-
అతడు ప్రపంచ స్ధాయి బౌలర్.. సౌతాఫ్రికాకు ఇక చుక్కలే!
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు భారత్ అన్ని విధాలా సిద్దమవుతోంది. ఈ సిరీస్లో భాగంగా డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. అదే విధంగా భారత్ పేస్ విభాగం అద్భుతంగా ఉంది అని అతడు కొనియాడాడు. "ప్రపంచ స్థాయి అద్బుతమైన బౌలర్లలో బుమ్రా ఒకడు. ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు విజయం సాధించింది. ఈ పర్యటనల్లో బుమ్రా తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇక భారత బౌలింగ్ విభాగం అద్భుతమైనది. అదే విధంగా టెస్ట్ల్లో భారత్ విజయాల్లో జట్టు పేస్ బౌలింగ్ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచస్ధాయి బ్యాటర్లను కూడా బోల్తా కొట్టించే బౌలర్లు భారత జట్టులో ఉన్నారు. అనుభవజ్ఞులైన పేసర్లు ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ ఉండడం జట్టుకు మరింత బలం చేకూరుతుంది" అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా 2018లో సౌతాఫ్రికా పర్యటనలోనే జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ల్లో ఆరంగట్రేం చేశాడు. చదవండి: IPL 2022 Auction: 39 బంతుల్లో 79.. పంజాబ్ కింగ్స్ వదులుకొని తప్పుచేసింది -
Zaheer Khan: ఈశాతో సహజీవనం.. కానీ పెళ్లివరకు రాలేదు.. సాగరిక మాత్రం
Zaheer Khan Love Life Marriage: జహీర్ ఖాన్.. క్రికెట్ను ఇష్టపడేవాళ్లు అమితంగా అభిమానించే ఫాస్ట్బాలర్ ‘కిస్నా.. ది వారియర్ పోయెట్’ హిందీ సినిమా ఫేమ్ ఈశా శర్వాణి ప్రేమలో క్లీన్బోల్డ్ అయిపోయాడు!! అయితే ఆ ప్రేమ.. పెళ్లిదాకా రాకుండానే బ్రేక్ అయింది. మరో బాలీవుడ్ తార, ‘చక్ దే ఇండియా ఫేమ్’ సాగరిక ఘాట్గే.. జహీర్ ఖాన్కు భార్య అయింది. ఆ బ్రేకప్.. ఈ పెళ్లి .. రెండూ ఇవ్వాళ్టి ‘మొహబ్బతే’ కథనంలో.. దాదాపు పదహారేళ్ల కిందట.. ఒక ఫంక్షన్లో ఒకరికొకరు పరిచయం అయ్యారు జహీర్, ఈశా. ఆ రోజు నుంచే మంచి స్నేహితులుగా మారారిద్దరూ. ప్రేమెప్పుడూ ఫ్రెండ్షిప్తోనే మొదలవుతుంది. ఈ ఇద్దరి స్నేహం కూడా ప్రేమైంది నెమ్మదిగా. ఒకరోజు జహీర్ చెప్పాడు ఈశాతో.. ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అని. ఈశాలో సంబ్రమాశ్చర్యం. నిజానికి ఆ మాట తానూ చెప్పాలనుకుంది. ఆ తీపి కబురు జహీర్ నోటివెంట రావడంతో వెంటనే ఓకే చెప్పేసింది. అప్పటి నుంచి ఆ ప్రేమ క్రికెట్ స్టేడియంలో జహీర్ను ప్రోత్సహించే ఈశా థమ్సప్స్లో.. అతన్ని ప్రశంసించే ఆమె చప్పట్లలో.. ఉత్సాహపరచే కేరింతల్లో.. ఈశా షూటింగ్ ప్యాకప్ అయ్యాక ఇద్దరూ కలసి చేసే డిన్నర్ డేట్స్.. హ్యాంగవుట్స్లలో కనిపించేది. తెల్లవారి మీడియాలో ప్రచురణ అయ్యేది.. ప్రసారమయ్యేది. సహజీవనం.. ‘చోరీ చోరీ ఛుప్ ఛుప్ కే.. ఎంతకాలమని ఉంటాం? మన గురించి మనమే మీడియాలో ఎన్నని రూమర్లను కంటాం.. వింటాం? చలో కలసి ఉందాం’ అనుకున్నారు. ఒకే ఇంట్లో కలసి ఉండడం మొదలుపెట్టారు. అలా వాళ్ల అనుబంధానికి అధికారతను అపాదించుకున్నారు. వాళ్లనుకున్నట్లుగా వదంతులకు చెక్ పడలేదు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొత్త రూమర్లు ప్రారంభమయ్యాయి. 2011 వరల్డ్ కప్ సమయంలో ఇండియా ఆడే మ్యాచ్ల పట్ల క్రికెట్ అభిమానులు ఎంత ఉత్కంఠభరితంగా ఉన్నారో ఈ జంట పెళ్లి రూమర్ పట్లా అంతే ఉత్కంఠతతో ఎదురు చూశారు. వాళ్లందరినీ నిరాశపరుస్తూ జహీర్, ఈశా తమ ప్రేమానుబంధం నుంచి బయటకు వచ్చారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు కలసి నడిచిన ఆ ప్రయాణాన్ని పెళ్లి పీటల మీదకు చేర్చకుండానే రద్దు చేసుకున్నారు. బ్రేకప్కు కారణమేంటో ఇద్దరూ చెప్పలేదు. మీడియా ఎంత ప్రశ్నించినా మౌనంతో దాటవేశారే కానీ ఇద్దరిలో ఎవరూ పెదవి విప్పలేదు. ఈశానే తర్వాతెప్పుడో ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఔను మేమిద్దరం విడిపోయాం. అయినా జహీర్ నాకెప్పటికీ మంచి స్నేహితుడే’ అని చెప్పింది. సాగరిక కలిసింది.. భగ్న ప్రేమ జహీర్ను బాగానే బాధించింది అని చెప్తారు అతని సన్నిహితులు. అందులోంచి బయటపడడానికి క్షణం తీరికలేకుండా గడపడం మొదలుపెట్టాడట. క్రికెట్తోపాటు ఫ్రెండ్స్తో పార్టీలు.. అవుటింగ్లు అతని షెడ్యూల్లో భాగమైపోయాయి. సరిగ్గా ఆ సమయంలోనే బాలీవుడ్లో మంచి బ్రేక్ కోసం చూస్తోంది సాగరిక ఘాట్గే. ఈ ఇద్దరూ తమ కామన్ ఫ్రెండ్ ఇంట్లో ఒకరికొకరు తారసపడ్డారు. పరిచయాలయ్యాయి. సాగరిక మాట తీరుకు ముచ్చటపడ్డాడు జహీర్. ఆమె నవ్వు ఆమెతో స్నేహం పెంచుకునేలా ఆకర్షించింది అతణ్ణి. అందుకే తక్కువ కాలంలోనే మంచి స్నేహితులైపోయారిద్దరూ. ఫ్రెండ్స్ సర్కిల్లో కలుసుకునే .. ఫ్రెండ్స్ గ్రూప్స్తో అవుటింగ్స్కి వెళ్లే ఈ ఇద్దరూ క్రమంగా ఇద్దరూ కలసుకోవడం.. ఇద్దరే హాలిడేస్ను ఆస్వాదించడం మొదలుపెట్టారు. అలా ప్రేమలో పడిపోయారు. యువరాజ్ సింగ్ పెళ్లికి జంటగా హాజరై తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు జహీర్, సాగరిక. తర్వాత వాళ్ల ప్రేమ గురించి జహీర్.. ట్విట్టర్లోనూ పోస్ట్ చేశాడు. జీవితమంతా సాగరిక చెంతే గడపాలని నిర్ణయించుకున్నాడు అతను. సాగరికతో నిశ్చితార్థం చేసుకున్నాడు. అప్పుడు సాగరికా సోషల్ మీడియాలో తన ప్రేమను ప్రకటించింది.. తన నిశ్చితార్థపు ఫొటోను పోస్ట్ చేస్తూ పార్టనర్స్ ఫర్ లైఫ్ హ్యాష్ ట్యాగ్ ఎంగేజ్డ్ అనే క్యాప్షన్తో. 2017, నవంబర్ 23న ఆ జంట తమ ప్రేమను పెళ్లితో స్థిరపర్చుకుంది. -ఎస్సార్ చదవండి: Ashes: 77 బంతుల్లో 12 ... 207 బంతుల్లో 26 పరుగులు.. స్టోక్స్, బట్లర్ పాపం.. View this post on Instagram A post shared by Sagarika Ghatge Khan (@sagarikaghatge) -
సెలక్టర్ల నిర్ణయం సరైందేనని షోయబ్ నిరూపించాడు: టీమిండియా మాజీ క్రికెటర్
Zaheer Khan Comments on Shoaib Malik: పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్పై టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్తో మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి.. సెలక్టర్ల నిర్ణయం సరైందేనని నిరూపించాడని కొనియాడాడు. కాగా టీ20 వరల్డ్కప్-2021లో భాగంగా షార్జా వేదికగా మంగళవారం కివీస్తో మ్యాచ్లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. టాస్ ఓడిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాక్కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు... కెప్టెన్ బాబర్ ఆజమ్ (9), ఫఖర్ జమాన్ (11) సహా హఫీజ్ (11) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఆ తర్వాత రిజ్వాన్ (34 బంతుల్లో 33; 5 ఫోర్లు) కూడా పెవిలియన్ చేరడంతో.. పాక్ ఒక దశలో 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన షోయబ్ మాలిక్ 20 బంతుల్లో ఒక సిక్సర్, రెండు ఫోర్ల సాయంతో 26 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అతడికి తోడైన ఆసిఫ్ అలీ వరుస షాట్లు కొట్టడంతో మరో 8 బంతులుండగానే పాకిస్తాన్ లక్ష్యం పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో జహీర్ ఖాన్ క్రిక్బజ్ లైవ్లో మాట్లాడుతూ షోయబ్ మాలిక్పై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘షోయబ్ మాలిక్ లాంటి సీనియర్ ఆటగాళ్లను ఎందుకు జట్టులోకి తీసుకుంటారని అభిమానులు తరచుగా అడుగుతుంటారు కదా. ఇదిగో ఇందుకే వారిని ఆడిస్తారు. ఒత్తిడిని ఎలా జయించాలో వారికి తెలుసు. వాళ్లకు ఓపిక ఎక్కువగా ఉంటుంది. తీవ్ర ఒత్తిడిలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరచగలరు. అన్నింటి కంటే ఈ లక్షణాలే ముఖ్యం. చివరి నిమిషంలో జట్టులోకి వచ్చిన షోయబ్ మాలిక్.. ఈరోజు సెలక్టర్ల నిర్ణయం తప్పుకాదని నిరూపించాడు’’ అని కితాబిచ్చాడు. కాగా సోహైబ్ మక్సూద్ను గాయం కావడంతో చివరి నిమిషంలో షోయబ్ పాక్ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో పాకిస్తాన్కు వరుస విజయాలు అందిస్తున్న కెప్టెన్ బాబర్ ఆజంను కూడా జహీర్ ఖాన్ ప్రశంసించాడు. ‘‘ఒకప్పుడు పాకిస్తాన్ జట్టు అంటే ఇదీ అని ఒక అంచనా వేయలేకపోయేవాళ్లం. కానీ... బాబర్ ఆజం చాలా కామ్గా తన పని తాను చేసుకుపోతున్నాడు. పాకిస్తాన్ క్రికెట్కు కొత్త దారి చూపిస్తున్నాడు’’ అని కొనియాడాడు. కాగా టీ20 వరల్డ్కప్ సూపర్-12లో భాగంగా టీమిండియా, న్యూజిలాండ్పై వరుస విజయాలతో పాకిస్తాన్ సెమీ ఫైనల్కు చేరువవుతోంది. చదవండి: T20 World Cup: ఇంగ్లండ్తో మ్యాచ్కు ముందు బంగ్లాదేశ్కు భారీ షాక్.. అతడు టోర్నీ నుంచి అవుట్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); View this post on Instagram A post shared by ICC (@icc) -
టీమిండియా కోచ్ రేసులో 'ఆ ముగ్గురు'.. విదేశీయులకు నో ఛాన్స్ అన్న బీసీసీఐ..!
BCCI Unlikely To Appoint Foreign Coach For Team India : టీ20 ప్రపంచకప్తో ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుండడంతో అతని వారసుడు ఎవరనే అంశంపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ వర్గాలు ఓ క్లారిటీ ఇచ్చాయి. టీమిండియా తదుపరి కోచ్గా విదేశీయులకు ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పాయి. కోచ్ రేసులో భారత మాజీ ఆటగాళ్లే ఉంటారని సూచనప్రాయంగా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీకి అత్యంత సన్నిహితులైన ముగ్గురు టీమిండియా దిగ్గజ ఆటగాళ్ల పేర్లు మరోసారి తెరపైకి వచ్చాయి. నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా ఉన్న రాహుల్ ద్రవిడ్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే స్వచ్చంధంగా కోచ్ పదవిపై నిరాసక్తత కనబర్చడంతో వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ల పేర్లు బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరు ముగ్గురికి ఐపీఎల్లో వివిధ ఫ్రాంఛైజీల తరఫున కోచింగ్ అనుభవం కూడా ఉండడంతో.. ఎవరో ఒకరికి రవిశాస్త్రి వారసుడిగా పట్టం కట్టడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా కోచ్ పదవికి విదేశీ కోచ్ ఫార్ములా వర్కవుట్ కాదని, అందులోనూ బోర్డు పరిశీలనలో ఉన్న రికీ పాంటింగ్, మహేల జయవర్దనే, టామ్ మూడీ లాంటి వాళ్లు ఫుల్ టైమ్ కోచ్గా పని చేసేందుకు అయిష్టత ప్రదర్శిస్తున్నారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, గతంలో నలుగురు విదేశీయులు టీమిండియా కోచ్లుగా పని చేసిన సంగతి తెలిసిందే. తొలుత జాన్ రైట్, ఆతర్వాత గ్రెగ్ ఛాపెల్, గ్యారీ కిర్స్టెన్, డంకన్ ఫ్లెచర్ భారత జట్టు హెడ్ కోచ్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. చదవండి: కోల్కతా ఓపెనర్ వెంకటేష్ అయ్యర్కు బంపర్ ఆఫర్.. -
19 ఏళ్ల చెత్త రికార్డు బద్దలు.. జహీర్ తర్వాత బుమ్రానే
లార్డ్స్: భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పాత సమస్య మళ్లీ ముందుకొచ్చి నట్లుంది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో బుమ్రా ఏకంగా 13 నోబాల్స్ వేశాడు. ఈ నేపథ్యంలో అతను ఒక చెత్త రికార్డును నమోదు చేశాడు. ఇంతకముందు 2002లో జహీర్ఖాన్ విండీస్తో జరిగిన టెస్టు మ్యాచ్లో 13 నోబాల్స్ వేశాడు. ఆ తర్వాత మరే భారత బౌలర్ ఇన్ని నోబాల్స్ వేయలేదు. మళ్లీ 19 ఏళ్ల తర్వాత బుమ్రా ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్లో 13 నోబాల్స్ వేసి జహీర్తో సమానంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో బుమ్రా 26 ఓవర్లు వేసి 79 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డ్రాగా ముగుస్తుందా లేక ఫలితం వస్తుందా అన్నది నాలుగో రోజు ఆటపై ఆధారపడి ఉంది. రెండో ఇన్నింగ్స్లో భారత్ వేగంగా ఆడి ఇంగ్లండ్కు ఎంత టార్గెట్ విధిస్తుందనేది చూడాలి. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 391 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (321 బంతుల్లో 180 నాటౌట్; 18 ఫోర్లు) వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీ సాధించగా... జానీ బెయిర్స్టో (107 బంతుల్లో 57; 7 ఫోర్లు) రాణించాడు. సిరాజ్కు 4, ఇషాంత్కు 3 వికెట్లు దక్కాయి. మూడో రోజు ఆట చివరి ఓవర్ చివరి బంతికి అండర్సన్ను షమీ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఆట ముగిసింది. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 364 పరుగులకు ఆలౌట్ అయింది. -
వైరల్: కన్నీరు పెట్టిస్తున్న రాజ్ కౌశల్ చివరి పోస్ట్
ప్రముఖ నటి, యాంకర్ మందిరా బేడి భర్త, నిర్మాత రాజ్ కౌశల్ ఇవాళ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్ ప్రముఖులు, సినీ నటీనటులు ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో రాజ్ కౌశల్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన చివరి పోస్టు వైరల్గా మారింది. ఈ ఆదివారం వీకెండ్ సందర్భంగా ఆయన స్నేహితులు, భార్య మందిర బేడీతో సందడి చేసినట్లు కౌశల్ తన చివరి పోస్టులో రాసుకొచ్చారు. ఇది చూసి ఆయన ఫాలోవర్స్, స్నేహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా గత ఆదివారం మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఆయన భార్య సాగరిక ఘాట్కే, నటి నేహా దూపియా, అంగద్ బేడి, భార్య మందిరా బేడిలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘సూపర్ సండే, సూపర్ ఫ్రెండ్స్, సూపర్ ఫన్’ అంటూ షేర్ చేశారు. అది చూసి ‘మూడు రోజుల క్రితమే స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపిన కౌశల్ ఇలా మృత్యువాత పడటం తీవ్రం కలచివేస్తోంది’, ‘ఇదే ఆయన చివరి పోస్టు అని తలచుకుంటే కన్నీరు ఆగడం లేదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే ఫొటోను నేహా దూపియా షేర్ చేస్తూ భావోద్యేగానికి లోనయ్యారు. View this post on Instagram A post shared by Raj Kaushal (@rajkaushal) ‘రాజ్ ఈ ఫొటోను మనం ఎప్పటికి గుర్తుండిపోయే జ్ఞాపకం గుర్తుగా తీసుకున్నాము. కానీ నువ్వు మా మధ్య ఎప్పటికి ఉండవనే విషయాన్ని నమ్మలేకపోతున్నా’ అంటూ మై స్ట్రాంగ్ లేడీ, ఈ సమయంలో నిన్ను ఓదార్చడానికి నాకు మాటలు రావడం లేదంటూ మందిరా, ఆమె కుమారుడు వీర్, కూతురు తారాలను ఉద్దేశిస్తూ తన పోస్టులో రాసుకొచ్చారు. అదే విధంగా రాజ్ కౌశల్ తన కుమారుడు వీర్, కూతురు తారాలతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసిన కౌశల్ పోస్టులు కూడా ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Neha Dhupia (@nehadhupia) చదవండి: Mandira Bedi: ప్రముఖ నటి మందిరా బేడి భర్త కన్నుమూత -
‘కేఎల్ రాహుల్ కంటే అతడిని ఆడిస్తేనే మంచిది’
ముంబై: ఇంగ్లండ్తో జరుగనున్న నిర్ణయాత్మక ఐదో టీ20లో భారత యువ ఆటగాడు ఇషాన్ కిషన్కు అవకాశం ఇవ్వాలని టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ అన్నాడు. కేఎల్ రాహుల్ స్థానంలో అతడికి తుది జట్టులో చోటు కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా, వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ను ఆడించాలని పేర్కొన్నాడు. రెండో టీ20 ద్వారా అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్, ఆ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకుని ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూడో టీ20(4 పరుగులు)లో అదే స్థాయిలో సత్తా చాటలేకపోయాడు. ఇక గజ్జల్లో గాయం కారణంగా నాలుగో మ్యాచ్కు అతడు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో శనివారం నాటి మ్యాచ్కు ముందు జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగితే బాగుంటుంది. నిజాయితీగా చెప్పాలంటే, ఒకవేళ ఇషాన్ కిషన్ గాయం నుంచి కోలుకున్నట్లయితే, కేఎల్ రాహుల్ స్థానంలో అతడిని ఆడించాలి. ఒత్తిడిలోనూ దూకుడుగా ఆడగలడు. ఇక, వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ను ఆడిస్తే బెటర్’’ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా ఈ సిరీస్లో 4 మ్యాచ్లలోనూ కేఎల్ రాహుల్ పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. అతడు నమోదు చేసిన స్కోర్లు వరుసగా 1,0,0,14. -
బుల్లెట్ కంటే వేగంగా దూసుకొచ్చింది
జహీర్ ఖాన్.. టీమిండియా బౌలింగ్ దళానికి దశాబ్దానికి పైగా నాయకత్వం వహించాడు. 2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన జహీర్ ఖాన్ 92 టెస్టుల్లో 311, 200 వన్డేల్లో 282, 17 టీ20ల్లో 17 వికెట్లు తీశాడు. 2011 ప్రపంచకప్ను భారత్ గెలవడంలో జహీర్ పాత్ర కూడా చాలా ఉంది. ఆ ప్రపంచకప్లో 9 మ్యాచ్లాడిన జహీర్ 21 వికెట్లు తీశాడు. ముఖ్యంగా జహీర్ 2006 నుంచి 2014 వరకు భారత జట్టుకు ప్రధాన బౌలర్గా వ్యవహరించాడు. (చదవండి : డేవిడ్ వార్నర్ ఇన్.. బర్న్స్ అవుట్) తాజాగా ఐసీసీ జహీర్ ఖాన్కు సంబంధించి త్రో బ్యాక్ థర్స్డే పేరిట ఒక వీడియోనూ ట్విటర్లో షేర్ చేసింది. ఆ వీడియోలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ .. టీమిండియా బౌలింగ్ కొనసాగుతుంది. అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ వా క్రీజులో ఉన్నాడు... బంతి టీమిండియా బౌలర్ జహీర్ ఖాన్ చేతిలో ఉంది. జహీర్ వేసిన బంతి బులెట్ వేగంతో దూసుకొచ్చి వికెట్లను గిరాటేయడంతో స్టీవా దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఆ వేగం ఎంత అంటే.. బంతి దాటికి మూడు వికెట్లు చెల్లాచెదురయ్యాయి. అయితే ఈ మ్యాచ్ ఏ టోర్నీలో జరిగింది.. ఏ సంవత్సరం జరిగిందో చెప్పాలంటూ క్యాప్షన్ జత చేసింది. చాలా మంది నెటిజన్లు ఆ మ్యాచ్ 2000వ సంవత్సరం.. ఐసీసీ నాకౌట్ చాంపియన్స్ ట్రోపీలో జరిగిందని కామెంట్లు చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐసీసీ నాకౌట్ చాంపియన్స్ ట్రోపీలో క్వార్టర్ ఫైనల్లో ఆసీస్, టీమిండియా తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ 84 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 46.4 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. పాంటింగ్ 46, మైఖెల్ బెవన్ 42 పరుగులు చేయగా.. మిగతవారు విఫలం కావడంతో 20 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కెన్యాలో జరిగిన ఈ టోర్నీలో న్యూజిలాండ్, భారత్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. కాగా ఫైనల్లో కివీస్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలి మేజర్ టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది. కాగా ఈ టోర్నీ ద్వారానే జహీర్ ఖాన్తో పాటు డాషింగ్ ఆల్రౌండర్గా పేరు పొందిన యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. #ThrowbackThursday ➜ When a young Zaheer Khan went through the gate of an experienced Steve Waugh! What a peach 🔥 Can you guess this game and year? 😉 pic.twitter.com/BQfGlr0FAR — ICC (@ICC) December 31, 2020 -
శుభవార్త చెప్పిన జహీర్ ఖాన్!
మాజీ ఇండియన్ క్రికెటర్ జహీర్ఖాన్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. త్వరలోనే వారి ఇంట్లోకి మూడో మనిషి రాబోతున్నారు. జహీర్ ఖాన్ బాలీవుడ్ నటి సాగరిక గాట్గేను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ యూఏఈలో ఉన్నారు. ప్రస్తుతం దుబాయ్లో ఐపీఎల్ జరుగుతుండగా జహీర్ఖాన్ ముంబై ఇండియన్స్ జట్టుకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్(డీసీఏ)గా పనిచేస్తున్నారు. జహీర్ఖాన్ తన పుట్టినరోజు వేడుకలను కూడా ముంబై ఇండియన్స్ జట్టుతో కలసి దుబాయ్లోనే జరుపుకున్నారు. ఈ సందర్భంగా జహీర్ గురించి వర్ణించాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం కోరగా జహీర్ అందరితో సంప్రదించి వారి అభిప్రాయాలను సేకరించి నిర్ణయాలను తీసుకుంటాడని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ఇక టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తాను తండ్రికాబోతున్నట్లు, వచ్చే ఏడాది జనవరిలో వారి ఇంటికి ఒక అతిధి రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: రషీద్ ఖాన్ భార్య అనుష్క శర్మ! -
వారిద్దరి కెప్టెన్సీలో చాలా పోలికలు: జహీర్
న్యూఢిల్లీ: సౌరవ్ గంగూలీ-ఎంఎస్ ధోనిలు ఇద్దరూ భారత క్రికెట్ జట్టును ఉన్నత శిఖరంలో నిలిపిన కెప్టెన్లు. వీరిలో సౌరవ్ గంగూలీది దూకుడు స్వభావం అయితే, ధోని మాత్రం మిస్టర్ కూల్. కాగా, వీరిద్దరి కెప్టెన్సీలో చాలా దగ్గర పోలికలున్నాయినని అంటున్నాడు టీమిండియా మాజీ పేసర్ జహీర్ఖాన్. ప్రధానంగా యువ క్రికెటర్లకు అండగా నిలిచే విషయంలో గంగూలీ,ధోనిలు దాదాపు ఒకే విధంగా ఆలోచిస్తారని జహీర్ పేర్కొన్నాడు. తనలాంటి ఎంతో మంది క్రికెటర్లకు గంగూలీ నుంచి ఎలాంటి మద్దతు లభించిందో, ఆ తర్వాత తరానికి ధోని కెప్టెన్సీలో కూడా అలాంటి మద్దతే లభించిందన్నాడు. ప్రతీ దశాబ్దానికి భారత క్రికెట్లో కెప్టెన్సీ మార్పు అనేది సహజంగానే జరుగుతూ వస్తుందన్నాడు. (ఆ వరల్డ్కప్ అంతా పెయిన్ కిల్లర్స్తోనే..!) ‘కెరీర్ మొదట్లో ఏ క్రికెటర్కైనా సీనియర్ల మద్దతు అవసరం. ముఖ్యంగా జట్టుకు సారథులుగా ఉండేవారి నమ్మకాన్ని ఏర్పరుచుకోవాలి. మనలోని ప్రతిభకు కెప్టెన్ల మద్దతు తోడైతే ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక సీనియర్ల అండ జూనియర్లకు ఎంతో అవసరం. గంగూలీ, ధోనిలు ఇద్దరూ చాలాకాలంపాటు భారత జట్టును నడిపించారు. ఇద్దరిలో చాలా సారూప్యతలు ఉన్నాయి. కెరీర్ తొలినాళ్లలో దాదా ఇచ్చిన మద్దతు మరువలేను. అయితే ధోని చేతికి పగ్గాలు వచ్చినప్పుడు జట్టులో అంతా సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో మ్యాచ్లు ఆడిన అనుభవం ఉన్నవాళ్లను ముందుకు నడిపించడం పెద్ద కష్టమేం కాదు. కానీ ఒక్కొక్కరుగా సీనియర్లు తప్పుకుంటుంటే.. అప్పుడు యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేసుకుంటూ జట్టును ముందుకు సాగించిన తీరు అద్భుతం. అచ్చం గంగూలీలానే ధోని యువ ఆటగాళ్లకు అండగా ఉన్నాడు. దాంతోనే అద్భుతమైన ఫలితాలు సాధించాడు’ అని జహీర్ తెలిపాడు. (ధోనికి మద్దతుగా కైఫ్.. రాహుల్ వద్దు!) -
జహీర్ ఖాన్ సరసన ఇషాంత్
వెల్లింగ్టన్: ఆతిథ్య న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ ఐదు వికెట్లతో మెరిశాడు. మిగతా పేస్ బౌలర్లు రాణించని చోట ఇషాంత్ రాణించడంతో కివీస్ను తొలి ఇన్నింగ్స్లో టీమిండియా కట్టడి చేయగలిగింది. ఓపెనర్లు టామ్ లాథమ్, టామ్ బ్లన్డెల్, సీనియర్ బ్యాట్స్మన్ రాస్ టేలర్లతో పాటు టెయిలెండర్లు టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్ల వికెట్లను ఇషాంత్ పడగొట్టి ఈ ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో ఐదు వికెట్లు తీయడం ఇషాంత్కు ఇది 11వ సారి. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక ఐదు వికెట్లు తీసిన రెండో భారత పేసర్గా జహీర్ సరసన ఇషాంత్ చేరాడు. జహీర్ 92 టెస్టుల్లో 11 సార్లు ఐదు వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ 97 టెస్టుల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్(23) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక విదేశీ గడ్డపై ఎక్కువ సార్లు ఐదు వికెట్లు(9) పడగొట్టిన మూడో టీమిండియా బౌలర్గా లంబూ నిలిచాడు. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో కపిల్ దేవ్(12), అనిల్ కుంబ్లే(10)లు ఉన్నారు. ఇక కివీస్తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు కూడా ఆడటం సందేహంగానే ఉన్నా...చివరకు సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇషాంత్ జట్టుతో చేరిన విషయం తెలిసిందే. చదవండి: ఇషాంత్ జోరు... ఆధిక్యం 51 నుంచి 183కు.. -
అదే బుమ్రా వైఫల్యానికి కారణం: జహీర్
న్యూఢిల్లీ: న్యూజిలాండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ మూడు వన్డేల సిరీస్లో వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇలా ఒక సిరీస్లో బుమ్రా వికెట్ కూడా తీయకపోవడం ఇదే మొదటిసారి. తన కెరీర్లో అతను ఇప్పటివరకూ 16 సిరీస్లు ఆడగా, ఇటీవల స్వదేశంలో ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్ల్లో కూడా మూడు మ్యాచ్ల్లో కలిపి ఒకటే వికెట్ పడగొట్టాడు. దాంతో బుమ్రాపై విమర్శల వర్షం కురుస్తోంది. అయితే బుమ్రా బౌలింగ్ వైఫల్యంపై ఇప్పటికే కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అండగా నిలవగా, ఇప్పుడు టీమిండియా మాజీ పేసర్ జహీర్ఖాన్ సైతం మద్దతుగా నిలిచాడు. బుమ్రా ఒక ప్రమాదకర బౌలర్ అంటూనే మరింత దూకుడుగా అతను బౌలింగ్ చేయాల్సి ఉంటుందన్నాడు. ఈ క్రమంలోనే బుమ్రా ఎందుకు విఫలమయ్యాడో విశ్లేషించాడు. (ఇక్కడ చదవండి: బుమ్రాకు మద్దతిచ్చిన కివీస్ కెప్టెన్) ‘ అతి తక్కువ సమయంలోనే బుమ్రా ఒక కీలక బౌలర్గా మారిపోయాడు. బుమ్రా బౌలింగ్ను ఆడాలంటే ప్రత్యర్థి జట్లలో వణుకు పుడుతోంది. బుమ్రా ఒక ప్రత్యేకతను చాటుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. బుమ్రా బౌలింగ్లో రిథమ్ ఏమీ తగ్గలేదు. కానీ అవతలి ఆటగాళ్లు బుమ్రాను జాగ్రత్తగా ఆడాలనే తలంపుతో బరిలోకి దిగుతున్నారు. ఒక వన్డే మ్యాచ్లో బుమ్రా ఓవర్లలో 35 పరుగులు వచ్చినా ఫర్వాలేదు కానీ వికెట్ను ఇవ్వకూడదనే ధోరణితో దిగుతున్నారు. దాంతో బుమ్రాను ఆచితూచి ఆడుతున్నారు. అదే సమయంలో మిగతా బౌలర్లపై ఎటాక్కు దిగుతున్నారు. దాంతోనే బుమ్రా వికెట్లను సాధించడం కష్టమవుతుంది. ఇక బుమ్రా తన బౌలింగ్కు మరింత పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. తన బౌలింగ్ను రక్షణాత్మక ధోరణితో ఆడుతున్నారనే విషయం బుమ్రాకు కూడా తెలుసు. దాంతో వికెట్లను ఏ విధంగా సాధించాలి అనే దానిపై బుమ్రా దృష్టి నిలపాలి. బ్యాట్స్మెన్ తప్పులు చేసే విధంగా బౌలింగ్కు పదును పెట్టాలి. ఎందుకంటే బుమ్రా బౌలింగ్ను జాగ్రత్తగా ఆడుతూ వికెట్లు ఇవ్వకుండా ఉండటానికే ప్రత్యర్థి జట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయనే విషయం స్పష్టంగా కనబడుతోంది. దీనిపై బుమ్రా ఫోకస్ పెట్టి మరింత దూకుడైన బౌలింగ్ను రుచిచూపించాలి’ అని జహీర్ పేర్కొన్నాడు. -
'పాండ్యా తొందరపడకు.. సమయం చాలా ఉంది'
ముంబై : గత కొంతకాలంగా వెన్నునొప్పితో సతమతమవుతున్న టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విదేశాల్లో శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. దీంతో గతేడాది సెప్టెంబరు నుంచి జట్టుకు దూరమైన పాండ్యా గాయం నుంచి కోలుకొని నెల క్రితమే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.న్యూజిలాండ్-ఎ జట్టుకు హార్దిక్ను మొదట ఎంపిక చేసినా ఫిట్నెస్ పరీక్షలో ఫెయిలవడంతో జట్టు నుంచి అతని పేరును తొలగించారు. ప్రస్తుతం ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో హార్దిక్ శిక్షణ పొందనున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ హార్దిక్ పాండ్యాకు ఒక సలహా సూచించాడు. 'ఐపీఎల్కు ఇంకా ఎంతో సమయం ఉంది. అప్పటిలోగా నువ్వు 120 శాతం ఫిట్నెస్తో బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే.. గాయాలతో జట్టుకు దూరమైన తర్వాత పునరాగమనం ముఖ్యం కాదు. జట్టులో ప్రదర్శన ఏ స్థాయిలో ఉందనేదే పరిగణనలోకి తీసుకుంటారు. గాయాలతో జట్టుకు దూరమైనప్పుడు ఎంతో అసహనంతో ఉంటాం. కానీ.. ఓపికతో ఉంటేనే తిరిగి కోలుకోగలం. మన శరీరం మాట మనం వినాలి. అందుకే ఇప్పుడు నీకు ఓపిక అనేది చాలా అవసరం' అని జహీర్ పేర్కొన్నాడు. సహాయ సిబ్బంది, ఫిజియో, ట్రైనర్స్తో పాటు వైద్య సిబ్బంది మాటను పాండ్యా వినాల్సిన అవసరం ఉందని జహీర్ పేర్కొన్నాడు. (ఇంకా కోలుకోని హార్దిక్ పాండ్యా) కాగా న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా ప్రదర్శనపై జహీర్ స్పందించాడు.'న్యూజిలాండ్ను సొంతగడ్డపై టీ20 సిరీస్లో క్లీన్స్వీప్ చేసి భారత్ సత్తాచాటింది. టీమిండియా 5-0తో విజయం సాధించడం ఎంతో గొప్ప విషయం. ప్రస్తుతం కివీస్ క్లిష్ట సమయంలో ఉంది. భారత్ను ఎదుర్కోవడానికి వారు ఇతర మార్గాలు అన్వేషించాలి. బుధవారం నుంచి మొదలుకానున్న వన్డే సిరీస్ కూడా కివీస్కు సవాలుగా నిలవనుంది. టీమిండియా ఇదే జోరుని కొనసాగిస్తూ వన్డే, టెస్టు సిరీస్లను గెలచుకోవాలని కోరుకుంటున్నా. జట్టును గాయాలు వేధిస్తున్నా రిజర్వ్ బెంచ్ ఎంతో పటిష్ఠంగా ఉంది. ఈ విషయంలో జట్టు దిగులు చెందాల్సిన అవసరం లేదని' జహీర్ చెప్పుకొచ్చాడు.('వారి ఆటతీరు చిన్నపిల్లల కంటే దారుణం') -
హార్దిక్ హాస్యం.. జహీర్ గట్టి కౌంటర్
-
త్వరలోనే మైదానంలో అడుగుపెడతాను
-
హార్దిక్ హాస్యం.. జహీర్ గట్టి కౌంటర్
టీమిండియా క్రికెటర్లలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ హార్దిక్ పాండ్యా. తాను చేసే పనులతో ప్రతీసారి వార్తల్లో హైలెట్ నిలుస్తాడు. తాజాగా టీమిండియా దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్ బర్త్డే సందర్భంగా హార్దిక్ చేసిన ట్వీట్ వివాదస్పదంగా మారింది. దీనిపై హార్దిక్ విమర్శకులు, జహీర్ ఖాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా హార్దిక్ ట్వీట్పై జహీర్ స్పందించాడు. ‘ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందకు హార్దిక్కు ధన్యవాదాలు. అయితే నీలా బ్యాటింగ్ నేనెప్పటికీ చేయలేను. కానీ ఈ మ్యాచ్లో(హార్దిక్ పోస్ట్ చేసిన మ్యాచ్ వీడియో) నువ్వు నా నుంచి ఎదుర్కొన్న తర్వాతి బంతి వలే నా పుట్టినరోజు చాలా బాగా జరిగింది’ అంటూ హార్దిక్కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. అదేవిధంగా బర్త్డే విషెస్ చెప్పిన ప్రతీ ఒక్కరికి జహీర్ ధన్యవాదాలు తెలిపాడు. కాగా.. జహీర్ బర్త్డే సందర్భంగా ‘ ‘హ్యాపీ బర్త్డే జాక్.. నేనిక్కడ కొట్టినట్టు నువ్వు కూడా మైదానం బయటకి దంచి కొడతావనే ఆశిస్తున్నా’అంటూ ఓ దేశవాళీ మ్యాచ్లో జహీర్ బౌలింగ్లో హార్దిక్ సిక్సర్ కొట్టిన వీడియోను జతచేసి ట్వీట్ చేశాడు. దీనిపై జహీర్ ఖాన్ అభిమానులు మండిపడ్డారు. ‘ముందు జహీర్లా టీమిండియాకు ప్రపంచకప్ తీసుకరా’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక హార్దిక్ లండన్లో వెన్నునొప్పి గాయానికి శస్త్రచికిత్స చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్నానని.. త్వరలోనే మైదానంలోకి అడుగుపెడుతానిని హార్దిక్ పేర్కొన్నాడు. అయితే గాయం తీవ్రత, జరిగిన శస్త్ర చికిత్సను పరిశీలిస్తే ఐదు నెలల పాటు హార్దిక్ విశ్రాంతి అవసరముంటుందుని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. -
హార్దిక్ అహంకారానికి నిదర్శనమిదే!
ఓ టీవీలో షోలో మహిళలపై అసభ్యకరమైన రీతిలో మాట్లాడి విమర్శల పాలైన టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. మరోసారి అలాంటి విమర్శలనే ఎదుర్కొంటున్నాడు. టీమిండియాలో సక్సెస్ఫుల్ బౌలర్గా గుర్తింపు పొందిన మాజీ ఆటగాడు జహీర్ ఖాన్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా జహీర్కి పుట్టిన రోజు శుభాక్షాంక్షలు చెప్పే క్రమంలో హార్దిక్ ఓ వీడియోను షోర్ చేశాడు. ఆ వీడియోనే అతనిని తీవ్ర విమర్శల పాలు చేసింది. నెటిజన్ల ఆగ్రహానికి గురిచేసింది. జహీర్ బౌలింగ్లో హర్థిక్ బౌండరి సాధించినది ఆ వీడియో పరమార్థం. దీంతో సీనియర్ ఆటగాడికి నువ్విచ్చే గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. హార్దిక్ అహంకారానికి ఇదే నిదర్శనమంటూ ఘాటు కామెంట్లతో విమర్శిస్తున్నారు. గత కొంతకాలంగా వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్న టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు సర్జరీ పూర్తయిన విషయం తెలిసిందే. ఇటీవల సర్జరీ నిమిత్తం లండన్ వెళ్లాడు. దాంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు నుంచి హార్దిక్కు విశ్రాంతి ఇచ్చారు. Happy birthday Zak ... Hope you smash it out of the park like I did here 🤪😂❤️❤️ @ImZaheer pic.twitter.com/XghW5UHlBy — hardik pandya (@hardikpandya7) October 7, 2019 -
ఆ జ్ఞాపకాలన్ని మధురాతిమధురం!
ముంబై: సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం నాటి చిరస్మరణీయ ఘట్టాన్ని ఎవరు మరచిపోగలరు! 2011, ఏప్రిల్ 2న కులశేఖర బౌలింగ్లో ధోని కొట్టిన భారీ సిక్సర్తో భారతావని పులకించింది. ‘ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టయిల్, ఇండియా లిఫ్ట్ ద వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్’... అంటూ సాగిన రవిశాస్త్రి వ్యాఖ్యానం ఇప్పటికీ మన చెవుల్లో మోగుతూనే ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా అదే రోజు అదే ముంబైలోని వాంఖడే మైదానంలో నాటి జట్టులోని కొందరు సభ్యులు దానిని గుర్తు చేసుకొని సంబరపడ్డారు. నేడు ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఇక్కడే జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లలో ఉన్న క్రికెటర్లు ఇచ్చోటనే... అంటూ తమ చిరకాల స్వప్నం నెరవేరిన రోజును తలచుకున్నారు. ముంబై మెంటార్లు సచిన్ టెండూ ల్కర్, జహీర్ఖాన్లతో యుువరాజ్ సింగ్ సెల్ఫీ దిగగా... మరో వైపు చెన్నై ఆటగాళ్లు ధోని, రైనా, హర్భజన్ కలిసి ఫోటోను పంచుకున్నారు. వరల్డ్ కప్ గెలిచిన రోజును పురస్కరించుకొని ప్రత్యేక వీడియో విడుదల చేసిన సచిన్ ప్రస్తుత జట్టు సభ్యులకు సందేశమిచ్చాడు. ‘త్వరలోనే మరో వరల్డ్ కప్ రాబోతోంది. మీలో ఎవరూ ఆడబోతున్నారో నాకు తెలీదు. కానీ ఎవరు ఆడినా గెలుపును కానుకగా తీసుకురండి. మీ జెర్సీలపై చూస్తే మూడు ప్రపంచ కప్ విజయాల స్టార్లు కనిపిస్తాయి. ఇప్పుడు ఆ సంఖ్యను నాలుగును చేయడం మీ చేతుల్లోనే ఉంది’ అని సచిన్ ఈ వీడియోలో వ్యాఖ్యానించాడు. గౌతం గంభీర్ కూడా బురదతో నిండిన తన ఫైనల్ మ్యాచ్ జెర్సీ ఫోటోను పెట్టి ‘కొన్ని జ్ఞాపకాల పుటలు మట్టితో అలంకరిస్తేనే బాగుంటుంది’ అని పోస్ట్ చేశాడు. -
జహీర్ ఖాన్ వల్లే..
న్యూఢిల్లీ: తన బౌలింగ్ను మరింత మెరుగుపరుచుకోవడానికి మాజీ పేసర్ జహీర్ ఖానే కారణమని టీమిండియా పేసర్ సిద్దార్థ్ కౌల్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లబోయే భారత జట్టులో చోటు దక్కించుకున్న సిద్ధార్థ్ కౌల్.. జహీర్ సూచనలతో తన బౌలింగ్లో పదును పెరిగిందన్నాడు. ‘నా తొలి ప్రాధాన్యం దేశవాళీ క్రికెట్కే. పంజాబ్ తరఫున చేసిన ప్రదర్శనలే జాతీయ జట్టులో అవకాశం దక్కేలా చేశాయి. న్యూజిలాండ్లో భారత్-ఏ తరఫున బౌలింగ్ చేశా. అక్కడి పిచ్లపై పూర్తి అవగాహన ఉంది. ఎప్పుడూ జట్టు గెలుపు కోసమే కష్టపడతా. నా మార్గనిర్దేశకుడు జహీర్ ఖాన్ నేతృత్వంలో నా బౌలింగ్ను మరింత పటిష్టం చేసుకున్నా. ఆయన చక్కని సలహాలు ఇస్తారు. బంతులు విసిరేటప్పుడు సింపుల్గా ఉండాలని సూచిస్తారు. ఆయన నాతో చాలా సమయం గడిపారు. నా బౌలింగ్ గురించి నోట్స్ రాసుకున్నారు. బంతులు విసిరేటప్పుడు ఏ కండరాలు ఉపయోగించాలి, ఏ ప్రాంతాల్లో బంతులు వేయాలో చెప్పారు. భారత్-ఎ తరఫున న్యూజిలాండ్ వెళ్లేటప్పుడూ ఆయనతో మాట్లాడాను. ఆ సలహాలు అద్భుతంగా ఉపయోగపడ్డాయి’ అని తెలిపాడు. ఇక భారత-ఎ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ గురించి మాట్లాడుతూ.. రాహుల్ సర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనకు క్రికెట్పై ఉన్న నాలెడ్జ్ను వెలకట్టలేం. ఆయన సలహాలు నాకెంతగానో ఉపయోగపడ్డాయి’ అని కౌల్ చెప్పుకొచ్చాడు. -
కుర్రాళ్ల లీగ్కు జహీర్, సునీల్ శెట్టి శ్రీకారం
న్యూఢిల్లీ: భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్, బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కుర్రాళ్ల కోసం నిర్వహించనున్న కొత్త క్రికెట్ లీగ్లో చేయిచేయి కలిపారు. జాతీయ స్థాయిలో ఫెరిట్ క్రికెట్ బాష్ పేరుతో (ఎఫ్సీబీ) వీరిద్దరు కలిసి లీగ్ నిర్వహణకు శ్రీకారం చుట్టారు. 15 ఏళ్లు పైబడిన బాలల కోసం మొత్తం 22 నగరాల్లో ప్రతిభాన్వేషణ పోటీలు నిర్వహిస్తారు. రెండు రౌండ్లుగా జరిగే ఈ సెలక్షన్ క్రికెట్ పోటీల ద్వారా చివరకు 224 మందిని ఎంపిక చేస్తారు. వీరికి రూ. లక్ష చొప్పున ఫీజుగా చెల్లిస్తారు. వీరందరిని కలిపి 16 జట్లను తయారు చేస్తారు. ఇలా ఏర్పడిన ఈ 16 జట్లకు అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు, కోచ్లు శిక్షణ ఇస్తారు. చివరకు 15 ఓవర్ల చొప్పున మ్యాచ్లను ఏర్పాటు చేస్తారు. ఇందులో అసాధారణంగా రాణించిన 14 మందిని ఆస్ట్రేలియాలో క్లబ్ స్థాయి క్రికెట్ టోర్నీ ఆడేందుకు అక్కడికి తీసుకెళ్తారు. -
మరోసారి క్రికెట్ ఫీల్డ్లోకి జహీర్
న్యూఢిల్లీ: ఒకప్పటి భారత క్రికెట్ జట్టు ప్రధాన పేసర్ జహీర్ ఖాన్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. వచ్చే నెలలో షార్జాలో ఆరంభం కానున్న టీ10 లీగ్లో జహీర్ఖాన్ ఆడనున్నాడు. ఈ టోర్నీ నవంబర్ 23 నుంచి ఆరంభం కానుంది. తొలి ఎడిషన్లో వీరేంద్ర సెహ్వాగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈ లీగ్లో భారత్ నుంచి అప్పుడు ఒక్కడే ఆడగా ఈసారి మాత్రం పలువురు భాగస్వామ్యం అవుతున్నారు. జహీర్ ఖాన్, ప్రవీణ్ కుమార్, ఆర్పీ సింగ్, ఆర్ఎస్ సోధి, సుబ్రమణ్యం బద్రీనాథ్తో పాటు మరో ముగ్గురు ఆడనున్నారు. ‘టీ10 రెండో ఎడిషన్లో హై ప్రొఫైల్ కల్గిన ఎనిమిది మంది భారత క్రికెటర్లు ఆడటం చాలా సంతోషకరం. రానున్న కాలంలో ఈ లీగ్లో దేశవిదేశాలకు చెందిన ఎక్కువ ఆటగాళ్లను ఆకర్షించేందుకు ఇది ఉపయోగపడుతుంది’ అని లీగ్ ఛైర్మన్ షాజీ ఉల్ ముల్క్ తెలిపారు. -
జహీర్ కొంచెం బరువు తగ్గబ్బా!
కోల్కతా : ఆదివారంతో 40వ ఏట అడుగుపెట్టిన టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్కు అటు మాజీ క్రికెటర్లు, ఇటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ విషెస్ను తెలియజేశారు. అయితే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన ట్వీటే ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ‘హ్యాపీ బర్త్డే జహీర్.. నీకు ఈ ఏడాది మంచి జరగాలి. దయచేసి కొంచెం బరువు తగ్గవు.. నీవు భారత బలం’ అని చమత్కరిస్తూ విషెస్ తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక జహీర్ గంగూలీ కెప్టెన్సీలోనే ఎక్కువ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. సౌరవ్ గంగూలీ సారథ్యంలో 36 టెస్టులు, 88 వన్డేలతో మొత్తం 124 మ్యాచ్లాడిన జహీర్ 232 వికెట్లు పడగొట్టాడు. లెఫ్టార్మ్ స్వింగ్ బౌలరైన జహీర్.. 2000లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టాడు. Happy birthday @ImZaheer zed K.. have a great year ...please loose some weight...u were India’s strength 🤝 — Sourav Ganguly (@SGanguly99) October 7, 2018 స్వింగ్తో తన బౌలింగ్ వైవిధ్యాన్ని చాటుకున్నాడు. ఈ టోర్నీలో ఫైనల్కు చేరినప్పటికి న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. మొత్తం కెరీర్లో 200 వన్డేలు, 92 టెస్టులు, 17 టీ20లాడిన జహీర్ వన్డేల్లో 282, టెస్టుల్లో 311, టీ20ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత ఆటగాళ్లలో జహీర్ నాలుగోవాడు. అతని కన్నా ముందు అనిల్ కుంబ్లే, శ్రీనాథ్, అజిత్ అగార్కర్లున్నారు. ఇక జహీర్కు తన టీమ్మెట్స్ సెహ్వాగ్, లక్ష్మణ్, భజ్జీ, ఆర్పీసింగ్, కైఫ్లు సైతం విషెస్ తెలిపారు. -
‘వారే నాకు స్ఫూర్తి, ధైర్యం’: టీమిండియా క్రికెటర్
క్రికెట్లో లెఫ్టార్మ్ పేసర్ల పాత్ర ఎంతో కీలకం. సర్ గార్ఫీల్డ్ సోబర్స్, వసీం ఆక్మమ్, చమింద వాస్, జహీర్ ఖాన్ ఇలా ఎంతో మంది లెఫ్టార్మ్ బౌలర్లు సుదీర్ఘ కాలం వారి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. జహీర్ ఖాన్, అశిష్ నెహ్రాలు రిటైర్మెంట్ అనంతరం టీమిండియాలో లెఫ్టార్మ్ పేసర్ స్థానం ఖాళీ అయింది. బరిందర్ శ్రాన్, జయదేవ్ ఉనద్కత్, అంకిత్ చౌదరీలు జట్టులోకి వచ్చినా అంతగా ఆకట్టుకోలేదు. ఒకానొక సమయంలో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ టీమిండియాకు లెఫ్టాండ్ బౌలర్ ఎంతో అవసరమని సెలక్టర్లకు విన్నవించుకున్నాడు. ఈ తరుణంలో సెలక్లర్లను ఆకట్టుకుంటూ జట్టులోకి వచ్చాడు రాజస్తాన్ ఆటగాడు ఖలీల్ అహ్మద్. మరి ఆసియా కప్లో మంచి ప్రదర్శన కనబర్చి జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంటాడా లేక అలా వచ్చి ఇలా వెళ్లి పోతాడా వేచిచూడాలి. సాక్షి, స్కోర్స్ట్: టీమిండియాకు ఆడాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు.. కానీ కొందరు మాత్రమే సుసాధ్యం చేసుకుంటారు. కన్న కలను సాకారం చేసుకొని రోహిత్ శర్మ నేతృత్వంలో ఆసియా కప్కు ఎంపికైన జట్టులో చోటు దక్కించుకున్నాడు రాజస్తాన్ ఆటగాడు ఖలీల్ అహ్మద్. టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ తనకు ఆదర్శమని, అండర్ -19, భారత్-ఏ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంచారని ఈ యువ క్రికెటర్ వివరించారు. ప్రస్తుతం అత్యుత్తమ ఆటను ప్రదర్శించి జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. ఆసియాకప్లో ఆడే అవకాశం వస్తే తానేంటో నిరూపించుకుంటానని స్పష్టంచేశాడు. భారత్ ‘ఏ’తరుపున 17 మ్యాచ్లు ఆడిన ఖలీల్ 28 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా ఏ, దక్షిణాఫ్రికా ఏ లపై చేసిన అత్యత్తమ ప్రదర్శనతోనే టీమిండియా తరుపున ఆడే అవకాశం లభించిందని అభిప్రాయపడ్డాడు. జహీర్ భాయ్ చెప్పినవన్నీ డైరీలో నోట్ చేసుకున్నా.. ‘2016లో ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్కు ఆడటం నాకు ఎంతో లాభించింది. నా స్పూర్తి జహీర్ ఖాన్. అతడిలా గొప్ప బౌలర్ కావాలని కలలు కన్నాను. ఈ దిగ్గజ ఆటగాడు చెప్పిన ప్రతీ సలహా, సూచన డైరీలో నోట్ చేసుకున్నా. నాకు ఏ సందేహం వచ్చినా ధైర్యంగా అడిగేవాడిని. యూఏఈ వేదికగా జరుగనున్న ఆసియాకప్లో కూడా ఎలా ఆడాలో అతడి సూచనలు డైరీలో నోట్ చేసుకుంటాను. అందరూ నన్ను మరో జహీర్ అంటున్నారు. జహీర్ లెజెండ్ క్రికెటర్. అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఒకరు స్థానాన్ని నేను భర్తీ చేయడమేంటి? తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటాను. జహీర్ ఖాన్ కంటే ఎక్కువ వికెట్లు తీస్తాను(నవ్వుకుంటూ)’ అంటూ ఖలీల్ పేర్కొన్నాడు. ద్రవిడ్ అంటే ధైర్యం ‘గెలుపోటముల గురించి ఆలోచించకు, నీ ఆట నువ్వు ఆడు’ అంటూ రాహుల్ ద్రవిడ్ ఎప్పుడూ ప్రోత్సహించేవాడని ఈ యువ ఆటగాడు తెలిపాడు. ద్రవిడ్ పక్కనుంటే ఎంతో ధైర్యంగా ఆడతామని, ఎల్లప్పుడూ ప్రోత్సహించేవాడని వివరించాడు. వందశాతం కష్టపడతానని, భారత్ తరుపున్న ఆడటం ఎంతో గౌరవంగా భావిస్తున్నాని పేర్కొన్నాడు. ఆసియాకప్కు ఎంపిక కావడం పట్ల తన తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపాడు. -
అఫ్గాన్ టెస్ట్: అశ్విన్ రికార్డు
సాక్షి, బెంగళూరు: అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ముందుగా బ్యాట్స్మెన్ చెలరేగగా, అనంతరం బౌలర్లు చకచకా వికెట్లు తీస్తు విజయాన్ని దగ్గర చేస్తున్నారు. భారత బౌలర్ల ధాటికి మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసేలా ఉంది. ఇక ఈ చారిత్రక టెస్ట్లో పలు రికార్డులు సృష్టిస్తున్న టీమిండియా ఆటగాళ్లు, తాజాగా భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మరో మైలు రాయిని అందుకున్నాడు. అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్లో అస్గార్ స్టానిక్జాయ్ వికెట్ తీసి.. తద్వారా భారత్ తరపున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన నాలుగో బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్(92 టెస్టుల్లో 311 వికెట్లు) రికార్డును అధిగమించాడు. అశ్విన్ 58 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించటం విశేషం. 100 వికెట్ల క్లబ్లో ఉమేశ్ యాదవ్ టీమిండియా పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ తొలి ఇన్నింగ్స్లో రహ్మత్ షాను ఔట్ చేయడంతో టెస్ట్ల్లో 100 వికెట్లు తీసిన బౌలర్గా ఈ ఘనత సాధించాడు. 37 టెస్టుల్లోనే ఈ మైలురాయిని అధిగమించాడు. భారత్ తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు: అనిల్ కుంబ్లే- 619 వికెట్లు (132 టెస్టుల్లో) కపిల్ దేవ్ - 434 వికెట్లు (131 టెస్టుల్లో) హర్భజన్సింగ్- 417 వికెట్లు (103 టెస్టుల్లో) అశ్విన్-315 వికెట్లు (ప్రస్తుతానికి) (58 టెస్టుల్లో) జహీర్ఖాన్-311 వికెట్లు (92 టెస్టుల్లో) -
గోల్ కొట్టబోతున్న గృహిణి
షారుఖ్ ఖాన్ ‘చక్ దే ఇండియా’ హాకీ టీమ్లో కనిపించి, గత నవంబరులో క్రికెటర్ జహీర్ ఖాన్ని పెళ్లి చేసుకుని గృహిణి జీవితంలోని కొత్త బాధ్యతల్లో మునిగితేలుతున్న సాగరికా ఘాట్గే.. త్వరలోనే ఫుట్బాల్ టీమ్లో కనిపించబోతున్నారు! మరాఠీ దర్శకుడు మిలింద్ ఉకే తీస్తున్న ‘మాన్సూన్ ఫుట్బాల్’ చిత్రంలో ఫుట్బాల్ టీమ్గా ఏర్పడిన గృహిణుల జట్టులో ఒక సభ్యురాలి పాత్రతో సాగరిక తిరుగులేని ఒక గోల్ కొట్టడం కోసం ప్రస్తుతం ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. ‘‘సాగరిక ఈ సినిమాకు నా బెస్ట్ చాయిస్. ఆమెకూ ఈ సబ్జెక్టు నచ్చింది’’ అని చెప్తున్న ఉకే.. చూస్తుంటే సాగరిక చుట్టూనే తన కథను అల్లుకున్నట్లు కనిపిస్తోంది. చిత్రం షూటింగ్ జూలైలో మొదలవుతోంది. ఈలోపే సాగరిక ఒక ఫుట్బాల్ క్రీడాకారిణిగా తనని తాను తీర్చిదిద్దుకుంటున్నారు. 2007లో ఛక్ దే తర్వాత ఫాక్స్, మిలే న మిలే హమ్, రష్, ప్రేమచి గోష్ట (మరాఠీ), జీ భర్ కె జీ లీ, దిల్ దారియాన్ (పంజాబీ), ఇరాద (2017) చిత్రాలలో సాగరిక నటించారు. ఇప్పుడీ ‘మాన్సూన్ ఫుట్బాల్’.. పెళ్లయ్యాక తొలిసారి ఆమె నటిస్తున్న చిత్రం. సాగరిక మరాఠీ యువతి. కొల్హాపూర్లో పుట్టారు. ఎనిమిదేళ్ల వరకు అక్కడే ఉన్నారు. తర్వాత రాజస్థాన్లోని అజ్మీర్ వెళ్లి, అక్కడి ‘మాయో కాలేజ్ గర్స్›్ల స్కూల్’ లో చదివారు. సాగరిక నేషనల్ లెవెల్ హాకీ ప్లేయర్ కూడా. ఆ ప్రతిభ కారణంగానే ఆమెకు ఛక్ దే ఇండియాలో అవకాశం వచ్చింది. విరాట్, అనుష్కలా.. సాగరిక, జహీర్లది లవ్ మ్యారేజ్. క్షణమైనా ఒకరినొకరు విడిచి ఉండలేని ఈ జంట.. తొలిసారి కళ్లు కళ్లు ఎక్కడ కలుపుకుందో ఎవరికీ తెలియని ఒక మిస్టరీ!