ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ | Transfer of many IAS and IPS in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ

Published Fri, Jul 12 2024 6:14 AM | Last Updated on Fri, Jul 12 2024 9:41 AM

Transfer of many IAS and IPS in Andhra Pradesh

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ అధి­కారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మరికొంత మంది అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కు­మార్‌ ప్రసాద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భూ పరిపాలన చీఫ్‌ కమిషనర్‌గా జి. జయలక్ష్మిని  నియమించింది. స్టాంప్స్‌ అండ్‌ రిజి­స్ట్రేషన్స్‌ ప్రత్యేక సీఎస్‌గా ఆర్‌పీ సిసో­డియా, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక సీఎస్‌గా జి.అనంతరాము నియమితుల­య్యారు. 

సమాచార పౌర సంబంధాల శాఖ డైరె­క్ట­ర్‌గా హిమాన్షు శుక్లాను నియమించింది. ఆర్థిక శాఖ (సీటీ) కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వర్తి­స్తున్న గిరిజా శంకర్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేసింది. ఆ బాధ్యతలను ఆర్థిక శాఖ ముఖ్య కార్య­దర్శికి అప్పగించింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ హరి­కిరణ్‌ను బదిలీ చేసింది. గ్రామ, వార్డు సచివాల­యా­ల శాఖ బాధ్యతల నుంచి అజయ్‌ జైన్‌ను రిలీవ్‌ చేసింది. 

ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు ఇలా.. 



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement