June 26: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం Huge Devotees Rush At Tirumala | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం

Published Wed, Jun 26 2024 7:04 AM | Last Updated on Wed, Jun 26 2024 7:04 AM

Huge Devotees Rush At Tirumala

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 16 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సోమవారం అర్ధరాత్రి వరకు  71,824 మంది స్వామివారిని దర్శించుకోగా, 28,462 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.01 కోట్లు సమర్పించారు.

ఇంకా.. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 6 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు, దర్శనానికి 5 గంటల సమయం. ఉచిత  సర్వదర్శనానికి  సుమారు 16  గంటల సమయం పడుతుంది . ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో స్వామివారి దర్శనం లభిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement