-
స్టార్ హీరో చిత్రాన్ని తొలగించిన ప్రముఖ ఓటీటీ సంస్థ.. ఎందుకంటే?
కన్నడ దివంగత స్టార్ పునీత్ రాజ్కుమార్ పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఆయన కెరీర్లో చివరిసారిగా నటించిన చిత్రం గంధడ గడ. డాక్యుమెంటరీగా రూపొందించిన ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో రిలీజై ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈ చిత్రం మొదట అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ తర్వాత లైసెన్స్ గడువు ముగియడంతో తమ ఫ్లాట్ఫామ్ నుంచి అమెజాన్ ఈ మూవీని తొలగించింది. దీంతో పునీత్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. (ఇది చదవండి: పునీత్ రాజ్కుమార్ రెండో వర్థంతి.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్) అయితే అమెజాన్లో తొలగించినా.. గంధడ గడ మూవీ మరికొన్ని డిజిటల్ ఫ్లాట్ఫామ్స్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం యూట్యూబ్, గూగుల్ టీవీ, ఐట్యూన్స్, యాపిల్ టీవీల్లో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. ఎవరైనా ఈ సినిమాను వీక్షించాలనుకుంటే...రూ.100 అద్దె చెల్లించి చూసేయొచ్చు. ఈ డాక్యుమెంటరీని కర్ణాటక రాష్ట్ర అడవులు, ప్రకృతి వనరులు, జీవ వైవిధ్యంలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించారు. ఈ డాక్యూమెంటరీ ఫిల్మ్ లో నటిస్తూనే స్వయంగా నిర్మించారు పునీత్ రాజ్కుమార్. కాగా.. పునీత్ రాజ్కుమార్ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య అశ్వనీ రేవంత్, ఇద్దరు కుమార్తెలు ధ్రితి, వందిత ఉన్నారు. ఆయన మరణానంతరం మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ చేతులమీదుగా ఆయన సతీమణి అశ్విని 2022 మార్చి 22న డాక్టరేట్ స్వీకరించింది. -
వరల్డ్ టాప్ యూట్యూబ్ ఛానెల్ మనదే.. ఏదో తెలుసా?
యూట్యూబ్! వీడియో విభాగంలో ఓ సెన్సేషన్. 2005 ప్రారంభమై ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతోంది. డిజిటల్ ల్యాండ్స్కేప్లో గేమ్ఛేంజర్గా మారిన యూట్యూబ్ లక్షలాది కంటెంట్ క్రియేటర్లకు ఆదాయ వనరుగా మారింది. వారి ఎదుగుదలకూ తోడ్పడుతోంది. సబ్స్క్రైబర్లు, లైక్స్, వ్యూస్ ఆధారంగా డిజిటల్ వరల్డ్లో ఏ యూట్యూబ్ ఛానల్ అగ్రస్థానంలో ఉందో గుర్తించవచ్చు. అయితే ఎప్పటిలాగే తొలి టాప్టెన్ యూట్యూబ్ ఛానల్స్ వివరాల్ని ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ప్రపంచంలో మిగిలిన దేశాల యూట్యూబ్ ఛానల్స్తో పోలిస్తే భారత్కు చెందిన యూట్యూబ్ ఛానల్స్ యూజర్లను ఆకట్టుకోవడంతో సబ్స్క్రైబర్ లాయల్టీ పరంగా అగ్రస్థానాన్ని సంపాదించాయి. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం..భారత్లోని మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ టీ సిరీస్ అగస్థానాన్ని సంపాదించుకుంది. శ్రోతల్ని ఆకట్టుకునే సంగీతంతో పాటు, ఎంటర్టైన్మెంట్ను అందించడంతో ప్రపంచంలో అత్యధికంగా సబ్స్క్రయిబ్ చేసుకున్న టాప్ 10 యూట్యూబ్ ఛానెల్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. టీ సిరీస్ తర్వాత మిగిలిన ఛానల్స్ ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూట్యూబ్ ఛానెల్స్ జాబితా ప్రకారం.. టీ-సిరీస్: ప్రపంచంలోనే నంబర్ వన్ యూట్యూబ్ ఛానెల్ 257 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. భారతదేశంలోని అతిపెద్ద మ్యూజిక్ లేబుల్, మూవీ స్టూడియో యాజమాన్యంలో వారి ఛానెల్లో మ్యూజిక్ వీడియోలు, సినిమాలు, ట్రైలర్లతో సహా ఇతర ఎంటర్ టైన్మెంట్ వీడియోల్ని ఇందులో వీక్షించవచ్చు. మిస్టర్ బీస్ట్: జిమ్మీ డొనాల్డ్సన్ అమెరికన్ యూట్యూబర్. మిస్టర్బీస్ట్గా ప్రసిద్ధి చెందారు. సాహసాలూ, వింత స్టంట్లూ చేస్తూ నడుపుతున్న ఈ ఛానల్కు సబ్స్క్రైబర్ల సంఖ్య సుమారు 232 మిలియన్లకు పైగా.. ఆదాయం వందల కోట్లే కోకోమెలన్ : ఈ అత్యంత ప్రజాదరణ పొందిన ఛానెల్ 3డీ యానిమేటెడ్ నర్సరీ రైమ్లు, పిల్లల పాటల వీడియో కంటెంట్ను అందిస్తుంది. ఈ ఛానెల్కు 170 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సెట్ ఇండియా (సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్): భారతదేశంలో సెట్ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్ ఉంది. హిందీలో కంటెంట్ను అందిస్తుంది. ఈ ఛానెల్కు 167 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కిడ్స్ డయానా షో: ఆన్లైన్లో కిడ్స్ డయానా షో అని పిలువబడే ఎవా డయానా కిడిస్యుక్. ఆమె, అమె కుటుంబ సభ్యులు కలిసి ఈ ఛానెల్ను నిర్వహిస్తున్నారు. 118 మిలియన్ల మంది సబ్స్కైబర్లు ఉన్నారు. ప్యూడైపీ : స్వీడిష్ యూట్యూబర్ ఫెలిక్స్ కెజెల్బర్గ్ నిర్వహించే ప్యూడైపీ అత్యంత ప్రజాదరణ పొందిన ఛానెల్లలో ఒకటి. ఇందులో 111 మిలియన్ల మంది సబ్స్కైబర్లు ఉండగా.. 4,747 వీడియోల్ని అప్లోడ్ చేశారు. లైక్ నాస్త్య: ది లైక్ నాస్త్య యూట్యూబ్ ఛానెల్ అనేది నాస్త్య అనే యువతి, ఆమె కుటుంబ సభ్యులతో పిల్లలకు ఎంటర్టైన్మెంట్ వీడియోల్ని అందిస్తుంటుంది. దీనికి 112 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వ్లాడ్ అండ్ నికి: ఈ అత్యంత ప్రజాదరణ పొందిన ఛానెల్ ఇద్దరు అన్నదమ్ములు నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్కు 108 మిలియన్ల మంది సబ్స్కైబర్లు ఉన్నారు. జీ మ్యూజిక్ కంపెనీ: ప్రధానంగా హిందీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఆఫర్లతో, జీ మ్యూజిక్ కంపెనీ యూట్యూబ్ ఛానెల్ 104 మిలియన్ల సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్: డబ్ల్యూడబ్ల్యూఈ యూట్యూబ్ ఛానెల్కు 99 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు, 73 వేల వీడియోలు ఉన్నాయి. ఇందులో రెజ్లింగ్ వీడియోల్ని వీక్షించవచ్చు. -
అశ్లీల కంటెంట్... యూట్యూబ్కు సమన్లు
ఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ యూట్యూబ్ భారత్ విభాగానికి నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) సమన్లు జారీ చేసింది. తల్లులు, కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన కంటెంట్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. అటువంటి ఛానెల్ల జాబితాతో జనవరి 15న తమ ముందు హాజరు కావాలని యూట్యూబ్ సంస్థ భారత్ విభాగ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ హెడ్ని కోరింది. ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో ఈ మేరకు భారతదేశంలోని యూట్యూబ్ ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ అధిపతి మీరా చాట్కు లేఖ రాశారు. తల్లులు, కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన చర్యలను చిత్రీకరించే యూట్యూబ్ ఛానెల్లలో ఆందోళనకరమైన ధోరణిని కమిషన్ గుర్తించిందని ప్రియాంక కనూంగో అన్నారు. ‘వీడియోలలో’ తల్లులు, కొడుకుల మధ్య అసభ్యకరమైన చర్యలు, తల్లులు, యుక్తవయస్సులో ఉన్న కొడుకుల మధ్య ముద్దులు వంటివి ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ఈ వీడియోలు లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే (పోక్సో) చట్టం- 2012ను ఉల్లంఘిస్తున్నాయి.' అని కమిషన్ గుర్తించిందని తెలిపారు. “యూట్యూబ్ దీన్ని పరిష్కరించాలి. నేరస్థులు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి వీడియోలను కమర్షియల్గా మార్చడం అంటే పోర్న్ అమ్మడం లాంటిది. పిల్లలు లైంగిక వేధింపులకు గురైన వీడియోలను ప్రదర్శించే ఏదైనా ప్లాట్ఫామ్ జైలుకు వెళ్లవలసి ఉంటుంది.”అని ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో తెలిపారు. ఇదీ చదవండి: అతిపెద్ద సముద్ర వంతెన.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం -
రూ.12 వేలకోట్ల సంగీత సామ్రాజ్యం.. టాప్ 10లో 7 మన పాటలే!
చదువు పూర్తయి సంగీత పరిశ్రమలో స్థిరపడాలనుకునే వారి తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన ఎదురవుతోంది. ఆ రంగంలో స్థిరపడేవారి ఆదాయమార్గాలు అంతంతమాత్రంగానే ఉంటాయనే భావన ఉంది. దాంతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందేమోనని భయపడుతారు. కానీ 2022లో దేశంలోని మ్యూజిక్ ఇండస్ట్రీ ఏకంగా రూ.12000 కోట్ల వ్యాపారం సాగించింది. ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. మొత్తంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో రూ.2.1 లక్షల కోట్ల వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. అయితే అందులో మ్యూజిక్ ఇండస్ట్రీ 6 శాతం వాటా కలిగి ఉంది. మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లోని టాప్ 10 పాటల్లో ఏడు భారతీయులవే కావడం విశేషం. పుష్ప సినిమాలో సునిధి చౌహాన్ పాడిన ‘రారా సామీ’ పాట ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. దీనికి 1.55 బిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఇంద్రావతి చౌహాన్ పాడిన ‘ఊ అంటావా’ పాటను 1.52 బిలియన్ల మంది చూశారు. మ్యూజిక్ కంపోజర్లు, గేయ రచయితలు, సింగర్లకు చెల్లించే డబ్బు 2.5 రెట్లు పెరిగినట్లు తెలిసింది. ప్రత్యేకంగా మ్యూజిక్ ఆల్బమ్స్ను క్రియేట్ చేసి దాని ద్వారా డబ్బు సంపాదిస్తున్నవారు, లైవ్షోల ద్వారా అర్జిస్తున్నవారు, డిస్కో జాకీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ది మ్యూజిక్ క్రియేటర్ ఎకానమీ: ది రైజ్ ఆఫ్ మ్యూజిక్ పబ్లిషింగ్ ఇన్ ఇండియా, 2023 నిర్వహించిన సర్వే ప్రకారం.. 40,000 కంటే ఎక్కువ మంది సంగీత సృష్టికర్తలు ఏటా 20,000-25000 పాటలను సిద్ధం చేస్తున్నారు. ఈ సర్వేలో అప్పటికే ఉంటున్న పాటలు, మ్యూజిక్ రీమిక్స్ చేస్తున్నవారిని పరిగణలోకి తీసుకోలేదు. వారిని కూడా కలుపుకుంటే ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో అంతర్జాతీయంగా, దేశవ్యాప్తంగా పేరున్న సంస్థలు విడుదల చేసే మ్యూజిక్కే ఆదరణ ఉండేదని, కానీ పెరుగుతున్న టెక్నాలజీ ద్వారా స్థానికంగా మ్యూజిక్ క్రియేట్ చేస్తున్న వారి కంటెంట్కు సైతం మంచి ఆదరణ లభిస్తోందని సర్వే ద్వారా తెలిసింది. ఇదీ చదవండి: రష్యా వద్దు.. సౌదీయే ముద్దు.. పరిస్థితులు తారుమారు? 1957నాటి కాపీరైట్ చట్టంలో 2012లో మార్పులు తీసుకొచ్చారు. రికార్డింగ్ని యధాతథంగా కాకుండా అదే పాటను మరొక సింగర్ పాడవచ్చు. వేరొక ట్యూన్కి సెట్ చేయవచ్చు. లైవ్షోలో పాడవచ్చు. దాంతో వివిధ మార్గాల నుంచి రాయల్టీలు పొందే వీలుంది. -
YouTube: ఇక్కడ సంపాదించుకున్నోడికి సంపాదించుకున్నంత!
ఆధునిక టెక్నాలజీ యుగంలో సామాజిక మాధ్యమాలు విస్తృతమయ్యాయి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్స్ ఇలా ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. నేటి రోజుల్లో బ్యాంక్ అకౌంట్ అయినా లేనివారు ఉంటారేమో గానీ ఏదో ఒక సోషల్మీడియా అకౌంట్ లేనివారు మాత్రం ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఎన్ని సోషల్మీడియా వేదికలు ఉన్నా యూట్యూబ్కు ఉన్న ప్రత్యేకత, ఆదరణ వేరు. అత్యధికమంది ఉపయోగించే సోషల్ మీడియా యాప్ ఇది. ఇందుకు కారణం పెద్దగా చదువుకోని సమాన్యులు సైతం ఉపయోగించేందుకు వీలుగా ఉండటం, కంటెంట్ వీడియోల రూపంలో ఉండటం. యూట్యూబ్ యూజర్లు ఏ స్థాయిలో ఉన్నారో అంతే స్థాయిలో కంటెంట్ క్రియేటర్లు అంటే యూట్యూబర్లు కూడా ఉన్నారు. అభిరుచిని తీర్చుకోవడంతోపాటు ఆదాయాన్ని పొందే అవకాశం ఉందిక్కడ. యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్ల సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, ట్రావెలింగ్, కుకింగ్, ఫ్యాషన్, లైఫ్స్టైల్, ఫైనాన్స్, న్యూస్.. ఇలా రకరకాల కంటెంట్ను యూట్యూబర్లు క్రియేట్ చేసి వీక్షకుల ముందుకు తెస్తున్నారు. యూట్యూబర్లు అంత సంపాదిస్తున్నారు.. ఇంత సంపాదిస్తున్నారు.. అంటూ మాట్లాడుకోవడమే గానీ వారికి డబ్బు ఎలా వస్తుంది.. ఎంత మంది చూస్తే ఎంత డబ్బు వస్తుంది.. అన్న లెక్కలు చాలా మందికి తెలియవు. ఈ లెక్కల్ని అర్థం చేసుకుని, ఒక యూట్యూబర్ ఎంత సంపాదించగలరు అన్నది అంచనా వేయాలని ఆసక్తి ఉన్న వారి కోసం ఇక్కడ కొంత సమాచారం ఇస్తున్నాం.. డబ్బు ఎలా వస్తుంది? స్పాన్సర్షిప్ల నుంచి మొదలు పెట్టి ఉత్పత్తుల ప్రమోషన్ వరకూ పలు రకాల మార్గాల్లో యూట్యూబర్లు డబ్బు సంపాదించవచ్చు. కానీ గూగుల్ ప్రకటనలు (Google Ads) నుంచే వచ్చే ఆదాయమే అత్యధికం. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్లో చేరిన సోషల్ మీడియా క్రియేటర్లు తమ వీడియోల ద్వారా గూగుల్ ప్లేస్డ్ యాడ్స్తో (Google-placed ads) డబ్బు సంపాదించవచ్చు. ఈ అర్హతలుండాలి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేయడానికి, క్రియేటర్లు తప్పనిసరిగా కనీసం 500 మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉండాలి. అలాగే గత 90 రోజుల్లో కనీసం మూడు పబ్లిక్ అప్లోడ్లు చేసి ఉండాలి. సంవత్సర కాలంలో 3,000 వాచింగ్ అవర్స్ లేదా గత 90 రోజుల్లో 3 మిలియన్ల యూట్యూబ్ షార్ట్ల వీక్షణలను కలిగి ఉండాలి. ఈ అర్హతలన్నీ ఉండి ఒకసారి అప్రూవల్ పొందిన తర్వాత, అర్హత కలిగిన క్రియేటర్లు ఛానెల్ మెంబర్షిప్లు, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్లు, సూపర్ థాంక్, యూట్యూబ్ షాపింగ్తో తమ సొంత ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునే సామర్థ్యం వంటి ఫీచర్ల ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఇక యూట్యూబ్ యాడ్సెన్స్ (YouTube AdSense) నుంచి డబ్బు సంపాదన ప్రారంభించడానికి, ప్రోగ్రామ్లోని క్రియేటర్లు తప్పనిసరిగా 1,000 మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉండాలి. సంవత్సర కాలంలో 4,000 వాచింగ్ అవర్స్ను కలిగి ఉండాలి. ఎంత మంది చూస్తే ఎంత డబ్బులు? తమతో యూట్యూబర్లు పంచుకున్న రెవెన్యూ పర్ మిల్లీ (RPM) రేట్ల ఆధారంగా బిజినెస్ ఇన్సైడర్ ఓ అధ్యయనం చేసింది. దాని ప్రకారం.. ప్రతి 1,000 వీక్షణలకు 1.61 నుంచి 29.30 డాలర్లు (రూ.130 నుంచి రూ.2,400) యూట్యూబర్లు సంపాదిస్తున్నారు. యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి యూట్యూబర్లు నెలకు ఎంత డబ్బు సంపాదిస్తారు అనేది వీక్షణల మొత్తం, ఆడియన్స్ లొకేషన్, కంటెంట్ కేటగిరి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. బిజినెస్ ఇన్సైడర్ అధ్యయనం చేసిన ఓ 28 మంది యూట్యూబర్ల నెలవారీ ఆదాయాలు 82 నుంచి 83,000 డాలర్ల వరకూ (రూ.6,800 నుంచి సుమారు రూ.70 లక్షలు) ఉన్నాయి. ఈ ఆదాయాలు నెలవారీగా మారవచ్చు. ఉదాహరణకు సుమారు లక్ష మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఓ యూట్యూబర్ ఒక నెలలో 1,000 డాలర్లు (రూ.83,000) సంపాదిస్తే మరొక నెలలో 6,000 డాలర్లు (సుమారు రూ.5 లక్షలు) వరకు సంపాదించినట్లు బిజినెస్ ఇన్సైడర్ పేర్కొంది. ఇక ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న వ్యక్తిగత ఫైనాన్స్ గురించి వీడియోలను రూపొందించే మరో యూట్యూబర్ ఒకే నెలలో 50,000 డాలర్లు (సుమారు రూ.41 లక్షలు) కంటే ఎక్కువ సంపాదించారు . గమనిక: ఇది కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. -
భారత్కు మించింది లేదు: యూట్యూబ్ ఎండీ
ప్రతిభావంతులైన, ఔత్సాహికులైన యువతకు ప్రస్తుతం భారత్కు మించిన మెరుగైన ప్రదేశం మరొకటి లేదు. ఈ మాట అంటున్నది ఎవరో కాదు.. యూట్యూబ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఇషాన్ ఛటర్జీ. ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి అయిన ఇషాన్ ఛటర్జీ గత సంవత్సరం యూఎస్ నుంచి భారత్కు తిరిగి వచ్చారు. హెచ్పీఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇటీవల హైదరాబాద్ వచ్చారు. ఎన్డీటీవీతో పలు విషయాలు వెల్లడించారు. భారత్లో రాబోయే 10 సంవత్సరాలు అద్భుతంగా ఉండబోతున్నాయన్నారు. భారత్ అత్యంత వైవిధ్యమైన, డైనమిక్ ఉత్తేజకరమైన మార్కెట్ అని పేర్కొన్నారు. భాషతో సంబంధం లేకుండా దేశంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన కంటెంట్ క్రియేటర్లకు సైతం యూట్యూబ్ వేదికను కల్పించిందన్నారు. ఇషాన్ ఛటర్జీ పాఠశాల విద్యాభ్యాసం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సాగింది. ఢిల్లీలోని సెయింట్ స్టీపెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ చేసిన ఆయన అమెరికాలోని వార్టన్ స్కూల్ యూనివర్సిటీ నంచి ఎంబీఏ పూర్తి చేశారు. యూట్యూబ్కు ముందు ఇషాన్ ఛటర్జీ గూగుల్, మెకెన్సీ కంపెనీల్లో పనిచేశారు. -
యూట్యూబ్ షేక్.. 2023లో దుమ్ము రేపిన వీడియోలు, షార్ట్స్ ఇవే..
ఆధునిక కాలంలో సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. దీంతో ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగిన నిమిషంలో తెలిసిపోతోంది. ఇందులో కూడా కొన్ని సంఘటనలు మాత్రమే పెద్దగా వైరల్ అవుతాయి. ఈ ఏడాది (2023) ఎక్కువ మంది చూసిన వీడియోలు ఏవి, టాప్ ట్రెండింగ్ కంటెంట్, దాని వెనుక ఉన్న క్రియేటర్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 2023లో ఎక్కువ మంది వీక్షించిన వీడియాల్లో చెప్పుకోదగ్గది 'చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్-ల్యాండింగ్ లైవ్ టెలికాస్ట్'. దీనికి ప్రారంభంలో 8.5 మిలియన్స్.. ఇప్పటి వరకు 79 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. ఈ సంవత్సరంలో యూట్యూబ్లో అతిపెద్ద లైవ్ స్ట్రీమ్గా ఇది సంచలనం సృష్టించింది. ఆ తరువాత వరుసగా మ్యాన్ ఆన్ మిషన్, యూపీఎస్సీ స్టాండ్ అప్ కామెడీ, డైలీ వ్లాగర్ పేరడీ, శాస్తా బిగ్ బాస్ 2 వంటివి ఎక్కువ వ్యూవ్స్ పొందాయి. టాప్ 15 గేమింగ్ వీడియోలు 2023లో 'ఐ స్టోల్ సుప్రా ఫ్రమ్ మాఫియా హౌస్' ఎక్కువమంది హృదయాలను దోచింది. ఈ గేమింగ్ వీడియో ఇప్పటికి 30 మిలియన్ వీక్షణనలను పొందింది. ఆ తరువాత స్థానంలో జీటీఏ5 ఇన్ రియల్ లైఫ్, గ్రానీ చాఫ్టర్ 1, స్కిబిడి టాయిలెట్ 39 - 59, కునాలి కో దర్ నహీ లగ్తా వంటివి ఉన్నాయి. టాప్ 10 కంటెంట్ క్రియేటర్స్ ఈ ఏడాది యుట్యూబ్లో సంచలనం సృష్టించిన టాప్ 10 కంటెంట్ క్రియేటర్ల జాబితాలో ప్రధమ స్థానంలో పవన్ సాహు ఉండగా.. ఆ ఆ తరువాత స్థానాల్లో నీతూ బిష్ట్ (Neetu Bisht), క్యూట్ శివాని 05, ఫిల్మీ సూరజ్ యాక్టర్, అమన్ డ్యాన్సర్ రియల్, ఆర్టిస్ట్ సింతు మౌర్య మొదలైనవారు ఉన్నాయి. ఇందులోనే మహిళల విభాగంలో నీతూ బిష్ట్, షాలు కిరార్, జశ్వి విశ్వి, ది థాట్ఫుల్ గర్ల్, రాయల్ క్యూన్, సోనాల్ అగర్వాల్, మింకు టింకు, అంజు డ్రాయింగ్ షార్ట్స్, మహి లక్రా వ్లాగ్స్, మామ్ అండ్ రీదిష్ణ వంటి వారు ఉన్నారు. టాప్ 15 షార్ట్స్ యూట్యూబ్ షార్ట్స్ విభాగంలో ఈ ఏడాది వరుసగా పతి కో బనాయా పాగల్, కదం కదం భజాంగే జా, 500 మీ ఐఫోన్, బ్లో ద రోలర్ అండ్ విన్ ఛాలెంజ్, చలాక్ బాయ్ ఫ్రెండ్, టామ్ అండ్ జెర్రీ (రిత్వి & కవి), పోర్ ఛాలెంజ్ విత్ సిరప్ వంటివి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: 50 రూపాయలతో రూ.350 కోట్ల సామ్రాజ్యం - చూపు లేకున్నా.. సక్సెస్ కొట్టాడిలా.. టాప్ 15 మ్యూజిక్ వీడియోలు 2023లో పాపులర్ అయిన వీడియోల విషయానికి వస్తే.. ఇందులో మొదటి స్థానంలో ఘనీ కో సబ్ ఘన్, జరా హక్తే జరా బచ్కే, జవేద్ మోహ్సిన్, క్యా లోగే తుమ్, హా నువ్ కావాలయ్యా (జైలర్), పల్సర్ బైక్ (ధమాకా), నా రెడీ (లియో) మొదలైనవి ఉన్నాయి. -
పనిచేయకుండానే డబ్బు కావాలా..?
అవునండీ.. పని చేయకుండానే డబ్బులు వస్తాయి. ఎలాగంటారా..? ప్యాసివ్ ఇన్కమ్తో ఇది సాధ్యం అవుతుంది. ప్యాసివ్ ఇన్కమ్తో కులాసాగా కాలం గడిపేయొచ్చు అనే భావన ఇప్పటికే చాలామందికి వచ్చేసింది. ఇంతకీ ఫ్యాసివ్ ఇన్కమ్ అంటే పని చేయకుండా వచ్చే ఆదాయం అన్నమాట! ఇదేదో బాగానే ఉందే.. ఇక కాయకష్టం చేయాల్సిన అవసరం లేదని ఫిక్సయిపోకండి. అలా కాలు కదపకుండా కాసులు రాలాలంటే అంతకుముందు యాక్టివ్ ఇన్కమ్ గణనీయంగా సంపాదిస్తే గానీ, ప్యాసివ్ సంపాదన సాధ్యపడదని మాత్రం గుర్తుంచుకోండి. ప్యాసివ్ ఇన్కమ్ అనేది ప్రత్యేక్షంగా మన ప్రమేయం లేకుండా స్థిరంగా డబ్బు వచ్చే విధానం. ఈ ఆదాయం రెంటల్ ప్రాపర్టీస్, ఇన్వెస్ట్మెంట్లు, క్రియేటివ్ వర్క్ రాయల్టీలు, డివెడెండ్లు.. నుంచి జనరేట్ అవుతుంది. ప్యాసివ్ ఇన్కమ్పైన డైలీ అటెన్షన్ అవసరం ఉండదు. అది కాలక్రమేణా పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు యూట్యూబ్ చానల్ పెడితే లక్షల్లో సంపాదించొచ్చని చాలామంది అంటారు. అయితే అందుకు మాత్రం ముందు చాలా కష్టపడాలి. ఒకసారి మనిటైజేషన్ అయిపోయి ఫాలోవర్లు పెరుగుతుంటూ డబ్బు వస్తూంటుంది. కొన్నిసార్లు వీడియో చేయకపోయినా కొందరు మనం గతంలో చేసిన వీడియోలు చూస్తారు కాబట్టి డబ్బు వస్తుంది. ఇన్స్టాలో కొత్తగా ఏదైనా థీమ్ క్రియేట్చేసి ఇన్స్టాంట్గా వైరల్ అయిపోవచ్చు. కానీ అందుకు చాలా కష్టపడాలి. అయితే ఫ్యాసివ్ ఇన్కమ్ నిర్వచనాన్ని అర్థం చేసుకోకుండా సంపాదనకు షార్ట్కట్స్ ఎంచుకుంటే మూడు షేర్లు… ఆరు లైకులకు పరిమితం అవుతారని నిపుణులు చెబుతున్నారు. స్టాక్మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్చేసి స్టాక్లు పెరుగుతున్నపుడు అందులో మదుపుచేసిన డబ్బు పెరుగుతుంది. దాంతోపాటు కంపెనీలు మంచి త్రైమాసిక ఫలితాలు పోస్ట్ చేస్తూ భవిష్యత్తులో మరింత అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని చెబుతుంటాయి. అయితే అందుకుగల కారణాలను విశ్లేషిస్తూ సిప్ మోడ్లో మరింత ఇన్వెస్ట్ చేయాలి. కంపెనీలు డివెండెండ్ ప్రకటిస్తున్నపుడు పెరిగిన స్టాక్ ధరతో సంబంధం లేకుండా అదనంగా ప్యాసివ్ ఇన్కమ్ను సంపాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే మరెన్నో మార్గాలున్నాయని, కానీ అంతకుముందు యాక్టివ్ మనీను సంపాదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదీ చదవండి: ఆఫీస్లో కాసేపు పడుకోనివ్వండి! -
యూట్యూబ్లో అత్యధిక మంది వీక్షించిన క్రికెట్ మ్యాచ్లు ఇవే..!
-
ఒకేసారి వంద పచ్చిగుడ్లను తిన్న యూట్యూబర్, వీడియో వైరల్
గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజూ గుడ్లు తీసుకుంటే శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. దీంట్లో ప్రోటీన్లతో పాటు శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఉంటాయన్నది నిజమే. కొందరు రోజూ ఉడికించిన గుడ్డు తీసుకుంటే మరికొందరు పచ్చిగుడ్డు తీసుకుంటారు. అయితే ఓ యూట్యూబర్ మాత్రం ఏకంగా ఒకేసారి వంద పచ్చి గుడ్లను తిని నెట్టింట సెన్సేషన్గా మారాడు. జిమ్ చేసేవాళ్లలో చాలామంది తమ డైట్లో తప్పకుండా గుడ్లు ఉండేలా చూసుకుంటారు. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుందని, శరీరానికి కావల్సినంత ప్రోటీన్ను అందిస్తుందని చాలామంది గుడ్లను తప్పకుండా రోజూ తీసుకుంటారు. అయితే ఓ ఫిట్నెస్ ఇన్ఫ్యూయెన్సర్,యూట్యూబర్ మాత్రం పెద్ద సాహసమే చేశాడు. తన యూట్యూబ్ చానల్కు లక్ష ఫాలోవర్స్ వచ్చిన సందర్భంగా ఆడియెన్స్ కోసం ఏదైనా సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు. అనుకుందే తడవుగా జిమ్లో ఓ పెద్ద మగ్గు నిండా 100 పచ్చి గుడ్లను నింపుకున్నాడు. ఇదేం చేస్తాడబ్బా అని చుట్టూ ఉన్నవాళ్లు చూసేలోపు మగ్గులోని సగానికి పైగా గుడ్లను ఖాళీ చేసేశాడు. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి పుషప్స్ చేసి మళ్లీ పచ్చి గుడ్లను తాగడం కంటిన్యూ చేశాడు. అలా మొత్తం మగ్లోని వంద గుడ్లను తాగేసరికి అక్కడున్న వాళ్లందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫాలోవర్స్ కోసం ఇలాంటి పిచ్చి స్టంట్లు చేస్తే ప్రాణానికి ప్రమాదం..ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు గుడ్డు తినడం మంచిది కదా అని అతిగా తీసుకుంటే చాలా ప్రమాదం అని డాక్టర్లు సైతం హెచ్చరిస్తున్నారు. View this post on Instagram A post shared by Vince Iannone (@vince_aesthetic) -
క్రియేటర్లకు యూట్యూబ్ భారీ షాక్!
క్రియేటర్లకు ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ భారీ షాకిచ్చింది. చాట్జీపీటీ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఏఐ వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. అయితే, దీన్ని ఆసరాగా చేసుకుంటున్న పలువురు వీడియో క్రియేటర్లు ఏఐ సాయంతో వీడియోలు చేస్తున్నారు. డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశంపై యూట్యూబ్ కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. ఏఐ యాప్స్తో చేసే కంటెంట్కు యూట్యూబ్లో చోటు లేదని స్పష్టం చేసింది. వీడియోల నుంచి ఏఐ ఇమేజెస్ వరకు యూట్యూబ్ వీడియోల్లో వినియోగించడానికి వీలు లేదని తెలిపింది. ఇందుకోసం కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపింది. ఒకవేళ ఏఐ ఫోటోలు, వీడియోల్ని వినియోగిస్తే సదరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు తప్పని సరిగా ఈ కంటెంట్ ఏఐతో చేసినట్లు తెలపాలి. లేదంటే ఆయా వీడియోలను తొలగించనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా యూట్యూబ్ బ్లాగ్లో మార్గదర్శకాలపై సమాచారం ఇచ్చింది. యూజర్లు కంటెంట్ వీక్షిస్తున్న సందర్భంలో ఈ కంటెంట్ను ఏఐ సహాయంతో సృష్టించినట్లు చెబుతుందని పేర్కొంది. డిస్క్రిప్షన్లో ఏఐ లేబుల్కు ఆప్షన్ ఉంటుందని పేర్కొంది. కొత్త మార్గదర్శకాలను పాటించని కంటెంట్ క్రియేటర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కంటెంట్ను తొలగించడంతో పాటు ఆయా ఛానెల్స్కు సంబంధించి మానిటైజేషన్ నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది. -
యూజర్లకు షాక్.. మరింత కాస్ట్లీగా యూట్యూబ్!
టెక్ దిగ్గజం గూగుల్కు చెందిన వీడియో షేరింగ్ దిగ్గజం యూట్యూబ్ యూజర్లకు షాకిచ్చింది. ఆదాయమార్గాల్ని అన్వేషిస్తున్న యూట్యూబ్ పలు దేశాల్లో యూట్యూబ్ ప్రీమియం ధరల్ని మరింత పెంచింది. పెంచిన ధరలతో యూట్యూబ్ కొన్ని దేశాల్లో మరింత కాస్ట్లీగా మారింది. వాటిల్లో భారత్ లేకపోవడం గమనార్హం. ఎక్కువ యాడ్స్ ఉంటే యూట్యూబ్కి ఆదాయం పెరుగుతుంది. అయితే, యూజర్లు యూట్యూబ్లో యాడ్స్ లేకుండా వీడియోలు చూడటానికి యాడ్ బ్లాకర్లను వాడుతుంటారు. దీంతో ఆదాయం తగ్గడంతో యాడ్ బ్లాకర్స్ని వినియోగిస్తున్న యూజర్లను బ్లాక్ చేసేలా కొత్త మెకానిజంను తయారు చేసింది. ఈ టెక్నాలజీ రాకతో ప్రపంచవ్యాప్తంగా యాడ్ బ్లాకర్లను వినియోగించే వారికి ‘యాడ్ బ్లాకర్లను వినియోగిస్తే యూట్యూబ్ నిబంధనలను ఉల్లంఘించినట్లే. యాడ్ బ్లాకర్లను వాడొద్దని ఇప్పటికే సూచించాం. ఒక వేళ ప్రకటనలు రాకుండా వీడియోలు చూడాలంటే ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది’ అని మెసేజ్లు పంపిస్తుంది. నవంబర్ 1 నుంచే అమలు తాజాగా, 9 టూ 5 గూగుల్ నివేదిక ప్రకారం.. అర్జెంటైనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, చీలీ,జర్మనీ, పోలాండ్, టర్కీ ఈ 7 దేశాలకు చెందిన యూజర్లకు యూట్యూబ్ మెయిల్స్ పంపింది. య్యూట్యూబ్లో ప్రీమియం ధరల్నిపెంచుతున్నట్లు ఆమెయిల్స్లో పేర్కొంది. ఈ పెరిగిన ధరలు నవంబర్ 1 నుంచి అందుబాటులోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే సబ్స్క్రిప్షన్ సేవల్ని వినియోగిస్తున్న యూజర్లు మరో మూడు నెలల వరకు పాత సబ్స్క్రిప్షన్ ఛార్జీలను చెల్లించే అవకాశం కల్పిస్తూనే.. కొత్తగా వచ్చి చేరే పెయిడ్ యూజర్లు మాత్రం పెంచిన ధరలు వర్తిస్తాయని చెప్పింది. అయితే, పెంచిన ధరలు ఎంతనేది తెలియాల్సి ఉంది. భారత్లో యూట్యూబ్ ప్రీమియం ధరలు భారతదేశంలో యూట్యూబ్ ప్రీమియం ధరలు స్థిరంగానే ఉన్నాయి. సంస్థ ప్రస్తుతం చందాదారుల నుండి నెలవారీ సబ్స్క్రిప్షన్ ధర రూ. 139, మూడు నెలల సబ్స్క్రిప్షన్ ధర రూ. 399, ఏడాది సభ్యత్వానికి ధర రూ. 1,290ని వసూలు చేస్తుంది. తద్వారా యూజర్లు యూట్యూబ్లో వీడియోల్ని వీక్షించే సమయంలో ఎలాంటి యాడ్స్ డిస్ప్లే అవ్వవు. చదవండి👉 ‘నీవ్వు వద్దూ.. నువ్విచ్చే జీతం వద్దంటూ’ -
ఇవిగివిగో... అవిగవిగో!
తాజాగా ఫోర్బ్స్ ఇండియా ‘డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించింది 24 సంవత్సరాల ఆకాంక్ష మోంగ. కన్సల్టెన్సీ జాబ్ను వదిలేసి ఫుల్టైమ్ ట్రావెలర్గా మారింది. పుణెకు చెందిన ఆకాంక్ష ట్రావెల్ అండ్ ఫొటోగ్రఫీ విభాగంలో మంచి పేరు తెచ్చుకుంది. ‘కంటెంట్ను ప్రేక్షకులకు వేగంగా చేరువ చేయడానికి సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయం లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలి’ అంటుంది ఆకాంక్ష. డిజిటల్ క్రియేటర్లు నిలువ నీరులా, గోడకు కొట్టిన మేకులా ఉండకూడదు అనే స్పృహతో యువ క్రియేటర్లు ఎప్పటికప్పుడు కొత్త టాపిక్స్పైనే కాదు టూల్స్ గురించి కూడా అవగాహన చేసుకుంటున్నారు. క్రియేటర్–ఫ్రెండ్లీ టూల్స్కు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల అప్డేట్స్ను వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. కంటెంట్ మేకింగ్లో మరింత క్రియేటివిటీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.... రెండు నెలల క్రితం ‘మీ షార్ట్స్ను నెక్ట్స్ లెవెల్కు తీసుకు వెళ్లండి’ అంటూ యూట్యూబ్ కొత్త క్రియేషన్ టూల్స్ను తీసుకువచ్చింది. అందులో ఒకటి కొలాబ్. ఈ టూల్తో సైడ్–బై–సైడ్ ఫార్మట్లో ‘షార్ట్’ను రికార్డ్ చేయవచ్చు. క్రియేటర్లు తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవడానికి మల్టిపుల్ లే ఔట్ ఆప్షన్లు ఉంటాయి.గత నెలలో జరిగిన ‘మేడ్ ఆన్ యూట్యూబ్’ కార్యక్రమంలో క్రియేటర్స్కు ఉపకరించే కొత్త టూల్స్ను ప్రకటించింది కంపెనీ. ‘క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్కు కొత్త టూల్స్ తీసుకురానున్నాం. క్లిష్టం అనుకునే వాటిని సులభతరం, అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసే టూల్స్ ఇవి. క్రియేటివ్ పవర్కు దగ్గర కావడానికి ఉపకరిస్తాయి’ అన్నాడు యూ ట్యూబ్ సీయీవో నీల్ మోహన్.యూ ట్యూబ్ ప్రకటించిన కొన్ని టూల్స్.... డ్రీమ్ స్క్రీన్ యూట్యూబ్ షార్ట్స్ కోసం రూపొందించిన న్యూ జెనరేటివ్ ఫీచర్ ఇది. దీని ద్వారా తమ షార్ట్స్కు ఏఐ జనరేటెడ్ వీడియో లేదా ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయడానికి వీలవుతుంది. పెద్దగా కష్టపడనక్కర్లేకుండానే పాప్ట్ ఇస్తే సరిపోతుంది. ‘డ్రీమ్ స్క్రీన్’ ద్వారా క్రియేటర్లు తమ షార్ట్స్కు న్యూ సెట్టింగ్స్ జ నరేట్ చేయవచ్చు. యూట్యూబ్ క్రియేట్ వీడియోలు క్రియేట్ చేయడానికి షేర్ చేయడానికి ఉపకరిస్తుంది. యూట్యూబ్ క్రియేట్ యాప్ ద్వారా ఖచ్చితత్వం, నాణ్యతతో కూడిన ఎడిటింగ్, ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ కాప్షనింగ్, వాయిస్ వోవర్, యాక్సెస్ టు లైబ్రరీ ఆఫ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, రాయల్టీ–ఫ్రీ మ్యూజిక్... మొదలైనవి క్రియేటర్లకు ఉపయోగపడతాయి. ఒక్క ముక్కలో చె΄్పాలంటే కాంప్లెక్స్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్తో పని లేకుండానే ప్రేక్షకులను ఆకట్టుకునేలా వీడియోలను సులభంగా క్రియేట్ చేయవచ్చు. క్రియేటర్ల నోట ‘హిట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్’ అనే మాట తరచుగా వినిపిస్తుంటుంది. ప్రస్తుతం దీన్ని ఫీచర్గా మలచనున్నారు. ‘హిట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్’ వినిపిస్తున్నప్పుడు ఈ బటన్లను సింక్లోని విజువల్ క్యూతో హైలైట్ చేస్తుంది. ఏఐ ఇన్సైట్స్ యూట్యూబ్లో ప్రేక్షకులు చూస్తున్న కంటెంట్ ఆధారంగా వీడియో ఐడియాలను తయారు చేసుకోవడానికి వీలవుతుంది. అలౌడ్ ఆటోమేటిక్ డబ్బింగ్ టూల్ ద్వారా కంటెంట్ను ఎక్కువ భాషల్లో క్రియేట్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ కూడా క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అప్డేట్స్తో ముందుకు వస్తోంది. వాటిలో ఒకటి క్రియేటర్లు ‘రీల్స్’లో టాప్ ట్రెండింగ్ సాంగ్స్ గురించి తెలుసుకునే అవకాశం. ఆ ఆడియోనూ ఎన్నిసార్లు ఉపయోగించారో తెలుసుకోవచ్చు. సేవ్ చేసి అవసరమైన సందర్భంలో వాడుకోవచ్చు. ట్రెండింగ్ టాపిక్స్ ఏమిటో కూడా తెలుసుకోవచ్చు. ‘ప్రస్తుతం పాపులర్ ఏమిటి?’ అనేది తెలుసుకోవడానికి కొత్త డెడికేటెడ్ సెక్షన్ క్రియేటర్లకు ఉపకరిస్తుంది’ అని చెబుతుంది కంపెనీ.‘రీల్స్’ను ఎడిట్ చేయడాన్ని సులభతరం చేయడానికి వీడియో క్లిప్లు, ఆడియో, స్టిక్కర్స్, టెక్ట్స్ను ఒకేచోటుకు తీసుకువచ్చింది. తమ కంటెంట్ పెర్ఫార్మెన్స్ గురించి తెలుసుకోవడానికి కొత్తగా తీసుకువచ్చిన ‘రీల్స్ ఇన్సైట్స్’తో యాక్సెస్ కావచ్చు. ఇన్స్టాగ్రామ్ కొత్తగా యాడ్ చేసిన ‘టోటల్ వాచ్ టైమ్’ మెట్రిక్, ‘యావరేజ్ టైమ్’ మెట్రిక్తో క్రియేటర్లు యాక్సెస్ కావచ్చు. రీల్స్లో ‘స్ట్రాంగర్ హుక్’ క్రియేట్ చేసి వీడియోను ఆకట్టుకునేలా చేయడానికి ఇది ఉపకరిçస్తుంది. అయిననూ... టెక్నాలజీ మాత్రమే సర్వస్వం, విజయ సోపానం అనుకోవడం లేదు యువ క్రియేటర్లు. ‘టెక్నాలజీ అంటే టూల్స్ మాత్రమే కాదు క్రియేటర్ పనితీరు. ప్రత్యేకత. సృజనాత్మకత’ అనే విషయంపై అవగాహన ఉన్న యువ క్రియేటర్లు నేల విడిచి సాము చేయడం లేదు. కంటెంట్, టెక్నాలజీని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. -
సోషల్ మీడియాతో పాపులర్ సింగర్ అయిన డిసోజా
బెంగళూరుకు చెందిన సింగర్, సాంగ్ రైటర్ ఫ్రిజెల్ డిసోజా. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో రకరకాల పాటల గురించి పోస్ట్లు, వీడియోలు పెట్టడం ద్వారా ఇండియన్ ఇండీ మ్యూజిక్ ప్రపంచంలోకి వచ్చింది. లాక్డౌన్ కాలంలో ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ‘సమ్థింగ్ న్యూ’ పాట ఐడియా వచ్చింది. ఈ డెబ్యూ సాంగ్ ద్వారా డిసోజా మెలోడియస్ వాయిస్కు మంచి పేరు వచ్చింది. సోషల్ మీడియాలో కనిపించి, వినిపించే డిసోజా లైవ్ ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొంది. ఫస్ట్ టూర్లో వచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆమెకు ఎంతో బలాన్ని ఇచ్చింది. ఇక రచన విషయానికి వస్తే...లవ్, హార్ట్బ్రేక్కు సంబంధించిన అంశాలపై పాటలు రాయడం డిసోజాకు ఇష్టం.‘వ్యక్తిగత అనుభవాల నుంచి చూసిన, విన్న విషయాల ఆధారంగా పాటలు రాయడం నాకు సులభం’ అంటుంది. మొదట్లో తన పాటల్లో ఎలక్ట్రిక్ గిటార్, డ్రమ్ల శబ్దం లిరిక్స్ను డామినేట్ చేసేది. ఇప్పుడు మాత్రం లిరిక్స్ కూడా స్పష్టంగా వినబడే ఈజీ–టు–లిజెన్ వైబ్కు ప్రాధాన్యత ఇస్తోంది. ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేట్ అయిన డిసోజా ఫుల్–టైమ్ మ్యూజిషియన్గా ఉండడమే తనకు ఇష్టం అంటుంది. View this post on Instagram A post shared by Frizzell D'Souza (@frizzell.dsouza) View this post on Instagram A post shared by Frizzell D'Souza (@frizzell.dsouza) -
యూట్యూబ్లో మొదటి వీడియో ఏది? ఎంతమంది చూశారు?
ఈ రోజుల్లో యూట్యూబ్ అనేది వినోద ప్రపంచపు రారాజు. ఒకవైపు యూట్యూబ్ ద్వారా కోట్లాది మంది వినోదం పొందుతుండగా, మరోవైపు లక్షలాది మంది ఈ ప్లాట్ఫారమ్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. నేటి రోజుల్లో యూట్యూబర్గా మారడం అనేది ఉద్యోగం కంటే ఉత్తమమైన ఆదాయం అందుకోగల వృత్తి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే యూట్యూబ్ ఎప్పుడు ప్రారంభమయ్యింది? దానిలో పోస్ట్ చేసిన మొదటి వీడియో ఏది? అనే ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. యూట్యూబ్ని 2005లో స్టీవ్ చెన్, చాడ్ హర్లీ, జావేద్ కరీం ప్రారంభించారు. అయితే ఆ తర్వాత వీరు దీనిని 165 కోట్ల డాలర్లకు గూగుల్కు విక్రయించారు. ఈ రోజు ఈ యాప్కున్న క్రేజ్ ఎంతంటే ప్రతి నెలా 200 బిలియన్లకు(ఒక బిలియన్ అంటే వంద కోట్లు) పైగా వినియోగదారులు దీనిని సందర్శిస్తున్నారు. యూట్యూబ్లో మొదటి వీడియో 2005 సంవత్సరంలో ఏప్రిల్ 24న రాత్రి 8:27 గంటలకు అప్లోడ్ చేశారు. ఈ వీడియోను యూట్యూబ్ సహ వ్యవస్థాపకుడు జావేద్ కరీం అప్లోడ్ చేశారు. ఈ వీడియో టైటిల్ ‘మీ ఎట్ ది జూ’. ఈ 19 సెకన్ల వీడియోలో జావేద్ ఏనుగుల గురించి మాట్లాడుతూ ‘ఇప్పుడు మనం ఏనుగుల ముందున్నాం. ఏనుగులకు పొడవాటి తొండం ఉంటుంది’ అని అన్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 291 మిలియన్లకు (ఒక మిలియన్ అంటే పది లక్షలు) పైగా వీక్షణలు దక్కాయి. అదే సమయంలో 4.09 మిలియన్ల మంది ఈ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఈ వీడియోను 14 మిలియన్ల మంది లైక్ చేశారు. అయితే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఛానెల్లో ఈ వీడియో తప్ప మరో వీడియో అందుబాటులో లేదు. ఇది కూడా చదవండి: గోల్ఫ్ కోర్సుల రంధ్రాల మూసివేత ఎందుకు? -
యూట్యూబ్ ఛానల్తో కోటీశ్వరుడు అయ్యాడు, అలాంటి వీడియోలతొ..
‘అసాధ్యం’ అనే మాటలో కొందరు ‘అ’ అనే అక్షరాన్ని ఎప్పటికీ పట్టించుకోరు. అజయ్ అక్షరాలా అలాంటి కుర్రాడే. ‘మనం అనుకోవాలేగానీ సాధ్యం కానిది అంటూ ఏముంది’ అనేది అతడి నమ్మకం. అంతులేని బలం. చిన్న వయసులోనే యూట్యూబ్ ప్రపంచంలోకి వచ్చాడు హరియాణాలోని ఫరీదాబాద్కు చెందిన అజయ్ నాగర్. ఇరవై ఏళ్లు దాటే లోపే వైరల్ యూట్యూబ్ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు. ఔత్సాహిక యూట్యూబర్లకు రోల్మోడల్ అయ్యాడు. చిన్నప్పుడు ఫుట్బాల్ ట్యుటోరియల్ వీడియోలు చూస్తూ వాటి నుంచి స్ఫూర్తి పొంది యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు అజయ్. ‘అడిక్టెడ్’ పేరుతో ఉన్న అతడి యూట్యూబ్ చానల్ ఆ తరువాత ‘క్యారీ డియోల్’గా పేరు మార్చుకుంది. కొత్త పేరే కాదు...కొత్త కంటెంట్ వచ్చింది. గేమ్ప్లే ఫుటేజిని అప్లోడ్ చేయడం నుంచి హీరో సన్నీ డియోల్ను అనుకరించడం వరకు ఎన్నో చేశాడు. అజయ్ వీడియో ‘యూట్యూబ్ వర్సెస్ టిక్ టాక్: ది ఎండ్’ ఆరు రోజుల్లోనే 72.2 మిలియన్ల వ్యూస్తో రికార్డ్ సృష్టించింది. అజయ్ ఫాలోవర్స్ ఒక రేంజ్కు చేరుకునే సమయానికి చానల్ పేరు ‘క్యారీమినటీ’గా మారింది. ‘ఇంతకీ క్యారీమినటీ అంటే?’ అని అడిగితే ‘నాకు కూడా తెలియదు. ఇట్ జస్ట్ సౌండ్స్ కూల్ అని అలా డిసైడైపోయాను’ నవ్వుతూ అంటాడు అజయ్. ఒక వీడియో హిట్ అయిన తరువాత సంతోషం మాటేమిటోగానీ దాని ప్రభావం చేయబోయే వీడియో మీద పడుతుంది. ‘గత వీడియోను మించి వ్యూస్ రావాలి’ అనుకునే సమయంలో ఒత్తిడి వచ్చి తల మీద కూర్చుంటుంది. దాన్ని కిందికి దించడం కష్టమైన పని. మరి ఈ సమస్యను అజయ్ ఎలా ఎదుర్కొన్నాడు? అతడి మాటల్లోనే... ‘వీడియోలు చేస్తుప్పుడు ఒత్తిడికి గురవుతుంటారా? అని నన్ను చాలామంది అడిగే వాళ్లు. ఒత్తిడి ఏమిటి! అని ఆశ్చర్యపడేవాడిని. అయితే అది ఒకప్పటి సంగతి. ఆ తరువాత నాలో కూడా మెల్లగా ఒత్తిడి మొదలైంది. ఎన్నో లక్షల మంది నా వీడియోలు చూస్తున్నారు. చాలా జాగ్రత్తగా చేయాలి. నెగెటివ్ కామెంట్స్ రావద్దు...అని ఒకటికి పదిసార్లు అనుకోవడం వల్ల విపరీతమైన ఒత్తిడికి గురయ్యేవాడిని. అయితే చివరి సమయంలో మాత్రం ఏదైతే అది అవుతుంది అనుకొని నా మనసుకు నచ్చినట్లు చేసేవాడిని. నా అంచనా ఎప్పుడూ తప్పలేదు’ఎవరి పిల్లలు వారికి ముద్దు అన్నట్లు ఎవరు చేసిన వీడియోలు వారికి మురిపెంగానే ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తన వీడియోలను యూట్యూబ్లోకి వదిలే ముందు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటాడు. బయటి ప్రేక్షకుడు ఎవరో చూస్తున్నట్లుగా తన వీడియోను చూస్తాడు.జీవితం పర్సనల్ లైఫ్,ప్రొఫెషనల్ లైఫ్ అని రెండు ప్రపంచాలుగా విడిపోయిన కాలంలో ఉన్నాం మనం. ప్రొఫెషనల్ లైఫ్లోనే అజయ్ ఎక్కువ కాలం గడపడం వల్ల కాలేజీ, యూనివర్శిటీలలో చదువుకునే అవకాశం రాలేదు. ఫ్రెండ్స్తో సరదాలు లేవు. వినోదాలు లేవు. అయితే అజేయపథంలో దూసుకుపోతున్న అజయ్ నాగర్కు వాటి గురించి గుర్తు రావడం అరుదే. ‘అజయ్ నాగర్, క్యారీమినటీ ఇద్దరు మంచి స్నేహితులు. ఒకరి అవసరం మరొకరికి ఉంది. కాబట్టి బెస్ట్ ఫ్రెండ్ లేడు అనే బాధ నాకు లేదు’ అంటాడు అజయ్.‘చాలా కష్టసమయంలో మీ వీడియో ఒకటి చూశాను. ఉత్సాహం పుంజుకోవడానికి అది నాకు ఔషధంలా పనిచేసింది’ ఇలాంటి ఈమెయిల్స్ అజయ్కు వస్తుంటాయి. వాటిని చదివినప్పుడల్లా తన బలం రెట్టింపు కావడంతో పాటు బాధ్యత కూడా పెరుగుతుంది.హార్డ్వర్క్, టాలెంట్తో అయిదు యూట్యూబ్ అవార్డ్లతో పాటు అజయ్ ఎన్నో అవార్డ్లు అందుకున్నాడు. ఆర్థిక కోణంలో కోటీశ్వరుడు అయ్యాడు. ఔత్సాహిక యూట్యూబర్లకు రోల్మోడల్గా మారాడు. -
Cyber Attack: యూట్యూబ్ లైక్ కొడితే రూ.77 లక్షలు దోచుకున్నారు!
ఏటికేటా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ను ఊతంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త పంథాల్లో అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఆశచూపి సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారు. దీంతో అమాయకులు బలవుతున్నారు. లక్షల్లో నగదు పోగొట్టుకున్నాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే కొన్ని కేసుల్లో నగదు రికవరీ అవుతున్నా, మరికొన్ని ఘటనల్లో నగదు కోసం బాధితులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఆన్లైన్ జాబ్స్, పార్ట్టైం జాబ్స్ ఆశచూపి తాజాగా 56 ఏళ్ల వ్యక్తి దగ్గర ఏకంగా రూ.77 లక్షలు కొట్టేసిన ఘటన నాగ్పుర్లో చోటుచేసుకుంది. యూట్యూబ్ లైక్ల ద్వారా నగదు సంపాదించవచ్చు అని చెప్పి సైబర్ నేరగాళ్లు నాగ్పుర్కు చెందిన 56 ఏళ్లు సరికొండ రాజు అనే వ్యక్తిని టెలిగ్రాం ద్వారా తొలుత సంప్రదించారు. తమ వద్ద ఒక ఉద్యోగ అవకాశం ఉందని, సులభంగా డబ్బు సంపాదించవచ్చని నమ్మించారు. ఇష్టమైన యూట్యూబ్ ఛానల్ను లైక్చేసి స్క్రీన్ షాట్లు పంపాలని కోరారు. అయితే ప్రారంభంలో అంతా మంచిగానే అనిపించింది. తనకు ఎటువంటి ఇబ్బంది రాదని రాజు భావించాడు. తాను చేసిన పనికి డబ్బులు కూడా వస్తుండడంతో సైబర్ నేరగాళ్లపై ఎలాంటి అనుమానం రాలేదు. దాంతో తన బ్యాంకు ఖాతా వివరాలను వారితో పంచుకున్నాడు. ఇదే అదనుగా భావించి సైబర్ నేరగాళ్లు రాజు బ్యాంక్ ఖాతా నుంచి అనధికార లావాదేవీలు నిర్వహించారు. ఏకంగా రూ.77 లక్షలు దోచుకున్నారు. చేసేదేమిలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు, ఓ బుకీని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మరో కోణం బయటపడింది. ఇటీవల జరిగిన భారత్ పాక్ ప్రపంచ కప్ మ్యాచ్పై బెట్టింగ్ పాల్పడినట్లు సదరు బుకీ అంగీకరించాడు. పార్ట్ టైం ఉద్యోగాలు, సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు అంటూ ఎవరైనా ఆశచూపిస్తే జాగ్రత్తగా ఉండాలని, వారు ఎంత మభ్యపెట్టినా.. ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను పంచుకోకూడదని పోలీసులు తెలిపారు. -
టైం మెచ్చిన ధృవ్తార!
యూట్యూబ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు... ధృవ్ రాఠీ. ఈ హరియాణా కుర్రాడు యూట్యూబర్గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. గాలివాటంగా విజయం సాధించలేదు. తనదైన సక్సెస్ ఫార్ములాను రూపొందించుకున్నాడు. ఆడియో స్పేస్లోకి అడుగు పెట్టి పాడ్కాస్టర్గా కూడా సత్తా చాటాడు. ‘డబ్బు కోసం కాదు ప్యాషన్తో పనిలోకి దిగండి. సామాజిక బాధ్యతను మరవకండి’ అంటున్న ధృవ్ రాఠీ తాజాగా టైమ్ మ్యాగజైన్ ‘నెక్స్ట్ జెనరేషన్ లీడర్స్ 2023’ జాబితాలో చోటు సంపాదించాడు... ధృవ్ రాఠీ సొంత రాష్ట్రం హరియాణా. జర్మనీలోని కాజ్రువ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్, అదే ఇన్స్టిట్యూట్లో రెన్యూవబుల్ ఎనర్జీలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. ట్రావెల్ వీడియోలతో ప్రయాణం ప్రారంభించిన ధృవ్ ఆ తరువాత రాజకీయా, సామాజిక అంశాలపై దృష్టి సారించాడు. ‘ఇన్సైడ్ ది వరల్డ్స్ స్మాలెస్ట్ కంట్రీ’ ‘గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ దిల్లీ స్కూల్స్’ ‘క్లీనింగ్ నైన్ మిలియన్ కేజీ వర్త్ ఆఫ్ ట్రాష్’.... మొదలైన వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ఏదో ఒక వీడియో చేయాలి, వదలాలి అని తొందర పడకుండా ఆచితూచి ఆలోచించి వీడియోలు చేసేవాడు ధృవ్. ‘చేయకపోయిన ఫరవాలేదు. చేసింది మాత్రం బాగుండాలి’ అని గట్టిగా నమ్ముతాడు. ఒక అంశంపై వీడియో చేయాలనుకున్నప్పుడు ‘కెమెరా ఉంది కదా. ఇది చాలు’ అనుకోకుండా ఆ అంశంపై లోతుగా రిసెర్చ్ చేస్తాడు. జర్నల్స్, రిపోర్ట్స్ చదవడంతో పాటు ఎంతోమంది నిపుణులతో మాట్లాడతాడు. ఆ తరువాతే పనిలోకి దిగుతాడు. ‘డబ్బులు బాగా గడించాలనే లక్ష్యంతో యూట్యూబర్గా మారవద్దు. యూట్యూబ్ అనేది జస్ట్ ఫర్ మనీ అనే భావనను మనసులో నుంచి తీసివేయాలి. ప్యాషన్ ఉన్నప్పుడే క్రియేటర్ కావాలి. ఒక క్రియేటర్ సక్సెస్ కావడానికి ఓపిక అనేది అతి ముఖ్యం. ఇక నేను తెలుసుకునేది ఏమీ లేదు అనుకోకుండా అనుభవాలు, పరిస్థితుల నుంచి ఎప్పటికప్పుడు పాఠాలు నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నది ఏమిటో నా గత వీడియోలు, ఇప్పటి వీడియోలకు మధ్య ఉన్న తేడాను గమనిస్తే తెలుస్తుంది. ఖరీదైన టెక్నికల్ టూల్స్ వాడినంత మాత్రాన పేరు రాదు అనేది గ్రహిం చాలి. వృథాగా డబ్బులు ఖర్చు చేయవద్దు. సింపుల్ కెమెరా ఫోన్, ఫ్రీ వీడియో ఎడిటర్తో మన ప్రయాణం మొదలు పెట్టవచ్చు. సామాజిక బాధ్యతను ఎప్పుడూ మరవద్దు’ అంటాడు ధృవ్. ‘పాపులర్ యూట్యూబర్’గా పేరు వచ్చినప్పటికీ అక్కడే ఆగిపోకుండా ఆడియో స్పేస్లోకి అడుగు పెట్టాడు ధృవ్ రాఠీ. పాలిటిక్స్, ఎంటర్టైన్మెంట్, సోషల్, ఎకనామిక్స్ టాపిక్లను కవర్ చేస్తూ పాడ్కాస్టర్గా కూడా తానేమిటో నిరూపించుకున్నాడు. ‘పాడ్కాస్ట్లో అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి. విజువల్గా ఆట్టుకునే అవకాశం లేదు. యానిమేషన్కు వీలులేదు. కేవలం మాట మాత్రమే ముఖ్యం అవుతుంది. శ్రోతలు తమ పనులు చేసుకుంటూ కూడా మన మాటలు ఆసక్తిగా వినేలా చేయాలి. పాడ్కాస్టింగ్లో నేను వీడియోలో ఎలా కనిపించాలి? అనేదాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆకట్టుకునేలా ఎలా మాట్లాడాలి? అనేదానిపైనే దృష్టి ఉంటుంది. నా ముఖాన్ని మాత్రమే కాదు గొంతు కూడా చాలామంది గుర్తుపట్టడం అనేది పాడ్కాస్టింగ్లో నాకు ప్లస్పాయింట్ అయింది. పాడ్కాస్టర్గా నాకు మంచి మార్కులు వేస్తూ శ్రోతలు నుంచి మెయిల్స్, మెసేజ్లు వస్తుంటాయి’ అంటున్న ధృవ్ అభిరుచుల విషయానికి వస్తే...ప్రయాణాలు, ఫొటోగ్రఫీ, స్కూబా–డైవింగ్, పుస్తక పఠనం అంటే ఇష్టం. ‘తక్కువలో ఎక్కువ’ అనేది నమ్మే సూత్రం. (చదవండి: సాధారణ ఉద్యోగిగా అడుగుపెట్టి..నేడు సంపన్న మహిళగా..!) -
సోషల్ మీడియాలో కనపడని పార్టీల సైన్యం!
ఒకప్పుడు.. ఎన్నికల ప్రచారమంటే ఊరూరా పార్టీలు, నాయకుల ర్యాలీలు.. మైకులలో హోరెత్తే ప్రసంగాలు.. ప్రచార పాటలతో తిరిగే వాహనాలు మాత్రమే అన్నట్టుండేది. ప్రతి పార్టీకి, అభ్యర్థికి వారి మద్దతుదారులే ప్రచార సేనగా ఉండేవారు. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. సోషల్ మీడియా సైన్యం ఎన్నికల కదనంలో తెరవెనుక ఉంటూ కనిపించని యుద్ధం చేస్తోంది. ఓటర్లపై దీని ప్రభావం ఎక్కువే ఉంటుండటంతో.. ప్రతి పార్టీ ప్రత్యేకంగా తమకంటూ ఓ సోషల్ మీడియా వింగ్ను ఏర్పాటు చేసుకుంది. కొన్ని పార్టీల నేతలు, కొత్తగా ఎన్నికల్లో పోటీలో దిగుతున్నవారు కూడా సైతం ఎవరికి వారు సొంతంగా సోషల్ టీంలను పెట్టుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా ప్రచారం ఎలా ఉండబోతోంది, సాంకేతికంగా దీని వెనుకదాగున్న అంశాలపై కథనం.. – సాక్షి , హైదరాబాద్ ‘సోషల్’ప్రచారం.. ఎందులో ఎలా? ఫేస్బుక్లో ప్రత్యేక పేజీలు, ఖాతాలు సృష్టించి ప్రమోషన్.. ఇన్స్టాగ్రాంలో రీల్స్ ద్వారా.. ట్విట్టర్ (ఎక్స్)లో హ్యాష్ట్యాగ్ల ద్వారా.. యూట్యూబ్ చానల్స్లో ఎక్కువ లైక్స్, వ్యూస్ వచ్చేలా చేయడం. సోషల్ మీడియా వాడకం సూక్ష్మంగాఇలా.. ♦ కంటెంట్ క్రియేషన్ ♦ కంటెంట్ ప్రమోషన్ అండ్ ట్రెండింగ్ ♦ సోషల్ మీడియా సెంటిమెంట్ అనాలసిస్ ♦ కంటెంట్ క్రియేషన్.. కంటెంట్ రైటర్లు.. కంటెంట్ క్రియేషన్.. కంటెంట్ రైటర్లు.. సోషల్ మీడియాలో మంచి ప్రచారం పొందాలంటే ఓటర్లను ఆకట్టుకునేలా, ఆలోచింపజేసేలా.. అనుకూల ఓటరుగా మార్చేలా వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు, వీడియో, ఆడియో సందేశాలు ఉండాలి. ఇందుకే అన్ని రాజకీయ పార్టీలు కంటెంట్ రైటర్లను, క్రియేటర్లను నియమించుకుంటున్నాయి. నేతలు కూడా వ్యక్తిగత సోషల్ మీడియా టీంలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ కంటెంట్ క్రియేటర్లు రోజువారీగా వారికి ఇచ్చిన టార్గెట్ నియోజకవర్గ పరిధిలోని సమస్యలు, సదరు రాజకీయ పార్టీ లేదా పోటీలో ఉన్న నాయకుడి గురించిన సానుకూల అంశాలు.. ప్రత్యర్థి పార్టీ, అభ్యర్థుల బలహీనతలపై విమర్శలతో కంటెంట్ను రాసి ఇస్తూ ఉంటారు. కంటెంట్ ప్రమోషన్ అండ్ ట్రెండింగ్.. కంటెంట్ రైటర్ల ద్వారా తీసుకున్న అంశాలతో తయారు చేసిన కథనాలు, ఆడియోలు, వీడియోలు, ఫొటోలను టార్గెట్గా పెట్టుకున్న అసెంబ్లీ సెగ్మెంట్, జిల్లా లేదా రాష్ట్రం మొత్తంగా ఓటర్లకు వివిధ రకాల సోషల్ మీడియా వేదికల ద్వారా చేర్చడమే కంటెంట్ ప్రమోషన్. ఇందుకోసం కంటెంట్ ప్రమోటర్లు తొలుత ఆ రాజకీయపార్టీ, నేతల పేరిట ఫేస్బుక్, ట్విట్టర్ (ఎక్స్), ఇన్స్ట్రాగామ్, యూట్యూబ్ చానళ్లు, వాట్సాప్ గ్రూపులు, చానళ్లు వంటివి సృష్టిస్తారు. సోషల్ మీడియా సెంటిమెంట్ అనాలసిస్ సోషల్ మీడియా అనేది బయటికి కనిపించని డిజిటల్ ప్రపంచం. అందులో మనం పోస్ట్ చేస్తున్న, వైరల్ చేస్తున్న కంటెంట్ను, వీడియోలు, ఫొటోలు, సమాచారం, ఆడియో మెసేజ్లు ఎంత వరకు టార్గెట్ ఓటర్లకు చేరుతుంది. ఒకవేళ చేరకపోతే ఎందుకు చేరడం లేదు? టార్గెట్ ఓటర్ను ఆకర్షించేలా ప్రత్యర్థి పార్టీలు ఎలాంటి ప్రమోషన్ చేస్తున్నాయి? వాటిని కౌంటర్ చేయాలంటే ఎలాంటి మార్పులు చేసుకోవాలన్న అంశాలను విశ్లేషించడాన్నే స్థూలంగా సోషల్ మీడియా సెంటిమెంట్ అనాలసిస్గా చెప్పొచ్చు. దీని ఫీడ్బ్యాక్ను ఆధారంగా కంటెంట్లో ఎలాంటి మార్పులు చేయాలనేది కంటెంట్ రైటర్లకు సూచనలు చేస్తున్నారు. కేవలం సోషల్ మీడియాలో అంశాలనే కాకుండా క్షేత్రస్థాయిలో సర్వేలు చేసి ప్రజల నాడి తెలుసుకోవడం కూడా ఈ సోషల్ మీడియా సెంటిమెంట్ అనాలసిస్ టీమ్ల పనిగా చెప్పొచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సోషల్ మీడియాతో.. భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడటం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆన్లైన్ డిబేట్లు, సోషల్ మీడియాలో గట్టి ప్రచారంతో ఆయన ముందంజలో నిలుస్తున్నారని అక్కడి రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరింత ప్రభావం చూపనుందని అంచనా వేస్తున్నారు. హ్యాకింగ్ టీమ్లతో గుట్టు తెలుసుకుంటూ.. పలు రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీలు, నేతల వ్యూహాలను తెలుసుకోవడం కోసం సైబర్ హ్యాకింగ్ నిపుణుల సేవలనూ వాడుకుంటున్నారు. సోషల్ మీడియా పెనెట్రేటింగ్ టూల్స్ను వినియోగించి.. కీలక వివరాలు సేకరించి, తమకు అనుకూలంగా, ప్రత్యర్థులకు వ్యతిరేకంగా వినియోగిస్తున్నారు. ప్రచార ట్రెండ్ మారింది.. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను చేరేందుకు సోషల్ మీడియా అనేది రాజకీయ పార్టీలకు, నేతలకు అస్త్రంగా మారింది. ఓటర్లకు మన బలాన్ని చెప్పడంతోపాటు ఎదుటి వ్యక్తి బలహీనతలపై ఓటర్లను ఆలోచింపజేసేలా ఈ డిజిటల్ ప్రచారం ఉపయోగపడుతోంది. పార్టీలే కాదు అభ్యర్థులు సైతం సొంతంగా సోషల్ మీడియా ప్రచార టీమ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వాట్సాప్ చానల్.. నయా ట్రెండ్.. స్మార్ట్ఫోన్ ఉండి, ఇంటర్నెట్ వాడే ఉన్న ప్రతి ఒక్కరూ వాడుతున్న సోషల్ మీడియా యాప్ అంటే వాట్సాప్ అని టక్కున చెప్పేయొచ్చు. ఇందులో ఇటీవల జతచేసిన సరికొత్త చానల్ ఫీచర్ సైతం ఎన్నికల వేళ అభ్యర్థులకు, ఆయా పార్టీలకు బాగా ఉపయోగపడుతోంది. ఈ వాట్సాప్ చానల్ ట్రెండ్ బాగా పెరుగుతోంది. వాట్సాప్ చానల్లో సదరు పార్టీలు, నాయకులు తమ కంటెంట్ను వైరల్ చేస్తూ ఓటర్లకు చేరుతున్నారు. ఇది కూడాకంటెంట్ ప్రమోషన్గా చెప్పొచ్చు. ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్స్.. టిక్టాక్ వీడియోలు, హెల్త్, యోగా, ఫ్యాషన్ ఇలా పలు అంశాలపై సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఇన్ఫ్లూయెన్సర్ల (సోషల్ మీడియాలో ప్రభావవంతమైన వ్యక్తులు)కు డబ్బు చెల్లించి ఒప్పందం చేసుకోవడం ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మరో విధానం. మనం చెప్పదలచుకున్న అంశాలపై వీడియోలు, లింక్లు ఇస్తే.. వాటిని లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో వాటిని షేర్ చేస్తారు. ఇందులో ఇన్ఫ్లూయెన్సర్ల ఫాలోవర్స్కు సదరు రాజకీయ పార్టీ లేదా నేత కంటెంట్ను చేర్చుతున్నారు. ఒక్కో చోట..ఒక్కోలా.. ♦ ఫేస్బుక్లో పార్టీ లేదా నాయకుడి కంటెంట్, ఆడియోలు, వీడియోలు, ఫొటోలు ఓటర్లకు చేరాలనుకుంటే అధికారికంగానే ఫేస్బుక్ యాడ్ సెన్స్లో ప్రమోషన్కు కొంత డబ్బులు చెల్లిస్తే చాలు. స్పాన్సర్డ్ ప్రకటనలు వైరల్ అవుతాయి. ఇందుకోసం మనం ఇచ్చిన వివరాలతో ఫేస్బుక్ ఓ జియోఫెన్సింగ్ క్రియేట్ చేస్తుంది. దాని ఆధారంగా ఈ కంటెంట్ వెళ్లేలా చేస్తారు. ♦ గూగుల్ యాడ్ సెన్స్లోనూ డబ్బులు చెల్లిస్తే.. ఫేస్బుక్ లింక్, యూట్యూబ్ లింక్, ఇన్స్ట్రాగామ్ లింక్ అందులో షేర్ చేస్తారు. ఇలా కూడా కంటెంట్ ప్రమోషన్ చేస్తున్నారు. గూగుల్లోకి వెళ్లి సెర్చ్ చేయగానే మనం ప్రమోట్ చేయాలనుకున్న లింక్లు హైలెట్ అయ్యేలా చేయడమే గూగుల్ యాడ్ సెన్స్. -
ఎక్స్, యూట్యూబ్ & టెలిగ్రామ్లకు నోటీస్ - వాటిని వెంటనే తొలగించండి
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఇందులో ఎక్స్ (ట్విటర్), యూట్యూబ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నోటీసులు అందించడానికి కారణమేంటనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (చిన్న పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించినవి) ప్లాట్ఫామ్స్ నుంచి వెంటనే తీసివేయాలని హెచ్చరించింది. ఈ సందర్భంగా ఆయా ప్లాట్ఫారమ్లకు నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా భవిష్యత్తులో కంటెంట్ మోడరేషన్ అల్గారిథమ్లు, రిపోర్టింగ్ మెకానిజమ్స్ వంటి చురుకైన చర్యలను కూడా అమలు చేయాలని తెలిపింది. ఈ నియణామాన్ని పాటించకుంటే 2021 రూల్ 3(1)(బి) అండ్ రూల్ 4(4) ఉల్లంఘనగా పరిగణించబడుతుందని ప్రకటనలో తెలిపింది. దీనిని ఉల్లంఘిస్తే.. సెక్షన్ 79 ప్రకారం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇదీ చదవండి: అంబానీ కంపెనీతో ఏడీఏఐ డీల్.. వేలకోట్లు పెట్టుబడికి సిద్ధం! There will be ZERO #tolerance for criminal & #harmful content on Indian #Internet. #ITRules under the #ITAct clearly lays down the expectation from #Intermediaries: They cannot host #criminal & harmful content like #CSAM. If Intermediaries do not act swiftly to clean up such… pic.twitter.com/PRQ9VypbR6 — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) October 6, 2023 -
మేకప్ వీడియోలతో సూపర్ క్రేజ్..ఏకంగా 19M ఫాలోవర్స్
ఫ్యాషన్ అండ్ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్ యూట్యూబ్.. పేరు బ్రెట్మ్యాన్. ఫిలిప్పీన్స్లో పుట్టాడు, హానలూలూలో పెరిగాడు. అమెరికన్ సిటిజన్గా సెటిల్ అయ్యాడు. బ్రెట్మ్యాన్ అసలు పేరు Sacayanan Laforga. వాళ్ల నాన్నకు.. రెజ్లర్స్ బ్రెట్ ‘ద హిట్మన్’ హార్ట్, డ్వైన్ ‘ద రాక్’ జాన్సన్ అంటే చాలా ఇష్టమట. అందుకే కొడుకును.. ఆ ఇద్దరి పేర్లు కలిసొచ్చెటట్టు బ్రెట్మ్యాన్ రాక్ అని పిలవడం షురూ చేశాడట. ఒరిజినల్ పేరు కన్నా నాన్న పెట్టిన బ్రాట్మ్యాన్ రాకే మంచిగా ఉందని దానికే ఫిక్స్ అయ్యాడట కొడుకు. 2015లో మేకప్ టిప్స్ వీడియోస్తో సోషల్ మీడియాలతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ వీడియోస్లో కాండిడ్ హ్యూమర్ కామెంట్రీతో పాపులర్ అయ్యాడు. ఇన్నోవేటివ్ ఫ్యాషన్ సెన్స్కీ ఫేమస్ అయ్యాడు. ఇవన్నీ కలిసే బ్రెట్మ్యాన్ని యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ని చేశాయ్. అకార్డింగ్ టు ఆన్లైన్ సోర్స్ .. బ్రెట్మ్యాన్ రాక్కి ఇప్పుడు ఆల్మోస్ట్ 9 మిలియన్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, 18.5 మిలియన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అండ్ 15.1 మిలియన్ టిక్టాక్ ఫాలోవర్స్ ఉండటం విశేషం. View this post on Instagram A post shared by Bretman Rock (@bretmanrock) View this post on Instagram A post shared by Vogue Philippines (@voguephilippines) -
పెట్టుబడికి సోషల్ రూట్..?
ఇటీవలి స్టాక్ మార్కెట్ రికార్డుల ర్యాలీ కొత్త ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. డీమ్యాట్ ఖాతాల సంఖ్య 2023 జూలై నాటికి 12.3 కోట్లు దాటిపోయింది. 2020 మార్చి నాటికి ఉన్న 4 కోట్లతో పోలిస్తే మూడేళ్లలోనే మూడు రెట్లు పెరిగాయి. అంటే మార్కెట్లోకి కొత్త ఇన్వెస్టర్ల రాక ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. (టేబుల్–గడిచిన 12 నెలల్లో డీమ్యాట్ ఖాతాల తీరు). తమ పెట్టుబడులు అనతి కాలంలోనే భారీ రాబడులు ఇవ్వాలనే ఆకాంక్ష కొత్త ఇన్వెస్టర్లలో సహజంగానే కనిపిస్తుంటుంది. ఫలితంగా మలీ్టబ్యాగర్ల కోసం జల్లెడ పడుతుంటారు. గతంలో అయితే స్టాక్స్లో పెట్టుబడి కోసం కుటుంబ సభ్యులు, బంధు మిత్రులను విచారించే వారు. సోషల్ మీడియా వ్యాప్తితో నేటితరం ఇన్వెస్టర్ల ప్రపంచం మరింత విస్తృతం అయింది. ఎన్నో యూట్యూబ్, ఫేస్బుక్, టెలీగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలు తెరుచుకుంటున్నాయి. ఎంతో మంది నిపుణుల అవతారం ఎత్తుతున్నారు. ఫలానా స్టాక్స్ కొనుగోలు చేయాలనే టిప్స్కు ఆదరణ ఎక్కువగా కనిపిస్తోంది. అయినప్పటికీ పెట్టుబడులకు సంబంధించి కనీస ప్రాథమిక సూత్రాలను విస్మరించకూడదు. నియంత్రణల పరిధిలో లేని సామాజిక మాధ్యమ వేదికలపై చెప్పే సమాచారానికి, ఇచ్చే సలహాలకు జవాబుదారీ ఏది? ఏది నిజం, ఏది తప్పుదారి? తెలుసుకోవడం ఎలా? ఇది అవగాహనపైనే తెలుస్తుంది. ఈ దిశలో సాయపడేదే సోషల్ ఇన్వెస్టింగ్. ఆచరణ ముఖ్యం ఒకరి నుంచి నేర్చుకోవడం, ఆచరణలో పెట్టడం ఈ రెండు వేర్వేరు. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్లు ట్రేడింగ్, పెట్టుబడి గురించి తెలుసుకునేందుకు సాయపడతాయి. ‘‘ఇన్వెస్టర్కు ఒక ప్రణాళిక ఉండాలి. దానికి కట్టుబడి ఉండాలి. రిటైల్ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది తాము పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్స్ కంటే నేరుగా స్టాక్స్లో తక్కువ రాబడులు సంపాదిస్తున్నట్టు ఆ మధ్య నిర్వహించిన ఒక సర్వేలో తెలిసింది. దీనికి ఇన్వెస్టర్లు మార్కెట్లో అనుకూల సమయం కోసం వేచి చూసి, ఇన్వెస్ట్ చేయడం కారణం కావచ్చు. లేదంటే మ్యూచువల్ ఫండ్స్ను అనుకూలం కాని సమయంలో విక్రయించి, కొనుగోళ్లు చేస్తుండొచ్చు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టిన తర్వాత వార్తలు, ప్రతికూల విశ్లేషణలు చూసి చలించిపోకుండా, ఫండ్స్ మాదిరిగా స్థిరమైన వైఖరి అనుసరించాలి. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్లో తోటి ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియో చూసి పెట్టుబడులు పెట్టినట్టయితే.. మార్కెట్ల పతనాల్లో ఎంత స్థిరంగా, దృఢంగా ఉండగలరన్నది కీలకం అవుతుంది. ఆ సమయంలో భయపడి విక్రయించారంటే రాబడులు గణనీయంగా తగ్గిపోతాయి. నష్టాలూ ఎదురు చూడొచ్చు’’అని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దీపేశ్ రాఘవ్ వివరించారు. మార్గదర్శిగానే.. ఇన్వెస్టింగ్ వేదికలను మార్గదర్శిగానే చూడాలి. గుడ్డిగా అనుసరించడం సరికాదు. ఈ ప్లాట్ఫామ్ల ద్వారా తగినంత అవగాహన, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్న తర్వాత, విడిగా ప్రతీ ఇన్వెస్టర్ తన వైపు నుంచి లోతైన అధ్యయనం చేయాలి. ఆ తర్వాతే తనకు అనుకూలమైన పెట్టుబడుల వ్యూహాలను అనుసరించాలి. ఇతరులు కేవలం తమ అనుభవాన్ని పంచుతారే కానీ, జవాబుదారీగా ఉండరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్లు స్టాక్స్, ట్రేడింగ్ గురించి నేర్చుకునే వేదికలే. ఇన్వెస్టర్లు ఎవరికి వారే తమ వంతుగా పెట్టుబడుల లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఎవరో పోర్ట్ఫోలియో కాపీ చేసి ఇన్వెస్ట్ చేసిన తర్వాత, నష్టాలు వచ్చాయని పరిహారం డిమాండ్ చేయలేరు. గుడ్డిగా అనుసరించడం సరికాదు.. కొత్త ఇన్వెస్టర్లు ఉచిత లేదా చెల్లింపుల వేదికల ద్వారా స్టాక్స్లో పెట్టుబడులు, ట్రేడింగ్కు మొగ్గు చూపించే ముందు.. ఆయా వేదికలు తమ లక్ష్యాలు, రిస్క్, రాబడుల ఆకాంక్షలకు సరిపోయే వేనా? అన్నది ఒక్కసారి తరిచి చూసుకోవాలి. ‘‘తాము అనుసరించే తోటి ఇన్వెస్టర్ల ప్రొఫైల్ను జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే వారు ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు. వారి పోర్ట్ఫోలియో తీవ్ర అస్థిరతలతో కూడుకుని ఉండొచ్చు. ‘‘ప్రతి వ్యక్తి లక్ష్యాలు, అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. మీ స్నేహితులు లేదా ఇతరులు వారి కోణం నుంచి సాధారణ సూచనలు ఇవ్వొచ్చు. అది విడిగా ప్రతి ఇన్వెస్టర్కు అనుకూలమైనదని చెప్పలేం. మీ ప్రస్తుత పోర్ట్ఫోలియో, భవిష్యత్ నగదు అవసరాలు, రిస్క్ సామర్థ్యం ఇలాంటివి ఏవీ ఎదుటి వారికి తెలియవు’’అని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ పారుల్ మహేశ్వరి పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టే ముందు పోర్ట్ఫోలియోను ఒక్కసారి పరిశీలించుకోవాలని సూచించారు. తమకు సరిపోలని ఉత్పత్తులు, సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ట్రేడింగ్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్టింగ్లో రిస్క్ తక్కువ. ఈ రెండింటిలో తమకు ఏది అనుకూలమో ఇన్వెస్టర్లే తేల్చుకోవాలి. సోషల్ ఇన్వెస్టింగ్ అంటే..? ఎన్నో తరాల నుంచి ఇది ఉన్నదే సోషల్ ఇన్వెస్టింగ్ (ఇన్వెస్టర్ల సమూహం/సమాజం). గతంలో స్నేహితులు, కుటుంబ సభ్యుల వరకే ఇది పరిమితం. ఇప్పుడు టెక్నాలజీ ఫలితంగా మరింత పెద్దదిగా అవతరించింది. ట్రేడర్లు, ప్రపంచవ్యాప్త నిపుణులు, ఇన్వెస్టర్లు ఇందులో భాగమవుతున్నారు. సోషల్ ఇన్వెస్టింగ్ యాప్స్, ప్లాట్ఫామ్లు ఇప్పుడు ప్రత్యేకంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఏవి అసలైనవో, ఏవి నకిలీవో గుర్తించేందుకు ఇవి దారి చూపిస్తున్నాయి. సీనియర్ ట్రేడర్లు, తమ మాదిరే ఆకాంక్షలతో కూడిన ఇన్వెస్టర్లతో చాట్, సంప్రదింపులకు ఇవి వేదికలుగా నిలుస్తున్నాయి. ట్రేడింగ్, పెట్టుబడులకు సంబంధించిన విజ్ఞానం పంచుకునేందుకు వారధిగా పనిచేస్తున్నాయి. అనుభవజు్ఞలైన ట్రేడర్ల పోస్ట్లు, పోర్ట్ఫోలియోను వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు తాజా సమాచారానికితోడు, పెట్టుబడుల సలహాలు కూడా వీటిపై అందుకోవచ్చు. యూఎస్, యూరప్లో అయితే ఇన్వెస్టర్లు, నిపుణుల ట్రేడ్ పోర్ట్ఫోలియోను ఇతరులు కాపీ చేసుకోవచ్చు. అమెరికాకు చెందిన ఈటోరో కూడా ప్రముఖ సోషల్ ఇన్వెస్టింగ్ పోర్టల్. ధ్రువీకరించిన ట్రేడర్ల పోర్ట్ఫోలియోలను ఈ వేదికపై పరిశీలించొచ్చు. కానీ, మన దేశంలో ఇంకా ఈ విధమైన అవకాశం అందుబాటులోకి రాలేదు. మన దగ్గర సోషల్ ఇన్వెస్టింగ్ అన్నది ఒక చిన్న ఇన్వెస్టర్ల సమూహంగానే ప్రస్తుతం ఉంది. ‘‘సోషల్ ఇన్వెస్టింగ్ అన్నది విస్తృతమైన పదం. ఒక ఉమ్మడి వేదికగా వ్యక్తుల మధ్య సంప్రదింపులకు వీలు కలి్పంచేది. స్టాక్ ఫండమెంటల్స్ (ఆర్థిక మూలాలు), కంపెనీ లాభ, నష్టాల నివేదిక విశ్లేషణ, కీలక రేషియోలు, సాంకేతిక సూచికలు, మార్కెట్ ధోరణులపై సంప్రదింపులకు అవకాశం కలి్పస్తుంది. ఇన్వెస్టర్లు తాము అనుసరించే ట్రేడింగ్ విధానాలు, పోర్ట్ఫోలియోను వీటిపై ఇతరులతో పంచుకుంటారు’’అని స్మాల్కేస్ సీఈవో వసంత్ కామత్ తెలిపారు. నేర్చుకునే మార్గం.. ‘‘కరోనా సమయంలో మార్కెట్లు కనిష్ట స్థాయిలను చవిచూశాయి. దాంతో అవి ఆకర్షణీయంగా మారాయి. సెబీ కేవైసీ నిబంధనలను సరళతరం చేసింది. దీంతో ఆన్లైన్లోనే వేగంగా ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడింది. దీనికితోడు యువ జనాభా ఎక్కువ మంది ఇంటికి పరిమితం కావడం పెద్ద ఎత్తున డీమ్యాట్ ఖాతాల ప్రారంభానికి దారితీసింది’’అని ప్రభుదాస్ లీలాధర్ రిటైల్ బ్రోకింగ్ సీఈవో సందీప్ రాయ్చురా తెలిపారు. ముంబైకి చెందిన ఉత్కర్‡్ష (32) కూడా కరోనా సమయంలో మార్కెట్లోకి ప్రవేశించిన వారిలో ఒకరు. సహజంగా వ్యాపారవేత్త అయిన ఆయన ఇప్పుడు స్టాక్స్లో చురుగ్గా ట్రేడింగ్ చేస్తున్నారు. తొలుత మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులకు డీమ్యాట్ ఖాతాను ఉపయోగించుకున్నారు. స్టాక్స్లో ట్రేడింగ్ చేయాలని 2021 మార్చిలో ఆయన నిర్ణయించుకున్నారు. కానీ ఇందుకు సంబంధించిన సమాచారం ఎలా తెలుసుకోవాలో ఆయనకు తోచలేదు. ఆ సమయంలో మలీ్టబ్యాగర్లు అంటూ పెన్నీ స్టాక్స్ గురించి యూట్యూబ్ చానళ్లు, ట్విట్టర్ పోస్ట్లలో టిప్స్ కనిపించేవి. అయినా సరే వాటి ట్రాప్లో ఆయన పడిపోలేదు. గడిచిన రెండేళ్ల కాలంలో ఈ తరహా అనధికారిక, రిజిస్ట్రేషన్ లేని అడ్వైజర్లు, సామాజిక మాధ్యమ వేదికల అణచివేతకు సెబీ కఠిన చర్యలు తీసుకోవడం గమనించొచ్చు. ఉత్కర్‡్ష స్వతహాగా కొంత అవగాహన కలిగి ఉండడంతో విశ్వసనీయత లేని ఇలాంటి బూటకపు చానళ్ల బారిన పడకుండా, సోషల్ ఇన్వెస్టింగ్ ఫోరమ్లలో చేరాడు. అన్నీ కాదు కానీ, కొన్ని ఉపయోగకరమైనవి అని కొంత కాలానికి ఆయనకు అర్థమైంది. కొందరు అనుభవం కలిగిన స్టాక్ ట్రేడర్లు స్టాక్స్, ఫండ్స్, పెట్టుబడి సూత్రాల గురించి చెప్పడం తనకు నిజంగా సాయపడినట్టు ఉత్కర్‡్ష వెల్లడించారు. వీటి సాయంతో ట్రేడింగ్పై అవగాహన మరింత పెరిగింది. ఇప్పటికీ ఈ సామాజిక మాధ్యమ ఫోరమ్ల సాయంతో స్టాక్స్ ట్రెండ్స్ గురించి ఆయన తెలుసుకుంటూనే ఉంటారు. సోషల్ ఇన్వెస్టింగ్ అంటే ఇదే. ‘‘మార్కెట్లోని సీనియర్, అనుభవజ్ఞులైన ట్రేడర్ల నుంచి కొత్త ఇన్వెస్టర్లు, ట్రేడర్లు నేర్చుకునే వేదికగానే సోషల్ ఇన్వెస్టింగ్ను చూడాలి. మరొకరిని కాపీ కొట్టడం కాకుండా.. స్టాక్ పరిశోధన, వార్తలు, ట్రేడింగ్ విధానాలను రూపొందించుకోవడానికి మార్గంగా నిలుస్తుంది’’అని స్మాల్కేస్ వసంత్ కామత్ వివరించారు. ఒక్క ఉత్కర్‡్ష అనే కాదు లక్షలాది మందికి నేడు ఇలాంటి సామాజిక మాధ్యమ వేదికలు ఇన్వెస్టింగ్కు మెరుగైన దారి చూపిస్తున్నాయనడంలో సందేహం లేదు. కాకపోతే నిజమైన–మోసపూరిత వేదికల మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలి. సామాజిక మాధ్యమ వేదికలు ఇప్పుడు పోస్ట్లకు వచ్చే వ్యూస్ ఆధారంగా, ప్రకటనల ఆదాయాన్ని యూజర్లతో పంచుకుంటున్నాయి. దీంతో సీనియర్ ట్రేడర్లు తమ అనుభవాన్ని, ట్రేడింగ్, పెట్టుబడి విధానాలను తోటి యూజర్లతో పంచుకోవడం వల్ల వారికి అదొక ఆదాయ వనరుగానూ మారుతోంది. దీంతో కొత్త ఇన్వెస్టర్లు నేర్చుకునే అవకాశాలు, వేదికలు పెరిగాయి. -
వీడియోలు చూడటానికి ఇదే ఫేవరెట్!
న్యూఢిల్లీ: దేశీయంగా ఆన్లైన్లో వీడియోల వీక్షణకు ఎక్కువ మంది యూట్యూబ్ను ఎంచుకుంటున్నారు. ప్రతి అయిదుగురిలో నలుగురు తమ ప్లాట్ఫామ్వైపు మొగ్గు చూపుతున్నట్లు యూట్యూబ్ ఒక ప్రకటనలో తెలిపింది. యూట్యూబ్ను ఇంటర్నెట్ ఆధారిత టీవీల్లో చూసే వారి సంఖ్య గణనీయంగా ఉంటోందని తెలిపింది. అలాగే యూట్యూబ్ షార్ట్స్ (తక్కువ నిడివి ఉండే వీడియోలు) సగటు రోజువారీ వీక్షణలు 120 శాతం మేర పెరిగినట్లు సంస్థ తెలిపింది. షార్ట్స్ వీక్షకుల్లో 96 శాతం మంది .. 18–44 ఏళ్ల వయస్సు మధ్య వారు ఉంటున్నారని పేర్కొంది. కంటెంట్ అప్లోడ్స్ 40 శాతం పెరిగినట్లు యూట్యూబ్ వివరించింది. -
యూట్యూబర్లకు గుడ్ న్యూస్: సుందర్ పిచాయ్ ప్లాన్ అదిరిపోయిందిగా!
AI-Powered Video Editing App గూగుల్ యాజమాన్యంలోని ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ (YouTube) వీడియో క్రియేటర్లకు తీపి కబురు అందించింది. తాజాగా యూట్యూబ్ క్రియేట్ (YouTube Create) యాప్ లాంచ్ చేసేంది. అలాగే ఆధునిక టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఎంటిలిజెన్స్ (AI)కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో యూట్యూబ్ క్రియేటర్లు వీడియోలను సులువుగా రూపొందించుకునేలా కొత్త యాప్ను తీసు కొస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని గూగుల్మాతృ సంస్థ అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ఎక్స్ (ట్విటర్)లోప్రకటించారు. AI పవర్డ్ టెక్నాలజీ రంగంలో తన మార్గ-బ్రేకింగ్ ఆవిష్కరణను వెల్లడించింది గూగుల్. Just announced at today’s #MadeOnYouTube event: Dream Screen lets creators type in an idea to produce an AI-generated video or image background, and creators can use YouTube Create to make video production much easier. https://t.co/mXxStE83N9 — Sundar Pichai (@sundarpichai) September 21, 2023 transport yourself to places you could only imagine - from a popcorn volcano to a jellybean beach 🤯 Dream Screen AI-generated backgrounds enter the chat in 2024. pic.twitter.com/11DXy6olYi — YouTube (@YouTube) September 21, 2023 వీడియో క్రియేట్లో ప్రెసిషన్ ఎడిటింగ్ , ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ వాయిస్ఓవర్, క్యాప్షనింగ్ ,ట్రాన్సిషన్స్ వంటి ఫీచర్లు ఉంటాయని కంపెనీ బ్లాగ్ పోస్ట్లో తెలిపింది. చాట్ బాక్స్లో మనం అనుకున్నది టైప్ చేయడం ద్వారా రి వీడియోలకు AI- రూపొందించిన వీడియో లేదా చిత్రాన్ని జోడించేలా 'డ్రీమ్ స్క్రీన్' అనే కొత్త ఫీచర్ను టెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఉదాహరణకు, వినియోగదారులు "నేను పారిస్లో ఉండాలనుకుంటున్నాను" అని టైప్ చేస్తే దానికి సంబంధించి వీడియో లేదా చిత్రాన్ని వస్తుంది. ట్రెండింగ్ టాపిక్లు, ప్రేక్షకుల ప్రాధాన్యతల ఆధారంగా వీడియోల కోసం టాపిక్ ఐడియాలు, అవుట్లైన్లను రూపొందించడంలో సాయపడుతుంది. ఈ కొత్త యాప్ ప్రతి ఒక్కరికీ వీడియో ప్రొడక్షన్ను సులభతరం చేయడం, ముఖ్యంగా ఫస్ట్టైం యూట్యూబ్ వీడియోలు చేస్తున్నవారికి మరింత అందుబాటులో ఉండేలా చేయడమే తమ లక్ష్యమని యూట్యూబ్ కమ్యూనిటీ ప్రోడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ టోనీ తెలిపారు. ఈ ఫిచర్ షార్ట్-ఫారమ్ వీడియోల కోసం మాత్రమే కాకుండా, YouTubeలో లాంగ్ ఫామ్ కంటెంట్ సృష్టికి కూడా సమానంగా సపోర్ట్ చేస్తుందని ఆయన వెల్లడించారు. తద్వారా చిన్న వీడియోలు లేదా రీల్స్ విషయంలో యూత్ మనసు దోచుకున్న టిక్టాక్, ఇన్స్టాలోని యాప్లతో YouTube క్రియేట్ పోటీ పడనుంది. ప్రస్తుతానికి ఇది ఎంపిక చేసిన దేశాల్లో యాప్ ఆండ్రాయిడ్లో బీటా మోడ్లో తొలుత భారత్, అమెరికా,యూకె, జర్మనీ, ఫ్రాన్స్, ఇండోనేషియా, సింగపూర్, కొరియాలోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. -
మీ పిల్లలు సైన్స్ అంటే భయపడుతున్నారా? ఈమె పాఠాలు వినిపించండి..
‘సరిగా అర్థం చేసుకోవడం నుంచే ప్రతిభకు బీజాలు పడతాయి’ అంటారు. ‘నాకు అర్థం కాలేదు’ అన్నంత మాత్రాన ఆ స్టూడెంట్ తెలివి తక్కువ అని కాదు. ఒక సబ్జెక్ట్ అర్థం కాకపోవడానికి, అవడానికి మధ్య ఏదో గ్యాప్ ఉండి ఉండవచ్చు. ఆ ఖాళీని పూరించగలిగితే అద్భుత ఫలితాలు సాధించవచ్చని ‘స్టెమాన్స్టర్’ద్వారా నిరూపించింది బెంగళూరుకు చెందిన సైంటిస్ట్ సోనాలి గుప్తా... ఆరోజు స్కూలు నుంచి వచ్చిన శ్రిష్టి తల్లి సోనాలిని ఒక డౌట్ అడిగింది.‘లోహంతో తయారు చేసిన ఓడ నీటిలో ఎలా తేలుతుంది?’నాల్గవ తరగతి చదువుతున్న శ్రిష్టి ఇలాంటి సందేహాలెన్నో తల్లిని అడుగుతుంటుంది. అప్పటికప్పుడు జవాబు చెప్పి చిన్నారి సందేహాన్ని తీరుస్తుంటుంది సోనాలి. ఇంట్లో శ్రిష్టి కోసం ఒక ల్యాబ్ను కూడా ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్ను పరిశీలించడం ద్వారా శ్రిష్టిలో శాస్త్రీయ విషయాలపై ఆసక్తి పెంచాలనేది సోనాలి కోరిక. ఫిజిక్స్లో పీహెచ్డీ చేసిన సోనాలికి కూతురు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం అత్యంత సులువైన పని. మరి శాస్త్రీయ విషయాలపై అవగాహన లేని తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? ఓడకు సంబంధించిన కుమార్తె సందేహాన్ని ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతోనే చెప్పింది సోనాలి. తాను అలా చెప్పడం వల్ల శ్రిష్టికి సులభంగా అర్థమైంది. ఇదే విధానంలో ఇతర పిల్లలకు చెబితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన లాక్డౌన్ టైమ్లో పట్టాలకెక్కింది. ‘అది నా జీవితంలో చెప్పుకోదగిన ముఖ్య సందర్భం’ అంటుంది సోనాలి. ‘లెర్నింగ్ బై డూయింగ్’ అనే నినాదంతో పిల్లలకు శాస్త్రీయ విషయాలపై అవగాహన పెంచడానికి హ్యాండ్స్–ఆన్ లెర్నింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ‘స్టెమాన్స్టర్’కు శ్రీకారం చుట్టింది. రకరకాల సందేహాలను తీర్చేలా వాట్సాప్ వేదికగా ఎన్నో వీడియోలు చేసింది. సంప్రదాయ బోధన ఎలా మెరుగుపడాలో చెబుతున్నట్లుగా ఉండేవి ఆ వీడియోలు. పరిచితులు, అపరిచితులు, మిత్రుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ‘మీ వీడియోలు అంటే మా పిల్లలకు ఎంతో ఇష్టం’ అని ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు చెప్పినప్పుడల్లా సోనాలికి ఉత్సాహంగా ఉండేది. ‘చాలా స్కూళ్లలో సైన్స్ అనేది సూత్రాలు, నిర్వచనాల పరిధి దాటి బయటికి రాదు. నిర్వచనాలు నిర్వచనాలలాగే చెప్పడం వల్ల అందరు పిల్లలకు అర్థం కాకపోవచ్చు. అందుకే అందరికీ అర్థమయ్యేలా ప్రాక్టికల్గా చెప్పాలి. ప్రపంచంలో గొప్ప ల్యాబ్స్ అని చెప్పుకోదగ్గ ఎన్నో ల్యాబ్స్లో పనిచేశాను. ఎందరో పిల్లలు ఆ ల్యాబ్స్లో కనిపించేవారు. పిల్లలకు సైన్స్పై ఆసక్తి అక్కడినుంచే మొదలవుతుంది’ అంటుంది సోనాలి. ‘స్టెమాన్స్టర్’ ద్వారా సైన్స్, గణితానికి సంబంధించి జటిలమైన కాన్సెప్ట్ల గురించి పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా వివిధ రకాల వస్తువులను ఉపయోగించి చెబుతున్నారు. ఎనిమిది నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని వీటిని రూపొందించారు. ‘పిల్లలు నా నుంచి మాత్రమే కాదు ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటున్నారు’ నవ్వుతూ అంటుంది సోనాలి. అయిదవ తరగతి చదువుతున్న ఆర్యన్ కేజ్రీవాల్కు సౌరవ్యవస్థ అనేది ఆసక్తికరమైన సబ్జెక్ట్. ‘స్టెమాన్స్టర్’ ΄ప్లాట్ఫామ్ ద్వారా తనకు ఇష్టమైన సబ్జెక్ట్కు సంబంధించి ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాడు. ‘నేను ఒరిగామి స్టార్స్ తయారు చేస్తాను. వాటి ద్వారా ఎన్నో సైన్స్ విషయాలు ఫ్రెండ్స్కు చెబుతుంటాను’ అంటాడు ఆర్యన్. ‘మా అబ్బాయిలో ఎంత మార్పు వచ్చిందంటే ఇప్పుడు మ్యాథ్స్, సైన్స్ వాడి ఫేవరెట్ సబ్జెక్ట్లు’ అంటుంది ఆనందంగా ఆర్యన్ తల్లి ఆంచల్. ప్రశ్న–జవాబుల నుంచి వర్క్షాప్ల వరకు ‘స్టెమాన్స్టర్’ ద్వారా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘ఆస్క్, డూ, లెర్న్, రిపీట్’ అంటూ పిల్లలకు దగ్గరవుతోంది స్టెమోన్స్టర్.