Guntur 12 Years Old Girl Complete Tenth Class, Details Inside - Sakshi
Sakshi News home page

12 ఏళ్లకే టెన్త్‌ పాసైన గుంటూరు విద్యార్థిని.. ఎన్ని మార్కులంటే?

Published Mon, May 8 2023 10:54 AM | Last Updated on Mon, May 8 2023 2:56 PM

Guntur 12 Years Old Girl Complete Tenth Class - Sakshi

సాక్షి, గుంటూరు:  గుంటూరు నగరానికి చెందిన చిర్రా అనఘాలక్ష్మి 11 ఏళ్ల 8 నెలల వయసులోనే 10వ తరగతి పరీక్షలు రాసింది. బ్రాడీపేటలోని సెంట్రల్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదివిన అనఘాలక్ష్మి అన్ని సబ్జెక్టులలో 90కి పైగా మార్కులతో మొత్తం 600కు గాను 566 మార్కులు సాధించింది.

పదేళ్ల వయసులో గణితంలో శతావధానం చేసిన అనఘాలక్ష్మి ప్రతిభను గుర్తించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాసిందని పాఠశాల డైరెక్టర్‌ ఆర్‌.రాము తెలిపారు. 
(‘జోసా’లో సీట్ల జోష్‌.. ఐఐటీ, ఎన్‌ఐటీలలో భారీగా పెరిగిన సీట్ల సంఖ్య)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement