![- - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2023/07/21/1244.jpg.webp?itok=gCgD9phe)
కర్ణాటక: వివాహేతర సంబంధం గురించి ఘర్షణ చోటుచేసుకుంది. వివరాల మేరకు సూళగిరి సమీపంలోని కారుబల గ్రామానికి చెందిన డ్రైవర్ రామచంద్రన్ (38). అతని భార్య రూప (28). అదే ప్రాంతానికి చెందిన జావిద్ (21)కు రూపతో వివాహేతర సంబంధం ఉండేది. గత 17వ తేదీ డ్యూటీపై వెళ్లిన రామచంద్రన్ రాత్రి ఇంటికొచ్చేసరికి జావిద్ కనిపించాడు. దీంతో భార్యను, అతన్ని నిలదీశాడు.
దీంతో ఆవేశానికి గురైన భార్య రూప, ప్రియుడు జావిద్లు కలిసి రామచంద్రన్పై దాడి చేశారు. తీవ్ర గాయాలేర్పడిన రామచంద్రన్ను స్థానికులు చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సూళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొమని జావిద్ను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment