తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటలు | 24 hours to devotees visit TTD Tirumala Srivaru | Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటలు

Published Mon, Jul 11 2022 5:04 AM | Last Updated on Mon, Jul 11 2022 3:21 PM

24 hours to devotees visit TTD Tirumala Srivaru - Sakshi

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు 87,478 మంది స్వామివారిని దర్శించుకోగా, 48,692 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.53 కోట్లు వేశారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ పూర్తిగా నిండిపోయింది.. క్యూలైను ఆస్థాన మండపం వద్దకు చేరింది.

నేడు టీటీడీ పాలకమండలి సమావేశం
టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో సోమవారం పాలక మండలి సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జరగనున్న ఈ సమావేశానికి పాలకమండలి సభ్యులు హాజరు కానున్నారు. ఇందులో టీటీడీ ఉద్యోగులకు ప్రమాదాలపై భద్రత కల్పించడం, వారందరికీ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందేలా ఏర్పాటు చేయడం, శ్రీవారి భక్తుల కోసం టైం స్లాట్‌ టికెట్లు మంజూరు వంటి వాటిపై చర్చించే అవకాశం ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement