Tirumala: తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ TTD News: Tirumala Que Updates On May 03 2024 | Sakshi
Sakshi News home page

తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ

Published Fri, May 3 2024 8:36 AM | Last Updated on Fri, May 3 2024 8:36 AM

TTD News: Tirumala Que Updates On May 03 2024

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 26 కంపార్ట్‌మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 10 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) స్వామివారిని 65,313 భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 28,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.54 కోట్లుగా లెక్క తేలింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement