-
హెడ్కోచ్గా గంభీర్.. బౌలింగ్ కోచ్గా జహీర్ ఖాన్ బెటర్!
‘‘గంభీర్ పట్టిందల్లా బంగారమే అవుతుంది. అతడు ఏ జట్టుతో చేరితే.. ఆ జట్టు విజయాలు సాధిస్తుంది. అసలు టీమిండియాకు విదేశీ కోచ్ల అవసరమే లేదు.ఇండియాలోనే ఎంతో మంది ప్రతిభావంతులైన కోచ్లు ఉన్నారు. ద్రవిడ్ తర్వాత.. భారత జట్టు ప్రధాన కోచ్గా గౌతం గంభీర్ కంటే అత్యుత్తమ ఆప్షన్ ఇంకొకటి ఉంటుందనుకోను.అతడొక అద్భుతమైన ఆటగాడు. గొప్ప కోచ్ కూడా కాగలడు. ప్రస్తుతం టీమిండియాకు హెడ్ కోచ్గా అతడే సరైనోడు. గంభీర్ తొలుత లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా ఉన్నాడు.అతడి మార్గ నిర్దేశనంలో లక్నో జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. తర్వాత కేకేఆర్కు మెంటార్గా వెళ్లాడు. ఆ జట్టు ఏకంగా చాంపియన్గా నిలిచింది.గంభీర్ది అత్యద్భుతమైన క్రికెటింగ్ మైండ్. ప్రత్యర్థి జట్టును కచ్చితంగా అంచనా వేసి అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించడంలో దిట్ట. తనతో కలిసి ఆడిన అనుభవం నాకుంది.కలిసే భోజనం చేసేవాళ్లం. ఆట గురించి చర్చించుకునే వాళ్లం. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య స్నేహ బంధం ఉంది. టచ్లోనే ఉంటాం’’ అని పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ అన్నాడు.భారత క్రికెట్ జట్టు హెడ్కోచ్గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మాత్రమే సరైన ఆప్షన్ అని నొక్కి వక్కాణించాడు. అతడి మార్గదర్శనంలో టీమిండియా మరింత పటిష్టంగా మారుతుందని కమ్రాన్ అక్మల్ పేర్కొన్నాడు.బౌలింగ్ కోచ్గా వారిలో ఒకరు బెటర్ఇక గంభీర్ ప్రధాన కోచ్గా ఉంటే.. ఆశిష్ నెహ్రా లేదంటే జహీర్ ఖాన్లలో ఒకరిని బీసీసీఐ తమ బౌలింగ్ కోచ్గా ఎంచుకోవాలని సూచించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ కమ్రాన్ అక్మల్ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్నాడు. ఈ నేపథ్యంలో అతడి వారసుడిగా గౌతం గంభీర్ ఎంపిక దాదాపుగా ఖాయమైపోయింది.మెంటార్గా మాత్రమేఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లకు మెంటార్గా పనిచేశాడు గౌతీ. అయితే, కోచ్గా మాత్రం అతడికి అనుభవం లేదు. ఇక వరల్డ్కప్ టోర్నీలో విజయ వంతంగా ముందుకు సాగుతున్న టీమిండియా గురువారం సూపర్-8 దశలో తొలి మ్యాచ్ ఆడనుంది. అఫ్గనిస్తాన్తో బార్బడోస్ వేదికగా తలపడనుంది. -
టీ20 వరల్డ్కప్-2024కు ముందు భార్య అనుష్కతో కోహ్లి చక్కర్లు.. ఫొటోలు వైరల్
-
Gudi Padwa 2024: భార్యతో కలిసి గుడిపడ్వా సెలబ్రేషన్స్లో జహీర్ ఖాన్ (ఫోటోలు)
-
Ind vs Eng: ఛాన్స్ ఇస్తే ఇలాగేనా ఆడేది?.. వేటు తప్పదు!
Ind vs Eng Test series 2024: ఇంగ్లండ్తో టెస్టుల్లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆట తీరును భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్ విమర్శించాడు. వరుసగా అవకాశాలు ఇచ్చినా.. వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తొందరపాటు చర్యలతో అనవసరంగా వికెట్ పారేసుకుంటున్నాడని జహీర్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు రంజీ ట్రోఫీ-2024లో ఆడిన ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఫామ్లోకి వచ్చినట్లే కనిపించాడు. కానీ తొలి రెండు టెస్టుల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. హైదరాబాద్లో కేవలం 48 పరుగులకే పరిమితమైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... విశాఖపట్నంలోనూ వైఫల్యాన్ని కొనసాగించాడు. రెండు ఇన్నింగ్స్లో కలిపి 56 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ రెండు సందర్భాల్లోనూ ఒక్కసారి కూడా జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్.. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ తీరును విమర్శిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగే సత్తా ఉండి కూడా అనసరపు షాట్లకు పోయి విశాఖలో వికెట్ సమర్పించుకున్నాడంటూ పెదవి విరిచాడు. ఎందుకంత తొందర? ‘‘జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు మనం ఎలాంటి పాత్ర పోషించాలన్న అంశం మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. శ్రేయస్ అయ్యర్ మాత్రం ఇవేమీ పట్టనట్టు కనిపించాడు. ఆండర్సన్ అప్పటికే తన స్పెల్ పూర్తి చేశాడు. ప్రత్యర్థి జట్టులో ఒక్క ఫాస్ట్ బౌలర్ మాత్రమే ఉన్నాడు. అతడి తర్వాత స్పిన్నర్లు అటాకింగ్కు వస్తారని తెలుసు. నిజానికి అయ్యర్ స్పిన్ ఆడటంలో టాప్ క్లాస్ బ్యాటర్. అయినా కూడా.. తొందరపడ్డాడు. స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించాలనే తొందరలో తనకు మేనేజ్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు ఆదుకోలేకపోయాడు’’ అని జహీర్ ఖాన్ అయ్యర్కు చురకలు అంటించాడు. వేటు తప్పదు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి తిరిగి వస్తే ఇంగ్లండ్తో మిగిలిన టెస్టుల్లో సెలక్టర్లు శ్రేయస్కు ఉద్వాసన పలకడం ఖాయమని జహీర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా గతేడాది కాలంగా టెస్టుల్లో శ్రేయస్ అయ్యర్ ఒక్క అర్ధ శతకం కూడా సాధించలేకపోయాడు. వరుస అవకాశాలు ఇస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఇక విశాఖపట్నం మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో మంచి ఆరంభమే అందుకున్నా ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్లీ బౌలింగ్లో తొందరపడి వికెట్ పారేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా- ఇంగ్లండ్ ప్రస్తుతం చెరో విజయంతో 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. చదవండి: SAT20 League 2024: సన్రైజర్స్ పేసర్ సంచలనం.. ఫైనల్ చేరిన డిఫెండింగ్ చాంపియన్ -
Ind vs Eng: టీమిండియా గెలిచింది... కానీ అదొక్కటే సమస్య!
India vs England, 2nd Test: ఇంగ్లండ్పై రెండో టెస్టులో గెలుపొంది ఐదు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది టీమిండియా. విశాఖపట్నం మ్యాచ్ను విజయంతో ముగించి.. హైదరాబాద్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. దీంతో టీమిండియాకు కాస్త ఊరట లభించినట్లయింది. అయితే, రెండో టెస్టులో గెలుపుతో జోరు మీదున్న రోహిత్ సేన తదుపరి మ్యాచ్లో మరింత జాగ్రత్తగా ఆడాలని భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ హెచ్చరించాడు. ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యం ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశాడు. గెలిచాం కానీ.. అదొక్కటే ఆందోళనకరం ఈ మేరకు జియో సినిమా షోలో భాగంగా రెండో టెస్టులో భారత బ్యాటర్ల ఆట తీరును విశ్లేషిస్తూ.. ‘‘సిరీస్లో అప్పటికే ఒక మ్యాచ్ ఓడి వెనుకబడి ఉన్నపుడు... దానిని కచ్చితంగా 1-1తో సమం చేయాలనే కసి, దూకుడు కనిపించాలి. నాకు తెలిసి ప్రతి ఒక్క ఆటగాడి నుంచి ఉత్తమ ప్రదర్శన రాబట్టేందుకు రోహిత్ కృషి చేశాడు. అయితే, మన బ్యాటింగ్ ఆర్డర్ ప్రదర్శన పేలవంగా ఉంది. ఇలాంటి పిచ్ల మీద.. మనవాళ్లు ఇంతకంటే ఎన్నో రెట్లు మెరుగ్గా బ్యాటింగ్ చేయడం మనం చూశాం. ఇంగ్లండ్ సమిష్టిగా ఆడింది నిజానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో మెరుగ్గా బ్యాటింగ్ చేసింది. కేవలం ఒక్క ఆటగాడు మాత్రమే అర్ధ శతకం బాదినా.. 300 పరుగుల స్కోరుకు చేరువైంది. జట్టుగా ఆడటం వల్ల వచ్చిన ఫలితం అది. అయితే, టీమిండియా తరఫున రెండు అద్భుతమైన ఇన్నింగ్స్ చూడటం మనకు భారీ ఊరటనిచ్చే అంశం. యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ గొప్ప ఇన్నింగ్స్ ఆడారు. ఏదేమైనా మన బ్యాటర్లు మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది’’ అని జహీర్ ఖాన్ విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ(209)తో మెరవగా.. శుబ్మన్ గిల్ శతకం(104) బాదాడు. ఇక టీమిండియా ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్టు మొదలుకానుంది. రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఇందుకు వేదిక. టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు ►టీమిండియా స్కోరు(తొలి ఇన్నింగ్స్): 396-10 (112 ఓవర్లలో) ►ఇంగ్లండ్ స్కోరు(తొలి ఇన్నింగ్స్): 253-10 (55.5 ఓవర్లలో) ►టీమిండియా స్కోరు(రెండో ఇన్నింగ్స్): 255-10 (78.3 ఓవర్లలో) ►ఇంగ్లండ్ విజయ లక్ష్యం: 399 రన్స్ ►లక్ష్యాన్ని ఛేదించలేక 292 పరుగులకే రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఆలౌట్ ►విజేత: 106 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా చదవండి: Ind vs Eng: అలాంటి పిచ్లు అవసరమా అన్న గంగూలీ.. ద్రవిడ్ కౌంటర్! -
రజత్ పాటిదార్ అరంగేట్రం.. జహీర్ చేతుల మీదగా! ఫోటోలు వైరల్
మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ టీమిండియా తరపున టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశాడు. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్తో రెండో టెస్టుకు భారత తుది జట్టులో పాటిదార్ చోటు దక్కించుకున్నాడు. దీంతో భారత్ తరపున టెస్టు క్రికెట్లో అడుగుపెట్టిన 310 ఆటగాడిగా రజత్ నిలిచాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ చేతుల మీదగా పటిదార్ క్యాప్ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆల్ ది బెస్ట్ రజత్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా రజత్ పాటిదార్కు దేశీవాళీ క్రికెట్లో ఘనమైన రికార్డు ఉంది. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 55 మ్యాచ్లు ఆడిన పాటిదార్.. 4000 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 12 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్కు నిరాశ ఎదురైంది. తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్.. అంతర్జాతీయ అరంగేట్రం కోసం మరి కొంత కాలం వేచి చూడల్సిందే. తుది జట్లు: భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్ Congratulations to Rajat Patidar who is all set to make his Test Debut 👏👏 Go well 👌👌#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/FNJPvFVROU — BCCI (@BCCI) February 2, 2024 -
'రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్.. ఇంగ్లండ్కు చుక్కలు చూపిస్తాడు'
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు హైదరాబాద్ వేదికగా జనవరి 25 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్న ఇరు జట్లు ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో చెమటోడ్చుతున్నాయి. అయితే టెస్టు సిరీస్కు ఆరంభానికి ముందే ఇరు జట్లు ఊహించని షాక్లు తగిలాయి. ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు హ్యారీ బ్రూక్ టెస్టు సిరీస్ నుంచి వైదొలగగా.. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇక తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్తో జరిగే టెస్ట్ సిరీస్లో రోహిత్ శర్మ వ్యక్తిగత ప్రదర్శనతో పాటు కెప్టెన్గా కూడా రాణిస్తాడని జహీర్ థీమా వ్యక్తం చేశాడు. "రోహిత్ శర్మ అద్భుతమైన నాయకుడు. జట్టులోని ప్రతీ ఆటగాడికి మద్దతుగా ఉంటాడు. రోహిత్ తన కెప్టెన్సీతో మొత్తం జట్టును ప్రభావితం చేస్తాడు. అదే అతడి కెప్టెన్సీలో స్పెషల్ క్వాలిటీ. అతడు ఇప్పటికే తన కెప్టెన్సీని నిరూపించుకున్నాడు. వరల్డ్కప్లో అతడు జట్టును నడిపించిన విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్లో కూడా అదే పంథాలో జట్టును నడిపిస్తాడు. రోహిత్ ఈ సిరీస్లో కెప్టెన్సీ పరంగానే కాకుండా బ్యాట్తో కూడా రాణిస్తాడు. ఇప్పటికే ఇంగ్లండ్పై ఎన్నో అద్బుత ఇన్నింగ్స్లు ఆడాడు. కాబట్టి ప్రస్తుత సిరీస్లో కూడా రోహిత్ తన మార్క్ చూపిస్తాడని ఆశిస్తున్నానని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జహీర్ పేర్కొన్నాడు. చదవండి: Jasprit Bumrah: 'బజ్బాల్తో నాకు సంబంధం లేదు.. ఏమి చేయాలో నాకు తెలుసు' -
పంత్ తిరిగొచ్చి ఐపీఎల్లో అదరగొట్టినా.. టీమిండియాలో చోటు కష్టం
T20 WC 2024- Rishabh Pant: రిషభ్ పంత్ టీమిండియా పునరాగమనం గురించి భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్ జట్టులోకి తిరిగి వచ్చినా.. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో మాత్రం అతడికి చోటు దక్కడం కష్టమన్నాడు. కాగా డిసెంబరు 30, 2022లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న ఈ వికెట్ కీపర్.. ఫిట్నెస్ సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 సీజన్ ఆరంభం నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా పంత్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ తాజా ఎడిషన్ ముగిసిన తర్వాత అంటే.. జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్-2024 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్రదర్శనను బట్టే బీసీసీఐ సెలక్టర్లు.. వరల్డ్కప్ ఆడే భారత జట్టును ఎంపిక చేయనున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్లో టీమిండియా వికెట్ కీపర్ ఎవరన్న అంశంపై బోర్డు ఇప్పటికీ నిర్ణయానికి రాలేకపోతోంది. ఇషాన్ కిషన్కు బీసీసీతో విభేదాలు తలెత్తాయన్న తరుణంలో.. ఇటీవల అఫ్గనిస్తాన్తో ముగిసిన సిరీస్కు అతడిని ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో జితేశ్ శర్మ, సంజూ శాంసన్లకు స్వదేశంలో జరిగిన ఈ టీ20 సిరీస్ ఆడే అవకాశం దక్కింది. అయితే, పంత్ తిరిగి వస్తే వీరి భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ పేసర్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. టీ20 జట్టులో పంత్ పునరాగమనం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘రిషభ్ పంత్ జీవితంలో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ ఆటగాడిగా ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం అంత సులువేమీ కాదు. పంత్ తిరిగి మైదానంలో అడుగుపెడితే అందరికీ సంతోషమే. కఠిన సవాళ్లను దాటి ఇక్కడిదాకా చేరుకున్నాడు. అయితే, ప్రస్తుతం తను పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధించడమే అన్నికంటే ముఖ్యం. ఆతర్వాత రెగ్యులర్గా క్రికెట్ ఆడాలి. ఆటలో మునుపటి లయను అందుకోవాలి. దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత కమ్బ్యాక్ ఇవ్వడం అది కూడా అంతటి ఘోర ప్రమాదం తర్వాత పూర్తిగా కోలుకుని తిరిగి రావడం అంటే కష్టంతో కూడుకున్న పనే.. ఇవన్నీ ఆలోచిస్తే గనుక.. పంత్ ఐపీఎల్లో అద్భుతంగా ఆడినా.. సెలక్టర్లు అతడిని టీ20 ప్రపంచకప్-2024 జట్టులో ఆడించే రిస్క్ చేస్తారని అనుకోవడం లేదు’’ అని జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. చదవండి: చెలరేగిన హైదరాబాద్ బౌలర్లు, బ్యాటర్లు.. తొలిరోజే 302 రన్స్ ఆధిక్యం! తిలక్ రీ ఎంట్రీతో.. -
సౌతాఫ్రికా వెన్ను విరిచిన బుమ్రా.. టెస్టుల్లో 4 అరుదైన రికార్డులు
Ind vs SA 2nd Test Day 2: Jasprit Bumrah Records: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో కేవలం రెండు వికెట్లకే పరిమితమైన ఈ స్పీడ్స్టర్.. రెండో ఇన్నింగ్స్లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. న్యూలాండ్స్ పిచ్ మీద 63/3 ఓవర్నైట్ స్కోరుతో గురువారం బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆతిథ్య ప్రొటిస్ జట్టుకు బుమ్రా ఆరంభం నుంచే చుక్కలు చూపించాడు. ముందు రోజు ట్రిస్టన్ స్టబ్స్ రూపంలో వికెట్ దక్కించుకున్న బుమ్రా.. రెండో రోజు ఆట మొదలైన తొలి ఓవర్లో(17.6వ ఓవర్)నే డేవిడ్ బెడింగ్హామ్ను అవుట్ చేసి శుభారంభం అందించాడు. ఆ తర్వాత మరో నాలుగు ఓవర్ల అనంతరం కైలీ వెరెనెను పెవిలియన్కు పంపాడు. అనంతరం మార్కో జాన్సెన్ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసిన ఈ రైటార్మ్ పేసర్.. కేశవ్ మహరాజ్ వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకుని ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు. ఈ క్రమంలో లుంగి ఎంగిడీని అవుట్ చేసిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగించిన బుమ్రా ఖాతాలో ఆరో వికెట్ జమైంది. ఈ నేపథ్యంలో.. సౌతాఫ్రికాతో రెండో టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా నాలుగు అరుదైన రికార్డులు సాధించాడు. అవేంటంటే.. 1. సౌతాఫ్రికాలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ 2. SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్. 3. సౌతాఫ్రికాలో అత్యధికసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రెండో భారత బౌలర్. 4. న్యూలాండ్స్ పిచ్ మీద టెస్టుల్లో అత్యధిక వికెట్లు కూల్చిన రెండో బౌలర్(ఏకైక భారత బౌలర్). బుమ్రా కంటే ముందు ఈ ఘనతలు సాధించిన బౌలర్లు 1. సౌతాఫ్రికాలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్లు 45 - అనిల్ కుంబ్లే 43 - జవగళ్ శ్రీనాథ్ 38* - జస్ప్రీత్ బుమ్రా 35 - మహ్మద్ షమీ 30 - జహీర్ ఖాన్. ⭐⭐⭐⭐⭐ A 5-star performance from #JaspritBumrah in the 2nd innings, as he picks up his 4th witcket of the morning! Will his 9th Test 5-fer lead to a historic win for #TeamIndia? Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/hjDyvSAJc3 — Star Sports (@StarSportsIndia) January 4, 2024 2. SENA దేశాల్లో టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన భారత బౌలర్లు 7 - కపిల్ దేవ్ 6 - భగవత్ చంద్రశేఖర్ 6 - జహీర్ ఖాన్ 6 - జస్ప్రీత్ బుమ్రా. 3. సౌతాఫ్రికాలో టెస్టుల్లో అత్యధికసార్లు ఫైవ్ వికెట్ హాల్స్ తీసిన భారత బౌలర్లు 3 - జవగళ్ శ్రీనాథ్ 3 - జస్ప్రీత్ బుమ్రా 2 - వెంకటేష్ ప్రసాద్ 2 - ఎస్ శ్రీశాంత్ 2 - మహ్మద్ షమీ. 4. న్యూలాండ్స్ పిచ్(కేప్టౌన్) మీద అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్లు 25 - కొలిన్ బ్లైత్ (ఇంగ్లండ్) 18 - జస్ప్రీత్ బుమ్రా (భారత్)(న్యూలాండ్స్ పిచ్ మీద ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్) 17 - షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) 16 - జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్) 15 - జానీ బ్రిగ్స్ (ఇంగ్లండ్) బుమ్రా ధాటికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 176 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రాకు ఆరు వికెట్లు దక్కగా.. ముకేశ్ కుమార్ రెండు, ప్రసిద్ కృష్ణ, సిరాజ్ ఒక్కో వికెట్ తీశారు. -
రెండ్రోజులు అక్కడే పెట్టిన అరటిపండును శ్రీశాంత్ తిన్నాడు! ఆఖరికి లోదుస్తులు కూడా..
Sreesanth Once Ate Two-Day Old Banana: ‘మానే కాక(రమేశ్ మానే) అప్పట్లో టీమిండియాతో ప్రయాణించేవాడు. మసాజ్ చేయడంతో పాటుగా పూజలు కూడా చేస్తుండేవాడు. నిజానికి శ్రీశాంత్కు ‘మూఢనమ్మకాలు’ ఎక్కువ. తనలాంటి ఫాస్ట్బౌలర్ను నేనైతే ఎప్పుడూ చూడలేదు. మానే కాక.. పూజ సమయంలో అగర్బత్తీలను అరటిపండుకు కుచ్చి నిలబెట్టేవాడు. రెండ్రోజులైనా అదే తిన్నాడు అయితే, శ్రీశాంత్ నమ్మకాల గురించి తెలిసిన ఓ క్రికెటర్ అతడిని ఆటపట్టించాలని భావించాడు. శ్రీశాంత్.. నువ్వు గనుక ఇప్పటికిప్పుడు అరటిపండు తింటే ఈ మ్యాచ్లో ఐదు వికెట్లు తీస్తావు తెలుసా అని ఊరించాడు. అప్పటికే ఆ అగర్బత్తీలు పెట్టిన అరటిపండు అక్కడ పెట్టి రెండ్రోజులు అయింది. అయినా శ్రీశాంత్ దానిని తిన్నాడు. వికెట్లు తీయాలనే కోరికతో అలా చేశాడు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. భారత మాజీ పేసర్ శ్రీశాంత్ గురించి చెప్పుకొచ్చాడు. జియో సినిమా షోలో భాగంగా.. టీమిండియా ఆటగాళ్ల వింత నమ్మకాల గురించి ప్రస్తావన రాగా 2006 నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. అందుకే అలా చేశాడు కాగా నాడు ఆ అరటిపండు తిన్న శ్రీశాంత్ అప్పటి మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో కలిపి ఐదు వికెట్లు తీశాడు. జమైకాలో వెస్టిండీస్తో టెస్టు సందర్భంగా మొత్తంగా 49 పరుగులు ఇచ్చి ఈ మేరకు వికెట్లు పడగొట్టాడు. వాళ్లైతే ఆఖరికి లోదుస్తులు కూడా ఇక ఇదే షోలో పాల్గొన్న టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. భారత క్రికెటర్లలో చాలా మందికి ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటాయని చెప్పుకొచ్చాడు. రంజీ ఆడే రోజుల్లో కొంతమంది ఏదైనా ఒకరోజు ఐదు వికెట్లు తీస్తే.. ఆ బట్టలు.. ఆఖరికి లోదుస్తులు కూడా ఉతక్కుండా ఉంచుకునే వాళ్లని తెలిపాడు. అదృష్టం తమతో పాటు అలాగే అతుక్కుపోవాలని ఇలా చేసే వాళ్లని చెప్పుకొచ్చాడు. శ్రీశాంత్ ఒక్కడికే కాకుండా చాలా మందికి ఇలాంటి నమ్మకాలు ఉంటాయని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా కేరళకు చెందిన శ్రీశాంత్ ప్రస్తుతం జింబాబ్వే ఆఫ్రో టీ10లీగ్తో బిజీగా ఉన్నాడు. చదవండి: ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. ఇంత మొండితనం పనికిరాదు! -
'కోహ్లి వల్లే జహీర్ కెరీర్కు ముగింపు'.. మాజీ క్రికెటర్ క్లారిటీ
టీమిండియా మాజీ కెప్టెన్.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ గురించి వంక పెట్టాల్సిన పని లేదు. మైదానంలో పాదరసంలా కదిలే కోహ్లి ఎన్నోసార్లు స్టన్నింగ్ క్యాచ్లు తీసుకున్నాడు. ఎక్కువ సందర్భాల్లో స్లిప్లో ఫీల్డింగ్ చేసిన కోహ్లి కొన్నిసార్లు క్యాచ్లు వదిలేశాడు. అందులో అమూల్యమైన క్యాచ్లు కూడా ఉన్నాయి. సోమవారం వెస్టిండీస్తో ముగిసిన రెండో టెస్టులో సిరాజ్ బౌలింగ్లో కోహ్లి ఒక సింపుల్ క్యాచ్ను జారవిడిచాడు. ఈ సందర్భంగా రెండో టెస్టుకు కామెంటేటర్లుగా వ్యవహరించిన ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్లు 2014లో కోహ్లి మిస్ చేసిన క్యాచ్ గుర్తుచేసుకున్నారు. కోహ్లి వల్లనే తన టెస్టు కెరీర్ ముగిసిపోయిందని జహీర్ అన్నట్లు ఇషాంత్ పేర్కొన్నాడు. ఇషాంత్ మాట్లాడుతూ.. ''2014లో మేము న్యూజిలాండ్ పర్యటనకు వచ్చాం. బేసిన్ రిజర్వ్ బ్యాక్ వేదికగా జరిగిన టెస్టులో మూడో రోజు ఆటలో మెక్కల్లమ్ ట్రిపుల్ సెంచరీతో మెరిశాడు. అయితే జహీర్ ఖాన్ బౌలింగ్లో కోహ్లి 9 పరుగుల వద్ద మెక్కల్లమ్ ఇచ్చిన క్యాచ్ను జారవిడవడంతో బతికిపోయిన మెక్కల్లమ్ ఆ తర్వాత 300 పరుగులు బాదాడు. దీంతో కోహ్లి.. ''ఇదంతా తన వల్లే'' అంటూ తెగ ఫీలయ్యాడు. లంచ్ విరామం సమయంలో జహీర్ వద్దకు వచ్చిన కోహ్లి సారీ చెప్పాడు. దీనికి జహీర్ బదులిస్తూ.. ''ఏం పర్లేదు తర్వాతి బంతికి ఔట్ చేద్దాం'' అని పేర్కొన్నాడు. టీ విరామ సమయంలో కోహ్లి మరోసారి జహీర్కు సారీ చెప్పగా.. ''నా కెరీర్ నీ వల్లే ముగిసిపోనుంది'' అంటూ బాంబు పేల్చాడు. అయితే ఇషాంత్ వ్యాఖ్యలను తప్పుబట్టిన జహీర్ వివరణ ఇచ్చుకున్నాడు. ''నా కెరీర్ నీవల్లే ఎండ్ అయిందని నేను అనలేదు. ఇషాంత్ నా వ్యాఖ్యలను వక్రీకరించాడు(నవ్వుతూ). ఇంతవరకు టీమిండియా ఆడిన టెస్టుల్లో 300 పరుగులు చేసిన ఆటగాడి క్యాచ్లను ఇద్దరే మిస్ చేశారు. మొదట కిరణ్ మోరే క్యాచ్ జారవిడవడంతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ గ్రహం గూచ్ ట్రిపుల్ సెంచరీ చేశాడు. కిరణ్ మోరే తర్వాత ఆ ఘనత సాధించింది కోహ్లినే. 9 పరుగుల వద్ద మెక్కల్లమ్ ఇచ్చిన క్యాచ్ను కోహ్లి జారవిడవడంతో అతను ట్రిపుల్ సెంచరీ చేశాడు. అందుకే నా కెరీర్ నీవల్లే ఎండ్ కాబోతుంది అంటూ జోక్ చేశాను. కానీ కోహ్లి మాత్రం ప్లీజ్ అలా అనొద్దు.. నాకు చాలా బాధగా ఉంది.. కానీ క్యాచ్ జారవిడవడం వల్ల పరుగులు వచ్చేశాయి. అని అన్నాడు. దీంతో నేను పర్లేదు.. ఈ విషయాన్ని ఇక్కడితో మరిచిపో అంటూ కోహ్లికి సర్ది చెప్పాను.'' అంటూ జహీర్ ఖాన్ తెలిపాడు. ఇక అప్పటి మ్యాచ్లో జహీర్ ఖాన్ ఐదు వికెట్లు తీసినప్పటికి 51 ఓవర్లలో 170 పరుగులు ఇచ్చుకున్నాడు. మెక్కల్లమ్ 302 పరుగులు, బీజే వాట్లింగ్, జేమ్స్ నీషమ్లు సెంచరీలతో చెలరేగారు. దీంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ను 680 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత కోహ్లి రెండో ఇన్నింగ్స్లో సెంచరీతో(105 పరుగులు) మెరిసినప్పటికి మ్యాచ్ డ్రాగా ముగిసింది. చదవండి: Lionel Messi: 'మెస్సీని చూసేందుకు 808 మేకలు'.. అద్బుతాన్ని చూసి తీరాల్సిందే -
యాదృచ్ఛికమో లేక విచిత్రమో.. ఈ ఇద్దరు టీమిండియా మాజీ పేసర్లు..!
జెంటిల్మెన్ గేమ్ క్రికెట్లో ఒకరితో ఒకరికి సరిపోలిన గణాంకాలు ఉండటం సర్వ సాధారణం. ఉదాహరణకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సాధించిన కొన్ని రికార్డులను ప్రస్తుత టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అచ్చం అదే తరహాలో సాధించడం మనం చూశాం. ఇలాంటి సరిపోలిన ఘటనలు క్రికెట్లో కోకొల్లలు. అయితే ఇప్పుడు మనం చూడబోయే సరిపోలిన గణాంకాలను మాత్రం క్రికెట్ అభిమానులు కనివినీ ఎరిగి ఉండరు. ఇద్దరు భారత బౌలర్లకు సంబంధించి ఒకేలా ఉన్న ఈ గణాంకాలు చూసి జనాలు నివ్వెరపోతున్నారు. కెరీర్లు మిగిసే నాటికి సేమ్ టు సేమ్ ఉన్న గణాంకాలు చూసి అభిమానులు అవాక్కవుతున్నారు. పేస్ బౌలర్లైన జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ.. తమతమ కెరీర్లలో ఒకేలా 311 టెస్ట్ వికెట్లు పడగొట్టారు. ఇద్దరు బౌలర్ల విషయంలో ఇలా జరగడం చాలా కామన్. అయితే ఇద్దరూ 11 సార్లు 5 వికెట్ల ఘనత, ఓసారి 10 వికెట్ల ఘనత సాధించి.. స్వదేశంలో 104 వికెట్లు, ఇతర దేశాల్లో 207 వికెట్లు పడగొట్టి ఉండటం మాత్రం విచిత్రమే. విండీస్తో రెండో టెస్ట్ సందర్భంగా జహీర్, ఇషాంత్ హిందీ కామెంట్రీ బాక్స్లో ఉండగా.. బ్రాడ్కాస్టర్ ఈ గణాంకాలను తెరపైకి తెచ్చాడు. ఇది చూసి జహీర్, ఇషాంత్లు సైతం ఆశ్చర్యపోయారు. తమకు కూడా తెలీని ఈ విషయం క్రికెట్ ప్రపంచానికి తెలియజేసినందుకు వారు బ్రాడ్కాస్టర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం సోషల్మీడియాలో వైరల్ కావడంతో.. ఇదెక్కడి విచిత్రం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, విండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా పట్టుబిగించింది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే ఆఖరి రోజు 8 వికెట్లు పడగొట్టాల్సి ఉంది. అదే విండీస్ గెలవాలంటే మరో 289 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్లు ఉన్న ఊపును చూస్తే ఇది అంత ఆషామాషీ విషయం కాదని తెలుస్తోంది. ఇప్పటికే తొలి టెస్ట్ గెలిచిన భారత్ 2 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ కూడా గెలిస్తే 2-0తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేస్తుంది. -
అండర్సన్ కంటే జహీర్ ఖాన్ బెస్ట్ బౌలర్: ఇషాంత్
భారత క్రికెట్లో మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్కు ప్రత్యేక స్ధానం ఉంది. తన అద్భుత బౌలింగ్తో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఈ రివర్స్ స్వింగ్ కింగ్ దాదాపు దశాబ్దం పాటు భారత క్రికెట్కు తన సేవలు అందించాడు. 2011 వన్డే ప్రపంచకప్లో 21 వికెట్లతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన జాక్... అన్ని ఫార్మాట్లలో కలిపి 610 వికెట్లు తీసుకున్నాడు. అయితే మరోసారి ఈ దిగ్గజ పేసర్పై టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా రణ్వీర్ అల్లాబాడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషాంత్కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్, జహీర్ ఖాన్లో ఎవరు అత్యుత్తమ బౌలర్ అని రణ్వీర్ ప్రశ్నించాడు. అందుకు బదులుగా ఇషాంత్ ఏమీ ఆలోచింకుండా అండర్సన్ కంటే జహీర్ గొప్ప బౌలర్ను అని చెప్పుకొచ్చాడు. కాగా అండర్సన్ కూడా ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. తన కెరీర్లో ఇప్పటి వరకు 180 టెస్టులు, 194 వన్డేలు ఆడిన అండర్సన్ వరుసగా 269, 686 వికెట్లు పడగొట్టాడు. అతడి టెస్టు కెరీర్లో ఏకంగా 32 ఫైవ్ వికెట్ల హాల్స్ ఉన్నాయి. "జిమ్మీ అండర్సన్ బౌలింగ్ శైలి కాస్త బిన్నంగా ఉంటుంది. అతడు టాప్ క్లాస్ బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ అతడు ఎక్కువ భాగం తన కెరీర్లో ఇంగ్లండ్లోనే ఆడాడు. ఇంగ్లండ్ పిచ్లకు పేసర్లు అనుకూలిస్తాయి, అదే భారత్లో ఆడి వుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. నా వరకు అయితే అండర్సన్ కంటే జాక్(జహీర్ ఖాన్) బెస్ట్ బౌలర్" అని ఇషాంత్ పేర్కొన్నాడు. చదవండి: IND vs WI: వెస్టిండీస్ టూర్కు ముందు చాహల్ కీలక నిర్ణయం.. మరో లీగ్లో ఆడేందుకు! -
అతడి సేవలను సన్రైజర్స్ సరిగ్గా వాడుకోవడం లేదు! కనీస మద్దతు లేకుండా..
IPL 2023 SRH: టీమిండియా యువ సంచలనం, కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ సేవలను సన్రైజర్స్ హైదరాబాద్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుందని భారత మాజీ స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ అన్నాడు. లోపం ఎక్కడ ఉందో అర్థం కావడం లేదని వాపోయాడు. కాగా నెట్ బౌలర్గా సన్రైజర్స్ జట్టులో చేరిన ఉమ్రాన్.. తన అద్భుతమైన ఆట తీరుతో అనతికాలంలోనే ప్రధాన బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. Photo Credit : IPL Website నెట్ బౌలర్గా వచ్చి..! ఏకంగా టీమిండియాలో కచ్చితమైన వేగంతో బంతులు విసిరే ఈ స్పీడ్స్టర్ ఐపీఎల్-2021 సీజన్లో కేకేఆర్తో మ్యాచ్ ద్వారా రైజర్స్ తరఫున అరంగేట్రం చేశాడు. గతేడాది 14 ఇన్నింగ్స్లో 22 వికెట్లు పడగొట్టిన అతడు.. అదే ఏడాది టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఉమ్రాన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం ఏడు మ్యాచ్లు ఆడిన అతడు 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో ఏప్రిల్ 29 నాటి మ్యాచ్ తర్వాత అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. కెప్టెన్కే తెలియదట ఈ నేపథ్యంలో ఐపీఎల్-2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్కు ముందు రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ మాట్లాడుతూ.. ఉమ్రాన్ ఆడకపోవడం వెనుక కారణమేమిటో తెలియదని వ్యాఖ్యానించాడు. మార్కరమ్ తీరు పలు సందేహాలకు తావిచ్చింది. ఈ క్రమంలో జియో సినిమా షోలో జహీర్ ఖాన్ ఈ విషయంపై స్పందించాడు. ఉమ్రాన్ విషయంలో సన్రైజర్స్ ఎందుకిలా?! ‘‘సన్రైజర్స్ ఫ్రాంఛైజీ ఉమ్రాన్ సేవలను సరిగ్గా వాడుకోలేకపోతోంది. ఇందుకు కారణమేమిటో మాత్రం తెలియడం లేదు. యువ సీమర్లను జట్టులో ఉంచుకున్నపుడు.. వారికి అవసరమైన సమయంలో అన్ని రకాలుగా మద్దతుగా నిలబడాలి. లోపాలను సరిచేసుకునేందుకు సరైన వ్యక్తితో మార్గదర్శనం చేయించాలి. కానీ దురదృష్టవశాత్తూ ఉమ్రాన్ విషయంలో ఫ్రాంఛైజీ ఇవేమీ చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఈ సీజన్లో అతడి ఆట తీరు, పలు మ్యాచ్లకు పక్కన పెట్టిన విధానం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది’’ అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. వాళ్లిద్దరు సూపర్ ఇదిలా ఉంటే.. టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, హైదరాబాదీ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పవర్ ప్లేలో అద్భుతాలు చేస్తున్నారని జహీర్ కొనియాడాడు. పెద్దగా కష్టపడకుండా బ్యాటర్లను తిప్పలు పెడుతూ అనుకున్న ఫలితాలు రాబడుతున్నారంటూ షమీ, సిరాజ్లను కొనియాడాడు. కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు 13 మ్యాచ్లలో 23 వికెట్లు తీసిన షమీ.. పర్పుల్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. ఇక సిరాజ్ 13 మ్యాచ్లలో 17 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్రైజర్స్ ఆర్సీబీతో మ్యాచ్లోనూ ఓడిపోయి పదో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: రూ. 8 కోట్లు పెడితే మధ్యలోనే వదిలివెళ్లాడు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు! ఇది క్రికెట్ షోనా? లేదంటే.. అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ..! సిగ్గుండాలి! -
'సమస్య మళ్లీ మొదటికే.. పరిష్కారం చూపకుంటే ప్రమాదం'
భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ టీమిండియా క్రికెట్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కీలకమైన వన్డే వరల్డ్కప్కు ముందు అయ్యర్ గాయపడడం.. అవకాశమిచ్చిన సూర్యకుమార్ వరుసగా విఫలం కావడం 2019 ప్రపంచకప్ సీన్ను రిపీట్ చేస్తుందన్నాడు. వన్డేల్లో కీలకమైన నాలుగో స్థానంలో కచ్చితమైన పరిష్కారం చూపెట్టకపోతే ప్రమాదం పొంచి ఉందంటూ పేర్కొన్నాడు. జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. ''మెగా ఈవెంట్ జరిగి నాలుగేళ్లు ముగిసింది. ఈ నాలుగేళ్లలో నాలుగో స్థానం కోసం ఎంతోమంది పోటీ పడ్డారు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో మరో వరల్డ్కప్ జరగనుంది. కానీ సమస్య మాత్రం అలాగే ఉంది. బ్యాటింగ్ ఆర్డర్పై కచ్చితంగా మరోసారి సమీక్షించుకోవాలి. మళ్లీ నాలుగో స్థానంలో ఆడే బ్యాటర్ని గుర్తించాలి. ఇదే సమస్య 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో కూడా ఎదురైంది. నాలుగు సంవత్సరాల తర్వాత కూడా మనం అదే సమస్య గురించి మాట్లాడుకుంటున్నాం. నాలుగో స్థానంలో ఆడించేందుకు శ్రేయాస్ అయ్యర్ను గుర్తించారని నాకు తెలుసు. అతను ఆ బాధ్యతను కూడా చక్కగా నిర్వర్తించాడు. కానీ అయ్యర్ ప్రస్తుతం గాయం బారిన పడ్డాడు. ఒకవేళ అయ్యర్ గాయం నుంచి కోలుకోకపోతే ఈ సమస్య నుంచి బయటపడడానికి పరిష్కార మార్గాలను వెతకాల్సిన అవసరం ఉంటుంది'' అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ఇక అక్టోబర్-నవంబర్లో జరగనున్న వన్డే వరల్డ్కప్కు భారత్ ఆతిధ్యమివ్వనుంది. సొంతగడ్డపై మెగాటోర్నీ జరగనుండడంతో టీమిండియా ఫెవరెట్ హోదాలో బరిలోకి దిగనుంది. 12 ఏళ్ల క్రితం భారత్లోనే జరిగిన వన్డే ప్రపంచకప్ను ధోని సారధ్యంలోని టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అభిమానుల కలను నెరవేర్చింది. తాజాగా మరోసారి వన్డే ప్రపంచకప్ జరగనుండడంతో ఈసారి కూడా అదే ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం జట్టు పరిస్థితి చూస్తే అనుకున్నంత మెరుగ్గా లేదు. ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్ అందుకు నిదర్శనం. ముఖ్యంగా బ్యాటింగ్లో టీమిండియా చాలా మెరుగుపడాల్సి ఉంది. రోహిత్, గిల్, కోహ్లిలు రాణించాల్సిన అవసరం ఉంది. మిడిలార్డర్లో సూర్యకుమార్/శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా అంతంత మాత్రంగానే ఆడుతున్నారు. ఇక ఆల్రౌండర్ జడేజా వన్డేల్లో తన ముద్ర చూపించాల్సిన అవసరం ఉంది. షమీ, సిరాజ్, కుల్దీప్లతో బౌలింగ్ మాత్రం కాస్త పటిష్టంగానే కనిపిస్తుంది. వరల్డ్కప్ సమయానికి వీరికి బుమ్రా జత కలిస్తే మాత్రం బౌలింగ్లో భారత్కు తిరుగుండదు. చదవండి: బ్యాటర్ కొంపముంచిన బంతి.. వీడియో వైరల్ NZ Vs SL: పాపం రచిన్ రవీంద్ర! షిప్లే విశ్వరూపం.. 10 ఓవర్లలోనే లంక.. -
అతడి వికెటే మ్యాచ్కు టర్నింగ్ పాయింట్.. లేదంటేనా?
టీమిండియా స్వదేశంలో నాలుగేళ్ల తర్వాత తొలి సిరీస్ పరాభావాన్ని చవిచూసింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో 21 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత జట్టు.. 1-2 తేడాతో సిరీస్ను కొల్పోయింది. మార్చి 2019 తర్వాత స్వదేశంలో టీమిండియాకు ఇదే తొలి సిరీస్ ఓటమి. ఇక ఆఖరి వన్డే ఓటమిపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ స్పందించాడు. కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోవడమే ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్ అని జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. కాగా 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్..248 పరుగులుకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో 50 బంతులు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ 32 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లితో కలిసి మూడో వికెట్కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని రాహుల్ నెలకొల్పాడు. "ఈ రన్ ఛేజింగ్లో టీమిండియా ఎక్కువ భాగం మ్యాచ్ను తన కంట్రోల్లోనే ఉంచుకుంది. కానీ కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోవడం మ్యాచ్ ఒక్క సారిగా ఆసీస్ వైపు మలుపు తిరిగింది. అదే సమయంలో అక్షర్ పటేల్ కూడా రనౌట్గా వెనుదిరిగాడు. తర్వాత హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లి కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో విరాట్పై కాస్త ఒత్తిడి పెరిగింది. అందుకే అతడు కాస్త దూకుడుగా ఆడి తన వికెట్ను కోల్పోయాడు. చెన్నై లాంటి పిచ్పై ఒక్క వికెట్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలదు. అయితే మ్యాచ్ను మరింత దగ్గరగా తీసుకువెళ్లాలి. అది భారత ఇన్నింగ్స్లో కనిపించలేదు. మొదటి నుంచే భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నించారు. అది రాహుల్ను చూస్తే అర్దమవుతుంది. ఎందుకంటే కేఎల్ రాహుల్ అవుట్ అయ్యే ముందు భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నించాడు. అతడు బలవంతంగా షాట్లు ఆడినట్లు తెలుస్తుంది" అని క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: మ్యాచ్ ఓడిపోయినా రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. -
మైదానంలో ‘కింగ్’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే!
మన దేశంలో రెండు వినోద ప్రధానాంశాలు.. క్రికెట్- సినిమా. చాలా మంది క్రికెట్ను ఓ మతంలా ఆరాధిస్తే.. సినిమాను ప్రేమించే వాళ్లూ కోకొల్లలు. ఈ రెండిటి మధ్య.. ముఖ్యంగా బాలీవుడ్- క్రికెట్ మధ్య విడదీయరాని అనుబంధం ఉందని ఇప్పటికే ఆయా రంగాల సెలబ్రిటీలు పలువురు నిరూపించారు. ప్రేమ పక్షుల్లా విహరిస్తూ పాపరాజీలకు పని కల్పించిన వారు కొందరైతే.. ప్రణయాన్ని వైవాహిక బంధంగా మార్చుకుని పెళ్లిపీటలెక్కిన వారు మరికొందరు. ఆ జాబితాలో తాజాగా క్రికెటర్ కేఎల్ రాహుల్- బీ-టౌన్ సెలబ్రిటి అతియా శెట్టి జంట కూడా చేరిన విషయం తెలిసిందే. మరి ఈ ‘లవ్బర్డ్స్’ కంటే ముందు వివాహ బంధంతో ముడిపడి సక్సెస్ అయిన క్రికెట్- బాలీవుడ్ జోడీలు ఎవరంటే! మన్సూర్ అలీ ఖాన్ పటౌడ్- షర్మిలా ఠాగోర్ భారత క్రికెట్లో లెజండరీ ఆటగాడిగా పేరొందిన మన్సూర్ అలీ ఖాన్ పటౌట్ అలియాస్ టైగర్ పటౌడీ. పిన్న వయసులోనే టెస్టు కెప్టెన్గా వ్యవహరించిన టైగర్ మనసును గెలుచుకున్న మహరాణి.. షర్మిలా ఠాగోర్. బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ఆమె.. టైగర్ను పెళ్లాడి నవాబుల కోడలైంది. ఇరు కుటుంబాల అంగీకారంతో 1968లో వీరి వివాహం జరిగింది. ఈ జంటకు ముగ్గురు సంతానం. కుమారుడు సైఫ్ అలీఖాన్, కుమార్తెలు సోహా, సబా. హర్భజన్ సింగ్- గీతా బస్రా భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు భజ్జీ. కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూసిన టర్బోనేటర్.. 2011 ప్రపంచకప్ విజయంలో తన వంతు సాయం చేశాడు. తన ఆటతో అభిమానులను ముగ్ధుల్ని చేసిన ఈ ఆఫ్ స్పిన్నర్.. బాలీవుడ్ నటి గీతా బస్రా కొంటెచూపులకు బౌల్డ్ అయ్యాడు. ది ట్రెయిన్, దిల్ దియా హై వంటి సినిమాల్లో నటించిన గీతను 2015లో పంజాబీ సంప్రదాయంలో అంగరంగవైభవంగా పెళ్లాడాడు. వీరికి కుమార్తె హినయ హీర్ ప్లాహా, కుమారుడు జోవన్వీర్ సింగ్ ప్లాహా సంతానం. యువరాజ్ సింగ్- హాజిల్ కీచ్ టీమిండియా స్టార్ ఆల్రౌండర్గా ఎన్నో రికార్డులు సృష్టించి కెరీర్లో శిఖరాగ్రాలను చూసిన యువరాజ్ సింగ్- నటి హాజిల్ కీచ్ ప్రేమ ముందు మాత్రం తలవంచాడు. క్యాన్సర్ బాధితుడైన యువీని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన హాజిల్.. 2016లో అతడితో కలిసి పెళ్లి బంధంలో అడుగుపెట్టింది. వీరి ప్రేమకు గుర్తుగా కుమారుడు ఓరియన్ ఉన్నాడు. కాగా సల్మాన్ ఖాన్- కరీనా కపూర్ జంటగా నటించిన బాడీగార్డ్ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా హాజిల్ నటించింది. జహీర్ ఖాన్- సాగరికా ఘట్కే టీమిండియా 2011 వన్డే వరల్డ్కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన లెఫ్టార్మ్ పేసర్ జహీర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టెస్టు క్రికెట్లో టీమిండియా తరఫున మూడు వందల వికెట్లు తీసిన జాక్.. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎక్కువగా బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడే జహీర్ ఖాన్.. 2017లో స్వయంగా తనే తన వివాహ ప్రకటన చేశాడు. బాలీవుడ్ నటి సాగరిక ఘట్కేను ప్రేమించి పెళ్లాడనున్నట్లు వెల్లడించాడు. హాకీ నేపథ్యంలో సాగే ‘చక్ దే ఇండియా’ సినిమాలో ప్రీతి పాత్రలో నటించిన అమ్మాయే సాగరిక! విరాట్ కోహ్లి- అనుష్క శర్మ టీమిండియా స్టార్, రన్మెషీన్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రేమకథ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ షాంపూ యాడ్లో అనుష్కను చూసిన ఈ పరుగుల వీరుడు తన మనసు పారేసుకున్నాడు. తమ బంధాన్ని బాహాటంగానే ప్రకటించిన విరుష్క జోడీ.. దాదాపు ఎనిమిదేళ్లు ప్రేమించుకున్న తర్వాత 2017 డిసెంబరులో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి దాంపత్యానికి గుర్తుగా కుమార్తె వామిక జన్మించింది. హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించిన హార్దిక్ పాండ్యా.. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం క్యాష్ రిచ్ లీగ్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా ఉన్నాడు. అరంగేట్ర సీజన్లోనే తమ జట్టును విజేతగా నిలిపి.. భారత జట్టులో పునరాగమనం చేయడంతో పాటుగా భవిష్యత్తు సారథిగా మన్ననలు అందుకుంటున్నాడు. ఇక హార్దిక్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. సెర్బియా మోడల్, బీ-టౌన్ నటి నటాషా స్టాంకోవిక్తో ప్రేమలో పడిన అతడు.. 2019లో తనతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు పెళ్లి చేసుకున్న ఈ జంట.. అంతకంటే ముందే కుమారుడు అగస్త్యకు జన్మనివ్వనున్నట్లు ప్రకటించింది. కాగా నటాషా ప్రకాశ్ ఝా దర్శకత్వం వహించిన సత్యాగ్రహ సినిమాతో నటిగా గుర్తింపు పొందింది. కేఎల్ రాహుల్- అతియా శెట్టి టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్గా ఉన్న కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్- బాలీవుడ్ వెటరన్ నటుడు సునిల్ శెట్టి గారాల పట్టి అతియా శెట్టితో చాలా కాలంగా రిలేషన్షిప్లో ఉన్నాడు. 2019లో ప్రేమలో పడ్డ వీళ్లిద్దరు 2021లో తమ బంధం గురించి అందరికీ తెలిసేలా సోషల్ మీడియా వేదికగా ఫొటోలు పంచుకున్నారు. ఇక రాహుల్ బిజీ షెడ్యూల్ కారణంగా వివాహాన్ని వాయిదా వేసుకున్న ఈ జంట.. ఎట్టకేలకు జనవరి 23, 2023లో పెళ్లిపీటలెక్కింది. సునిల్ శెట్టికి చెందిన ఖండాలా ఫామ్హౌజ్లో వీరి వివాహం అత్యంత సన్నిహితుల నడుమ జరిగింది. ఇదిలా ఉంటే అజాహరుద్దీన్- సంగీత బిజ్లానీ పెళ్లి చేసుకున్నప్పటికీ బంధాన్ని కొనసాగించలేకపోయారు. ఇక రవిశాస్త్రి- అమృతా సింగ్, సౌరవ్ గంగూలీ- నగ్మా, రవిశాస్త్రి- నిమ్రత్ కౌర్ తదితరుల పేర్లు జంటలుగా వినిపించినప్పటికీ వీరి కథ సుఖాంతం కాలేదు. -వెబ్డెస్క్ చదవండి: Mohammed Shami: షమీకి ఏడాదికి రూ. 7 కోట్లు! నెలకు 10 లక్షల భరణం ఇవ్వలేరా? కోర్టు కీలక ఆదేశాలు అర్జున్ దగ్గర అన్నీ ఉన్నాయి.. నా దగ్గర నువ్వు ఉన్నావు, చాలు నాన్న: సర్ఫరాజ్ ఖాన్ -
పుణెలోని బిల్డింగ్లో అగ్ని ప్రమాదం.. గ్రౌండ్ ఫ్లోర్లో జహీర్ ఖాన్ రెస్టారెంట్
పుణె: మహారాష్ట్రలోని పూణె నగరంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లుల్లా నగర్ చౌక్ ప్రాంతంలోని మార్వెల్ విస్టా భవనం టాప్ ఫ్లోర్లోని వెజిటా రెస్టారెంట్లో ఉదయం 8.45 నిమిషాలకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేశాయి. మూడు ఫైరింజన్లు, వాటర్ ట్యాంకర్లను రంగంలోకి దింపినట్లు పుణె అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. Fire breaks out at the top floor of Marvel Vista building in Lulla Nagar Chowk in Pune, Maharashtra pic.twitter.com/y2Y9YQTVFu — The Jamia Times (@thejamiatimes) November 1, 2022 ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారాయి. ఇందులో మంటల ధాటికి కాలిపోతున రెస్టారెంట్ రూఫ్, కీటికీలు కూలి కిందపడిపోవటం కనిపిస్తోంది. అయితే ఈ ప్రమాద సమమంలో రెస్టారెంట్ మూసివేసి ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించించలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇదే బిల్డింగ్లోని గ్రౌండ్ ఫ్లోర్లో మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ కూడా ఉన్నట్లు తెలిసింది. చదవండి: ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిన మంటలు #Pune: Massive fire breaks out inside a home at Marvel Vista, a G+7 storey building in Lullanagar, Kondhwa Two water tankers and three fire brigades responded immediately and reached the spot#PuneFire #Fire pic.twitter.com/81x5aVnaGd — Free Press Journal (@fpjindia) November 1, 2022 -
'ఇంజనీర్లు చాలా మంది ఉన్నారు.. ఫాస్ట్ బౌలర్ అవ్వు'
టీమిండియాలోకి చాలా మంది ఫాస్ట్ బౌలర్లు వచ్చి వెళ్లారు. కొందరు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటే.. కొంతమంది మాత్రం ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. క్రికెట్ను అమితంగా అభిమానించే మన దేశంలో టాప్ క్లాస్ బౌలర్లుగా వెలుగొందిన వారిలో స్పిన్నర్లే ఎక్కువ. స్పిన్నర్లు ఎంత ప్రభావం చూపించినప్పటికి ఒక తరానికి ఒక్కో ఫాస్ట్ బౌలర్ భారత్ పేస్ దళాన్ని నడిపించారు. 1970,80వ దశకంలో కపిల్ దేవ్ లాంటి దిగ్గజ ఆల్రౌండర్.. ఇక 90వ దశకంలో జగవల్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్ లాంటి పేసర్లు టీమిండియాను నడిపించారు. ఇక మిలీనియం ఆరంభంలో టీమిండియాలోకి కొత్త బౌలర్ వచ్చాడు. మొదట్లో పెద్దగా రాణించకపోయినప్పటికి గంగూలీ అండతో వరుసగా అవకాశాలు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత దాదాపు దశాబ్దంన్నర కాలం పాటు టీమిండియా బౌలింగ్లో పెద్దన్న పాత్ర పోషించాడు. అతనే టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్. క్రికెట్పై ఉన్న అభిరుచి అతన్ని ఇంజనీర్ నుంచి క్రికెటర్గా మార్చింది. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మాజీ లెఫ్టార్మ్ పేసర్, ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని జట్టు 2011 వన్డే వరల్డ్కప్ ఛాంపియన్గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. యువతకు రోల్ మోడల్, ఫాస్ట్ బౌలర్ 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో తనదైన ముద్ర వేశాడు. భారత అత్యుత్తమ బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్. ఇవాళ(అక్టోబర్ 8న) తన 44వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇంజనీర్ నుంచి క్రికెటర్గా.. జహీర్ ఖాన్ క్రికెటర్ గా మారిన కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జహీర్ 1978 అక్టోబర్ 8న మహారాష్ట్రలోని శ్రీరాంపూర్లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. మహారాష్ట్రలోని ఒక చిన్న పట్టణానికి చెందిన అతను టీమిండియాలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు. తన ప్రారంభ విద్యను శ్రీరాంపూర్లోని హింద్ సేవా మండల్ న్యూ మరాఠీ ప్రాథమిక పాఠశాలలో.. ఆ తర్వాత కేజే సోమయ్య సెకండరీ పాఠశాలలో చదివాడు. తదనంతరం జహీర్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. జహీర్కు క్రికెట్పై ఉన్న మక్కువ చూసి అతని తండ్రి ఫాస్ట్ బౌలర్గా మారమని సలహా ఇచ్చాడు. ''దేశంలో చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు.. నువ్వు ఫాస్ట్ బౌలర్గా తయారయ్యి టీమిండియాకు సేవలందించు అని జహీర్ తండ్రి పేర్కొన్నాడు. తండ్రి మాటలను ఆదర్శంగా తీసుకున్న జహీర్ తర్వాత వెనుదిరిగి చూడలేదు. జహీర్ 'జకాస్' అయ్యాడు.. జహీర్ ఖాన్ను క్రికెటర్గా తయారు చేయాలనే ఉద్దేశంతో అతని తండ్రి ముంబైకి తీసుకొచ్చాడు. ఇక్కడే జహీర్ ఖాన్ 'జాక్' పేరుతో క్రికెట్ కెరీర్ ప్రారంభించాడు. జింఖానా క్లబ్తో జరిగిన మ్యాచ్లో జహీర్ ఏడు వికెట్లు తీసి వార్తల్లో నిలిచాడు. ఇక్కడే జహీర్ ఖాన్ MRF పేస్ ఫౌండేషన్కు చెందిన టీఏ శేఖర్ దృష్టిలో పడ్డాడు. తన వెంట జహీర్ను చెన్నైకి తీసుకెళ్లాడు. జహీర్ ఫస్ట్ క్లాస్, ఆపై అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టగలిగాడు. 2011 ప్రపంచ కప్ హీరోగా.. అలాగే, 28 ఏళ్ల తర్వాత భారత జట్టు వన్డే ప్రపంచకప్ను గెలవడానికి జహీర్ ఖాన్ కూడా ప్రధాన కారణం. 2011 ప్రపంచకప్లో టీమిండియాను ఛాంపియన్గా నిలబెట్టడంలో జహీర్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రపంచకప్లో 21 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్ చరిత్రలో జహీర్ పేరిట మొత్తం 44 వికెట్లు నమోదయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్లో జహీర్ 610 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 311 వికెట్లు..వన్డేల్లో 282 వికెట్లు పడగొట్టిన జహీర్ 17 టి20లు ఆడి 17 వికెట్లు తీశాడు. ✅ The second-highest wicket-taker in international cricket among Indian pace bowlers ✅ India's joint-highest wicket-taker in ODI World Cups#OnThisDay A happy 44th birthday to Zaheer Khan, the pace spearhead who starred in 🇮🇳's 2011 World Cup triumph 🥳 — ESPNcricinfo (@ESPNcricinfo) October 8, 2022 3⃣0⃣9⃣ international games 👍 6⃣1⃣0⃣ international wickets 👌 2⃣0⃣1⃣1⃣ World Cup-winner 🏆 Birthday wishes to the former #TeamIndia speedster @ImZaheer. 🎂 👏 pic.twitter.com/a2ta0LtgWg — BCCI (@BCCI) October 8, 2022 Celebrating Zaheer Khan's birthday 🎊 He was the joint-highest wicket-taker in the 2011 @cricketworldcup, picking up 21 in nine matches at 18.76 👏 WATCH his every wicket from the tournament 📽️ #BowlersMonth pic.twitter.com/Xifpd8UYna — ICC (@ICC) October 7, 2020 -
అతడొక అద్భుతం.. టీమిండియాకు మరో జహీర్ ఖాన్: పాక్ మాజీ క్రికెటర్
India Vs South Africa T20 Series 2022: ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన అర్ష్దీప్ సింగ్.. వెస్టిండీస్ టూర్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. విండీస్తో టీ20 సిరీస్లో ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలో ఆసియా కప్-2022 టీ20 టోర్నీకి ఎంపికైన ఈ యువ పేసర్.. మెగా టోర్నీలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా పాకిస్తాన్తో సూపర్-4 మ్యాచ్లో క్యాచ్ నేలపాలు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇక ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20 సిరీస్ నేపథ్యంలో విశ్రాంతి తీసుకున్న అర్ష్.. దక్షిణాఫ్రికాతో సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ప్రొటిస్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన అర్ష్దీప్ తిరువనంతపురం వేదికగా జరిగిన టీ20లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బంతిని స్వింగ్ చేస్తూ.. సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తద్వారా ప్రొటిస్ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలకంగా వ్యవహరించి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అర్ష్దీప్ సింగ్ మరో జహీర్ ఖాన్ ఇక అదే జోష్లో మిగిలి ఉన్న మరో రెండు మ్యాచ్లకు సిద్ధమవుతున్నాడు ఈ ఫాస్ట్బౌలర్. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ అర్ష్దీప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అర్ష్దీప్ సింగ్ అద్భుతమైన బౌలర్. నా అభిప్రాయం ప్రకారం టీమిండియాకు మరో జహీర్ ఖాన్ దొరికేశాడు. అర్ష్దీప్ సింగ్ పేస్లో వైవిధ్యం.. బంతిని స్వింగ్ చేయగల నైపుణ్యం అతడిని ప్రత్యేకంగా నిలిపాయి. మానసికంగా కూడా తను ఎంతో బలవంతుడు. తన శక్తిసామర్థ్యాలేమిటో అతడికి బాగా తెలుసు. వాటిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో కూడా పూర్తి అవగాహన ఉంది. సౌతాఫ్రికాతో తొలి టీ20లో రీలీ రొసోవ్, డికాక్ను అవుట్ చేసిన తీరు బాగుంది. నువ్వు సూపర్ అయితే, డేవిడ్ మిల్లర్ వికెట్ మాత్రం అద్భుతం. ఇన్స్వింగర్తో అతడిని బోల్తా కొట్టించాడు. ఇంత చిన్న వయసులోనే అర్ష్దీప్ రాణిస్తున్న తీరు అమోఘం. టీమిండియాకు జహీర్ ఖాన్ లాంటి లెఫ్టార్మ్ పేసర్ సేవలు అవసరమైన తరుణంలో అతడు వచ్చాడు’’ అంటూ 23 ఏళ్ల అర్ష్దీప్ సింగ్పై కమ్రాన్ అక్మల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో సైతం అర్ష్దీప్నకు చోటు దక్కిన విషయం తెలిసిందే. కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన ఈ యువ పేసర్... 17 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Pak Vs Eng 6th T20: పాక్ బౌలర్లకు చుక్కలు.. 13 ఫోర్లు, 3 సిక్స్లతో సాల్ట్ విధ్వంసం.. ఇంగ్లండ్ చేతిలో పాక్ చిత్తు National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత.. -
ముంబై ఇండియన్స్లో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి ప్రమోషన్
ఫైవ్ టైమ్ ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. తమ నాన్ ప్లేయింగ్ బృందంలో కీలక మార్పులు చేసింది. ప్రధాన కోచ్ మహేళ జయవర్థనేతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ జహీర్ ఖాన్కు ప్రమోషన్ కల్పించి అత్యంత కీలక బాధ్యతలు అప్పజెప్పింది. జయవర్దనేకు ముంబై ఇండియన్స్ (ఎంఐ) గ్రూప్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ పదవి అప్పజెప్పిన యాజమాన్యం.. జహీర్ ఖాన్ను గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్మెంట్గా ప్రమోట్ చేసింది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. 🚨 Head Coach ➡️ Global Head of Performance 🌏 We are delighted to announce Mahela Jayawardene as our Global Head of Performance 🙌💙#OneFamily #MumbaiIndians #MIemirates #MIcapetown @MIEmirates @MICapeTown @MahelaJay pic.twitter.com/I4wobGDkOQ — Mumbai Indians (@mipaltan) September 14, 2022 ఎంఐ యాజమాన్యం ఖాళీ అయిన జయవర్ధనే, జాక్ల స్థానాలకు త్వరలో భర్తీ చేయనుంది. జయవర్ధనే 2017 నుంచి ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ గా పని చేస్తుండగా.. జహీర్ ఖాన్ 2019లో ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్గా నియమితుడయ్యాడు. 🚨 Director of Cricket Operations ➡️ Global Head of Cricket Development 🌏 Let's welcome ZAK as our Global Head of Cricket Development 🙌#OneFamily #MumbaiIndians #MIemirates #MIcapetown @MIEmirates @MICapeTown @ImZaheer pic.twitter.com/VBfzzrBG6J — Mumbai Indians (@mipaltan) September 14, 2022 జయవర్ధనే, జహీర్ ఖాన్ కొత్త బాధ్యతలేంటి.. ఎంఐ గ్రూప్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్గా బాధ్యతలు చేపట్టనున్న జయవర్ధనే.. కొత్త పాత్రలో ముంబై ఇండియన్స్ (ఐపీఎల్) తో పాటు ఎంఐ ఎమిరేట్స్ (ఇంటర్నేషనల్ లీగ్ టీ20), ఎంఐ కేప్టౌన్ (సౌతాఫ్రికా) ఫ్రాంచైజీలకు సంబంధించిన కోచింగ్ స్టాఫ్కు మార్గదర్శకుడిగా వ్యవహరిస్తాడు. అలాగే మూడు జట్ల స్టాఫ్, ప్లేయర్స్ రిక్రూట్మెంట్, స్ట్రాటజిక్ ప్లానింగ్ తదితర వ్యవహారాలు పర్యవేక్షిస్తాడు. జహీర్ విషయానికొస్తే.. ఇతను మూడు ఫ్రాంచైజీల ప్లేయర్స్ డెవలప్మెంట్, ప్రోగ్రామ్ డెవలప్మెంట్, అలాగే న్యూ టాలెంట్ అన్వేషణ వంటి పలు కీలక బాధ్యతలు చూస్తాడు. -
Ind Vs Eng: పంత్ సెంచరీ.. ద్రవిడ్ రియాక్షన్ అదుర్స్.. వైరల్
India Vs England 5th Test- Rishabh Pant- Rahul Dravid: రిషభ్ పంత్.. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్కు సారథ్యం వహించి కెప్టెన్గా శెభాష్ అనిపించుకున్నా.... బ్యాటర్గా మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలో పంత్పై విమర్శలు వెల్లువెత్తాయి. రానున్న టీ20 ప్రపంచకప్-2022 జట్టులో చోటు కూడా ఇవ్వకూడదంటూ పలువురు మాజీ క్రికెటర్లు పంత్ ఆట తీరుపై విరుచుకుపడ్డారు. కట్ చేస్తే.. ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టులో రిషభ్ పంత్ తనదైన శైలిలో అద్భుతంగా రాణించాడు. టీ20 ఫార్మాట్ సంగతి ఎలా ఉన్నా టెస్టుల్లో తన తరహా ఇన్నింగ్స్తో జట్టును పటిష్ట స్థితిలో నిలిపి అందరి చేతా ప్రశంసలు అందుకుంటున్నాడు. 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి టీమిండియా క్లిష్ట పరిస్థితిలో ఉన్న వేళ శతకంతో రాణించాడు. రవీంద్ర జడేజా మరో ఎండ్లో సహకారం అందిస్తుండగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అయితే, పంత్పై విమర్శలు వచ్చిన సమయంలో టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడికి అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు పంత్. ఎడ్జ్బాస్టన్ టెస్టులో 111 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో 146 పరుగులు చేశాడు. దీంతో ద్రవిడ్ సంతోషంతో ఉప్పొంగిపోయాడు. డగౌట్లో కూర్చుని మ్యాచ్ వీక్షిస్తున్న ద్రవిడ్ ఒక్కసారిగా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో చిరునవ్వులు చిందిస్తూ పంత్ను అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక పంత్ సెంచరీ ఇన్నింగ్స్పై ద్రవిడ్ రియాక్షన్ గురించి టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి అద్భుతమైన ఇన్నింగ్స్ చూసినపుడు ఎవరికైనా భావోద్వేగాలు నియంత్రించుకోవడం కష్టమే. సాధారణంగా ద్రవిడ్ ఎప్పుడూ ఇలా రియాక్ట్ అవ్వడు’’ అని క్రిక్బజ్ షోలో వ్యాఖ్యానించాడు. చదవండి: MS Dhoni Knee Problem: మోకాలి నొప్పులతో బాధపడుతున్న ధోని.. ట్రీట్మెంట్ ఖర్చు 40 రూపాయలు! Ind Vs Eng 5th Test: అసలు అంచనాలే లేవు... అయినా కూడా నువ్వు మరోసారి! ఎన్నాళ్లో ఇలా? Rishabh Pant, you beauty! 🤩💯 Is there a more exciting Test cricketer in the modern game?! 🔥 Tune in to Sony Six (ENG), Sony Ten 3 (HIN) & Sony Ten 4 (TAM/TEL) - (https://t.co/tsfQJW6cGi)#ENGvINDLIVEonSonySportsNetwork #ENGvIND pic.twitter.com/Qvn3eDYw9Z — Sony Sports Network (@SonySportsNetwk) July 1, 2022 -
'ఒత్తిడిని హార్ధిక్ ఛాలెంజ్గా తీసుకుంటాడు'
టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒత్తిడిని సవాల్గా తీసుకుంటాడని జహీర్ కొనియాడాడు. రాజ్కోట్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో భారత్ 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆరంభంలోనే వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన టీమిండియాను హార్ధిక్ పాండ్యా అదుకున్నాడు. 31 బంతుల్లో హార్ధిక్ 46 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దినేష్ కార్తీక్తో కలిసి ఐదో వికెట్కు 65 పరుగుల కీలక బాగాస్వామ్యాన్ని నమోదు చేశాడు.ఇక దినేష్ కార్తీక్ 27 బంతుల్లోనే 55 పరుగులు చేసి భారత్ 169 పరుగుల చేయడంలో కీలక పాత్ర పోషించాడు. "హార్ధిక్ తను ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. అతడు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు చేయాలని కోరుకుంటున్నాను. హార్ధిక్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ వస్తే మరింత అద్భుతంగా రాణిస్తాడు. ఆరంభంలో వికెట్లు కోల్పోయినప్పడు, అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్కు రావాలి. ఐపీఎల్లో కూడా ఆ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అద్భుతంగా రాణించాడు. అతడు అటువంటి ఒత్తిడి పరిస్థితులను ఛాలెంజ్గా తీసుకుని ఆడుతాడు. అదే అతడి బ్యాటింగ్ స్టైల్" అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. చదవండి: ENG vs NED: నెదర్లాండ్స్ ఆటగాళ్ల గోస .. బంతి కోసం చెట్లు, పుట్టల్లోకి -
Ind Vs SA: మూడో టీ20.. అతడిని తప్పక జట్టులోకి తీసుకోండి.. లేదంటే!
India Vs South Africa 3rd T20: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో రెండు వరుస పరాజయాలు మూటగట్టుకుంది టీమిండియా. తద్వారా రిషభ్ పంత్ సారథ్యంలోని భారత జట్టు ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 0-2 తేడాతో వెనకబడిపోయింది. ఇక ఈ సిరీస్ గెలవాలంటే మిగిలిన మూడు మ్యాచ్లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి. లేదంటే సఫారీ గడ్డపై టెస్టు, వన్డే సిరీస్లలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం చేజారుతుంది. అంతేగాక హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వదేశంలో ఇంత వరకు వరుస సిరీస్లు గెలిచిన టీమిండియా జోరుకు బ్రేక్ పడుతుంది. ఇక ఢిల్లీ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్లో భారత్ భారీ స్కోరు చేసినప్పటికీ బౌలర్లు తేలిపోవడంతో 7 వికెట్ల తేడాతో పరాజయం తప్పలేదు. రెండో మ్యాచ్లో బ్యాటర్ల వైఫల్యం ప్రభావం చూపింది. ఇక బౌలర్లలో సీనియర్ సీమర్ భువనేశ్వర్ కుమార్(4 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు) ఒక్కడే ఆకట్టుకున్నాడు. అతడే ఎక్స్ఫ్యాక్టర్.. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ మూడో టీ20 తుది జట్టు కూర్పు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ స్పీడ్స్టర్ ఉమ్రాన్ మాలిక్ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అతడు టీమిండియాకు ఎక్స్ ఫ్యాక్టర్గా మారతాడని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు క్రిక్బజ్తో మాట్లాడిన జహీర్ ఖాన్.. ‘‘తదుపరి మ్యాచ్లో ఉమ్రాన్ను ఆడించాలి. అతడి ఎక్స్ట్రా పేస్ జట్టుకు ఉపయోగపడుతుంది. ఐపీఎల్లో అతడి ప్రదర్శనను మనమంతా చూశాము. టీ20 లీగ్లో ప్రొటిస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ను ఉమ్రాన్ అవుట్ చేసిన విధానం అమోఘం. తన వేగవంతమైన బంతితో మిల్లర్ను బోల్తా కొట్టించాడు. భారత జట్టులో ఉమ్రాన్ చేరిక తప్పకుండా ప్రభావం చూపుతుంది’’ అని తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అందుకే ఉమ్రాన్ను జట్టులోకి తీసుకోవాలి! ఇక టీమిండియా- దక్షిణాఫ్రికా మధ్య మూడో టీ20 విశాఖపట్నంలోని వైఎస్సార్(డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం) స్టేడియంలో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జహీర్ ఖాన్.. ‘‘అక్కడి మైదానం చిన్నది. కాబట్టి స్పిన్నర్లు ఒత్తిడిలో కూరుకుపోవచ్చు. కాబట్టి ఉమ్రాన్ వంటి పేసర్ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా జూన్ 14న ఇరు జట్లు మూడో టీ20 మ్యాచ్లో తలపడబోతున్నాయి. ఇక ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్-2022లో 22 వికెట్లు పడగొట్టి క్రీడా ప్రముఖుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా సిరీస్ నేపథ్యంలో తొలిసారిగా టీమిండియాకు సెలక్ట్ అయ్యాడు. అయితే, మొదటి రెండు మ్యాచ్లలోనూ అతడిని బెంచ్కే పరిమితం చేయడం గమనార్హం. చదవండి: Rishabh Pant: అదే మా పొరపాటు.. అందుకే ఓడిపోయాం.. ఇక మూడింటికి మూడు గెలవాల్సిందే! 💬 💬 "A dream come true moment to get India call up." Umran Malik speaks about the excitement on being a part of the #TeamIndia squad, Day 1 at the practice session, his idols and goals ahead. 👍 👍 - By @28anand Full interview 🎥 🔽 #INDvSA | @Paytm pic.twitter.com/V9ySL4JKDl — BCCI (@BCCI) June 8, 2022 -
ముంబై ఇండియన్స్కు గుడ్న్యూస్.. గాయం నుంచి కోలుకున్న స్టార్ ఓపెనర్
ఐపీఎల్-2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో గాయపడిన ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్ గాయం నుంచి కోలుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2 (శనివారం)న రాజస్తాన్ రాయల్స్తో జరగనున్న మ్యాచ్కు ఇషాన్ అందుబాటులో ఉండనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 48 బంతుల్లో 81 పరుగులు సాధించాడు. అయితే ముంబై ఇన్నింగ్స్ 18వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ వేసిన యార్కర్.. కిషన్ ఎడమ కాలి బొటనవేలికి బలంగా తాకింది. క్రీజులో పరుగులు తీయడానికి కిషన్ ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడి ఢిల్లీ ఇన్నింగ్స్లో పూర్తిగా ఫీల్డ్లోకి రాలేదు. తరువాత అతడిని స్కానింగ్కి పంపగా.. గాయం అంత తీవ్రమైనది కాదని తేలింది. ఈ నేపథ్యంలో కిషన్ ఫిట్నెస్గా ఉన్నాడని ముంబై క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ జహీర్ ఖాన్ తెలిపాడు.“ఇషాన్ కిషన్ పూర్తి స్థాయి ఫిటెనెస్ సాధించాడు. అతడు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తున్నాడు. రాజస్తాన్తో మ్యాచ్కు కిషన్ అందుబాటులో ఉంటాడు’’ అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), అన్మోల్ప్రీత్ సింగ్, రాహుల్ బుద్ధి, రమణదీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, అర్జున్ టెండూల్కర్, బాసిల్ థంపి, హృతిక్ షోకీన్, జస్ప్రీత్ బుమ్రా, జయదేవ్ ఉనద్కత్, జోఫ్రా ఆర్చర్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రిలే మెరెడిత్, టైమల్ మిల్స్, అర్షద్ ఖాన్, డేనియల్ సామ్స్, డెవాల్డ్ బ్రెవిస్, ఫాబియన్ అలెన్, కీరన్ పొలార్డ్, సంజయ్ యాదవ్, ఆర్యన్ జుయల్ మరియు ఇషాన్ కిషన్. చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్కు గుడ్న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు! 👉 Playing at CCI 👉 Bowling strategies 👉 Sky's fitness update ZAK answers a range of questions in the pre-match PC! 🗣️💙#OneFamily #DilKholKe #MumbaiIndians #MIvRR @ImZaheer https://t.co/3OecmfnIN5 — Mumbai Indians (@mipaltan) April 1, 2022