పాముకాటుతో కాంగ్రెస్‌ నాయకురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో కాంగ్రెస్‌ నాయకురాలి మృతి

Published Sat, Oct 7 2023 12:32 AM | Last Updated on Sat, Oct 7 2023 9:47 AM

- - Sakshi

అనంతపురం: పాముకాటుతో మండల కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు జానకమ్మ (50) శుక్రవారం మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాలమేరకు.. జానకమ్మ కూడేరులోని శివపార్వతుల జోడు లింగాల సంగమేశ్వరస్వామి దేవాల యం వద్ద పూజా సామగ్రి దుకాణం నిర్వహిస్తోంది. వారి కుటుంబం సభ్యులు కూడా అక్కడే నివాసం ఉంటున్నారు.

శుక్రవారం వేకువజామున జానకమ్మను పాము కాటేయడంతో గమనించిన భర్త ఆంజనేయులు పామును చంపేశాడు. తొలుత స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లాడు. వైద్య సిబ్బంది సూచన మేరకు అనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జానకమ్మ సాయంత్రం మృతి చెందింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement