-
Aus Vs Zim: సొంతగడ్డ మీద ఆస్ట్రేలియాకు భారీ షాక్.. జింబాబ్వే సంచలన విజయం
Zimbabwe Tour of Australia, 2022- 3rd ODI: ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో జింబాబ్వే సంచలన విజయం సాధించింది. మూడు వికెట్ల తేడాతో ఆతిథ్య కంగారూలను ఓడించి భారీ షాక్ ఇచ్చింది. తద్వారా మూడు వన్డేల సిరీస్లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించి క్లీన్స్వీప్ నుంచి తప్పించుకుంది. కాగా ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ సూపర్ లీగ్లో భాగంగా మూడు వన్డేలు ఆడేందుకు జింబాబ్వే.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. మొదటి రెండు మ్యాచ్లలో అలవోకగానే! మొదటి రెండు మ్యాచ్లలో ఆరోన్ ఫించ్ బృందం పర్యాటక జింబాబ్వే మీద వరుసగా 5, 8 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయాలు సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో వన్డేలోనూ నెగ్గి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని భావించింది. అయితే, అనూహ్య రీతిలో రెగిస్ చకబ్వా బృందం ఆసీస్కు షాకిచ్చింది. బర్ల్ దెబ్బకు కుప్పకూలిన ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ టౌన్స్విల్లే వేదికగా శనివారం జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రియాన్ బర్ల్ 5 వికెట్లతో చెలరేగిన నేపథ్యంలో 31 ఓవర్లలోనే కంగారూల ఆట ముగిసింది. 141 పరుగులకే ఆలౌట్ అయింది. ఇందులో 94 పరుగులు ఓపెనర్ డేవిడ్ వార్నర్ చేసినవే! #3rdODI | @ryanburl3 after his five-wicket haul 👇 pic.twitter.com/mHc6DSBv0X — Zimbabwe Cricket (@ZimCricketv) September 3, 2022 రాణించిన మారుమని.. చకబ్వా కెప్టెన్ ఇన్నింగ్స్ లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వేకు ఓపెనర్ తాడివానాషే మారుమని 35 పరుగులతో శుభారంభం అందించాడు. ఇక వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఆరో స్థానంలో బరిలోకి దిగిన కెప్టెన్ రెగిస్ చకబ్వా 37 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. రియాన్ బర్ల్ సైతం ఆఖర్లో విలువైన ఇన్నింగ్స్ ఆడి (11 పరుగులు) కెప్టెన్కు సహకారం అందించాడు. ఈ క్రమంలో 39 ఓవర్లలో 7 వికెట్ల నస్టానికి 142 పరుగులు చేసిన జింబాబ్వే.. ఆతిథ్య ఆసీస్ మీద అద్బుత విజయం సాధించింది. రియాన్ బర్ల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చదవండి: Asia Cup 2022: మరోసారి తలపడనున్న భారత్-పాక్.. సూపర్-4 షెడ్యూల్ ఇదే Asia cup 2022: భారత్ రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే రెండో జట్టుగా! -
ఆస్ట్రేలియాకు షాకిచ్చిన జింబాబ్వే.. 141 పరుగులకే కంగారులు ఆలౌట్!
టౌన్స్విల్లీ వేదికగా మూడో వన్డేలో ఆస్ట్రేలియాకు జింబాబ్వే భారీ షాక్ ఇచ్చింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను 141 పరుగులకే జింబాబ్వే కుప్పకూల్చింది. జింబాబ్వే బౌలర్లలో స్పిన్నర్ ర్యాన్ బర్ల్ 5 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. అతడితోపాటు ఎవాన్స్ రెండు, విలియమ్స్, న్యాచీ, నగర్వా తలా వికెట్ సాధించారు. ఇక ఆసీస్ సాధించిన 141 పరుగులలో డేవిడ్ వార్నర్ ఒక్కడే 94 పరుగులు చేయగా.. మిగితా బ్యాటర్లు మొత్తం కలిసి కేవలం 47 పరుగులు మాత్రమే చేశారు. ఇక ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ను 2-0తేడాతో ఆసీస్ కైవసం చేసుకుంది. కాగా 18 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఆడుతోన్న జింబాబ్వే కనీసం ఒక్క మ్యాచ్లోనైనా విజయం సాధించాలని భావిస్తోంది. 141 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 13 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. చదవండి: Asia Cup 2022: ఇదేం బౌలింగ్ రా బాబు.. అప్పుడు సూర్య! ఇప్పుడు కుష్దిల్.. -
వన్డే క్రికెట్లో చరిత్ర.. వారి ఆటతీరు మారిందనడానికి ఇదే సాక్ష్యం
జింబాబ్వే వన్డే క్రికెట్లో చాన్నాళ్ల తర్వాత కొత్త రికార్డు నెలకొల్పింది. బంగ్లాదేశ్తో సొంతగడ్డపై జరిగిన టి20, వన్డే సిరీస్ల్లో విజయం సాధించడమే గాక పూర్వవైభవం దిశగా అడుగులను మరింత సుస్థిరం చేసుకుంది. టి20 ప్రపంచకప్ 2022కు క్వాలిఫై అయ్యామన్న సంతోషం జింబాబ్వేను పూర్తిగా మార్చేసింది. స్వదేశంలో సిరీస్ ఆడుతున్నప్పటికి ఇంతకముందెన్నడూ చూడని జింబాబ్వేను చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. తొలి రెండు వన్డేలో జింబాబ్వే ప్రదర్శన అందుకు అతీతంగా అనిపించింది. ఇక బుధవారం జరిగిన చివరి వన్డేలో జింబాబ్వే బంగ్లాదేశ్ చేతిలో ఓడినప్పటికి.. వారి పోరాటపటిమ అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా జింబాబ్వే టెయిలెండర్లు రిచర్డ్ నగరావ, విక్టర్ న్యౌచిబ్లు పదో వికెట్కు రికార్డుస్థాయి భాగస్వామంతో మెరిశారు. 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఒక దశలో 83 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో కనీసం వంద పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. అయితే టెయిలెండర్లు రిచర్డ్ నగరావ(34 నాటౌట్), విక్టర్ న్యౌచిబ్(26 పరుగుల) పదో వికెట్కు 68 పరుగులు జోడించి జింబాబ్వే పరువును కాపాడారు. కాగా పదో వికెట్కు వీరిద్దరు నమోదు చేసిన భాగస్వామ్యం వన్డే క్రికెట్ చరిత్రలో పదో స్థానం దక్కించుకుంది. తొలి స్థానంలో విండీస్ దిగ్గజాలు రిచర్డ్స్, మైకెల్ హోల్డింగ్ 106* పరుగుల భాగస్వామ్యంతో తొలి స్థానంలో ఉంది. మహ్మద్ అమిర్, సయీద్ అజ్మల్ 103 పరుగులతో రెండో స్థానంలో ఉంది. రాంపాల్, కీమర్ రోచ్ 99 పరుగులతో మూడో స్థానంలో ఉంది. చదవండి: ZIM Vs BAN: బంగ్లాదేశ్కు ఓదార్పు విజయం.. సిరీస్ జింబాబ్వే సొంతం #3rdODI | DRINKS! After 31 overs, 🇿🇼 are 144/9 Highest 10th wicket partnership for 🇿🇼 in ODIs (Ngarava 29*, Nyauchi 24*), need 113 runs from 19 overs#ZIMvBAN | #WaltonODISeries | #VisitZimbabwe pic.twitter.com/aPER0mUyzA — Zimbabwe Cricket (@ZimCricketv) August 10, 2022 -
బంగ్లాదేశ్కు ఓదార్పు విజయం.. సిరీస్ జింబాబ్వే సొంతం
జింబాబ్వే పర్యటనలో బంగ్లాదేశ్ రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో జింబాబ్వేపై 105 పరుగుల తేడాతో బంగ్లాదేశ్కు ఓదార్పు విజయం దక్కింది. ఎందుకంటే ఇప్పటికే జింబాబ్వే మూడు వన్డేల సిరీస్ను 2-1తో గెలుచుకుంది. కాగా అంతకముందు జరిగిన మూడు టి20 మ్యాచ్ల సిరీస్ను కూడా జింబాబ్వే 2-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అఫిప్ హొసేన్ 85 నాటౌట్ టాప్ స్కోరర్ కాగా.. అనాముల్ హక్ 76, మహ్మదుల్లా 39 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవన్స్ 2, ఎల్ జాంగ్వే 2, సికిందర్ రజా, నగరవా చెరొక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 32.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 83 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే కనీసం వంద పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. అయితే టెయిలెండర్లు రిచర్డ్ నగరావ(34 నాటౌట్), విక్టర్ న్యౌచిబ్(26 పరుగుల) పదో వికెట్కు 68 పరుగులు రికార్డు భాగస్వామ్యంతో మెరిసి జింబాబ్వే పరువును కాపాడారు. కాగా పదో వికెట్కు వీరిద్దరు నమోదు చేసిన భాగస్వామ్యం వన్డే క్రికెట్ చరిత్రలో పదో స్థానం దక్కించుకుంది. సిరీస్లో రెండు సెంచరీలతో చెలరేగిన కెప్టెన్ సికిందర్ రజా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. చదవండి: Shikar Dhawan: 'ఆపండి రా నాయనా'.. మీ అతి ప్రేమతో చంపేటట్లున్నారు! Ishan Kishan: ఎంపిక చేయలేదన్న కోపమా?.. పాట రూపంలో నిరసన -
బంగ్లాదేశ్కు మరోసారి ఊహించని షాక్.. వన్డే సిరీస్ జింబాబ్వే సొంతం!
జింబాబ్వేతో టీ20 సిరీస్ను కోల్పోయిన బంగ్లాదేశ్.. ఇప్పుడు వన్డే సిరీస్ను కూడా కాపాడకోలేకపోయింది. హరారే వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో జింబాబ్వే కైవసం చేసుకుంది. జింబాబ్వే విజయంలో ఆ జట్టు ఆల్రౌండర్ సికందర్ రజా, కెప్టెన్ చక్బావ సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో మహ్మదుల్లా (80), కెప్టెన్ తమీమ్(50), అఫీఫ్ హుస్సేన్(41) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో రజా మూడు వికెట్లు, మాధేవేరే రెండు, న్యాచి, చివంగా తలా వికెట్ సాధించారు. అనంతరం 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రజా, చక్బావ అద్భుతమైన ఇన్నింగ్స్లతో జట్టును అదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్కు ఏకంగా 201 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యం మ్యాచ్ను జింబాబ్వే వైపు మలుపు తిప్పింది. అనంతరం జింబాబ్వే కెప్టెన్ చక్బావ 75 బంతుల్లో 102 పరుగులు చేసి ఐదో వికెట్గా వెనుదిరిగాడు. కెప్టెన్ ఔటైనప్పటికీ రజా(127 బంతుల్లో 117పరుగులు) మాత్రం అఖరి వరకు క్రీజులో నిలిచి జింబాబ్వేకు మరుపురాని విజయాన్ని అందించాడు. రజా, చక్బావ అద్భుమైన ఇన్నింగ్స్ల ఫలితంగా జింబాబ్వే 47.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కాగా రజాకు ఈ సిరీస్లో ఇదే వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం. తొలి వన్డేలో కూడా జింబాబ్వే విజయంలో రజా తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇరు జట్ల మధ్య అఖరి వన్డే బుధవారం హరారే వేదికగా జరగనుంది. చదవండి: Asia Cup 2022: ఆసియా కప్కు భారత జట్టు.. అయ్యర్కు నో ఛాన్స్! హుడా వైపే మెగ్గు! -
ఆసియా కప్కు ముందు బంగ్లాదేశ్కు భారీ షాక్!
జింబాబ్వేపై తొలి వన్డేలో ఓటమి పాలైన బంగ్లాదేశ్కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ లిటన్ దాస్ గాయం కారణంగా మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. హారారే వేదికగా జరిగిన తొలి వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా లిటన్ దాస్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు 81 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రిటైర్ట్ హార్ట్గా వెనుదిరగాడు. అయితే అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాలు సమయం పట్టనున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ క్రమంలో లిటన్ దాస్ ఆసియాకప్-2022కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక బంగ్లాదేశ్- జింబాబ్వే మధ్య రెండో వన్డే హారారే వేదికగా ఆదివారం(ఆగస్టు7)న జరగనుంది. లిటన్ దాస్ స్థానంలో నజ్ముల్ హుస్సేన్ శాంటో తుది జట్టలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక తొలి వన్డే విషయానికి వస్తే.. బంగ్లాదేశ్పై 5 వికెట్ల తేడాతో జింబాబ్వే ఘన విజయం సాధించింది. జింబాబ్వే విజయంలో ఆల్ రౌండర్ సికందర్ రజా(135), ఇనోసెంట్ కాయ(110) అద్భుతమైన సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో తమీమ్ ఇక్భాల్(62), లిటన్ దాస్(81),అనముల్ హాక్(73) పరుగులతో రాణించారు. అనంతరం 304 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 5 వికెట్లు కోల్పోయి 48.2 ఓవర్లలోనే చేధించింది. చదవండి: ZIM vs BAN: పూర్వ వైభవం దిశగా అడుగులేస్తుందా..! -
పూర్వ వైభవం దిశగా అడుగులేస్తుందా..!
క్రికెట్లో జింబాబ్వే జట్టు మళ్లీ పూర్వ వైభవం సాధించే పనిలో పడిందా?.. అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. తాము ఆడుతుంది బంగ్లాదేశ్ లాంటి జట్టుతో అయినప్పటికి.. జింబాబ్వేకు ఇది గొప్ప ఫీట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జింబాబ్వే పూర్తిస్థాయి ఆటతీరు కనబరిచి దాదాపు 10 ఏళ్లకు పైనే అవుతుంది. ఒకప్పుడు ఆండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్, తైబూ, మసకద్జా, హిత్ స్ట్రీక్, క్యాంప్బెల్ లాంటి ఆటగాళ్లతో జింబాబ్వే సంచలన విజయాలు నమోదు చేసిన దాఖలాలు ఉన్నాయి. -సాక్షి, వెబ్డెస్క్ కానీ క్రమక్రమంగా ఆటగాళ్లు రిటైర్ అవ్వడం.. ఆదాయం లేక ఉన్న క్రికెటర్లు వేరే దేశానికి వలస వెళ్లడం.. ఆర్థిక మాంద్యం కూడా జింబాబ్వేను బాగా దెబ్బతీసింది. ఒకానొక దశలో ఆటగాళ్లు సరైన షూస్ లేకుండానే మ్యాచ్లు ఆడడం వారి ధీనస్థితిని కళ్లకు కట్టింది. అలాంటి జింబాబ్వే ఇప్పుడు కాస్త కొత్తగా కనిపిస్తుంది. జట్టులో ఉన్న ఆటగాళ్లు సమన్వయంతో ఆడుతూ ముందుకు వెళ్తున్నారు. ఇటీవలే టి20 ప్రపంచకప్ 2022కు క్వాలిఫై అయ్యామన్న జోష్ జింబాబ్వేకు బూస్టప్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. జింబాబ్వే పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్కు షాక్లు మీద షాకులు ఇస్తూనే వస్తుంది. ఇప్పటికే సొంతగడ్డపై తొలి ద్వైపాక్షిక టి20 సిరీస్ నెగ్గిన ఆనందంలో ఉన్న జింబాబ్వే.. తాజాగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో మరోసారి సంచలనం చేసింది. 300 పరుగుల పైచిలుకు లక్ష్యాన్ని అవలీలగా చేధించి బంగ్లాదేశ్కు మరోసారి షాక్ ఇచ్చింది. 6 పరుగులకే రెండు వికెట్లు.. 62 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన జింబాబ్వేను ఇన్నోసెంట్ కాయా, సికందర్ రజాలు ఇన్నింగ్స్ను నడిపించిన తీరు అద్భుతమనే చెప్పొచ్చు. కాయా 122 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 110 పరుగులు.. సికందర్ రజా 109 బంతుల్లో 135 నాటౌట్, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ ఇద్దరి మధ్య నాలుగో వికెట్కు 192 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. జింబాబ్వే క్రికెట్ చరిత్రలో ఈ ఇద్దరి భాగస్వామ్యం మూడో అత్యుత్తమం కావడం విశేషం. ఇంతకముందు 2014లో అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో హామిల్టన్ మజకద్జ, సికందర్ రజాలు 224 పరుగులతో తొలి స్థానంలో ఉన్నారు. ►ఇక జింబాబ్వేకు ఇది మూడో అత్యుత్తమ చేజింగ్ కావడం విశేషం. 11 ఏళ్ల క్రితం బులవాయో వేదికగా కివీస్తో మ్యాచ్లో జింబాబ్వే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించింది. ►2022లో జింబాబ్వేకు ఇది రెండో వన్డే విజయం. ఈ ఏడాది జనవరిలో పల్లెకెలే వేదికగా జరిగిన మ్యాచ్లో జింబాబ్వే లంకకు షాక్ ఇచ్చింది. ►బంగ్లాదేశ్పై ఒక వన్డేలో విజయం సాధించడానికి జింబాబ్వేకు 9 ఏళ్లు పట్టింది. ఆఖరిసారి మే 2013లో బులవాయో వేదికగా జరిగిన మ్యాచ్లో జింబాబ్వే బంగ్లాపై విజయం అందుకుంది. ఈ 9 ఏళ్ల కాలంలో జింబాబ్వే బంగ్లాదేశ్ చేతిలో వరుసగా 19 వన్డేల్లో పరాజయం చవిచూసింది. ►అయితే జింబాబ్వే ఈ విజయాలు బంగ్లాదేశ్పై సాధించడం తీసిపారేయాల్సిన విషయం కాదు. ఎందుకంటే రోజురోజుకు జింబాబ్వే పటిష్టంగా తయారవుతోంది. పెద్ద జట్లను ఓడించలేకున్నా.. అఫ్గనిస్తాన్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ లాంటి జట్లకు షాకివ్వడం ఖాయం. Stunning knocks from Innocent Kaia and Sikandar Raza 💯 Watch all the #ZIMvBAN matches on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺 📝 Scorecard: https://t.co/UMQDSxMjxu pic.twitter.com/sHg96ctOUD — ICC (@ICC) August 5, 2022 Iwiniiileeeh! What a way to finish it @SRazaB24! Well in @ZimCricketv 🇿🇼✊🏾 Big chase. pic.twitter.com/IOLRoSxEDp — Ranga.🇿🇼 (@RangaMberi) August 5, 2022 చదవండి: IND vs WI: నాలుగో టి20.. రోహిత్ శర్మ ఆడడంపై కీలక అప్డేట్ -
బంగ్లాదేశ్కు మరో షాకిచ్చిన జింబాబ్వే.. తొలి వన్డేలో ఘన విజయం!
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న జింబాబ్వే.. ఇప్పుడు వన్డే సిరీస్ను కూడా విజయంతో ఆరంభించింది. హరారే వేదికగా జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్పై జింబాబ్వే 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జింబాబ్వే విజయంలో ఆల్ రౌండర్ సికందర్ రజా(135), ఇనోసెంట్ కాయ(110) అద్భుతమైన సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. బంగ్లాదేశ్కు ఓపెనర్లు తమీమ్ ఇక్భాల్, లిటన్ దాస్ తొలి వికెట్కు 119 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 62 పరుగులు చేసిన తమీమ్, రజా బౌలింగ్లో పెవిలియన్కు చేరగా.. అనంతరం 81 పరుగులు చేసిన లిటన్ దాస్ రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అనముల్ హాక్(73), ముష్ఫికర్ రహీం(52) పరుగులతో రాణించడంతో బంగ్లా స్కోర్ 300 పరుగులు దాటింది. జింబాబ్వే బౌలర్లలో రజా,విక్టర్ న్యాచ్ తలా వికెట్ సాధించారు. ఇక 304 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 61 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం సికందర్ రజా,ఇనోసెంట్ కాయ అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 192 పరుగుల రికార్డు బాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి విరోచిత ఇన్నింగ్స్ల ఫలితంగా జింబాబ్వే 48.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఇక బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన రజాకు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: IND vs WI: మియామి బీచ్లో ఎంజాయ్ చేస్తున్న భారత ఆటగాళ్లు.. ఫోటోలు వైరల్ -
జింబాబ్వేతో మూడో టీ20.. బంగ్లాదేశ్కు భారీ షాక్!
ఆదివారం హరారే వేదికగా జరిగిన రెండో టీ20లో జింబాబ్వేపై బంగ్లాదేశ్ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే గెలుపు జోష్లో ఉన్న బంగ్లాదేశ్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టాండింగ్ కెప్టెన్ నూరుల్ హసన్ గాయం కారణంగా జింబాబ్వే పర్యటన మొత్తానికి దూరం కానున్నాడు. కాగా రెండో టీ20లో వికెట్ కీపింగ్ చేస్తున్నసమయంలో నూరుల్ హసన్ చేచేతి వేలికి గాయమైంది. అతడు గాయం నుంచి కోలుకోవడానికి రెండు వారాల సమయం పట్టనున్నట్లు బంగ్లా వైద్య బృందం వెల్లడించింది. "నూరుల్ చేతికి గాయమైన తర్వాత మేము ఎక్స్రే తీశాము. అతడి చూపుడు వేలుకు గాయమైంది. అతడు ఈ గాయం నుంచి కోలుకోవడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది" అని బంగ్లా జట్టు ఫిజియో ముజాద్డ్ ఆల్ఫా సానీ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అఖరి టీ20కు, వన్డే సిరీస్కు నూరుల్ హసన్ దూరం కానున్నాడు. కాగా గాయపడిన హసన్ స్థానంలో లిటాన్ దాస్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక మూడు టీ20ల సిరీస్లో ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. నిర్ణయాత్మక మూడో టీ20 హరారే వేదికగా మంగళ వారం (ఆగస్టు2)న జరగనుంది. అనంతరం మూడో వన్డేల సిరీస్లో జింబాబ్వేతో బంగ్లాదేశ్ తలపడనుంది. చదవండి: Deandra Dottin: అంతర్గత విభేదాలు.. వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ సంచలన నిర్ణయం! -
టీ20 ప్రపంచకప్కు అర్హత.. బిజీ బిజీ షెడ్యూల్తో జింబాబ్వే..!
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్కు అర్హత సాధించిన జింబాబ్వే.. రాబోయే రెండు నెలల్లో బిజీ బిజీ షెడ్యూల్తో గడపనుంది. కాగా 18 ఏళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు జింబాబ్వే వెళ్లనుంది. అయితే ఈ పర్యటనకు ముందు వెళ్లే ముందు జింబాబ్వే.. స్వదేశంలో బంగ్లాదేశ్, భారత్లతో వరుస సిరీస్లలో తలపడనుంది. తొలుత బంగ్లాదేశ్తో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్లో జింబాబ్వే తలపడనుంది. జూలై 30న హరారే వేదికగా జరగనున్న తొలి టీ20తో బంగ్లా టూర్ ప్రారంభం కానుంది. అనంతరం 2016 తర్వాత తొలి సారి జింబాబ్వే పర్యటనకు భారత్ రానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్ ఐసీసీ వన్డే సూపర్ లీగ్లో భాగంగా జరగనుంది. హరారే వేదికగా ఆగస్ట్ 18న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత జింబాబ్వే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు జింబాబ్వే ఆడనుంది. చదవండి: Ind Vs WI ODI Series: వాళ్లంతా లేరు కాబట్టి మా పని ఈజీ.. మేమేంటో చూపిస్తాం: విండీస్ కెప్టెన్ -
జింబాబ్వే, న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన ఆసీస్..!
స్వదేశంలో జింబాబ్వే, న్యూజిలాండ్తో జరగనున్న వన్డే సిరీస్లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే ఈ సిరీస్లకు ఆ జట్టు స్టార్ పేసర్ పాట్ కమిన్స్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అదే విధంగా సీనియర్ స్పిన్నర్ ఆడమ్ జంపా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక శ్రీలంక పర్యటనలో ఆసీస్ జట్టులో భాగమైన పలువురి ఆటగాళ్లను టీమ్ మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. మిచెల్ స్వెప్సన్, జోష్ ఇంగ్లిస్, ఝే రిచర్డ్సన్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్లకు జట్టులో చోటు దక్కలేదు. ఇక రెండు సిరీస్లు నార్త్ క్వీన్స్లాండ్లో జరగనున్నాయి. ఆగస్టు 28న జింబాబ్వేతో వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 6న న్యూజిలాండ్తో సిరీస్ మొదలుకానుంది. జింబాబ్వే, న్యూజిలాండ్తో వన్డే సిరీస్లకు ఆసీస్ జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, మార్నస్ లాబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్ ఆడమ్ జాంపా Rate this Aussie ODI squad out of 10 pic.twitter.com/LRJpqFL9M6 — cricket.com.au (@cricketcomau) July 18, 2022 చదవండి: IND vs WI: టీమిండియాతో సిరీస్.. క్రికెట్కు గుడ్బై చెప్పిన విండీస్ వికెట్ కీపర్..! -
టి20 ప్రపంచకప్ కదా.. ఆ మాత్రం ఉండాల్సిందే
ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న టి20 ప్రపంచకప్కు జింబాబ్వే క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. జింబాబ్వేతో పాటు నెదర్లాండ్స్ కూడా అనుమతి సాధించింది. క్వాలిఫయింగ్ టోర్నీ (బి)లో ఈ రెండు జట్లు ఫైనల్ చేరాయి. బులవాయోలో జరిగిన తొలి సెమీ ఫైనల్లో జింబాబ్వే 27 పరుగుల తేడాతో పపువా న్యూ గినియాపై విజయం సాధించింది. జింబాబ్వే 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేయగా, న్యూ గినియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులే చేయగలిగింది. జింబాబ్వే జట్టు.. ఒకప్పుడు క్రికెట్లో ఒక వెలుగు వెలిగిన దేశం. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి మేటిజట్లను ఓడించి సంచలనాలు నమోదు చేసింది. గత దశాబ్ద కాలం వరకు జింబాబ్వే జట్టు మోస్తరుగానే రాణించింది. కానీ కొన్నేళ్ల నుంచి మాత్రం వారి ఆటతీరు నాసిరకంగా తయారైంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. క్రికెట్లో పేద దేశంగా పేరు పొందిన జింబాబ్వేలో ఆటగాళ్లకు, బోర్డుకు అంతర్గత వ్యవహారాల్లో విబేధాలు, జాతి వివక్ష లాంటి ఎన్నో అంశాలు చుట్టుముట్టాయి. ఒకప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్-10లో ఉన్న జింబాబ్వే ఇప్పుడు కనీసం ఆ దరిదాపున కూడా రావడం లేదు. దీనికి తోడూ బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఐర్లాండ్ లాంటి దేశాలు క్రికెట్లో బాగా రాణిస్తున్నాయి. ఇవి కూడా జింబాబ్వేకు కొంత ప్రతీకూలమయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక టి20 ప్రపంచకప్ టోర్నీకి క్వాలిఫై అవడం పెద్ద ఘనత కిందే లెక్క. అందుకే జింబాబ్వే జట్టు దానిని ఒక పెద్ద పండుగలా సెలబ్రేట్ చేసుకుంది. మ్యాచ్ విజయం అనంతరం జింబాబ్వే ఆటగాళ్లు టి20 ప్రపంచకప్కు క్వాలిఫై అవ్వడాన్ని పెద్ద పండుగలా జరుపుకున్నారు. డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లంతా ఒక దగ్గరికి చేరి తమ బ్యాట్లను నేలకు కొడుతూ గట్టిగట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను జింబాబ్వే క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ''టి20 వరల్డ్కప్కు క్వాలిఫై అయ్యామని తెలియగానే మా జట్టు సభ్యులు పెద్ద పండుగ చేసుకున్నారు.'' అంటూ ట్వీట్ చేసింది. ఇక జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ''టి20 ప్రపంచకప్కు అర్హత సాధించామంటే మాకు అది పెద్ద విషయం. ఈ సందర్భంగా నాకు మాటలు రావడం లేదు. మా కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. సెమీఫైనల్లో 200 పరుగులు కొట్టినప్పటికి దానిని నిలుపుకునేందుకు బౌలర్లు అద్భుత కృషి చేశారు. ఇక ప్రస్తుతం దృష్టంతా ఆదివారం జరగనున్న క్వాలిఫయర్ ఫైనల్ పైనే ఉంది. ఆ మ్యాచ్లోనూ విజయం సాధించి గ్రూఫ్-ఏలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తాం. ఆ తర్వాత అక్టోబర్లో జరగనున్న టి20 వరల్డ్కప్పై దృష్టి పెడుతాం'' అంటూ కామెంట్ చేశాడు. #ICYMI: The lads celebrating after clinching a place at the ICC Men’s T20 World Cup 🏏 pic.twitter.com/ZoRQe57cz3 — Zimbabwe Cricket (@ZimCricketv) July 16, 2022 చదవండి: Yasir Shah: రీఎంట్రీలోనూ సంచలనమే.. పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు -
నజీబుల్లా మెరుపు ఇన్నింగ్స్.. జింబాబ్వేపై ఆఫ్ఘనిస్తాన్ గెలుపు
హరారే వేదికగా జింబాబ్వేతో జరగిన తొలి టీ20లో ఆఫ్ఘనిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్కు ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, గుర్భాజ్ అద్భుతమైన అరంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 83పరుగులు జోడించారు. అయితే ర్యాన్ బర్ల్ వేసిన 11 ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆఫ్గాన్ కాస్త ఒత్తిడికి గురైంది. అయితే అఖరిలో నజీబుల్లా జద్రాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో విజయం ఆఫ్ఘనిస్తాన్ వశమైంది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో నజీబుల్లా జద్రాన్(44), హజ్రతుల్లా జజాయ్(45) పరుగులతో రాణించారు. ఇక జింబాబ్వే బౌలర్లలో ర్యాన్ బర్ల్ మూడు వికెట్లు, ల్యూక్ జోంగ్వే ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కల్పోయి 159 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో సికిందర్ రజా(45) మాధేవేరే(32) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నిజత్ మసూద్ మూడు వికెట్లు,ఫజల్హక్ ఫరూఖీ, నబీ, రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు. ఇక రెండో టీ20 ఆదివారం జరగనుంది. చదవండి: SL vs AUS: 3 ఓవర్లలో 59 పరుగులు.. శ్రీలంక సంచలన విజయం..! -
జింబాబ్వేను చిత్తు చేసిన ఆఫ్ఘనిస్తాన్.. సిరీస్ కైవసం..!
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది. 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. 44.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆఫ్ఘాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ సెంచరీతో చెలరేగాడు. కాగా ఇది అతడికి తన కెరీర్లో తొలి సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్లో జద్రాన్ 141 బంతుల్లో 120 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రహమత్ షా 88 పరుగులతో రాణించాడు. ఇక జింబాబ్వే బౌలర్లలో ముజారబానీ, తిరిపానో చెరో వికెట్ సాధించారు. కాగా అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 228 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఇనోసెంట్ కియా 69 పరుగులు, రాయర్ బర్ల్ 51 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ మూడు,ఫజల్హక్ ఫారూఖీ,నబీ,రషీద్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించాడు. చదవండి: Umran Malik Bowling Idols: 'వకార్ యూనిస్ ఎవరో తెలియదు.. ఆ ముగ్గురు పేసర్లే నా ఆదర్శం' -
ఓ ప్రముఖ భారత వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడు..
జింబాబ్వే తరఫున అత్యధిక శతకాలు(17) బాదిన క్రికెటర్గా రికార్డుల్లో నిలిచిన ఆ దేశ మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్, మ్యాచ్ ఫిక్సింగ్కు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించాడు. 2019లో ఓ భారత వ్యాపారవేత్త, తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడని, అందుకు అతను 15000 అమెరికన్ డాలర్లు ఆఫర్ చేశాడని ట్విటర్ వేదికగా ఆరోపణలు చేశాడు. నాటి ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా తాను ఆ వ్యక్తి నుంచి కొంత నగదు కూడా తీసుకున్నట్లు అంగీకరించాడు. To my family, friends and supporters. Here is my full statement. Thank you! pic.twitter.com/sVCckD4PMV — Brendan Taylor (@BrendanTaylor86) January 24, 2022 గతేడాది సెప్టెంబర్లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన టేలర్.. 2019లో ఓ ప్రముఖ భారత వ్యాపారవేత్త ఆహ్వానం మేరకు భారత్కు వచ్చానని, ఆ సందర్భంగా ఓ పార్టీలో కొందరు నాకు కొకైన్ ఆఫర్ చేశారని, తాను కొకైన్ సేవిస్తుండగా వీడియోలు తీసి బెదిరించడం మొదలుపెట్టారని, ఈ క్రమంలోనే మ్యాచ్ ఫిక్సింగ్ కూడా చేయమన్నారని సంచలన స్టేట్మెంట్ను విడుదల చేశాడు. ఆ వ్యాపారవేత్త జింబాబ్వేలో టీ20 లీగ్ను లాంచ్ చేస్తామని తనను సంప్రదించాడని, అప్పటికే తమ దేశ క్రికెట్ బోర్డు నుంచి ఆరు నెలలుగా జీతాలు లేవని, తన ఆర్ధిక అవసరాలను ఆసరాగా తీసుకుని సదరు వ్యక్తి తనను ప్రలోభ పెట్టాడని, తాను అంగీకరించకపోయే సరికి బ్లాక్ మెయిలింగ్కు దిగాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. గత రెండేళ్లుగా ఈ భారాన్ని మోయలేక మానసికంగా, శారీరకంగా కృంగిపోయానని, అందుకే ఈ స్టేట్మెంట్ను విడుదల చేస్తున్నాని పేర్కొన్నాడు. జింబాబ్వే తరఫున 34 టెస్ట్లు, 205 వన్డేలు, 45 టీ20లు ఆడిన టేలర్.. టెస్ట్ల్లో 6 సెంచరీలు, వన్డేల్లో 11 సెంచరీలు సహా దాదాపు పది వేల పరుగులు చేశాడు. 35 ఏళ్ల ఈ ఆల్రౌండర్.. 2014 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. కాగా, తనను ఫిక్సింగ్ చేయమన్న ఆ వ్యాపారవేత్త ఎవరనే విషయాన్ని మాత్రం టేలర్ వెల్లడించలేదు. చదవండి: ICC Awards 2021: వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఎవరంటే..! -
షూస్ కొనే స్థోమత లేదు సాయం చేయండి: క్రికెటర్ ఆవేదన
''మేము చాలా దయనీయ స్థితిలో ఉన్నాం.. సిరీస్ ముగిసిన ప్రతీసారి విరిగిపోయిన మా షూస్కు గ్లూ రాసుకొని వాటిని కాసేపు ఎండబెడుతున్నాం.. ఆ తర్వాతి మ్యాచ్లకు మళ్లీ అవే షూతో సిద్ధమవుతున్నాం. ఇలా కొన్ని నెలలు పాటు చేస్తూనే ఉన్నాం. కనీసం షూ కొనే స్థోమత కూడా లేదు... ఎవరైనా స్పాన్సర్ ఉంటే సాయం చేయండి.. అప్పుడు మా షూస్కు గ్లూ పెట్టే అవసరం రాదు.'' ఇది జింబాబ్వే క్రికెటర్ ర్యాన్ బర్ల్ ఆవేదన. ఈ ఒక్క అంశం చాలు జింబాబ్వే క్రికెట్ బోర్డు ఎంత దయనీయ స్థితిలో ఉందో చెప్పడానికి. అయితే ర్యాన్ బర్ల్ పోస్టుకు స్పందించిన స్పోర్ట్స్ కంపెనీ పూమా షూస్.. అతనితో ఒప్పందం చేసుకోవడమే గాక జింబాబ్వే ఆటగాళ్లకు షూస్ను గిఫ్ట్గా పంపి తన ఉదారతను చాటుకుంది. ర్యాన్ బర్ల్ కన్నీటిపర్యంతమవుతూ పెట్టిన పోస్ట్ సగటు క్రికెట్ అభిమానులను కదిలిచింది. దీన స్థితిలో ఉన్న జింబాబ్వే క్రికెటర్లకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.'' బీసీసీఐ, ఈసీబీ, క్రికెట్ ఆస్ట్రేలియా మీకు ఒక విజ్ఞప్తి.. దయచేసి జింబాబ్వేతో సిరీస్లు ఉంటే పోస్ట్పోన్ చేయకండి. ఇప్పుడు వారితో క్రికెట్ ఆడితే వచ్చే డబ్బు వారికి ఎంతో ఉపయోగపడుతుంది. కచ్చితంగా జింబాబ్వే మంచి టీమ్.. కానీ అక్కడి కుళ్లు రాజకీయాలు క్రికెట్ను భ్రష్టు పట్టిస్తున్నాయి.జింబాబ్వేతో సిరీస్లు ఆడుతూ వారికి ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది.'' ఒక అభిమాని ఆవేదన చెందాడు. ''జింబాబ్వే ఆటగాళ్ల పరిస్థితి చూసి బాధేస్తోంది. క్రికెట్లో కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యం అవసరం పడుతుందేమో. జెంటిల్మెన్ ఆటగా పిలుచుకునే క్రికెట్లో ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా చూడాలి. దయనీయ స్థితిలో ఉన్న జింబాబ్వే క్రికెటర్లను ఆదుకోవాలి'' అంటూ మరొకరు కామెంట్ చేశారు. ర్యాన్ బర్ల్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్గా మారింది. మరి ఐసీసీతో పాటు బీసీసీఐతో పాటు ఇతర క్రికెట్ బోర్డులు బర్ల్ పోస్టుకు స్పందిస్తాయేమో చూడాలి.జింబాబ్వే తరపున 2017లో అరంగేట్రం చేసిన ర్యాన్ బర్ల్ 3 టెస్టుల్లో 24 పరుగులు, 18 వన్డేల్లో 243 పరుగులతో పాటు 7 వికెట్లు, 25 టీ20ల్లో 393 పరుగులతో పాటు 11 వికెట్లు తీశాడు. ఇక ప్రపంచ దేశాల్లో పేదరికంతో అలమటిస్తున్న దేశాల్లో జింబాబ్వే ఒకటి. నల్లజాతీయులు అనే వివక్ష వారిని మరింత వెనక్కి నెట్టేసింది. దశాబ్దాలకు పైగా వారు కనీసం ఏ క్రీడల్లో కూడా ఆడేందుకు అనుమతించలేదు. అలాంటిది కాస్త కూస్తో జింబాబ్వేకు పేరు వచ్చింది క్రికెట్ ద్వారానే అని చెప్పొచ్చు. రెండు దశాబ్దాల కిందటి వరకు జింబాబ్వే జట్టులో కాస్త పేరున్న ఆటగాళ్లు ఎక్కువగా కనిపించేవారు. హిత్ స్ట్రీక్, ఆండీ ప్లవర్, గ్రాంట్ ఫ్లవర్,హెన్రీ ఒలాంగా, తైబూ, స్టువర్ట్ క్యాంప్బెల్ లాంటి ఆటగాళ్లు ఉండేవారు. వీరు ఉన్నంతకాలం జింబాబ్వే ఆటతీరు కాస్త మెరుగ్గానే ఉండేది. బలహీన జట్టుగా కనిపించినా.. కాస్త పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించేది. వీళ్లంతా రిటైర్ అయ్యాకా జింబాబ్వే ఆటతీరు మరింత తీసికట్టుగా తయారైంది. బంగ్లాదేశ్, ఐర్లాండ్, అప్ఘనిస్తాన్ల కంటే ఎంతో ముందు అంతర్జాతీయ క్రికెటలోకి వచ్చిన జింబాబ్వే వారి చేతిలో కూడా పరాజయం పాలై అనామక జట్టుగా తయారైంది. దీనికి తోడూ క్రికెట్ను రాజకీయాలతో ముడిపెట్టడంతో 2019 జూలైలో ఐసీసీ జింబాబ్వేను ఆట నుంచి బహిష్కరించింది. దీంతో వారి కష్టాలు రెట్టింపయ్యాయి. ఎంతలా అంటే కనీసం జింబాబ్వే క్రికెట్ బోర్డు వారి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు కూడా చెల్లించలేకపోయింది. ఆ తర్వాత 2019 అక్టోబర్లో ఐసీసీ జింబాబ్వేపై ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. తాజాగా పాకిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటించింది. రెండు టెస్టుల సిరీస్ను పాక్ 2-0తో క్లీన్స్వీప్ చేయగా.. తర్వాత జరిగిన మూడు టీ20ల సిరీస్లో ఒక మ్యాచ్లో గెలిచిన జింబాబ్వే మిగతా రెండు ఓడిపోయి 2-1 తేడాతో సిరీస్ను పాక్కు అప్పగించింది. చదవండి: ఈ వ్యక్తిని అందుకోవడం కష్టంగా ఉంది : వార్నర్ నెలరోజులు గది నుంచి బయటికి రాలేకపోయా: పృథ్వీ షా Any chance we can get a sponsor so we don’t have to glue our shoes back after every series 😢 @newbalance @NewBalance_SA @NBCricket @ICAssociation pic.twitter.com/HH1hxzPC0m — Ryan Burl (@ryanburl3) May 22, 2021 Such a sad state of affairs concerning Zimbabwe cricket. Democratization of Cricket is necessary. We can't allow the beautiful game of cricket to continue like the Super League in football. — Satrajeet Sen (@Sen_Satrajeet) May 23, 2021 @BCCI @ECB_cricket @CricketAus Please do not keep postponing your tours with Zim. It brings them much needed experience and money, with all the viewers watching. Zim sure had a great team, but even the current team has splendid potential. Let's not ignore them — Niranjan Jha (@njanjha17) May 22, 2021 -
అవినీతి ఆరోపణలు.. మాజీ కెప్టెన్పై నిషేధం
దుబాయ్: జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్పై ఐసీసీ 8 ఏళ్ల పాటు నిషేధం విధించింది ఐసీసీ అవినీతి నిరోధక కోడ్ను ఐదుసార్లు ఉల్లంఘించినట్లు స్ట్రీక్పై ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో ఈ ఆరోపణలను ఖండించిన స్ట్రీక్.. తాజాగా వాటిని అంగీకరించాడు. జింబాబ్వే తరపున హీత్ స్ట్రీక్ 189 వన్డేల్లో 239 వికెట్లు, 65 టెస్టుల్లో 216 వికెట్లు తీసి అత్యంత విజయవంతమైన బౌలర్గా నిలిచాడు. ఆటకు గుడ్బై చెప్పిన తర్వాత కోచ్గా వ్యవహరించిన హీత్ స్ట్రీక్ ఆ సమయంలోనే అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలింది. 2017, 2018లలో వివిధ మ్యాచ్ల సందర్భంగా అతడు తన టీమ్లోని ప్లేయర్స్ దగ్గరికి బుకీలను అనుమతించడాన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో కొన్ని అంతర్జాతీయ మ్యాచ్లు కూడా ఉండగా.. ఐపీఎల్, బీపీఎల్, ఆఫ్ఘనిస్థాన్ ప్రిమియర్ లీగ్లలోని మ్యాచ్లు కూడా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ల ఫలితాలపై అవి ఎలాంటి ప్రభావం చూపలేదని ఐసీసీ అవినీతి నిరోధక శాఖ స్పష్టం చేసింది. ఓ మాజీ కెప్టెన్, కోచ్గా ఎన్నో అవినీతి నిరోధక కౌన్సిలింగ్ సెషన్లకు హాజరైన స్ట్రీక్ ఇలా చేయడం బాధాకరమని ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ అన్నారు. చదవండి: మ్యాచ్ ఓడినందుకు షారుఖ్ క్షమాపణ.. స్పందించిన రసెల్ సుదీర్ఘ కాలంగా టాప్లో కోహ్లి; ఇప్పుడు అగ్రస్థానంలో పాక్ కెప్టెన్ -
‘క్రికెట్కు వీడ్కోలు ఇలా కాదు’
హరారే: జింబాబ్వే జట్టును అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జింబాబ్వే క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వ జోక్యం మితిమీరినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. సస్పెన్షన్ తక్షణం అమలులోకి వస్తున్నట్లు ప్రకటించింది. ఐసీసీ తీసుకున్న తాజా నిర్ణయంతో జింబాబ్వేకి చెందిన క్రికెట్ జట్లు ఏవీ...ఇక ఐసీసీ నిర్వహించే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడానికి లేదు. అలాగే జింబాబ్వే క్రికెట్కు అందిస్తున్న నిధుల సాయాన్ని కూడా ఐసీసీ పూర్తిగా నిలిపివేసింది. ఐసీసీ నిర్ణయంతో జింబాబ్వేలో క్రికెట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఐసీసీ నిర్ణయం పట్ల జింబాబ్వే క్రికెటర్లు సికందర్ రజా, బ్రెండన్ టైలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేశారు. ‘ఎలా ఒక నిర్ణయం ఉన్నట్లుండి మమ్మల్ని అపరిచితులుగా, నిరుద్యోగులుగా మారుస్తూ, ఎంతో మంది కెరియర్ని ముగిస్తుంది.. ఎలా ఒక నిర్ణయం ఎన్నో కుటుంబాలపై ప్రభావం చూపిస్తుంది.. అంతర్జాతీయ క్రికెట్కు నేను వీడ్కోలు చెప్పాలనుకున్న పద్దతి ఇది కాదు కదా’ అంటూ సికిందర్ రజా ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. How one decision has made a team , strangers How one decision has made so many people unemployed How one decision effect so many families How one decision has ended so many careers Certainly not how I wanted to say goodbye to international cricket. @ICC pic.twitter.com/lEW02Qakwx — Sikandar Raza (@SRazaB24) July 18, 2019 ‘జింబాబ్వేను సస్పెండ్ చేస్తూ.. ఐసీసీ తీసుకున్న నిర్ణయం హృదయవిదారకమైనది. మా చైర్మన్ ఎంపీ కాదు.. మా జట్టు వెనక ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. వందలాది మంది నిజాయతీ పరులైన ఆటగాళ్లు, ఉద్యోగులు, సహాయక సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్ దీన్నో ఉద్యోగంలా మాత్రమే కాక బాధ్యతగా భావించి జింబాబ్వే క్రికెట్కు అంకితమయ్యారు’ అంటూ బ్రెండన్ టేలర్ ట్వీట్ చేశారు. @ICC It's heartbreaking to hear your verdict and suspend cricket in Zimbabwe. The @ZimbabweSrc has no government back round yet our Chairman is an MP? Hundreds of honest people,players, support staff,ground staff totally devoted to ZC out of a job,just like that. 💔 — Brendan Taylor (@BrendanTaylor86) July 18, 2019 -
ఆతిథ్యం ఇవ్వాలంటే అప్పు కావాలి!
హరారే:జింబాబ్వే క్రికెట్ రోజు రోజుకు దిగజారిపోతున్నదనడానికి తాజా ఘటనే ఉదాహరణ. జింబాబ్వే క్రికెట్ బోర్డు ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోవడంతో తమకు అప్పు కావాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ని ఆశ్రయించింది. తమ వద్ద మ్యాచ్లు నిర్వహించడానికి అస్సలు డబ్బులు లేవని, ఏమైనా రుణ సాయం చేస్తే ఒకడుగు ముందుకు వేస్తామని జింబాబ్వే క్రికెట్ బోర్డు లేఖలో ఐసీసీకి విన్నవించింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. జింబాబ్వేలో పర్యటించాలి. ఆ ద్వైపాక్షిక సిరీస్లో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టీ 20 మ్యాచ్లు జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం జింబాబ్వే క్రికెట్ బోర్డు ఆర్ధిక కష్టాల కారణంగా పాక్తో సిరీస్ను నిర్వహించలేని పరిస్థితి తలెత్తింది. మరోవైపు పాకిస్థాన్ జట్టు కూడా ఆతిథ్యం ఇవ్వలేమంటే చెప్పండి.. ప్రత్యామ్నాయాలు చూసుకుంటామంటూ జింబాబ్వే క్రికెట్ బోర్డుకు సందేశాలు పంపింది. దీంతో జింబాబ్వే బోర్డు.. ఐసీసీ మద్దతు కోరింది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజమ్ సేథీ ధృవీకరిస్తూ.. 'ఐసీసీ మద్దతు కోరామని.. పర్యటనపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోవద్దని ఏప్రిల్ వరకు ఆగమంటూ జింబాబ్వే బోర్డు మమ్మల్ని కోరింది. ఒక వేళ ఈ ప్రయత్నంలో జింబాబ్వే విఫలమైతే మేం ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తాం' అని పేర్కొన్నారు. గతంలో భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన పలు సందర్బాల్లో ఆ దేశ క్రికెటర్లకు కిట్లు బహుమతులుగా ఇచ్చిన సంగతి తెలిసిందే. -
చివరి వన్డే అఫ్గాన్దే
షార్జా: జింబాబ్వేతో సోమవారం జరిగిన ఐదో మ్యాచ్లో అఫ్గాన్ 146 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సిరీస్ను 4–1తో దక్కించు కుంది. తొలుత అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 241 పరుగులు చేసింది. రషీద్ ఖాన్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులు సాధించాడు. జింబాబ్వే 32.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. -
విరాట్ కోహ్లిని తలపించాడు..!
వెల్లింగ్టన్ : అండర్ -19 ప్రపంచకప్లో భారత క్రికెట్ టీమ్ అదరగొడుతోంది. గ్రూప్-బీలోని ప్రత్యర్థులు అందరినీ చిత్తు చేసిన పృథ్వీ షా సేన క్వార్టర్స్లోకి అడుగుపెట్టింది. గ్రూప్-బీలో శుక్రవారం జరిగిన ఆఖరు మ్యాచ్లో జింబాబ్వేతో తలపడిన భారత జట్టు అద్భుత ప్రతిభను కనబరిచింది. ఓపెనర్లు శుభ్మాన్ గిల్ 59 బంతుల్లో 90 పరుగులు, దేశాయ్ 73 బంతుల్లో 56 పరుగులు సాధించడంతో చిన్న లక్ష్యాన్ని భారత జట్టు అలవోకగా చేధించింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే బౌలర్ కొసిలాతి నుంగు విసిరిన 14వ ఓవర్లో గిల్ అద్భుతమైన షాట్ను ఆడి క్రికెట్ పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కోహ్లి ట్రేడ్ మార్క్ షాట్ను అదే తరహాలో ఆడిన గిల్ దాన్ని భారీ సిక్సర్గా మలిచాడు. ఇదే మ్యాచ్లో భారత స్పిన్నర్ అనుకుల్ సుధాకర్ రాయ్ కేవలం 20 పరుగులు ఇచ్చి, నాలుగు వికెట్లను పడగొట్టాడు. క్వార్టర్ ఫైనల్స్లో భారత్, బంగ్లాదేశ్తో తలపడనుంది. -
మరో విజయమే లక్ష్యంగా...
మౌంట్ మాంగనీ: వరుస విజయాలతో అండర్–19 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్కు చేరిన భారత యువ జట్టు శుక్రవారం తమ చివరి లీగ్ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడనుంది. తొలి మ్యాచ్లో పటిష్ట ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన పృథ్వీ షా బృందం రెండో మ్యాచ్లో పసికూన పపువా న్యూ గినియాపై ఘన విజయం సాధించి మంచి ఊపుమీద ఉంది. ఇదే వరుసలో జింబాబ్వేపై గెలుపొంది అజేయంగా నాకౌట్కు వెళ్లాలని భారత జట్టు భావిస్తోంది. ఇప్పటికే గ్రూప్ ‘బి’ నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండు విజయాలతో క్వార్టర్స్కు చేరుకున్నాయి. ఉదయం 6.30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
పాక్దే తొలి వన్డే
పోరాడి ఓడిన జింబాబ్వే లాహోర్ : బ్యాటింగ్లో షోయబ్ మాలిక్ (112), హఫీజ్ (86), హారిస్ సోహైల్ (89 నాటౌట్) చెలరేగి ఆడటంతో జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా పాక్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 375 పరుగులు చేసింది. తర్వాత జింబాబ్వే 50 ఓవర్లలో 5 వికెట్లకు 334 పరుగులు చేసి పోరాడి ఓడిం ది. చిగుంబరా (117) సెంచరీతో ఆకట్టుకున్నాడు. మసకద్జా (73), సికిందర్ రజా (36), విలియమ్స్ (36) మోస్తరుగా ఆడారు. అయితే కీలక సమయంలో పాక్ బౌలర్లు విజృంభించడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. షోయబ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికపై శుక్రవారం జరుగుతుంది. సానియా ఆనందోత్సాహం ఆరేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో తన భర్త షోయబ్ మాలిక్ సెంచరీ కొట్టడంతో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆనందంతో పరవశించిపోతోంది. తన సంతోషాన్ని దాచుకోకుండా ట్విట్టర్లో షోయబ్కు అభినందనలు తెలిపింది. ‘నీ ప్రదర్శన చాలా సంతృప్తినిచ్చింది. నమ్మకం అద్భుతాలు చేస్తుంది’ అని ట్వీట్ చేసింది. -
పాకిస్తాన్దే టి20 సిరీస్
లాహోర్ : పాకిస్తాన్, జింబాబ్వే జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగానే ముగిసింది. చివరి ఓవర్లో 12 పరుగులు కావాల్సి ఉండగా బిలావల్ భట్టి (5 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్; 1 సిక్స్) అద్భుత ఆటతీరుతో జట్టును గట్టెక్కించాడు. దీంతో ఆదివారం గడ్డాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో పాక్ 2 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను 2-0తో దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో మూడు వికెట్లకు 175 పరుగులు చేసింది. షాన్ విలియమ్స్ (32 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు; 1 సిక్స్), సిబంద (46 బంతుల్లో 49; 2 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన పాక్ 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసి నెగ్గింది. ముక్తార్ అహ్మద్ (40 బంతుల్లో 62; 6 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా ఉమర్ అక్మల్ (21 బంతుల్లో 30; 1 ఫోర్; 2 సిక్సర్లు) వేగంగా ఆడాడు. -
భారత్ సాయం కావాలి
జింబాబ్వే జట్టు రావడం ద్వారా పాకిస్తాన్లో ఆరేళ్ల తర్వాత క్రికెట్ ప్రారంభం అవుతోంది. భారత్ తమకు సాయం చేస్తే తమ దేశంలో పూర్తిస్థాయిలో క్రికెట్ పునరుద్ధరణ జరుగుతుందని పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ షహర్యర్ ఖాన్ చెప్పారు.