-
ప్రక్షాళన చేయాల్సిందే..
ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో ఔట్ సోర్సింగ్ సిబ్బంది తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కొందరు సిబ్బంది విభాగాల్లో అంతా తామై వ్యవహరిస్తున్నారని కేఎంసీలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా వీరి పెత్తనమే ఎక్కువైందని, అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా తాము చెప్పిందే వేదం అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇక కంప్యూటర్ ఆపరేటర్లు కేటాయించిన విభాగాల్లో కాకుండా అంతా ఒకే గదిలో కూర్చుని కార్యకలాపాలు సాగిస్తున్నారనే విమర్శ ఉంది. ప్రధానంగా శానిటేషన్, రెవెన్యూ, ఇంజనీరింగ్, అకౌంట్స్, ఐటీ, ఎన్నికలు, పరిపాలన విభాగాల్లో ఔట్సోర్సింగ్ సిబ్బంది పెత్తనం అధికమైందని తెలుస్తోంది. ఈనేపథ్యాన కమిషనర్గా విధుల్లో చేరిన అభిషేక్ అగస్త్య తొలుత కార్యాలయ ప్రక్షాళన నుంచే తన పని ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు.అంతా అక్కడి నుంచే..కేఎంసీలో ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది కొరత కారణంగా పలువురిని ఔట్సోర్సింగ్ విధానంలో నియమించారు. వీరిలో కొందరికి కంప్యూటర్ ఆపరేటర్లుగా హోదా కల్పించి విభాగాలకు అప్పగించారు. ఇందులో పలువురు అధికారులు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ బృందంగా ఏర్పడి కార్యాలయంలో తమకంటూ ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేసుకున్నారు.రెవెన్యూ, గ్రీవెన్స్, కమిషనర్ పేషీ, సిస్టమ్ మేనేజర్ విభాగాలకు చెందిన కంప్యూటర్ ఆపరేటర్లు సాంకేతిక విభాగం పేరుతో అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. వారి కి నచ్చిన ఫైళ్లను పరిష్కరిస్తూ.. ఇతరులవి పక్కన పెడుతున్నారనే విమర్శలు చాన్నాళ్లుగా ఉన్నాయి. ఏళ్ల తరబడి వీరంతా అదేవిభాగాల్లో పనిచేస్తుండడంతో అజమాయిషీ కరువవగా.. విభాగాల్లో కాకుండా అంతా ఒకేచోటకు చేరడంతో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.పాతుకుపోయారు..కేఎంసీలో రెవెన్యూ, శానిటేషన్, టౌన్ప్లానింగ్, ఇంజనీరింగ్, ఎస్టాబ్లిష్మెంట్ విభాగాల్లో ఉద్యోగులు, అధికారులు ఏళ్ల తరబడి పాతుకుపోయి ఉన్నారు. ఇటీవల కొందరి విభాగాలు మార్చినప్పటికీ ఉద్యోగుల తీరు మాత్రం మారలేదని తెలుస్తోంది. కొందరు ఉద్యోగులు చెప్పా పెట్టకుండానే విధులకు గైర్హాజరు కావడం పరిపాటిగా మారిందని సమాచారం. ఈ నేపథ్యాన నగరాభివృద్ధి ఎంత ముఖ్య మో... కార్యాలయాన్ని ప్రక్షాళన చేయడం కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని కొత్త కమిషనర్ గుర్తించాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి.విధుల్లో చేరిన కమిషనర్ అభిషేక్ అగస్త్యఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా అభిషేక్ అగస్త్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి అదనపు కలెక్టర్గా ఉన్న ఆయనను కమిషనర్గా బదిలీ చేయగా విధుల్లో చేరారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మేయర్ పునుకొల్లు నీరజను కమిషనర్ మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు.ఆ తర్వాత కమిషనర్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాల అధికారులతో సమావేశమై ప్రస్తుతం జరుగుతున్న పనులపై ఆరా తీశారు. అలాగే, అకౌంట్స్ విభాగం అధికారితో సమావేశం సందర్భంగా కేఎంసీలో నిధుల నిల్వలు, పెండింగ్ బిల్లులపై చర్చించారు. మధ్యాహ్నం నగరంలోని బోనకల్ రోడ్డు, మమత రోడ్డు మార్గాల్లో కమిషనర్ అభిషేక్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ రంజిత్కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ఏ.సంపత్కుమార్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, డీఈలు, టౌన్ప్లానింగ్ ఏసీపీ వసుంధర తదితరులు పాల్గొన్నారు.కేఎంసీనా.. సాఫ్ట్వేర్ కంపెనీయా?కార్పొరేషన్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ల సంఖ్యను చూస్తే ఓ సాఫ్ట్వేర్ కంపెనీని తలదన్నేలా ఉంటుంది. ఒక్కో విభాగంలో ఇద్దరి నుంచి నలుగురు, ఐదుగురు వరకు ఆపరేటర్లను నియమించగా.. వీరు పనిచేయడం కన్నా బయట తిరగడం పైనే శ్రద్ధ వహిస్తారనే విమర్శలున్నాయి. ఎక్కడా ఏ కార్యాలయంలో లేని విధంగా కేఎంసీలో 23 మంది వరకు కంప్యూటర్ ఆపరేటర్లను నియమించగా పలువురికి కనీస కంప్యూటర్ పరిజ్ఞానం లేదని తెలుస్తోంది.అయినా రాజకీయ పలుకుబడితో ఇతర విధుల్లో చేరి కంప్యూటర్ ఆపరేటర్లుగా పేర్లు నమోదు చేయించుకున్నారని సమాచారం. కాస్త పరిజ్ఞానం ఉన్న వారు అధికారులను ఏమారుస్తుంటే.. ఏ మాత్రం నైపుణ్యం లేని సిబ్బంది ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి నెట్టుకొస్తున్నారని తెలుస్తోంది. ఇంతమంది ఉన్నప్పటికీ ప్రత్యేక అవసరాల సమయాల్లో మాత్రం రోజువారీ వేతనంపై బయట నుంచి ఆపరేటర్లను తీసుకొస్తుండడం గమనార్హం. -
బెంగళూరులో.. ఏరోనాటికల్ ఇంజనీర్ విషాదం!
ఖమ్మం: మండలంలోని పిండిప్రోలు గ్రామానికి చెందిన ఊడుగుల కృష్ణమూర్తి(44) బెంగళూరులోని హిందుస్తాన్ ఎరోనాటికల్ లిమిటెడ్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. పిండిప్రోలుకు చెందిన ఊడుగుల వెంకయ్య – మాణిక్యమ్మ మూడో కుమారుడు కృష్ణమూర్తి ఇరవై ఏళ్ల క్రితం బెంగళూరులోని హెచ్ఏఎల్లో ఇంజనీర్గా చేరి డిప్యూటీ మేనేజర్ స్థాయికి ఎదిగాడు.ఇటీవలే సొంత గ్రామంలో జరిగిన గ్రామ దేవత వేడుకకు కూడా హాజరయ్యాడు. ఈనెల 22న బెంగళూరులోని నివాసంలో బాత్రూమ్కు వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందినట్లు తెలిసింది. ఆ సమయాన భార్య శిరీష, పిల్లలు ఖమ్మంలో ఉండడంతో కృష్ణమూర్తి మృతి విషయం రెండు రోజుల తర్వాత స్నేహితుల ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన బంధువులు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు బెంగళూరు వెళ్లారు. కాగా, కృష్ణమూర్తి విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.గంటల వ్యవధిలోనే తల్లీ కుమారుడు...ముదిగొండ: గడ్డిమందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన రఘునాధపాలెం మండలం చిమ్మపూడికి చెందిన కణతల శేషగిరి(36) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి మృతిచెందాడు. కుటుంబ, ఆర్థిక స మస్యల కారణంగా చిమ్మపూడికి చెందిన తల్లీ,కుమారుడు కణతాల నర్సమ్మ(55), శేషగిరి(36) ముదిగొండ మండలం సువర్ణాపురం శివారులో ఈనెల 23న గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే.వీరిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, సోమవారం ఉదయం నర్సమ్మ మృతి చెందింది. అలాగే, ఆమె కుమారుడు శేషగిరి అర్థరాత్రి దాటాక మృతి చెందగా, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముదిగొండ ఎస్ఐ గజ్జెల నరేష్ తెలిపారు. కాగా, గంటల వ్యవధిలోనే తల్లీకుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. -
చదువుల మోత!
విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే పాఠశాలల్లో బోధన ఊపందుకుంటోంది.ఈనేపథ్యాన విద్యార్థులకు కావాల్సిన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగ్లు, హాస్టళ్లకు వెళ్తున్న వారి కోసం పరుపులు, పెట్టెలు ఇతర సామగ్రి కొనుగోళ్లలో తల్లిదండ్రులు నిమగ్నమయ్యారు. దీంతో జిల్లా కేంద్రంలోని బుక్స్టాళ్లు, ఇతర దుకాణాలు వారం ఇలా రద్దీగా కనిపించాయి. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
తల్లడిల్లుతున్న పేగుబంధం..
ఖమ్మం: రెక్కాడితే కాని డొక్కాడని ఆ కుటుంబాన్ని ఓ ప్రమాదం కోలుకోలేని దెబ్బతీసింది. చేతికి అందివచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అచేతన స్థితికి చేరగా.. కుటుంబానికి పెద్ద దిక్కయిన తండ్రి వడదెబ్బతో మృతిచెందాడు. మరో కొడుకు ఉపాధి లేక చిన్న చిన్న పనులు చేస్తున్నా కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత తల్లిపై పడటంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే రోడ్డుప్రమాదంలో గాయపడిన కుమారుడికి చికిత్స కోసం రూ.22 లక్షల మేర అప్పు చేసిన ఆ కుటుంబం తండ్రి మృతితో మరింత కష్టంలో పడిపోయింది.రోడ్డు ప్రమాదంలో గాయపడి..ఖమ్మం నగరంలోని 16వ డివిజన్ కొత్తూరు గ్రామానికి చెందిన వల్లెపు నరసింహారావు, నళిని దంపతులకు ఇద్దరు కొడుకులు. వీరిలో వల్లెపు అవినాష్ గతేడాది నవంబర్ 8న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. కుక్క అడ్డు రావడంతో తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. అవినాష్ను చికిత్స కోసం హైదరాబాద్లోని పలు ఆస్పత్రులకు తిప్పారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి వరకు బంధువులు, తెలిసిన వారి వద్ద రూ.22 లక్షల వరకు అప్పులు చేసి అతని చికిత్సకు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆయన వైద్యానికి రోజుకు రూ.10 వేలు ఖర్చు అవుతోంది.వడదెబ్బతో తండ్రి..ఇదే పరిస్థితితో ఇబ్బందులు పడుతుండగా.. యజమాని నరసింహారావు కూడా మరణించాడు. ఎండల్లో పనిచేయడంతో వడదెబ్బకు గురై ఈ నెల 6న మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఒక పక్క కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండగా.. ఇలా భర్త అర్ధాంతరంగా ముగియడంతో ఆమె గుండె పగిలింది. ఇక మరో కొడుకు అభిలాష్ హైదరాబాద్లో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అది ఖర్చుల వరకు కూడా సరిపోవడం లేదని నళిని వాపోయింది. ప్రస్తుతం నళిని కూలీ పనులకు వెళ్తూ నెట్టుకొస్తోంది. తమను ఆదుకోవాలని వేడుకుంటోంది. ఆర్థిక సాయం చేయాలనుకునే వారు 79896 32983 నంబర్లో సంప్రదించాలని బంధువులు కోరారు. -
ఖమ్మం: మరీ ఇంత ఘోరమా?
సాక్షి, ఖమ్మం: జిల్లాలో వేకువ ఝామునే ఘోరం జరిగింది. ఓ వృద్ధురాలు, ఆమె ఇద్దరు మనవరాళ్లు దారుణ హత్యకు గురయ్యారు. ఆ వృద్ధురాలి తనయుడు కనిపించకుండా పోవడంతో అతనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం జరిగింది. పిట్టల పిచ్చమ్మ(60), ఆమె మనవరాళ్లు నీరజ(10), ఝాన్సీ(6)లు హత్యకు గురయ్యారు. శనివారం ఉదయం రక్తపు మడుగులో ఉన్న ఇద్దరినీ గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఇద్దరు చిన్నారుల తండ్రి వెంకటేశ్వర్లే ఈ హత్యలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండేళ్ల కిందట ఆ చిన్నారుల తల్లి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. అయితే ఆమెను కూడా భర్తే వెంకటేశ్వర్లే హత్య చేసి ఉంటాడని పోలీసులు వద్ద స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెంకటేశ్వర్లు ఆచూకీ కోసం పోలీసులు యత్నిస్తున్నారు. -
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
ఖమ్మం: గత ఎన్నికల్లో తమను కడుపులో పెట్టుకుని అత్యధిక మెజార్టీతో గెలిపించగా ముగ్గురికి మంత్రి పదవులు దక్కడంతో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నామని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలోని జెడ్పీ సెంటర్ నుండి ముస్తఫానగర్, చర్చికాంపౌండ్, ప్రకాష్నగర్, బోసుబొమ్మ సెంటర్ మీదుగా గాంధీచౌక్ వరకు శుక్రవారం రాత్రి రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చికాంపౌండ్ సెంటర్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని, ఆ రెండు పార్టీల నడుమ లోపాయికారి ఒప్పందం ఉందని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ తాను చేసిన తప్పుల నుండి కాపాడుకోడానికి బీజేపీతో జత కడుతున్నారని చెప్పారు. ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి మాయమాటలతో పదేళ్లు రాజ్యమేలారని విమర్శించారు. కనీసం పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇవ్వలేకపోయారని చెప్పారు.కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కట్టిస్తామని చెప్పినప్పటికీ మంత్రి తుమ్మల ఖమ్మం నియోజకవర్గానికి అదనంగా ఇళ్లు కావాలని అడిగారని తెలిపారు. గృహనిర్మాణ శాఖకు మంత్రిగా ఉన్న తాను ఖమ్మంకు ఆరు వేల ఇళ్లు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఎంపీగా రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే కేంద్రం నుంచి అదనంగా నిధులు వస్తాయని తెలిపారు.నిరుపేదలందరికీ ఇళ్లు..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మంలో రోడ్ల వెంట, కాల్వగట్ల వెంట గుడిసెలు వేసుకుని ఉంటున్న వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. వెంకటగిరి, బైపాస్ బ్రిడ్జిలు, దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్, పుట్టకోట బెడ్ తన హయాంలో నిర్మించినవేనని తెలిపారు.ఖమ్మం ప్రజలు ప్రశాంతంగా అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండాలంటే రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. జిల్లా నుంచి డిప్యూటీ సీఎం భట్టితో పాటు తామిద్దరం కలిసి ఖమ్మంను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాష్టంలోనే ఆగ్రగామిగా ఉంచుతామని తెలిపారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెబుతున్న వారు ధైర్యం ఉంటే రేవంత్రెడ్డిని తాకాలని సూచించారు.మతోన్మాద బీజేపీ మరోమారు గెలిస్తే ప్రజల మధ్య మతవిద్వేషాలను రెచ్చగొట్టి దేశాన్ని విభజిస్తుందని తెలిపారు. అనంతరం అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ముగ్గురు మంత్రుల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. ఈ రోడ్డు షోలో డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నాయకులు మహ్మ ద్ జావీద్, బాలసాని లక్ష్మీనారాయణ, సాధు రమేష్రెడ్డి, దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీతోనే అభివృద్ధి, సంక్షేమం : జేపీ నడ్డా
ఖమ్మం: పేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలంటే బీజేపీతోనే సాధ్యమని పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సోమవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, పదేళ్లలో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని అన్నారు. దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచితబియ్యం, 75 ఏళ్లు నిండిన వారికి ఆయుష్మాన్ భారత్ అందిస్తున్న ఘనత తమదేనన్నారు. రాబోయే రోజుల్లో ఏడు కోట్ల కుటుంబాలకు పైపులైన్ ద్వారా వంటగ్యాస్ అందించడమే లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్లో కుటుంబపాలన సాగుతోందని, దానికి అండగా నిలిచిన పార్టీలదీ అదే చరిత్ర అని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో అవినీతి జరిగిందని నడ్డా ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులుగా తాండ్ర వినోద్రావు, సీతారాంనాయక్ను గెలిపించాలని కోరారు.దేశ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలు..గత పదేళ్లలో భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని, దేశ ప్రజలే తన కుటుంబంగా భావించే నరేంద్ర మోదీని మరోసారి గెలిపించాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. దేశంలో కాంగ్రెస్ వచ్చేది లేదని, రాహుల్ ప్రధాని అయ్యేది లేదని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి అసత్య హామీలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇచ్చిన చిప్ప పట్టుకొని రేవంత్రెడ్డి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.కేసీఆర్, రేవంత్ ఇద్దరూ తోడు దొంగలేనని అన్నారు. కాలం చెల్లిన కమ్యూనిస్టులు కాంగ్రెస్తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని విమర్శించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 17 సీట్లనూ బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మాయమాటలు నమ్మకుండా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు మాట్లాడుతూ ఢిల్లీలో మాదిరి ఖమ్మం కాంగ్రెస్లోనూ కుటుంబపాలన సాగుతోందని, స్థానికేతరుడైన వియ్యంకుడిని మంత్రి పొంగులేటి తెచ్చి పెట్టారని ఆరోపించారు. స్థానికుడినైన తననే ఆదరింంచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మహబూబాబాద్ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ మాట్లాడుతూ తనను మరోసారి గెలిపిస్తే మహబూబాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, నాయకులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, విజయరామారావు, ఎం.ధర్మారావు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, రంగాకిరణ్, నాయకులు శ్రీకాంత్, నంబూరి రామలింగేశ్వరరావు, జీవీకే మనోహర్, ఎం.శ్రీనివాసరెడ్డి, ఉప్పల శారద, నాగేశ్వరరావు, రాయుడు నాగేశ్వరరావు, నరేంద్రబాబు పాల్గొన్నారు.ఇవి చదవండి: లెక్క తేలింది.. పోరు మిగిలింది.. -
‘మోసం చేసిన కాంగ్రెస్కు గుణపాఠం’
● ఎంపీగా నామను గెలిపిస్తేనే అది సాధ్యం ● ప్రచార సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులుఖమ్మం రూరల్/తిరుమలాయపాలెం: అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గెలిపించాలని పలువురు పిలుపునిచ్చారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో జరిగిన ప్రచార సమావేశాల్లో అభ్యర్థి నామతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు, సామాన్య ప్రజల కష్టాలు కళ్లెదుటే కనబడుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడాలన్నా, జిల్లా అభివృద్ధి చెందాలన్నా నామ గెలుపు తప్పనిసరని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించినందుకు తప్పు చేశామని భావిస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను వివరిస్తూ నామ గెలుపునకు పాటుపడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పలు సంక్షేమ పథకాలను తొలగించడమే కాక హామీలను నెరవేర్చడం లేదంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా పాట రూపంలో వివరించారు. అలాగే, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు తీరు మార్చుకోవాలని సూచించారు. ఈ సమావేశాల్లో ఎంపీపీ బి.ఉమ, నాయకులు తాళ్లూరి జీవన్కుమార్, బెల్లం వేణు, బాషబోయిన వీరన్న, గుడిబోయిన దర్గయ్య, లక్ష్మణ్, వెంకటేశ్వర్లు, ఏ.వరప్రసాద్, దేవరం దేవేందర్రెడ్డి, మాలతి, చావా వేణు, ఆలస్యం నాగేశ్వరరావు, రవి, చామకూరి రాజు తదితరులు పాల్గొన్నారు. ● ఖమ్మం లీగల్: బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, న్యాయ శాఖ ఉద్యోగులను కలిసి తనను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు బిచ్చాల తిరుమలరావు, కొత్తా వెంకటేశ్వరరావు, మేకల సుగుణారావు తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ను కలిసిన సివిల్స్ ర్యాంకర్
ఖమ్మం సహకారనగర్/ఖమ్మం క్రైం/ఖమ్మం మయూరిసెంటర్: ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 938వ ర్యాంక్ సాధించిన బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్)కు చెందిన సాయి అలేఖ్య సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ వీ.పీ.గౌతమ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను కలెక్టర్ సత్కరించారు. ఆతర్వాత సీపీ సునీల్దత్ను కూడా కలవగా ఆయన సాయిఅలేఖ్యతో పాటు ఆమె తండ్రి మధిర టౌన్ పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రావూరి ప్రకాశ్రావు – పద్మశ్రీ దంపతులను సన్మానించారు. అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ఠ, ఏఎస్పీ అవినాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక సాయి అలేఖ్యను ఖమ్మంలోని బీసీ స్టడీసర్కిల్లో సత్కరించారు. స్టడీసర్కిల్లో గ్రూప్స్, డీఎస్సీ శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ముఖాముఖి ఏర్పాటుచేయగా.. ఆమె పాల్గొని ఉద్యోగాలకు సన్నద్ధతపై సూచనలు చేశారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత, అధ్యాపకులు పాల్గొన్నారు. అలాగే, సాయిఅలేఖ్య చదువుకున్న త్రివేణి పాఠశాల, సెంచరీ స్కూల్లో కూడా ఆమెను సన్మానించారు. త్రివేణి డైరెక్టర్లు గొల్లపుడి వీరేంద్రచౌదరి, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్తో పాటు సీహెచ్.అప్పారావు, స్వప్న, ముస్తఫా, అశోక్, చార్లెస్, సందీప్, సెంచరీ స్కూల్లో కరస్పాండెంట్ డీవీఎస్.ప్రభాకర్రావు, డైరెక్టర్ మాధవీలతతో పాటు స్వరూప, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సాయిఅలేఖ్యను సన్మానించిన కలెక్టర్, సీపీ -
బాలారిష్టాలు దాటని హబ్
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మంలో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్ హబ్లో రకరకాల కొరతతో తరచూ పరీక్షలు నిలిచిపోతున్నాయి. రసాయనాల కొరత, యంత్రాల్లో లోపాలతో ఏ రోజు ఏ పరీక్ష ఉంటుందో సిబ్బందికే తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వివిధ ప్రాంతాల నుంచి శాంపిళ్లు తీసుకొస్తున్నా లక్ష్యం మేరకు పరీక్షలు జరగడం లేదు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మూడేళ్ల క్రితం తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ నెలకొల్పారు. తొలుత 57 రకాల పరీక్షలు నిర్వహించగా క్రమంగా వాటి సంఖ్య పెంచడంతో ప్రస్తుతం 134 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ కొంత కాలంగా టెస్టులకు రసాయనాల సరఫరా సక్రమంగా లేకపోవడంతో అన్ని పరీక్షలు జరగడం లేదు. ఇటీవల రసాయనాల సరఫరా పూర్తిగా నిలిచిపోగా కొన్ని రోజుల పాటు పరీక్షలే నిలిచిపోయాయి. దీంతో అధికారులు మహబూబాబాద్, వరంగల్ ఆస్పత్రుల నుంచిరసాయనాలు తెప్పించి పని కానిచ్చేశారు. ఇదే పరిస్థితి తరచుగా ఎదురవుతుండడంతో అవసరమైన పరీక్షలు జరగక సామాన్యులు మళ్లీ ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. తొలినాళ్లలో మంచి స్పందన డయాగ్నస్టిక్ హబ్కు తొలి నాళ్లలో మంచి స్పందన లభించింది. అప్పట్లో 57 రకాల పరీక్షలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం అదనంగా మరో 77 రకాల పరీక్షలను గత ఏడాది ప్రభుత్వం చేర్చింది. ఇలా 134రకాల పరీక్షలు చేయాల్సి ఉన్నా ఖమ్మం హబ్లో సగానికి కంటే తక్కువ పరీక్షలే జరుగుతున్నాయి. తరచూ రసాయనాల కొరత, సిబ్బంది అందుబాటులో లేకపోవడం, యంత్రాల మరమ్మతులు వంటి కారణాలతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. సాధారణంగా హబ్లో ప్రతీ గంటకు 1,520 పరీక్షలు చేస్తారు. ఇందులో కెమిస్ట్రీ అనలైజర్ మిషన్ ద్వారా 1,200, ఇమ్యునో అనలైజర్ మిషన్ ద్వారా 220, సీబీపీ మిషన్ ద్వారా గంటకు వంద పరీక్షలు చేయాల్సి ఉన్నా ఆ స్థాయిలో జరగడంలేదు. 45 ఆస్పత్రుల నుండి శాంపిళ్లు జిల్లాలోని 45 ప్రభుత్వ ఆస్పత్రుల నుండి ఖమ్మం పెద్దాస్పత్రిలోని డయాగ్నస్టిక్ హబ్కు నిత్యం శాంపిల్స్ వస్తుంటాయి. పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాల్లో సేకరించిన శాంపిళ్లను వాహనాల్లో ఇక్కడకు తీసుకొస్తారు. ఇందుకోసం ఐదు రూట్లలో వాహనాలు తిరుగుతుంటాయి. అనంతరం హబ్లో పరీక్షలు చేసి 24గంటల్లోగా బాధ్యుల సెల్ఫోన్కు రిపోర్టు పంపిస్తారు. కానీ కొంత కాలంగా అనుకున్న స్థాయిలో పరీక్షలు జరగకపోగా... అవసరమైన వారు ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయించాల్సివస్తోంది. ప్రస్తుతం హబ్లో సీబీపీ, గర్భిణులకు నిర్వహించే కోయోగ్లేషన్ టెస్టులు, ఇతర అవసరమైన టెస్టులు అందుబాటులో లేవని సమాచారం. అన్ని పరీక్షలు జరిగేలా చర్యలు డయాగ్నస్టిక్ హబ్లో అన్ని రకాల పరీక్షలు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. రసాయనాల కొరతతో అప్పుడప్పుడు కొంత ఏర్పడుతుండడంతో ఉన్నతాధికారులకు నివేదించాం. త్వరలోనే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. హబ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు జరిగేలా చూస్తున్నాం. డాక్టర్ బి.అమర్సింగ్, ఆర్ఎంఓ, ఖమ్మం జనరల్ ఆస్పత్రి తరచుగా పరీక్షలకు అంతరాయాలు పేరుకు 134 పరీక్షలు.. అందేవి అంతంతే ఖమ్మం డయాగ్నస్టిక్ హబ్లో రసాయనాల లేమితో ఇక్కట్లు సిబ్బంది కొరత, యంత్రాల మరమ్మతులతో ఇంకొంత సమస్య -
ఏడుగురు.. 11 సెట్లు
కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణఖమ్మం సహకారనగర్: ఖమ్మం లోక్సభ స్థానం ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. ఈమేరకు సోమవా రం ఏడుగురు అభ్యర్థులు 11 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీ.పీ.గౌతమ్ తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్)గా ఉల్లెంగుల యాదయ్య రెండు సెట్లు, బహుజన్ లెఫ్ట్ పార్టీ అభ్యర్థిగా అంతోని సురేష్ ఒక సెట్ నామినేషన్ సమర్పించారు. అలాగే, స్వతంత్ర అభ్యర్థులు దండా లింగయ్య మూడు సెట్లు, తేజావత్ జోగు రాము రెండు, ఎదురుగట్ల చిట్టిమల్లు, మద్దిశెట్టి ఎర్రప్ప, మద్దినేని అనిల్కుమార్ ఒక్కో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. -
అధికారులు జవాబుదారీగా వ్యవహరించాలి
ఖమ్మం సహకారనగర్: గ్రామపంచాయతీల ప్రత్యేక అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి పాటుపడాలని అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన జీపీల ప్రత్యేక అధికారులతో సమావేశమై పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సమీఓఇంచచారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షిస్తుండడంతో పాటు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మిషన్ భగీరథ సరఫరా లేని చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే ప్రైవేట్ వనరులను లీజ్కు తీసుకోవాలన్నారు. అలాగే, నర్సరీలు, విద్యుద్దీపాలు, అంతర్గత రహదారుల నిర్వహణపై దృష్టి సారించాలని, సకాలంలో పన్నులు వసూలు చేయడమే కాక ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఈసమీక్షలో జెడ్పీ సీఈఓ వినోద్, డీఆర్డీఓ సన్యాసయ్య పాల్గొన్నారు. ఏకలవ్య మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి పరీక్ష భద్రాచలంటౌన్: ఉమ్మడి జిల్లాలోని తెలంగాణ ప్రభుత్వ ఏకలవ్య మోడల్ సంక్షేమ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలుకల్పించేందుకు ఈనెల 28న పరీక్ష నిర్వహించనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్ తెలిపారు. ఈనెల 28న ఉదయం 10.30 గంటల నుంచి 12.30 వరకు పరీక్ష ఉంటుందని పేర్నొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు https:// tsemrs. telangana. gov. in వెబ్సైట్ ద్వారా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు భద్రాద్రి జిల్లాలో మూడు, ఖమ్మం జిల్లాలో ఒక కేంద్రం ఏర్పాటు చేసినట్లు పీఓ తెలిపారు. స్వచ్ఛమైన తాగునీరు అందించాలి వైరా: వైరా రిజర్వాయర్ వద్ద సక్రమంగా క్లోరినేషన్ చేయడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి ఆదేశించారు. వైరా రిజర్వాయర్ గుట్టపై బోడేపూడి సుజల స్రవంతి పథకం, మిషన్ భగీరథ ఇన్ టేక్వెల్ ప్రాంతాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఇటీవల రిజర్వాయర్ నుంచి రంగు మారిన నీరు సరఫరా అవుతుందనే ప్రచారంతో పరిశీలించిన ఆయన వివరాలు ఆరా తీశారు. ప్రస్తుతం రిజర్వాయర్లో నీటి నిల్వలు, క్లోరినేషన్ విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్కు చేరుతున్న నేపథ్యాన నీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సీఈ కె.శ్రీనివాస్, ఎస్ఈ సదాశివకుమార్, ఈఈలు వాణిశ్రీ, పుష్పలత, డీఈ నర్సింహమూర్తి, ఏఈ మణిశంకర్ పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు తల్లాడ ప్రమాదంపై ఎన్పీడీసీఎల్ సీఎండీ ఆగ్రహం ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి హెచ్చరించారు. జిల్లాలోని తల్లాడ సబ్స్టేషన్లో ఆదివారం ట్రాన్స్ఫార్మర్ పేలగా లైన్మెన్గా గాయాలయ్యాయి. ఈ నేపథ్యాన సీఎండీ సోమవారం ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. ఉద్యోగులు, సిబ్బంది విధినిర్వహణలో నిబంధనలు పాటించాలని, పనిప్రాంతంలో గ్లౌజ్లు, హెల్మెట్ విధిగా ధరించాలని సూచించారు. తల్లాడ సబ్స్టేషన్లో జరిగిన ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్న సీఎండీ.. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూనే విధిగా భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. -
గులాబీకి సవాల్..
ఖమ్మం లోక్సభ ఎన్నిక బీఆర్ఎస్కు సవాల్గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఓట్లు సాధించడం ఎదురీతకు కారణమవుతోంది. లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తంగా 2.65 లక్షల ఎక్కువ ఓట్లను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఈ వ్యత్యాసాన్ని విశ్లేషిస్తే లోక్సభ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ బీఆర్ఎస్ నేతలు, శ్రేణుల్లో నెలకొంది. ఇక్కడ విజయం కోసం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు సర్వశక్తులొడ్డుతున్నా ఫలితం ఎలా ఉండబోతోందన్న చర్చ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంనాడు అధికారంలో.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఖమ్మంలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ విజయం సాధించారు. ఆ తర్వాత ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీ, ఇండిపెండెంట్లుగా గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. అనంతరం 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు 5,67,459 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి. దీంతో 1,68,065 ఓట్ల మెజార్టీతో నామ విజయబావుటా ఎగురవేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నాడు 14.74 శాతం ఓట్ల వ్యత్యాసం వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ సునాయాసంగా గెలిచింది. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ పరిధి ఏడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు 5,18,194 ఓట్లు వస్తే.. పార్లమెంట్ ఎన్నికల్లో నామాకు 49,265 ఓట్లు మాత్రమే అదనంగా నమోదయ్యాయి. ఇప్పుడు భారీ వ్యత్యాసం తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే భారీ వ్యత్యాసం ఉంది. ఖమ్మం లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్తో పాటు పొత్తులో భాగంగా సీపీఐ అభ్యర్థులకు 7,33,293 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థులకు 4,67,639 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తద్వారా కాంగ్రెస్ కూటమి 2,65,654 ఓట్ల మెజార్టీని సాధించినట్లయింది. ఈ గణాంకాలను పరిశీలిస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేస్తోంది. మరోపక్క అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు తగ్గడం.. అధికారంలో కూడా లేకపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థికి ఎదురీత తప్పదా అన్న చర్చ కొనసాగుతోంది. ఖమ్మం లోక్సభ ఎన్నికలో బీఆర్ఎస్ ఎదురీత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మెజార్టీ ఓట్లు ఆ పార్టీతో పోలిస్తే ‘కారు’కు 2.65 లక్షల ఓట్ల వ్యత్యాసం ఈ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎటువైపోనని ఉత్కంఠపట్టు దొరికేది ఎక్కడ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖమ్మం నియోజకవర్గంలో 49,381 ఓట్ల మెజార్టీ, పాలేరులో 56,650 మెజార్టీ, సత్తుపల్లిలో 19,440 ఓట్లు, మధిరలో 35,452 ఓట్ల మెజార్టీ, వైరాలో 33,045 ఓట్లు, కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి 42,781 ఓట్ల మెజార్టీ, అశ్వారావుపేటలో 28,905 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎక్కడా కూడా బీఆర్ఎస్ అభ్య ర్థులు కాంగ్రెస్ అభ్యర్థులకు గట్టిపోటీ ఇవ్వలేక పోయారు. కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు ఏడు నియోజకవర్గాల్లోనూ భారీ మెజార్టీ రావడంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ అసెంబ్లీ పరిధిలో ఎలా ఓట్లు దక్కించుకోవాలి, ఎక్కడ పట్టు దొరుకుతుందనే లెక్కల్లో బీఆర్ఎస్ నేతలు మునిగితేలుతున్నారు.ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి, బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు.. నియోజకవర్గం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఖమ్మం 1,36,016 86,635 పాలేరు 1,27,820 71,170 సత్తుపల్లి 1,11,245 91,805 మధిర 1,08,970 73,518 వైరా 93,913 60,868 కొత్తగూడెం (సీపీఐ) 80,336 37,555 అశ్వారావుపేట 74,993 46,088 మొత్తం 7,33,293 4,67,639 -
185 ఎకరాల్లో పంటలకు నష్టం
● గాలిదుమారంతో నష్టంపై వ్యవసాయ శాఖ అంచనా ● సింగరేణి మండలంలోనే ప్రభావంఖమ్మంవ్యవసాయం: అకాల వర్షంతో జిల్లాలో 185.20ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా గుర్తించింది. జిల్లా అంతటా ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో కోత దశలో ఉన్న యాసంగి పంటలకు నష్టం వాటిల్లింది. నిబంధనల ప్రకారం 33 శాతా నికి పైగా జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని అధికారులు అంచనాలు రూపొందించారు. జిల్లాలోని సింగరేణి మండలంలో మాత్రమే అకాల వర్షం కారణంగా పంటలకు నష్టం జరిగిందని, ఈ మండలంలో 102 మంది రైతులకు చెందిన వరి, మొక్కజొన్న, మామిడి 185.20 ఎకరాల్లో పంట లకు నష్టం ఏర్పడిందని గుర్తించారు. వరి, మొక్కజొన్న, మామిడికి నష్టం ఈదురుగాలులు, అకాల వర్షానికి సింగరేణి మండలంలోని పోలంపల్లి, కోటిలింగాల, ఉసిరికాయలపల్లి, కోమట్లగూడెం, ఎర్రుబోడుతో పాటు మొత్తం ఎనిమిది గ్రామాల్లో కోత దశలో ఉన్న వరి, మొక్కజొన్న, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. 35 మంది రైతులకు చెందిన 48 ఎకరాల్లో వరి, అరవై మంది రైతులకు చెందిన 83.20 ఎకరాల్లో మొక్కజొన్న 60, ఏడుగురు రైతులకు చెందిన 54 ఎకరాల్లో మామిడి నష్టం వాటిల్లినట్లు గుర్తించగా.. నివేదికను వ్యవసాయ శాఖ కమిషనర్కు పంపించారు. కాగా, కూసుమంచి, మధిర, ఖమ్మం వ్యవసాయ డివిజన్లలోనూ పంటలకు నష్టం జరిగినా 33 శాతా నికి మించకపోవడంతో పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. 11మండలాల్లో వర్షం జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వర కు 11మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. సింగరేణి మండలంలో అధికంగా 89.2 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అలాగే, కామేపల్లి, మండలంలో 22.4, ఖమ్మం రూరల్ మండలంలో 7.2, ముదిగొండ మండలంలో 4.8, తిరుమలాయపాలెం మండలంలో 4.6, రఘునాథపాలెం మండలంలో 3.2, ఏన్కూరు మండలంలో 2.6, కూసుమంచి మండలంలో 2.4, ఖమ్మం అర్బన్ మండలంలో 1.4, నేలకొండపల్లి మండలంలో 1.2 మి.మీల వర్షపాతం నమోదైనట్లు తెలి పారు. ఈదురుగాలులకు చెట్లు కూలి రాకపోకలకు అంతరా యం ఏర్పడింది. అలాగే, విద్యుత్ లైన్లపై చెట్లు పడడంతో సరఫరా నిలిచిపోగా సోమవారం కొమ్మలు తొలగించి సరఫరా పునరుద్ధరించారు. -
ఉక్కపోతతో బాలింతలు, చిన్నారుల అవస్థ
ఎంసీహెచ్లో మొరాయిస్తున్న ఏసీలుఖమ్మంవైద్యవిభాగం: ప్రచండ భానుడి ప్రభావంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో చికిత్స పొందుతున్న బాలింతలు వేడి తట్టుకోలేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పలు వార్డుల్లో ఏసీలు సరిగ్గా పనిచేయకపోవడంతో అధికారులు కొన్నిచోట్ల కూలర్లు బిగించారు. అయినా గాలి సరిపోక పలువురు ఇళ్ల నుంచి టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకుని వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. -
గీత దాటితే ఇక్కట్లే..
లోక్సభ ఎన్నికల ప్రచారం నానాటికీ జోరందుకుంటోంది. ఈ నేపథ్యాన ఎవరు కూడా నిబంధనలు అతిక్రమించకుండా అధికార యంత్రాంగం డేగకళ్లతో నిఘా వేసింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో స్పందించేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఏర్పాటైన వివిధ రకాల బృందాలు తనిఖీలు ముమ్మరం చేశారు. కాగా, ఎన్నికల వేళ నిబంధనలపై కేంద్ర ఎన్నికల సంఘం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఆయా మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని సూచిస్తూ.. ఎవరు అతిక్రమించినా ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యాన ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలపై కథనం. – ఖమ్మం సహకారనగర్ ● సమావేశాలు సమావేశాల నిర్వహణకు ముందుగానే లిఖితపూర్వకంగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. నిషేధాజ్ఞలు, ఆంక్షలు ఉన్న ప్రదేశాల వివరాలు తెలుసుకుని ఆ ప్రదేశాలకు దూరంగా వేడుకలు ఏర్పాటుచేసుకోవాలి. సమావేశాల్లో మైక్లు, లౌడ్ స్పీకర్ల వినియోగానికి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. సమావేశానికి ఎవరైనా ఆటంకం కలిగిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలే తప్ప సొంతంగా చర్యలకు దిగొద్దు. ● ఊరేగింపులు ఊరేగింపు నిర్వహించాలనుకునే వారు ముందస్తుగానే పోలీసులకు తెలియచేయాల్సి ఉంటుంది. ఊరేగింపు మార్గంలో ఏమైనా నిషేధాజ్ఞలు ఉన్నాయో తెలుసుకోవాలి. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఊరేగింపు చేపట్టాలి. ఎవరి దిష్టిబొమ్మలను దగ్ధం చేయొద్దు. ● అధికార పార్టీ... ఎన్నికల ప్రచారాన్ని అధికార పర్యటనలతో కలిపి నిర్వహించవద్దు. అధికార యంత్రాంగం, ప్రభుత్వ వాహనాలను వినియోగించరాదు. అలాగే, ప్రభుత్వ వసతిగృహాలపై ఏ ఒక్కరి పెత్తనం ఉండొద్దు. ప్రభుత్వ ఖర్చుతో మీడియాలో ప్రకటనలు ఇవ్వకూడదు. ఏ రకమైన గ్రాంట్లు, పేమెంట్లు కొత్తగా మంజూరు చేయరాదు. అలాగే, అభివృద్ధి పనులపై వాగ్దానాలు చేయకూడదు. నూతన భవనాలు, కార్యక్రమాలకు శంకుస్థాపన చేయొద్దు. ● ప్రచారంలో వాహనాలు ఎన్ని వాహనాలైనా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించవచ్చు. అయితే, రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతి తీసుకోవాలి. ఒరిజనల్ అనుమతి పత్రం స్పష్టంగా కన్పించేలా వాహనానికి అంటించాలి. అనుమతి తీసుకున్న అభ్యర్థి మాత్రమే ఆ వాహనాన్ని వినియోగించాలి. రవాణా శాఖ చట్టానికి లోబడి వాహనాలకు అదనపు మంగులు సమకూర్చుకోవచ్చు. అయితే, విద్యాసంస్థలు, వారి మైదానాలను ప్రచారానికి వాడకూడదు. ప్రైవేట్ భూములు, భవనాలకు పోస్టర్లు అంటించాలంటే యజమాని లిఖితపూర్వక అనుమతి తీసుకొని రిటర్నింగ్ ఆఫీసర్కి అందించాలి. ప్రచార కరపత్రాలు, పోస్టర్లను ముద్రణాలయాల పేరు, చిరునామా ఉండాలి. ప్రచారంలో భాగంగా టోపీలు, కండువాలు ఇచ్చేందుకు అవకాశమున్నా వీటిని ఖర్చులో చూపించాలి. అయితే, చీరలు, చొక్కాలు, అభ్యర్థి ఫొటోలతో డైరీలు, క్యాలెండర్లు ప్రచురించరాదు. వాహనాల స్టెపినీ కవర్లపై కూడా మత సంబంధిత ఫొటోలు, అభ్యర్థి ఫొటోలు ఉండడానికి వీలు లేదు. ● తాత్కాలిక కార్యాలయాలు ప్రార్థనా స్థలాలు, పాఠశాలలకు, పోలింగ్ స్టేషన్లకు 200 మీటర్లకు వెలువలే అభ్యర్థి కార్యాలయం ఏర్పాటుచేసుకోవాలి. కార్యాలయాలపై పార్టీ జెండా, బ్యానర్, పార్టీ చిహ్నాన్ని పెట్టుకోవచ్చు. రాత్రి 10గంటల తర్వాత, ఉదయం 6గంటల లోపు మైక్లు, లౌడ్ స్పీకర్లు వాడకూడదు. రాత్రి 10గంటల తర్వాత పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయొద్దు. ఎస్ఎంఎస్ల ద్వారా అభ్యంతకర వార్తలను ప్రసారం చేయొదు. ఎన్నికల మార్గదర్శకాలు పాటించడం తప్పనిసరి నియమ, నిబంధనలు జారీచేసిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రచారం, విమర్శల్లో హద్దు దాటకుండా సూచనలు ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) మంత్రులు ఎన్నికల అధికారులను ఎక్కడకు కూడా పిలవడానికి వీలులేదు. ప్రైవేట్ పని కోసం వచ్చిన మంత్రిని ఏ అధికారి కలవకూడదు. వాహనాలను ఇంటి నుంచి తమ కార్యాలయానికి మాత్రమే ఉపయోగించాలి. పైలెట్ కార్లు ఎర్ర బుగ్గ కార్లు ఉపయోగించకూడదు. అధికార పార్టీ చేసిన పనులపై ఏర్పాటుచేసిన ప్రచార హోర్డింగ్లు తొలగించాలి. కొత్త పనుల ప్రారంభంపై నిషేధం ఉండగా.. ఇప్పటికే మొదలైన పనులు మాత్రం కొనసాగించవచ్చు. అలాగే, పూర్తయిన పనులకు చెల్లింపులు, ప్రకృతి వైపరీత్యాలు వస్తే సహాయక కార్యక్రమాలపై ఎలాంటి నిషేధం ఉండదు. అధికారిక కార్యక్రమాలకు హాజరైనా రాజకీయ ఉపన్యాసాలు చేయవద్దు. సాధారణ నియమాలు అభ్యర్థి కానీ పార్టీ నేతలు కానీ కులమత, భాషా విద్వేషాలను రెచ్చగొట్టేలా చేయొద్దు. విధానాలు, కార్యక్రమాలపై, గతంలో చేసిన పనులపైనే తప్ప వ్యక్తిగత జీవితంపై విమర్శలు ఉండకూడదు. కుల, మత ప్రాతిపదికపై ఓట్లు అడగకూడదు. ప్రార్థనా ప్రదేశాలను ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించవద్దు. ఓటు కోసం డబ్బులు ఇవ్వడం, బెదిరించడం నిషేధం. ఒక వ్యక్తి ఓటును మరో వ్యక్తి వేయడం చట్ట వ్యతిరేకం. వ్యక్తుల అనుమతి లేకుండా వాళ్ల భూమి, భవనాలను ప్రచారానికి ఉపయోగించరాదు. ఇతర పార్టీల ఎన్నికల ప్రచారం, సమావేశాలకు ఆటంకపర్చేలా వ్యవహరించొద్దు -
సెలవులంతా ఇక్కడే..
ప్రస్తుతం నేను ఆరో తరగతి చదువుతున్నా. స్కూల్కు వేసవి సెలవులు ఇచ్చారు. ఈ సెలవుల్లో లైబ్రరీలో పుస్తకాలు చదవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాను. ఇక్కడ ఉన్న కామిక్స్, స్టోరీ పుస్తకాలు, డిక్షనరీ పుస్తకాలు చదవాలని ఉంది. – జి.లిఖిత్, సత్తుపల్లి ఎస్సై పరీక్షల కోసం.. ఎస్సై పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నా.. గ్రూప్స్కు సైతం దరఖాస్తు చేసుకున్నాను. ప్రతిరోజు కల్లూరు నుంచి సత్తుపల్లి లైబ్రరీకి వచ్చి చదువుకుంటున్నా. ఇంకా మరిన్ని పుస్తకాలు సమకూరిస్తే మంచిగా ప్రిపేర్ అయ్యే అవకాశం లభిస్తుంది. – ఈ.గాయత్రి, కల్లూరు● -
నేడు యూత్ కాంగ్రెస్ సమావేశం
ఖమ్మం వన్టౌన్: లోక్సభ ఎన్నికల నేపథ్యాన ఖమ్మం పార్లమెంటరీ స్థాయి యువజన కాంగ్రెస్ సమావేశాన్ని మంగళవారం నిర్వహిస్తున్నట్లు యువజన కాంగ్రెస్ జిల్లాయడ్లపల్లి సంతోష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఉదయం 10.30గంటలకు మొదలయ్యే ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్లు సురభి ద్వివేది, ఖలీద్ మహ్మద్, రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, జోనల్ ఇన్చార్జ్ జెషన్ అహ్మద్, పార్లమెంట్ ఇన్చార్జ్ నాగిరెడ్డి సందీప్ రెడ్డి ముఖ్య అతిథులగా పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ మేరకు యువజన కాంగ్రెస్ కమిటీల బాధ్యులు, నాయకులు హాజరుకావాలని సంతోష్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు. -
పెళ్లి ఇంట్లో విషాదం
ఖమ్మంఅర్బన్: అప్పటి వరకు పెళ్లి సందడితో కళకళలాడిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. రఘునాథపాలెం మండలం బావోజీతండాలో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గుగులోత్ హాలియా(60) పెద్దకుమారుడి కొడుకు పెళ్లి భద్రాద్రి జిల్లాలో ఆదివారం జరిగింది. సోమవారం తండాలో విందు ఉండగా, హాలియా మంచుకొండకు వెళ్లి వంట వాళ్లను కలిసి తమ త్వరగా రావాలని కోరారు. అక్కడి నుంచి కూరగాయల కోసం ద్విచక్రవాహనంపై ఖమ్మం వెళ్లాడు. మార్గమధ్యలో ఖమ్మంలోని ఇల్లెందు–ఖమ్మం ప్రధాన రోడ్డులో ఖానాపురం చెరువు సమీపాన ముందు వెళ్తున్న లారీని ఇంకో వాహనం లైట్ల వెలుతురు కారణంగా గుర్తించలేకపోయిన ఆయన ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హాలియా అక్కడికక్కడే మృతి చెందగా.. విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆయన భార్య, ముగ్గురు కుమారులు ఉండగా, ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు.కూరగాయలకు వెళ్తూ వరుడి తాత మృతి -
● మా పాలనలోనే చల్లగా..
● పచ్చగా ఉండాలంటే...బీఆర్ఎస్ హయాంలో రైతులు పచ్చగా కళకళలాడారని.. ఇప్పుడు సాగునీరు అందక పంటలు కోల్పోతున్నారని బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు విమర్శించారు. ఖమ్మం మార్కెట్ను సోమవారం సందర్శించిన ఆయన రైతులు, హమాలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతాంగానికి పెద్దపేట వేసిన కేసీఆర్కు మద్దతుగా తనను గెలిపించాలని కోరారు. మార్కెట్ మాజీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, నాయకులు పాల్గొన్నారు. – ఖమ్మం మయూరిసెంటర్బీజేపీ అధికారంలోకి వచ్చాకే దేశమంతా ప్రజలు హాయిగా జీవిస్తున్నార ని ఖమ్మం అభ్యర్థి తాండ్ర వినోద్రావు తెలిపారు. ఏన్కూరులో ప్రచారం సందర్భంగా సోమవారం నిర్వహించిన రోడ్డుషోలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలందరికీ లబ్ధి జరిగిందని చెప్పారు. మరోమారు బీజేపీని గెలిపిస్తే యువతకు ఉపాధి, సామాన్యులకు విద్య, వైద్యం అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈమేరకు ఖమ్మం నుంచి తనను గెలిపించాలని కోరారు. – ఏన్కూరు -
రాములునాయక్తోనే మా ప్రయాణం
వైరా: వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే పయనిస్తామని పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రకటించారు. ఖమ్మంలోని రాములునాయక్ నివాసంలో వైరా నియోజకవర్గ నాయకులు పలువురు ఏన్కూరు మండల మాజీ అధ్యక్షుడు బానోత్ సురేష్ నాయక్ అధ్యక్షతన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాములునాయక్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోగా, ఓడిపోయిన అభ్యర్థికే నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి ఇవ్వడంతో ఆవేదనతో బీఆర్ఎస్కు రాజీనామా చేశానని తెలిపారు. దీనిపై నాయకులు తమ మద్దతు రాములునాయక్కే ఉంటుందని ప్రకటించడంతో పాటు ఆయన వెంటే నడుస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీలు వేల్పుల పావని, మాలోత్ శఽకుంతల, లావుడ్యా సోనీ, నాయకులు పెద్దబోయిన ఉమాశంకర్, ఎండీ.హనీఫ్, ఎస్కే.బీబా, మాలోత్ కిషోర్, లావుడ్యా కిషన్ భూక్యా సైదా, బానోత్ కుమార్, భూక్యా చందులాల్, బండారి కృష్ణ, నరేష్నాయక్, వీరన్న, చాందిని తదితరులు పాల్గొన్నారు. -
కోల్కతా వాసిపై హత్యకేసు కొట్టివేత
ఖమ్మంలీగల్: కోల్కత్తాకు చెందిన జాకీర్ అలీపై ఖమ్మం అర్బన్ పోలీసులు నమోదు చేసిన హత్య కేసును కొట్టి వేస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీఎస్.జగ్జీవన్కుమార్ సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. వెలుగుమట్ల పార్క్లో జాకీర్అలీ, అబ్దుల్లా వాచ్ టవర్ నిర్మాణ పనులు చేస్తుండగా 2019 మార్చి 15 అబ్దుల్లా చనిపోయాడు. పార్క్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు జాకీర్అలీపై హత్య కేసు నమోదు చేశారు. అయితే, సాక్షులను విచారించగా నేరం రుజువు కాకపోవడంతో కేసు కొట్టేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నిందితుడి తరఫున న్యాయవాదిగా చిలుకూరి స్వర్ణకుమారి వ్యవహరించారు. గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం చింతకాని: మండలంలోని వందనం శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయ సమీపాన పంట పొలాల్లో సోమవారం గుర్తు తెలియని మహిళ(60) మృతదేహం లభ్యమైంది. మతిస్థిమి తం సక్రమంగా లేని సదరు మహిళ ఆదివారం మధ్యాహ్నం పొలాల వైపు వచ్చింది. ఆమె సోమవారం ఉదయం పొలాల వద్ద చనిపోయి కనిపించింది. దీంతో ఎస్సై నాగుల్మీరా వివరాలు ఆరా తీశారు. ఆమె చేతిపై ఎ.పోచమ్మ అని పచ్చబొట్టు ఉండగా, ఎండ తీవ్రతకు తట్టుకోలేక మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని అన్నం సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాసరావు సాయంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించినట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతున్న కార్మికుడు మృతి కొణిజర్ల: పంచాయతీ కార్యదర్శి వేఽధిస్తున్నాడని ఆరోపిస్తూ గతనెల 28న పురుగుల మందు తాగిన కార్మికుడు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మండలంలోని అంజనాపురానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ భూక్యా ప్రసాద్ను కార్యదర్శి పనిలోకి రానివ్వడం లేదని చెబుతూ పురుగుల మందు తాగగా ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన సోమవారం మృతి చెందగా, ప్రసాద్ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంధువులు పోస్టుమార్టాన్ని అడ్డుకున్నారు. వైరా సీఐ సాగర్నాయక్, ఎస్ఐ శంకరరావు చేరుకుని ప్రసాద్ ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శంకర్రావు తెలిపారు. -
పుస్తకం..హస్తభూషణం
నేటికీ మంచి నేస్తాలే.. ● ఆన్లైన్ యుగంలో కూడా తగ్గని పఠనాసక్తి ● వెబ్ సైట్లలోనూ అందుబాటులో పుస్తకాలు ● నేడు ప్రపంచ పుస్తక దినోత్సవంసత్తుపల్లిటౌన్: పుస్తకం ఒంటరి తనాన్ని పోగొట్టే సాధనం.. మంచి, చెడులను చెప్పే సాధనం.. అందుకే చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. నా వద్ద ఏ మాత్రం డబ్బులు ఉన్నా వాటితో పుస్తకాలు కొంటాను.. మిగిలిన సొమ్ముతో తిండి, బట్టా సమకూర్చుకుంటాను అన్నారు ఇంకో మహానుభావుడు. నిజజీవితంలో పుస్తకాలకు ఉన్న విలువను చాటిచెప్పే వ్యాఖ్యలివి. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు పుస్తక పఠనంలో మార్పులు వచ్చినా.. ఎంచుకోవటంలో ప్రాధాన్యతలు మారినా పఠనాసక్తి మాత్రం తగ్గడం లేదు. నేడు(మంగళవారం) ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా కథనం. ● విజ్ఞాన భాండాగారాలు పుస్తకం మనకు తెలియని ఎన్నో విషయాలను ఎన్నో విషయాలను చెబుతుంది. వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది. అందుకే పుస్తకాన్ని హస్త భూషణం అంటారు. ప్రస్తుతం అందరి చేతుల్లో ఇంటర్నెట్తో కూడిన సెల్ఫోన్లు వచ్చినా పుస్తకాలకు ఆదరణ తగ్గలేదనే చెప్పుకోవాలి. చదువుకునే పుస్తకాలు, చదివే సాధనాలు మారినా పఠనాసక్తి తగ్గలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ● విజయం వైపు.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో కొలువు సాధించటం కోసం యువత తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలో వారు పోటీ పరీక్షలపై దృష్టి సారించడంతో షాపులు, లైబ్రరీల్లో ఈ తరహా పుస్తకాలే అందుబాటులో ఉంటున్నాయి. అదే విధంగా విజయం వైపు ఎలా పురుగులు తీయాలనే పలు అంశాలను వివరిస్తూ లక్ష్యం, ఆశయాలు, నడవడిక అంశాలతో ముద్రించిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలు తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో లభిస్తున్నాయి. ● ఆన్లైన్లోనూ పుస్తకాలు చేతిలో సెల్ఫోన్ ఉంటే చాలు ఆన్లైన్లో కావాల్సిన పుస్తకాలను ఈ–బుక్ ద్వారా చదివే వెసలుబాటు ఉండడంతో పఠనాసక్తి తగ్గడం లేదని చెబుతున్నారు. పోటీ ప్రపంచంలో లైబ్రరీకి వెళ్లలేక, పుస్తకాలను కొనలేక పలువురు ఈ–బుక్లో చదువుతూ విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. కాగా, వేసవి సెలవుల్లో పిల్లలనుతల్లిదండ్రులు గ్రంథాలయాలకు పంపించి పఠనాసక్తి పెంపొందించాల్సిన అవసరముందని పలువురు సూచిస్తున్నారు. తద్వారా సెల్ఫోన్ నుంచి దూరం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఉమ్మడి జిల్లాలో గ్రంథాలయాలు 43 పుస్తకాలు 4,98,303 డిపాజిటర్లు 31,755 పాఠకులు 11,85,392 మంది ఇప్పుడంతా పోటీ పరీక్షలకే.. ఒకప్పుడు నవలలు, కథల పుస్తకాలను ఎక్కువగా చదివేవారు. లైబ్రరీల్లోనూ వీటికి డిమాండ్ ఉండేది. ముఖ్యంగా విప్లవ సాహిత్యం, దేశభక్తి, పౌరాణికం, డిటెక్టీవ్ నవలలకు ఎందరో అభిమానులు ఉండేవారు. కొత్త పుస్తకాలు మార్కెట్లోకి వస్తే వెంటనే కొనేవారు. కానీ అలాంటి పుస్తకాలు కొనేవారు ఇప్పుడు అరుదుగానే ఉన్నారని చెప్పుకోవాలి. ప్రస్తుత యువత విజ్ఞానం, ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలకు పెద్దపీట వేస్తున్నారు. అందుకే నవలలు, కథల పుస్తకాలు ఏళ్ల క్రితం ముద్రించినవే లైబ్రరీల్లో కనిపిస్తున్నాయి. -
చిన్నప్పటి నుంచి..
గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు చదవటం చిన్నప్పటి నుంచే అలవాటు. ప్రస్తుతం గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడ కావాల్సినన్ని పుస్తకాలు ఉన్నాయి. అన్నిరకాల పుస్తకాలే కాక చదువుకోవడానికి చక్కని వాతావరణం ఉంది. – జె.రమ్య, సత్తుపల్లి 30 ఏళ్లుగా ప్రతిరోజు.. నేను ముప్పై ఏళ్లుగా గ్రంథాలయానికి వస్తున్నా. దినపత్రికలు చదవడం నా దినచర్యలో ఒక భాగం. ఇంకా శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద సాహిత్యం చదువుతాను. తల్లిదండ్రులు పిల్లలను పుస్తక పఠనం వైపు మళ్లించాలి. – కోడె వీరభద్రం, నాచారం, దమ్మపేట మండలం -
ఒత్తిడిని అధిగమిస్తేనే విజయాలు
ఖమ్మంమయూరిసెంటర్: పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తే విజయాలు సొంతమవుతాయని ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ నాయకులు బాగం హేమంతరావు, పోటు ప్రసాద్ పేర్కొన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యాన సోమవారం ఖమ్మంలో మోడల్ ఎంసెట్, నీట్ మోడల్ పరీక్షలు నిర్వహించగా వారు ప్రశ్నాపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. మోడల్ పరీక్షలు రాయడం ద్వారా విద్యార్థుల్లో ఆందోళన తగ్గుతుందని తెలిపారు. ఏఐఎస్ఎఫ్ నాయకుడు మడుపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు రావి శివరామకృష్ణ, డాక్టర్స్ అకాడమీ డైరెక్టర్ సతీష్ కుమార్, జిల్లా కార్యదర్శి ఇటికాల రామకృష్ణ, నాయకులు శివ, వంశీ, బాలాజీ, ప్రతాప్, రాకేష్, రోహిత్, రాహుల్ రేణుక తదితరులు పాల్గొన్నారు. కారేపల్లి సంతగుడి ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు కారేపల్లి: దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యాన కారేపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం నిర్వహిస్తున్న వారాంతపు సంత జూనియర్ అసిస్టెంట్ పగడాల మోహన్కృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంతారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కారేపల్లి సంతలో అవకతవకలు జరుగుతున్నట్లు డీసీకి కొందరు ఫిర్యాదు చేయగా, ఆదివారం సంతను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈక్రమాన 60మేకలతో వెళ్తున్న వాహనాలను తనిఖీ చేయగా 23మేకలకే రుసుం చెల్లించినట్లు రశీదు ఉండడంతో రూ.4,500 జరిమానా విదించారు. ఈమేరకు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని తేలడంతో జూనియర్ అసిస్టెంట్ను సస్పెండ్ చేశారని ఈఓ నల్లమోతు శేషయ్య తెలిపారు. అయితే, ఉత్తర్వులను తీసుకునేందుకు ఆయన నిరాకరించడంతో రిజిస్టర్ పోస్టు ద్వారా పంపనున్నట్లు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సమత పేర్కొన్నారు. ఉపాధి హామీ కూలీలకు ఇబ్బంది రావొద్దు ముదిగొండ: ఎండ కారణంగా ఉపాధి హామీ కూలీలు ఇబ్బంది పడకుండా వసతులు కల్పించాలని డీఆర్డీఓ ఆర్.సన్యాసయ్య సూచించారు. మండలంలోని న్యూలక్ష్మీపురం, సువర్ణాపురంల్లో పర్యటించిన ఆయన పని ప్రదేశాల్లో కూలీలతో మాట్లాడారు. పనికి తగిన వేతనం అందుతుందా అని ఆరా తీశాక ప్రథమ చికిత్స కిట్లు, తాగునీటి వసతి, టెంట్ల ఏర్పాటుపై సిబ్బందికి సూచనలు చేశారు. ఆతర్వాత వెంకటాపురంలో నర్సరీని ఆయన పరిశీలించారు. ఉద్యోగులు శ్రీదేవి, సూర్యనారాయణ, రంగనాయకమ్మ తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల చేతులకు వాపు టీకా వేయడంలో నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు కల్లూరు: _¯]l²-í³-ÌS-ÏÌZÏ ÆøVýS °Æø«§ýl-MýS-ÔèæMìS¢ ò³Æý‡-VýS-yýl…-™ø ´ër$ ÐéÅ«§ýl$ÌS »êǯ]l ç³yýl-MýS$…yé MýSË*ÏÆý‡$ {糿¶æ$-™éÓ-çܵ-{†ÌZ sîæM>Ë$ CÐ]lÓ-V>.. C§ýlªÇ ^ól™èl$-ÌSMýS$ Ðéç³# Ð]l_a VýSyýlz-Ë$ HÆý‡µ-yézƇ$$. C…§ýl$MýS$ Bçܵ-{† ¯]lÆó‡Þ M>Æý‡-×æÐ]l$° ™èlÍϧýl…-{yýl$-Ë$ BÆøí³-çÜ$¢-¯é²Æý‡$. MýSË*Ï-Æý‡$MýS$ ^ðl…¨¯]l §ýl…ç³-™èl$ÌS G°Ñ$¨ ¯ðlÌSÌS MýS$Ð]l*-Æý‡$-yìlMìS f¯]l-Ð]lÇ 17¯]l ¯]lÆŠḥÞ sîæM> ÐólĶæ$-V> 25 ÆøkÌS ™èlÆ>Ó™èl VýSyýlz-ÌêV> Ð]l*Ç…¨. ©…™ø »êË$yìl° ™èlÍϧýl…-{yýl$-Ë$ Oòßæ§ýl-Æ>»ê§Šæ-ÌZ° Bçܵ-{†ÌZ ^èl*í³…^èl-V>, C¯ŒS-òœMýSÛ¯ŒS HÆý‡µ-yìl…§ýl° ™ðlÍ´ëÆý‡$. çÜÆý‡jÈ ^ólĶæ*-ÍÞ E¯]l²-ç³µ-sìæMîS Ð]lĶæ$çÜ$Þ G°Ñ$§ól M>Ð]l-yýl…-™ø Cº¾…¨ AÐ]l#-™èl$…yýl-V> ^ðlç³µ-V> ™èlÍϧýl…-{yýl$-Ë$ B…§øâýæ¯]l Ð]lÅMýS¢… ^ólçÜ$¢-¯é²Æý‡$. MýSË*Ï-Æý‡$MóS ^ðl…¨¯]l Ð]l$Æø §ýl…ç³-™èl$-Ë$ ™èlÐ]l$ MýS$Ð]l*-Æý‡$-yìlMìS íœ{º-Ð]lÇ 7Ð]l ™ól©¯]l sîæM> ÐólƇ¬…^èl-V> BĶæ$¯]l ^ól†Oò³ MýS*yé VýSyýlz HÆý‡µyìl C¯ŒS-òœMýSÛ¯ŒS Ð]l_a…¨. Òǧýlª-ÇMìS sîæM> ÐólíÜ…¨ JMóS ¯]lÆý‡$Þ M>Ð]l-yýl…-™ø yéMýStÆŠ‡ ¯]lÐ]lÅ-M>…™Œæ¯]l$ ÑÐ]l-Æý‡-×æ Ayýl-VýS-V> C§ýlªÆý‡$ _¯é²-Æý‡$-ÌS¯]l$ ç³È„ìS…^éMýS ÑÐ]l-Æ>Ë$ ÐðlÌS-Ïyìl-Ýë¢-Ð]l$° ™ðlÍ´ëÆý‡$. M>V>, ¯]lÆŠ‡Þ °Æý‡Ï-„ýSÅ… Ð]lÌôæÏ CÌê fÇW…-§ýl°.. CÌê…-sìæÑ ç³#¯]l-Æ>Ð]l–™èl… M>MýS$…yé A«¨M>Æý‡$-Ë$ ^èlÆý‡Å-Ë$ ¡çÜ$-MøÐéÌS° ç³Ë$ Ð]l#Æý‡$ MøÆý‡$-™èl$-¯é²Æý‡$.