నేటి నుంచి రాట్నాలమ్మ తిరునాళ్ల | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రాట్నాలమ్మ తిరునాళ్ల

Published Tue, Apr 23 2024 8:25 AM | Last Updated on Tue, Apr 23 2024 8:25 AM

-

పెదవేగి : రాట్నాలకుంటలో వేంచేసియున్న శ్రీరాట్నాలమ్మ అమ్మవారి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు జరిగే తిరునాళ్లకు రాట్నాలమ్మ దేవస్థానం ముస్తాబైంది. భక్తుల పాలిట కల్పవల్లిగా ప్రసిద్ధికెక్కిన రాట్నాలమ్మ ఆవిర్భావం తూర్పుచాళుక్యుల కాలంలోనే జరిగింది. రాజవంశం రత్నాలు సమర్పించి కోరిన కోరిక మేరకు ఈ వేంగిపుర ప్రాంతంలో అమ్మవారు ఒక చేతిలో ఖడ్గంతో మరో చేతిలో కలశాలతో పులివాహనంపై ఈ ప్రాంతంలో రత్నలమ్మగా వెలసింది. బ్రహ్మ, ఈశ్వరుడు, విష్టువు, కాలభైరవుడు, కుమారస్వామి, చతుర్భుజ దుర్గాదేవి, షడ్భుజదుర్గాదేవి, సుబ్రహ్మణ్యస్వామి సప్తమాత్రుకలు వైదేహి సూర్య ఉషాదేవి తదితర పరివార దేవతలతో అమ్మవారు ఇక్కడ కొలువై ఉంది. నాటి రత్నలమ్మ నేటి రాట్నాలమ్మగా ప్రసిద్ధి చెందింది.

ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి..

ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి ఐదు రోజుల పాటు అమ్మవారి తిరునాళ్లు వైభవంగా నిర్వహిస్తారు. తిరునాళ్లు విజయవంతానికి ఆలయ అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement