-
ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీ, ఎన్కౌంటర్లే: సీఎం కేసీఆర్
సాక్షి, వరంగల్: తెలంగాణలో ఎన్నికల ప్రచార ఘట్టం చివరి దశకు చేరుకుంది. నేటితో ప్రచారానికి తెర పడనుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. నేడు వరంగల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్పై మండిపడ్డారు. వరంగల్ బీఆర్ఎస్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్గా ఉంది. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను మీరు బేరీజు వేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలకు వరంగల్ వేదికగా నిలిచింది. రాయి ఏదో, రత్నం ఏదో గుర్తించి ఓటు వేస్తే మంచి జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ, ఎన్కౌంటర్లే. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలే. తెలంగాణ ప్రజలను గోస పెట్టించుకున్నారు. 1956లో ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీనే. చాలా రాష్ట్రాలు మద్దతిచ్చాక తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేస్తే తెలంగాణ ప్రకటన చేశారు. కాంగ్రెస్ హయాంలో వరంగల్ సిటీకి ఎన్నిరోజులకు ఒక్కసారి నీళ్లు వస్తుండేవి. 50 కాంగ్రెస్ పాలనలో ఒరిగిందేమీ లేదు. తెలంగాణ ప్రజల హక్కులు కాపాడటం కోసమే బీఆర్ఎస్ పనిచేసింది. ఎన్నికల ప్రచారంలో ఇది నా 95వ సభ. తెలంగాణలో విద్య, వైద్య రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చాం. వరంగల్ అభివృద్ధి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. హెల్త్ యూనివర్సిటీని స్థాపించుకున్నాం. వరంగల్కు ఎన్నో పరిశ్రమలు రాబోతున్నాయి. బీసీలకు సీట్లు ఇచ్చిన ప్రతీ చోటా అందరూ ఏకమై వారిని భారీ మెజార్టీతో గెలిపించాలి అని కామెంట్స్ చేశారు. -
వరంగల్ లో డబ్బులు ఉన్న కారులో మంటలు
-
ఎన్నికల సిత్రం.. కారు ఇంజిన్లో డబ్బు తరలిస్తుండగా..
సాక్షి, వరంగల్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు దాదాపు రూ.650 కోట్లకు పైగానే నగదును పోలీసులు పట్టుకున్నారు. ఇక, తాజాగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అయితే, కారు ఇంజిన్ డబ్బులు తరలిస్తుండగా హీట్ కారణంగా కరెన్సీ నోట్లు కాలిపోయి.. కారు నుంచి మంటలు, పొగ బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. ఎన్నికలవేళ వరంగల్ జిల్లాలో అక్రమంగా ఓ కారులో తరలిస్తున్న డబ్బు అగ్నికి ఆహుతి అయింది. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారు ముందు భాగంలో(ఇంజిన్ వద్ద) డబ్బులను అమర్చారు. అనంతరం, వరంగల్ నుంచి వర్ధన్నపేట వైపు వెళ్తుండగా బొల్లికుంట క్రాస్ రోడ్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో, దట్టమైన పొగలు రావడంతో కారు అక్కడికక్కడే నిలిపివేసి డ్రైవర్ పరారయ్యాడు. అనంతరం, ఓ వ్యక్తి మరో కారులో వచ్చి కాలిపోతున్న నోట్ల కట్టలను మరో కారులో వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక, కారులో ఉన్న డబ్బు సుమారు 30 నుంచి 50 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా సినీ ఫక్కిలో జరిగినట్టు క్షణాల్లో జరిగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలంలోకి చేరుకున్న పోలీసులు కారు ఎవరది? డబ్బు ఎక్కడికి తరలిస్తున్నారన్న కోణంలో విచారణ చేపట్టినట్టు వరంగల్ ఈస్ట్ జోన్ డీసీసీ రవీందర్ తెలిపారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో బీఆర్ఎస్ హాట్రిక్.. తేల్చిన మరో సర్వే -
బీఆర్ఎస్కు వీఆర్ఎస్
2జీ, 3జీ, 4జీ పార్టీల నుంచి విముక్తి కల్పించాలి బీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే. అవి 2జీ, 3జీ, 4జీగా కుటుంబ పార్టీలుగా కొనసాగుతున్నాయి. కేసీఆర్, కేటీఆర్ పార్టీ రెండు తరాల 2జీ.. ఓవైసీ పార్టీ మూడు తరాల 3జీ. కాంగ్రెస్ పార్టీ 4జీ.. నెహ్రూ, ఇందిర, రాజీవ్, ఇప్పుడు రాహుల్గాంధీ. ఈ 2జీ, 3జీ, 4జీ పార్టీల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలి. చందమామపైకి చంద్రయాన్ను తీసుకెళ్లిన మోదీకి అవకాశం ఇవ్వాలి. అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపుతాం బీఆర్ఎస్ సర్కారు తెలంగాణను అక్రమాలు, ఆక్రమణలు, కుంభకోణాల రాష్ట్రంగా తయారు చేసింది. బీఆర్ఎస్ అంటేనే భ్రష్టాచార్ రాష్ట్ర సమితి. మియాపూర్ భూముల్లో రూ.4 వేల కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డులో రూ.3,300 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.40 వేల కోట్ల అవినీతి జరిగింది. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి, కుంభకోణాలపై విచారణ జరిపి జైలుకు పంపడం ఖాయం. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి, వరంగల్: తెలంగాణలోని బీఆర్ఎస్ సర్కారు దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆరోపించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేవని.. బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చిందని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపుతామని పేర్కొన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేసి.. వాటిని బీసీ, ఎస్టీ, ఎస్సీలకు పంచుతామని ప్రకటించారు. బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. శనివారం ఉమ్మడి పాలమూరులోని గద్వాల, నల్లగొండ జిల్లా కేంద్రం, వరంగల్లలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభల్లో అమిత్షా ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేసీఆర్ అబద్ధాలతో ప్రపంచ రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చినా.. ఇచ్చిన హామీ మేరకు దళితుడిని సీఎం చేయలేదు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ నేడు రూ.3 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మారింది. దళితబంధు పథకం పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లబ్ధిదారుల వద్ద రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేశారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే డబుల్ ఇంజన్ ప్రభుత్వం కావాలా, కేసీఆర్ మోసపూరిత అబద్ధాలు కావాలా అనేది ప్రజలు ఆలోచించాలి. కమలం గుర్తుపై బటన్ నొక్కి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి. బీజేపీ గెలిస్తే బీసీనే సీఎం తెలంగాణలో 52 శాతం ఓబీసీలే. 135 బీసీ ఉపకులాలు ఉన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీ వ్యతిరేక పార్టీలు. అవి బీసీలకు టికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేశాయి. బీసీల గురించి ఆలోచించే బీజేపీ ఎక్కువ మంది బీసీలకు టికెట్లు ఇచ్చింది. రాష్ట్రంలో తన కుమారుడిని సీఎం చేయాలని కేసీఆర్ చూస్తుంటే.. కేంద్రంలో తన కుమారుడిని ప్రధానిని చేయాలని సోనియా గాంధీ ప్రయత్నిస్తున్నారు. అదే బీజేపీ అధికారంలోకి వస్తే మా బిడ్డలో, కొడుకులో, బంధువులో సీఎం, ప్రధాని కారు. ప్రధాని మోదీ ప్రకటించినట్టుగా తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీనే సీఎం చేస్తాం. తెలంగాణ బడ్జెట్లో బీఆర్ఎస్ సర్కారు ఎంబీసీల కోసం రూ.3,300 కోట్లు కేటాయించి.. రూ.77 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కేంద్రంలోని ప్రధాని మోదీ కేబినెట్లో 27మంది బీసీ మంత్రులు ఉన్నారు. ప్రధాని మోదీ కూడా బీసీయే. ఈ ఘనత బీజేపీకే దక్కుతుంది. జాతీయ బీసీ కమిషన్కు సర్వాధికారాలు ఇచ్చాం. సవరణ చేయడానికి రాష్ట్రాలకు హక్కు కల్పించాం. జాతీయ స్థాయిలో జరిగే ఎంబీబీఎస్ పరీక్షల్లో బీసీలకు 27శాతం రిజర్వేషన్ ఇచి్చన ఘనత బీజేపీదే. పేపర్ లీకేజీలతో యువత జీవితాలు నాశనం బీఆర్ఎస్ సర్కారు టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీలతో యువత జీవితాలను నాశనం చేసింది. పేపర్ లీకేజీల వల్ల ప్రవళిక, రహ్మత్ల ఆత్మహత్య చేసుకున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో పారదర్శకంగా 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఉచితంగా రామమందిర దర్శనం చేయిస్తాం కాంగ్రెస్ 70 ఏళ్లుగా అయోధ్య రామమందిర నిర్మాణ విషయాన్ని వివాదాస్పదం చేసింది. కానీ మోదీ రామమందిర నిర్మాణాన్ని చేపట్టారు. వచ్చే ఏడాది జనవరి 22న మందిరాన్ని ప్రారంభిస్తాం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా రామమందిర దర్శనం చేయిస్తాం..’’ అని అమిత్షా ప్రకటించారు. ఈ సభల్లో సీనియర్ నేతలు కె.లక్ష్మణ్, గంగిడి మనోహర్రెడ్డి, ఎరబ్రెల్లి ప్రదీప్రావు, రావు పద్మ, డాక్టర్ కాళీప్రసాద్, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లకు గుణపాఠం చెప్పాలి: డీకే అరుణ ప్రధాని మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ.. ప్రపంచ దేశాల్లో సగర్వంగా తలెత్తుకునేలా చేసిన గొప్ప నాయకుడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని, బీఆర్ఎస్ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం అన్ని వర్గాలను మోసం చేసి, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. మరోవైపు అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలకు గుణపాఠం చెబితేనే తెలంగాణకు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. కారు స్టీరింగ్ ఒవైసీల చేతుల్లో.. నిజాం పాలన నుంచి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ తెలంగాణకు స్వేచ్ఛ ప్రసాదిస్తే.. సీఎం కేసీఆర్ ఒవైíసీకి లొంగిపోయి విమోచన దినోత్సవం చేయడం లేదు. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని రాష్ట్ర అవతరణ దినంగా నిర్వహిస్తాం. బీఆర్ఎస్ గుర్తు కారు అయినా.. దాని స్టీరింగ్ ఒవైసి చేతుల్లో ఉంది. ముస్లింలను సంతోషపెట్టేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. భద్రాచలంలో రాములవారికి సీఎం పట్టువ్రస్తాలు సమర్పించే ఆనవాయితీని మరిచిపోయారు. రాజ్యాంగ విరుద్ధంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు. బీజేపీ వస్తే వాటిని రద్దు చేసి ఓబీసీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతాం. వాల్మికుల సమస్యలను కేసీఆర్ కేంద్రం దృష్టికి తీసుకురాలేదు. తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే వారి సమస్యను పరిష్కరిస్తాం. తెలంగాణ అభివృద్ధికి ఐదు లక్షల కోట్లు రెండు తెలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలోని యూపీఏ సర్కారు ఉమ్మడి ఏపీకి రూ.2లక్షల కోట్లు ఇస్తే.. తర్వాతి తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే రూ.2.5 లక్షల కోట్లు ఇచ్చింది. తెలంగాణలో హైవేల అభివృద్ధికి, సమ్మక్క–సారలమ్మ జాతర, గిరిజన యూనివర్సిటీ, ఎయిర్పోర్టు, వందేభారత్ రైళ్లు, రైల్వేస్టేషన్లలతోపాటు ఇతర అభివృద్ధి పనులు కలిపితే రూ.ఐదు లక్షల కోట్లు ఇచ్చాం. కేసీఆర్ ప్రభుత్వం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఎలుకలు కొరికి చిన్నారులు చనిపోయిన ఘటనలు జరగడం విచారకరం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంజీఎంలో మౌలిక వసతుల కల్పనకు, అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం. -
బీఆర్ఎస్ అంటే అవినీతి, అక్రమాలు: అమిత్ షా
-
బీజేపీ గాలిని వాళ్లే తీసుకున్నారు : రాహుల్ గాంధీ
సాక్షి,వరంగల్ : తెలంగాణ ఇస్తే పేదలకు మంచి జరుగుతుందని భావించామని, అయితే వారికి ఎలాంటి మేలు జరగలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో జరిగిన కార్నర్ మీటింగ్లో రాహుల్ గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్ గెలవగానే రాష్ట్రంలో కులగణన చేపడతామన్నారు. కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు పెంచిందని విమర్శించారు. ప్రజలను విభజించి రాజకీయ లబ్ధి పొందాలనేది బీజేపీ కుట్ర అని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని రాహుల్ ఆరోపించారు. బీజేపీ బండిలో గాలిని ఆ పార్టీయే తీసుకుందని ఎద్దేవా చేశారు. ‘ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల బ్యాంకు ఖాతాలో ప్రతి నెల రూ.2,500 వేస్తాం. రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తాం. విద్యార్థుల చదువు, కోచింగ్ కోసం యువ వికాసం కింద రూ.5 లక్షలు ఇస్తాం. చేయూత పథకం కింద వృద్ధులు, వితంతువులకు ప్రతి నెల రూ.4 వేలు ఇస్తాం. కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు మాత్రమే మేలు చేస్తారు. ప్రధాని మోదీ ధనికులైన తన స్నేహితులకు మాత్రమే మేలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం పేదలను గుర్తించి ప్రతి ఒక్కరికి మేలు చేస్తుంది’ అని రాహుల్ తెలిపారు. ఇదీచదవండి..కేసీఆర్ ఇక అక్కడే ఉండిపోతారు: ఖర్గే -
పల్లె కుసుమం.. బెంగుళూరు డీఆర్డీఏలో శాస్త్రవేత్తగా కొలువు
సాక్షి, వరంగల్: కృషి, పట్టుదల ఉంటే పేదరికం అడ్డు కాదని ఓ యువతి నిరూపించింది. నిరుపేద చేనేత కార్మికుడి కూతురు బెంగుళూరు డీఆర్డీఏలో శాస్త్రవేత్తగా కొలువు సంపాదించి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆ యువతి తండ్రి సంరక్షణలో పెరిగి ఇంతటి ఘన కీర్తిని సొంతం చేసుకున్న ఆ పల్లె కుసుమం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన వనం ఉమాదేవి-సదా నందం దంపతుల కూతురే ఈ రాజ్యలక్ష్మి. సదా నందం దంపతులకు ఇద్దరు సంతానంలో రాజ్యలక్ష్మి పెద్దది.. తల్లి ఉమాదేవి 2004లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అప్పటి నుంచి తండ్రి సదానందం పిల్లలకు అన్నీతానై అల్లారు ముద్దుగా పెంచాడు. చేనేత కార్మికుడిగా వచ్చేది చాలీచాలని సంపాదనే అయినా పిల్లల చదువు విషయంలో రాజీ పడలేదు. ఇల్లందలోనే ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి దాకా చదివిన రాజ్య లక్ష్మి, ఇంటర్ పూర్తయ్యాక బాసర ట్రిపుల్ ఐటీలో సీటు (బీటెక్ - కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్) సంపాదించి ఉన్నత విద్యపూర్తి చేసింది ఆమె ప్రతిభను గుర్తించిన అక్కడి అధ్యాపకులు అక్కడే ఆమెకు గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసే అవకాశం కల్పించారు. అక్కడ పనిచేస్తూ అహర్నిశలు కష్టపడింది. ఈ క్రమంలో ఆమె వివాహం ప్రశాంత్తో అయ్యింది. భర్త, అత్తమామల ప్రోత్సాహంతో పరీక్షలు రాసి బెంగుళూరులోని డీఆర్డీఏలో కేటగిరీ-బీలో సైంటిస్ట్గా ఉద్యోగం సాధించినట్లు రాజ్యలక్ష్మి తెలిపింది. ఎన్నో కష్టాలను అధిగమించి అహర్నిశలు శ్రమిస్తే గాని ఈ ఉద్యోగం తనని భరించలేదని రాజ్యలక్ష్మి చెబుతోంది. తనకు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని చదివి శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించాలని చెబుతోంది. తన విద్యాభ్యాసంలో తోడ్పాటు అందించిన అధ్యాపకులను గుర్తుచేసుకొని తన కృతజ్ఞతలు తెలిపింది. గ్రామీణ ప్రాంతం నుండి ఓ యువతి బెంగళూరు డిఆర్డిఏ లో శాస్త్రవేత్తగా ఎంపిక కావడం పట్ల తన తండ్రి సదానందం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన కూతురు సాధించిన ఘనత మా కష్టాలను దూరం చేసిందని తెలిపారు. నిరుపేద కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులో రాణించి యువ శాస్త్రవేత్తగా ఎంపికైన రాజ్యలక్ష్మి ప్రయాణం నేటి యువతకు ఆదర్శమని చెప్పాలి. -
వినిపిస్తోందా.. మూడో స్వరం
ప్రజాస్వామ్య సౌధమైన శాసనసభలో మూడో స్వరం వినిపించేందుకు ట్రాన్స్జెండర్లు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. వరంగల్ తూర్పు సెగ్మెంట్ నుంచి బీఎస్పీ అభ్యర్థి గా పోటీ చేసేందుకు రామన్నపేటకు చెందిన చిత్రపు పుష్పిత లయకు తాజాగా అవకాశం లభించగా, గత ఎన్నికల్లో గోషామహల్ నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థి గా పోటీ చేసిన చంద్రముఖి కూడా ఈసారి ఇండిపెండెంట్గా బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇక ట్రాన్స్జెండర్లతో పాటు ప్రజల్లో ఓటు అవగాహనకు రాష్ట్ర ఎన్నికల ప్రచార కర్తగా వరంగల్కు చెందిన ట్రాన్స్జెండర్ లైలాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించింది. ఆమె తమ కమ్యూనిటీ వారు ఓటు నమోదు చేసుకునేందుకు అవగాహన కలిగిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, వరంగల్/హైదరాబాద్ రాష్ట్రంలో సుమారు 50 వేల మందికి పైగా ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు స్వచ్చంద సంస్థలు అంచనా వేస్తున్నాయి. కానీ ఓటర్లుగా నమోదైన వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. ట్రాన్స్జెండర్ల పట్ల సమాజం నుంచి ఎదురయ్యే వివక్ష, అవమానాలు, వేధింపుల కారణంగానే చాలామంది ‘మగవారు’గానే మనుగడ కొనసాగిస్తున్నట్టు ఆయా సంస్థలు చెబుతున్నాయి. అన్ని జీవన సమూహాల్లాగే ట్రాన్స్జెండర్లు కూడా స్వేచ్ఛా యుతమైన జీవనాన్ని కొనసాగించే హక్కును కలిగి ఉన్నట్లు గతంలో వెలువరించిన సుప్రీంకోర్టు తీర్పు వారికి గొప్ప ఆత్మస్థైర్యాన్ని కలిగించింది. మరోవైపు వివిధ స్వచ్చంద సంస్థలు, ప్రజాసంఘాలు, హక్కులసంఘాల నుంచి వారికి సంపూర్ణమైన మద్దతు, అండదండలు లభించాయి. దీంతో ట్రాన్స్ జెండర్లు సంఘటితమయ్యారు. తమ ఉనికిని బలంగా చాటుకొనేందుకు ఎన్నికలను ఒక అస్త్రంగా మలుచుకున్నారు. తీవ్రమైన వివక్ష, అణచివేతకు గురవుతున్న ట్రాన్స్జెండర్ల అస్తిత్వాన్ని చాటుకొనేందుకు, ఆకాంక్షలనువెల్లడించేందుకు చట్టసభలను వేదికగా చేసుకోవాలని భావిస్తున్నట్లు చిత్రపు పుషి్పత లయ, చంద్రముఖి చెబుతున్నారు. బీఎస్పీ కార్యకర్త నుంచి అభ్యర్థిగా చిత్రపు పుష్పిత లయ ప్రస్థానం వరంగల్ రామన్నపేటకు చెందిన చిత్రపు పుష్పిత లయ బీఎస్పీ పార్టీ కార్యకర్తగా ఢిల్లీలో ఐదేళ్లు పనిచేశారు. ఆ తర్వాత డాక్టర్ అంబేడ్కర్ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. రెండేళ్ల నుంచి వరంగల్ తూర్పు బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు ట్రాన్స్జెండర్ల తరఫున తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థి గా చంద్రముఖి ట్రాన్స్జెండర్ల అస్తిత్వాన్ని చాటుకొనేందుకు మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు మువ్వల చంద్రముఖి వెల్లడించారు. భరతనాట్య కళాకారిణి. వ్యాఖ్యాత, సినీనటి అయిన చంద్రముఖి దశాబ్దకాలంగా ట్రాన్స్జెండర్స్ హక్కుల కోసం పోరాడుతున్నారు. ప్రజాస్వామ్య సౌధంలో మూడోస్వరాన్ని వినిపించేందుకే 2018లో ట్రాన్స్జెండర్ల ప్రతినిధిగా, బీఎల్ఎఫ్ అభ్యర్థి గా గోషామహల్ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమెకు 1125 ఓట్లు లభించాయి. ఈ సారి మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాలనుకుంటున్నట్లు చెప్పారు. ఏ నియోజకవర్గం నుంచి అనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. ఎన్నికల ప్రచారకర్తగా లైలా.. మహబూబాబాద్ జిల్లాలోని అన్నారం గ్రామానికి చెందిన లైలా అలియాస్ ఓరుగంటి లక్ష్మణ్ డిగ్రీ చదువుకునే రోజుల్లో హిజ్రావైపు మళ్లారు. పూర్తిస్థాయి ట్రాన్స్జెండర్గా మారి డబుల్ పీజీ కూడా చేశారు. 20 ఏళ్ల నుంచి మ్యారీ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవీ ప్రాజెక్ట్లో హెల్త్ వర్కర్గా పనిచేస్తూ వరంగల్లో ఉంటున్నారు. రాష్ట్ర హిజ్రాల వెల్ఫేర్ సంఘం సభ్యురాలుగా కూడా ఎన్నికయ్యారు. వారి కమ్యూనిటీ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రస్థాయిలో కృషి చేస్తున్నారు. ఈమె సేవలను గుర్తించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ ఏడాది సెపె్టంబర్ 19వ తేదీన ఎన్నికల ప్రచారకర్త (అంబాసిడర్)గా నియమించడం విశేషం. -
ఉదయాన్నే నిద్రలేచి చూసేసరికి..
సాక్షి, మహబూబాబాద్: పాము కాటుతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలో జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన గుంజె స్వాతి, రాజు దంపతులు తమ కుమారుడు నిఖిల్(12)తో కలిసి ఇంట్లో కింద నిద్రించారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున బాలుడి నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన తల్లిదండ్రులు వెంటనే ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. గమనించిన వైద్యులు బాలుడు మృతి చెందాడని నిర్ధారించారు. కాగా, ఒక్కగానొక్క కొడుకు పాము కాటుతో మృతి చెందడంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చదవండి: సినిమాల్లో అవకాశాలు రాలేదని.. -
మాస్టర్ప్లాన్.. అమలు చేస్తేనే మేలు
హైదరాబాద్ తర్వాత అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరం వరంగల్. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగర అభివృద్ధి కోసం రచించిన ప్రణాళికలు అంతే వేగంగా అమలు కావడం లేదు. గ్రేటర్ వరంగల్ నగర విస్తీర్ణం 408 చదరపు కిలోమీటర్లు కాగా జనాభా 10.90 లక్షలకు చేరింది. ఉమ్మడి వరంగల్ అనేక మందికి నివాసయోగ్య నగరంగా మారింది. ఇక్కడి ప్రజల ఎజెండాను అమలు చేయాల్సిన అవసరం ఉందని నగర వాసులు కోరుతున్నారు. – సాక్షి ప్రతినిధి, వరంగల్ అల్లంతదూరాన ‘మాస్టర్ప్లాన్’... వరంగల్ మాస్టర్ప్లాన్–2042 సర్కారు ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. 42 నెలలుగా ముఖ్యమంత్రి పేషీ నుంచి ఫైల్ కదలడం లేదని అధికారులే చెబుతున్నారు. ఫలితంగా రాష్ట్రంలో పెద్ద సిటీగా.. 10.90 లక్షలకు మించిన జనాభా ఉన్న గ్రేటర్ వరంగల్లో 50 ఏళ్ల నాటి మాస్టర్ప్లానే ఇప్పటికీ అమల్లో ఉంది. వెంటనే మాస్టర్ప్లాన్ – 2042ను అమల్లోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. పెండింగ్లో ‘ఇన్నర్ రింగ్రోడ్డు’.... 1972లో ‘కుడా’ఆవిర్భావంలో ఏర్పడిన మాస్టర్ ప్లాన్లో భాగంగా నగరానికి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదనలు పొందుపర్చారు. భూ సేకరణకు 2013లో రూ.13 కోట్లు ఆర్డీఓ పేరిట జమ చేశారు. తదుపరి మరో రూ.50 కోట్ల నిధులు రెవెన్యూ శాఖకు అప్పగించారు. కానీ ఇంత వరకు భూ సేకరణ పూర్తి కాలేదు. పనులు పూర్తి కాలేదు. కలగా రోప్ వే... ఏపీలోని విశాఖ నగరంలో కైలాసగిరి పైకి ఎలాగైతే రోప్వే (వేలాడే పెట్టె) ఉందో అలాంటిదే వరంగల్ నగరంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. భ«ద్రకాళి గుడికి వచ్చిన వారు భద్రకాళి చెరువు అందాలను వీక్షిస్తూ హనుమకొండ పద్మాక్ష్మి గుట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి హంటర్ రోడ్డు జూపార్కు ఎదురుగా ఉన్న రీజినల్ సైన్స్ కేంద్రం గుట్టపై వరకు రోప్వే డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టుకు 2007లో టెండర్లు పిలిచారు. వైజాగ్ రోప్వే ప్రాజెక్టు చేసిన కోల్కతాకు చెందిన ఒక ప్రైవేటు సంస్థ ముందుకొచ్చింది. కానీ ఆ తర్వాత పనులు ముందుకెళ్లలేదు. మామునూరు ఎయిర్పోర్టు... నియో రైలు.. వరంగల్లోని మామునూరులో విమానాశ్రయం రావాలన్నది ఎన్నో ఏళ్ల కల. ఒకప్పుడు ఇక్కడ విమానాలు ఎగిరాయి. ఇప్పటికీ రన్వే, విమానాశ్రయం ఉన్నాయి. మట్టి నమూనా పరీక్షలను కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్లు ఏడాదిన్నర క్రితం చేపట్టారు. ఇక మిగిలిన స్థలసేకరణ బాధ్యత రాష్ట్రానిది. ఈ ప్రక్రియపై వేగం పెరిగి పూర్తయితే రెండు, మూడేళ్లలో ఈ ప్రాంత ప్రజలకు విమానయానయోగం సులువవుతుంది. అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్నట్టు వరంగల్లోనూ మెట్రో రైలును తీసుకొచ్చేందుకు సిద్ధమైన ప్రతిపాదనలు, ప్రణాళికలు ఇంకా కాగితాలపైనే ఉన్నాయి. ‘ఔటర్ రింగ్రోడ్డు’అలాగే... ఔటర్ రింగు రోడ్డు పనులకు సీఎం కేసీఆర్ 2017 అక్టోబర్లో శంకుస్థాపన చేశారు. మొత్తంగా నగరం చుట్టూ 69 కిలోమీటర్ల మేర ఔటర్ రింగు రోడ్డును ప్రతిపాదించారు. ఇంకా 40 కిలోమీటర్ల మేర పూర్తి కావాల్సి ఉంది. ముసురు మొదలయ్యిందంటే ‘ముంపు’భయం.. గ్రేటర్ వరంగల్ నగర విస్తీర్ణం 408 చదరపు కిలోమీటర్లు. నగరంలో 66 డివిజన్లు ఉన్నాయి. సుమారు 1,500 పైగా కాలనీలుంటాయి. ఇందులో 40 శాతం కాలనీల్లో డ్రెయినేజీ వ్యవస్థ లేదు. భూ కబ్జాలు, ఆక్రమణలతో 40కి పైగా లోతట్టు కాలనీలు ప్రమాదపు అంచులో ఉంటున్నాయి. కాస్త వర్షం కురిస్తేనే కాలనీలు ఏరులై వరంగల్ నగరాన్ని ముంచెత్తుతున్నాయి. -
నేడు మరో మూడు కేసీఆర్ సభలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ శుక్రవారం మరో మూడు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. తొలుత ఉదయం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభకు సీఎం హాజరవుతారు. తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మహబూబా బాద్ సభకు వస్తారు. అనంతరం వరంగల్ నగరం భట్టుపల్లిలో నిర్వహించే వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. వరంగల్ జిల్లా పరిధిలోని సభల ఏర్పాట్లను గురువారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, దాస్యం వినయభాస్కర్, శంకర్నాయక్ తదితరులు పరిశీలించారు. -
పోరుగల్లు.. పోటాపోటీ
తెలంగాణ తొలి, మలి దశల ఉద్యమాలకు చిరునామాగా ఉన్న పోరాటాల ఖిల్లా, ఉద్యమాల జిల్లా ఉమ్మడి వరంగల్లో 2023 ఎన్నికల సమరంలో తమ సర్వశక్తులొడ్డేందుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. 2018 ఎన్నికల్లో 12 నియోజకవర్గాలకు గానూ 10 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. భూపాలపల్లి, ములుగు నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా గండ్ర వెంకటరమణారెడ్డి, ధనసరి సీతక్క (అనసూయ) విజయం సాధించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్లో చేరగా.. ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఉమ్మడి జిల్లాలో 11కు చేరింది. ఇక వచ్చే నెలలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ 12 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ ములుగు, స్టేషన్ఘన్పూర్, నర్సంపేట, భూపాలపల్లిలకు అభ్యర్ధులను ఖరారు చేసింది. బీజేపీ 9చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల ఎంపిక నుంచే వ్యూహాత్మకం... రాజకీయ పార్టీలు ఈసారి అభ్యర్థుల ఎంపిక నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. బీఆర్ఎస్ తొమ్మిది చోట్ల సిట్టింగ్లకే అవకాశం ఇచ్చినా.. స్టేషన్ఘన్పూర్, జనగామ నియోజకవర్గాల్లో డా.టి.రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలను మార్చింది. రైతుబంధు సమితి చైర్మన్గా రాజయ్యకు, ఆర్టీసీ చైర్మన్గా యాదగిరిరెడ్డిని నియమించి.. ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఆ రెండు చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం కల్పించింది. ములుగు జెడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతికి తొలిసారిగా ములుగు నుంచి చాన్స్ ఇచ్చారు. అయితే నామినేటెడ్ పదవులు ఇచ్చినా.. జనగామ, స్టేషన్ఘన్పూర్లలో అభ్యర్థుల గెలుపునకు చేసే కృషిని బట్టి ఫలితాలు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ములుగు, స్టేషన్ఘన్పూర్, నర్సంపేటలలో పాతవారికే (సీతక్క, సింగాపురం ఇందిర, దొంతి మాధవరెడ్డి)లకే అవకాశం ఇచ్చి భూపాలపల్లికి గండ్ర సత్యనారాయణరావును ప్రకటించింది. మరో ఎనిమిది స్థానాలకు ఐదు చోట్ల ఖరారు కాగా, మూడింట్లో పోటాపోటీగా ఉంది. ఆ ఐదు చోట్ల కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక బీజేపీ ఉమ్మడి జిల్లాలో ములుగు, నర్సంపేట, పరకాల మినహా మిగతా చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. ఆ రెండింటి మధ్యే పోరు... ఏఐఎఫ్బీ, బీఎస్పీ వైపు అసంతృప్తులు.. మొత్తం 12 స్థానాలకు రెండు ఎస్సీలకు, మూడు ఎస్టీలకు రిజర్వు కాగా.. ఏడు జనరల్ స్థానాలు ఉమ్మడి వరంగల్లో ఉండగా... ఈసారి జరిగే ఎన్నికల్లో సామాజిక కోణాలు ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు సైతం ఆచితూచి పావులు కదుపుతున్నాయి. కాగా ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు ప్రచారసభలు నిర్వహించగా.. కాంగ్రెస్ తరఫున ఈ నెల 18, 19 తేదీల్లో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్గాందీ, ప్రియాంకగాంధీలు బస్సుయాత్రను రామప్ప వేదికగా ప్రారంభించి ప్రచారం నిర్వహించారు. రెండు రోజులపాటు ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు. చాలా నియోజకవర్గాల్లో పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ వారంతా కూడా ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) వైపు చూస్తున్నారు. - గడ్డం రాజిరెడ్డి -
Rahul Gandhi: విమర్శల బాణం.. ఆత్మీయ రాగం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్పై వాగ్బాణాలు.. బీజేపీకి చురకలు.. ఎంఐఎం పార్టీపై విమర్శలు. అసలా మూడు పార్టీలూ ఒక్కటేనంటూ ఆరోపణ లు. మరోవైపు ఇందిర, రాజీవ్, సోనియాగాంధీల పేర్లను ప్రస్తావిస్తూ..తనది తెలంగాణతో కుటుంబ బంధమంటూ ఆత్మీయత పంచే ప్రయత్నం. అంతేకాదు ఎక్కడికక్కడ స్థానిక ప్రజలతో మమేకం. సింగరేణి కార్మికులకు భరోసా.. టీ షాపు, టిఫిన్ సెంటర్ నిర్వాహకులతో కులాసా కబుర్లు.. సమ స్యలపై ఆరా.. ఎక్కడ కనబడితే అక్కడ చిన్నారుల కు చాక్లెట్లు..ఇదీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో మూడురోజుల పర్యటన సాగిన తీరు. ఆశలు రేపిన రాహుల్.. రాష్ట్రంలో రాహుల్ తొలివిడత విజయభేరి యాత్ర శుక్రవారంతో ముగి సింది. ఎన్నికల వేళ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు రాహుల్ ప్రయత్నించారు. ములుగు, భూపా లపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, బోధన్, ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గాల మీదు గా ఆయన మూడురోజుల బస్సుయాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు, వ్యవహార శైలి, సామాన్యుడిలా కలిసి పోయేందుకు ప్రయత్నించడం మంచి ప్రభావం చూపుతుందనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ప్రజలను ఆకట్టుకోవడంలో రాహుల్ సఫలీకృతులయ్యారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ బలంగా ఉండే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో రాహుల్ పర్యటన స్థానిక కాంగ్రెస్ కేడర్లో నూతనోత్సాహాన్ని నింపిందని అంటున్నారు. నేతల్లోనూ ఆయన జోష్ నింపారని, ఇదే ఊపు కొనసాగిస్తే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తటస్థులు, మేధావులకూ బీజేపీ సీట్లు! ఇటు ‘యుద్ధం’.. అటు ‘బంధం’ రాహుల్ ముఖ్యంగా రెండు అంశాలపై దృష్టి పెట్టారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యంగా ఇది దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న యుద్ధమని పదే పదే చెప్పడం ద్వారా ప్రజల్లో ఆలోచన రేకెత్తించగలిగారని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందంటూ వ్యాఖ్యానించడం ద్వారా ప్రజల్లో కాంగ్రెస్పై విశ్వాసం పెంచే ప్రయత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పాటు తెలంగాణతో తమ కుటుంబానికి ఉన్నది కేవలం ఎన్నికల బంధం, రాజకీయ బంధమే కాదని, ప్రేమానురాగాల అనుబంధమని, అందుకే చెల్లి ప్రియాంకను తెలంగాణకు తీసుకువచ్చానని చెప్పిన రాహుల్..తెలంగాణపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని బలంగా చెప్పే ప్రయత్నం చేశారనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు సామాజిక న్యాయం అంశాన్ని కూడా రాహుల్ చర్చకు తెచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణలోని మెజార్టీ బీసీ వర్గాలకు కేవలం 3 మంత్రి పదవులే ఇచ్చారని, 18 శాఖలు కేసీఆర్ కుటుంబం చేతుల్లోనే ఉన్నాయని ధ్వజమెత్తారు. కులగణన దేశానికి ఎక్స్రే లాంటిదంటూ తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కులగణన చేపడతామంటూ గట్టి హామీ ఇవ్వడం ద్వారా బీసీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు. అయితే రాహుల్తో పాటు వచ్చిన ప్రియాంకా గాంధీ కేవలం ఒక్కరోజు మాత్రమే రాష్ట్రంలో ఉండడం పార్టీ శ్రేణులను కొంత నిరుత్సాహానికి గురి చేసింది. ఎన్నికల ప్రచారం ముగిసేలోపు మరో రెండు దఫాలుగా యాత్ర సాగుతుందని, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. -
తెలంగాణలో ప్రచారం హోరెత్తిస్తున్న కాంగ్రెస్
-
రాక్షస కావ్యం మూవీ ప్రీమియర్ షో రెస్పాన్స్
-
మళ్లీ వచ్చేది ఇచ్చేదీ కేసీఆరే
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎన్నికల టైం కాబట్టి పొలిటికల్ టూరిస్టులు వస్తున్నారని, కేవలం ఎన్నికలప్పుడు వచ్చే ఆ పొలిటికల్ టూరిస్టుల మాటల నమ్మి ఆగం కావద్దని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు రాగానే సంక్రాంతికి గంగిరెద్దులోళ్లు వచ్చినట్లు ప్రతిపక్షాలు వస్తాయని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.. కేసీఆర్ పథకాలను కాపీకొట్టి, నాలుగు ఓట్లు డబ్బాలో వేయించుకోవాలని ప్రయత్నం చేసేవారిని అస్సలు నమ్మవద్దని కోరారు. స్కీములు అమలవుతున్న తెలంగాణలో ‘స్కాములు’చేసేందుకు వస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాకముందు, వచ్చాక ఎలా ఉందో గమనించాలని, కులమత భేదాలు లేకుండా అడగకున్నా ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చింది కేసీఆరేనని, మళ్లీ వచ్చేది, ఇచ్చేది కూడా కేసీఆరేనని స్పష్టం చేశారు. కేటీఆర్ శుక్రవారం గ్రేటర్ వరంగల్ నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రైసిటీలో సుమారు రూ.900 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేశారు. మడికొండలో క్వాడ్రంట్ సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించారు. ఈ సందర్భంగా హనుమకొండ ‘కుడా’మైదానంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ అధ్యక్షతన, ఖిలా వరంగల్ గ్రౌండ్లో ఎమ్మెల్యే నరేందర్ అధ్యక్షతన జరిగిన ప్రగతి నివేదన బహిరంగ సభల్లో ప్రసంగించారు. వంచించాలని చూస్తే పుట్టగతులుండవ్.. తెలంగాణ ప్రజలను ఇంకా మాయమాటలతో వంచించాలని చూస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పుట్టగతులుండవని కేటీఆర్ హెచ్చరించారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడు ఏదో చేస్తామంటే ఎలా నమ్ముతామని, అధికారం ఉన్నచోట అభివృద్ధిని విస్మరించిన బీజేపీ ఇక్కడేమి చేస్తుందని ప్రశ్నించారు. అధికారం కోసం ప్రతిపక్షాలు చెప్పే మాటలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ‘చరిత్రలో వాస్తవాలు దాచినా దాగవు. 1956లో హైదరాబాద్ సంస్థానం ఒక రాష్ట్రంగా ఉంటే.. బలవంతంగా తీసుకుపోయి ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్సే. 1968లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఖమ్మం, వరంగల్లో అందరూ కలిసి కదం తొక్కితే ఆ రోజు కర్కశకంగా 370 మంది పిల్లల్ని పిట్టల్లా కాల్చి చంపింది. 30 ఏళ్ల తర్వాత 2001లో గులాబీ జెండా ఎగిరితే అదిరిపోయి కాంగ్రెస్ తెలంగాణ నినాదాన్ని అందుకుంది. తెలంగాణ ఇస్తామని నమ్మబలికి 2004లో పొత్తు పెట్టుకుని 2014 వరకు పదేళ్లు చావగొట్టింది. వేలమంది చావులను కళ్ల చూసిన తర్వాత.. మీ అందరి పోరాటంతో ప్రజాశక్తి ముందు తలవంచక తప్పని పరిస్థితి వస్తే అనివార్యంగా కాంగ్రెస్, బీజేపీ కలిసొచ్చాయి. విధిలేని పరిస్థితుల్లోనే తెలంగాణ జపం చేశాయి..’అని కేటీఆర్ చెప్పారు. ఉద్యమానికి ఊపిరిలూదింది ఓరుగల్లే.. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ఊపరిలూదింది ఓరుగల్లు గడ్డే. మీ అందరికీ రుణపడి ఉంటాం. వరంగల్లో 24 అంతస్తుల్లో అతిపెద్ద ఆస్పత్రి నిర్మిస్తున్నాం. దసరా నాటికి అది పూర్తవుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత అన్ని జిల్లాల్లో బ్రహ్మండంగా మెడికల్ కాలేజీలు వచ్చాయి. ప్రభుత్వ ఖర్చుతో మన పిల్లలు డాక్టర్లు అయ్యే పరిస్థితి ఏర్పడింది. త్వరలోనే సీఎం శుభవార్త చెబుతారు. ఆసరా పెన్షన్లు ఎంతో పెంచబోతున్నామో స్వయంగా కేసీఆరే ప్రకటిస్తారు. కేసీఆర్ మత రాజకీయం చెయ్యరు. ఆయన అన్ని మతాలను సమానంగా చూసే నాయకుడు..’అని మంత్రి అన్నారు. భవిష్యత్ అంతా ద్వితీయ శ్రేణి నగరాలదే.. ‘దేశంలో భవిష్యత్ అంతా ద్వితీయశ్రేణి నగరాలదే. రాబోయే పదేళ్లలో హైదరాబాద్కు వరంగల్కు తేడా ఉండదు. మడికొండ ఐటీ పార్కులో నూతనంగా నిర్మించిన క్వాడ్రంట్ సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా 500 మందికి ఉపాధి లభిస్తుంది. స్థానికంగా యువతకు ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం వరంగల్, ఖమ్మం, నల్లగొండ వంటి నగరాలు, పట్టణాలకు పరిశ్రమలు తీసుకువస్తోంది. వరంగల్లోనే కాదు ఏపీలోని భీమవరం, నెల్లూరుకూ ఐటీ సంస్థలు రావాలి. అక్కడా ఐ టీ సంస్థలు పెట్టాలని ఎన్నారైలను కోరుతున్నా. కావాలంటే జగనన్నకు చెప్పి నేను మీకు జాగా ఇప్పిస్తా. బెంగళూరు ఐటీ రంగంలో 40 శాతం తెలుగువాళ్లే. అక్కడి నుంచి వచ్చేందుకు తెలుగు ఐటీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఉన్నచోటే మన యువతకు ఉపాధి దక్కేలా చూద్దాం..’అని కేటీఆర్ అన్నారు. వినయన్న మాస్ లీడర్ అంటూ అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీ పసునూరు దయాకర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమే‹Ù, నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
గణేష్ నిమజ్జనంలో సీపీ రంగనాథ్ డాన్స్
-
వేయి స్తంభాల గుడి విశిష్టత మరియు రహస్యాలు
-
కాకతీయుల వేయి స్తంభాల గుడి గురించి ఈ విశేషాలు మీకు తెలుసా?
-
వేయి స్తంభాల గుడి నంది చరిత్ర మీకు తెలుసా..?
-
వరంగల్ జిల్లాలో అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు
-
ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో పొగలు.. వారంలో రెండో ఘటన
సాక్షి, వరంగల్: హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా హౌరా వెళ్తున్న ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో పొగలు వచ్చాయి. వరంగల్ జిల్లా నెక్కొండ సమీపంలో సోమవారం ఉదయం 12 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులో పొగలు రావటాన్ని గమనించిన ప్రయాణికులు.. చెయిన్ లాగి రైలును ఆపారు. పెద్ద ఎత్తున పొగలు వ్యాపించడంతో భయందోళన చెందిన ట్రైన్ దిగి పరుగులు పెట్టారు. రైలులోని డ్రైవర్లు, గార్డు పరిస్థితిని సమీక్షించి.. రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున పొగలు బోగీలను కమ్మేశాయి. కాగా బ్రేక్ లైనర్లు పట్టుకోవడంతో పొగలు వచ్చినట్లు రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇక హౌరా ఎక్స్ప్రెస్ లో పొగలు రావడం వారం వ్యవధిలో ఇది రెండోసారి. నాలుగు రోజుల క్రితం కొరివి మండలం గుండ్రాతిమడుగు వద్ద కూడా రైలుతో పొగలు వ్యాపించాయి. చదవండి: చక్రం తిప్పడం పక్కా.. ఈ బరువు నాకొక లెక్కా -
రాష్ట్రంలో ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, వరంగల్/చర్ల: రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శనివారం వరుస దాడులు నిర్వహించింది. తెలంగాణలోని వరంగల్, కొత్తగూడెం జిల్లాలతోపాటు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లోనూ ఎన్ఐఏ అధికారుల సోదాలు కొనసాగాయి. ఈ దాడులు రెండు రోజులుగా జరుగుతున్నప్పటికీ శనివారం వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జూన్లో కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ముగ్గురి నుంచి పేలుడు పదార్థాలు, డ్రోన్లు, లాత్ మిషన్ను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకుని ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు. భద్రతా బలగాలకు వ్యతిరేకంగా పేలుడు పదార్థాలు, డ్రోన్లు ఉపయోగించేందుకు చేసిన కుట్రలో నిషేధిత మావోయిస్ట్ పార్టీ ప్రమేయం ఉండటంతో కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా మరో 12 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. ఆ విచారణ కొనసాగింపులో భాగంగానే శనివారం వరంగల్లో ఐదు చోట్ల, భద్రాద్రి కొత్తగూడెంలో రెండు చోట్ల, అదేవిధంగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పామేడులోని నిందితుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డిజిటల్ డివైజ్లను, డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. నిందితులు యాంటీ భారత్ ఎజెండాలో భాగంగా పలు ముడిపదార్థాలను మావోయిస్టులకు చేర్చేందుకు ప్రయత్నించినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని తెలిపారు. ఏజెన్సీలో ఇద్దరు అదుపులోకి? ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వెంకటాపురం ఏజెన్సీలో మావోయిస్టుల గురించి ఎన్ఐఏ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ఎదిరె, సూరవేడు కాలనీ, విజయపురితో పాటు పలుచోట్ల మావోయిస్టు దళానికి డ్రోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర సామగ్రి సరఫరా చేశారనే సమాచారంతో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ.. ఏజెన్సీలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల సరిహద్దులోని ఏజేన్సీ ప్రాంతాల్లో దేశవాళీ తుపాకులను తయారు చేసి వాటిని మావోలకు పంపుతున్నారన్న సమాచారం మేరకు సోదాలు జరిపినట్లు తెలిసింది. -
కేయూలో విద్యార్థుల ఆందోళన ఉధృతం
సాక్షి, హన్మకొండ జిల్లా: హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ అడ్మిషన్ల అవకతవకలపై విద్యార్థుల ఆందోళన, పోలీసుల దాడి వివాదాస్పదంగా మారింది. ఆందోళనకు దిగిన ఏబీవీపీ విద్యార్థులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి గాయపర్చారని విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. గాయపడ్డ విద్యార్థులను కేయూలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. కాళ్ళు చేతులు విరిగేలా పోలీసులు కొట్టడంపై రఘునందన్ రావు సీరియస్గా స్పందించారు. శాంతియుతంగా ఆందోళనకు దిగిన విద్యార్థులను కొట్టలేదు.. ఇబ్బంది పెట్టలేదంటున్న సీపీ రంగనాథ్ లైవ్ డిటెక్టివ్ పరీక్షలకు సిద్ధమా అని ప్రశ్నించారు. సీపీ తీరుపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రైవేటుగా కేసు నమోదు చేయిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులను క్రిమినల్గా చిత్రీకరించాలనే ఆలోచను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేయూ వైస్ ఛాన్సలర్ పై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. విద్యార్థులపై దాడికి నిరసనగా 12న వరంగల్ బంద్కు పిలుపునివ్వడంతో పాటు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు రఘునందన్రావు. -
ఒకే కుటుంబం నుంచి ఏకంగా 78 మంది ఉపాధ్యాయులు
సాక్షి, హన్మకొండ: ఒక కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు.. మహా అయితే నలుగురు ఒకే వృత్తిని ఎంచుకోవడం సాధారణం. కానీ ఒకే కుటుంబం నుంచి ఏకంగా 78 మంది ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. బెంజిమన్ అనే వ్యక్తికి చెందిన నాలుగు తరాలకు చెందిన 78మందికి బుధవారం హనుమకొండ కంచరకుంటలోని సెయింట్పాల్ హైస్కూల్ చైర్మన్ ఎం.ఆనంద్ ఆహ్వానం పంపగా 22మంది హాజరయ్యారు. వీరిని గురుపూజోత్సవం సందర్భంగా సన్మానించారు. బెంజిమన్ తండ్రి మోజెస్ బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. 1901లో బెంజిమన్ కుటుంబ సమేతంగా హనుమకొండలో స్థిరపడ్డారు. ఆయనకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చదవండి: చంటి బిడ్డను చేతులపై ఎత్తుకుని వాగు దాటించిన బాబాయి