్టెంట్ కలెక్టర్ రాధికాగుప్తా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వైద్యసేవలు, పరీక్షల్లో లోపాలపై వైద్యుడు లవన్కుమార్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఆస్పత్రిలో కనీస సంఖ్యలో ప్రసవాలు జరగకపోవడం, టీహబ్లో పరీక్షల లక్ష్యాలను చేరుకోకపోవడంతో పాటు రికార్డు నిర్వహణపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
అలాగే, మండలంలోని చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రిని కూడా అదనపు కలెక్టర్ స్నేహలత, అసిస్టెంట్ కలెక్టర్ తనిఖీ చేసి ‘ఆరోగ్య మహిళ’లో భాగంగా వైద్యసేవలపై ఆరా తీశారు. డీఆర్డీఓ విద్యాచందన, డిప్యూటీ డీఎంహెచ్ఓ సీతారాం, ఎంపీపీ బీరవల్లి రఘు, ఎంపీడీఓ బి.రవికుమార్, ఎంపీఓ వీరస్వామి, డాక్టర్ తబుస్సుంతో పాటు డాక్టర్ లక్కినేని రఘు, సీహెచ్.కృష్ణారావు, లక్ష్మీకాంతమ్మ, నాగశేషరెడ్డి, సాకేత్ పాల్గొన్నారు.
ఇదేనా మీ పనితీరు ?
Published Wed, Apr 12 2023 12:51 PM | Last Updated on Wed, Apr 12 2023 12:51 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- అనంత్ - రాధిక పెళ్లి సందడి : మరోసారి మెస్మరైజ్ చేసిన రాధిక
- పిల్లలమర్రికి పూర్వవైభవం
- బీజేపీలోకి రావాలంటే..రాజీనామా చేయాల్సిందే
- మైండ్గేమ్తో నాడు బాబు.. నేడు రేవంత్ మాయ
- ఇకపై అద్భుతమైన రాబడులు కష్టమే!
- వచ్చే మార్చిలోగా 6 ప్రాజెక్టులు రెడీ
- అన్ని మతవిశ్వాసాలను గౌరవిస్తాం
- క్రికెట్ గ్రౌండ్స్.. ఫర్ రెంట్!.. అద్దె కట్టు.. బ్యాట్ పట్టు..
- డ్రైవింగ్.. ట్రాక్లో పడేలా
- చదువులకు రాజకీయ చెద
Advertisement
Comments
Please login to add a commentAdd a comment