పట్టాభి మాట్లాడింది.. దారుణమైన భాష: ఏపీ డీజీపీ | AP DGP Gowtham Sawang Respond On TDP Leader Pattabhi Comments | Sakshi
Sakshi News home page

పట్టాభి మాట్లాడింది.. దారుణమైన భాష: ఏపీ డీజీపీ

Published Wed, Oct 20 2021 2:14 PM | Last Updated on Wed, Oct 20 2021 5:52 PM

AP DGP Gowtham Sawang Respond On TDP Leader Pattabhi Comments - Sakshi

సాక్షి, విజయవాడ: నిన్న టీడీపీ నేత పట్టాభి మాట్లాడింది.. చాలా దారుణ భాష అని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నవారిపై దుర్భాషలాడటం సరికాదన్నారు. ‘‘పట్టాభి వ్యాఖ్యల తర్వాత ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఒక పార్టీ కార్యాలయంలో కూర్చుని ఇంత దారుణంగా మాట్లాడటం సరికాదు. ఇలాంటి భాషను సమాజంలో ఎవరూ అంగీకరించరు. పట్టాభి మాట్లాడిన భాష గతంలో ఎన్నడూ వినలేదు. రాజకీయ పార్టీలకు బాధ్యత ఉండాలని డీజీపీ హితవు పలికారు. (చదవండి: నారా లోకేష్‌పై కేసు నమోదు

పట్టాభి వ్యాఖ్యలు అన్ని పరిధులు దాటాయి..
నిన్న పట్టాభి చేసిన వ్యాఖ్యలు అన్ని పరిధులు దాటాయి. ఒక్కసారి కాదు.. పదేపదే పట్టాభి దూషణలు చేశాడు. పట్టాభి వ్యాఖ్యలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాం. గత కొన్ని రోజులుగా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తాం. దీని వెనుక ఎలాంటి కుట్ర ఉన్నా దర్యాప్తులో బయటపెడతాం. నిన్న సాయంత్రం 5.03 నిమిషాలకు వాట్సాప్‌లో ఒక కాల్‌ వచ్చింది. కాల్‌ చేయగానే ఎస్పీ తక్షణమే స్పందించారు.

నిరాధార ఆరోపణలు కరెక్టు కాదు
నిరాధార ఆరోపణలు కరెక్టు కాదని డీజీపీ అన్నారు. విజయవాడకు డ్రగ్స్‌తో ఏమాత్రం సంబంధం లేదన్నారు. అయినా కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారన్నారు. స్పష్టంగా చెప్పినా పదేపదే ఆరోపణలు సరికాదన్నారు. ఆరోపణలు చేయవద్దని చెబుతున్నాం. గుజరాత్‌లో దొరికిన డ్రగ్స్‌తో ఏపీకి సంబంధం లేదు. ఒక గ్రామ్‌ కూడా విజయవాడకు రాలేదన్నారు.

పోలీసుల త్యాగాన్ని మరువలేం..
విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాన్ని మరువలేమని డీజీపీ అన్నారు. ఎలాంటి క్లిష్ట సమయంలోనైనా పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. రేపు పోలీసు ఫ్లాగ్‌ డే నిర్వహిస్తామన్నారు. కోవిడ్‌లో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నామని డీజీపీ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement