-
రూ.25,000 వేలలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్
మిడ్-రేంజ్ విభాగంలో రూ.25 వేలలోపు స్మార్ట్ ఫోన్లు సరైన ప్రత్యేకతతో రావడమే కాకుండా ఈ విభాగంలో స్మార్ట్ ఫోన్స్ మంచి పనితీరుతో పాటుగా కెమెరా, సాఫ్ట్వేర్, డిజైన్ తో పాటు మొత్తం నిర్మాణంలో కూడా హై-ఎండ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లకు పోటీగా ఉండేలా కనిపిస్తాయి. రూ.25,000లోపు ఉన్న ఉత్తమ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ తో పాటు గేమింగ్, మల్టీ టాస్కింగ్, యాడ్-ఫ్రీ సాఫ్ట్వేర్, మల్టీ-కెమెరా సేటప్ విషయంలో మంచిగా పని చేయడానికి ఫాస్ట్ మిడ్-రేంజ్ ప్రాసెసర్ తీసుకొస్తాయి. ఇవి పనితీరు విషయంలో ఏ మత్రం ఫ్లాగ్ షిప్ లకు తీసిపోవు అందుకే మార్కెట్లో రూ.25000లోపు అందుబాటులో ఉన్న ఫోన్స్ గురుంచి తెలుసుకుందాం. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 మంచి పనితీరుతో పాటు ఎక్కువ కాలం బ్యాటరీ కావాలనుకునే వారి కోసం ఈ మొబైల్ మంచి ఎంపిక అవుతుంది. దీనిలో గెలాక్సీ నోట్ 10+లో ఉపయోగించిన ఎక్సినోస్ 9825 ప్రాసెసర్ తీసుకొచ్చారు. అలాగే, ఇందులో 7,000 ఎమ్ఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఉంది. ఈ ధర వద్ద మంచి సూపర్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉండటంతో పాటు అద్భుతమైన కెమెరా, గేమింగ్ పనితీరును కనబరుస్తుంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జర్తో దీనిని చార్జ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇందులో స్టాక్ యాప్స్ లో యాడ్స్ కూడా వస్తాయి. దేశ మొత్తంగా సర్విస్ కేంద్రాలు అందుబాటులో ఉండటం వల్ల అది ఒక అదనపు బలంగా దీనికి ఉపయోగపడుతుంది. దీని ధర రూ.23,999గా ఉంది. రియల్ మీ ఎక్స్ 7 5జీ రియల్ మీ ఎక్స్ 7 5జీ గురుంచి ప్రధానంగా చెప్పుకోవాలంటే మంచి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని చెప్పుకోవాలి. దీని 8జీబీ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. ఈ ధర వద్ద క్వాల్కామ్ ప్రాసెసర్ కు సమానంగా మీడియాటెక్ డైమెన్సిటీ 800యు ప్రాసెసర్ పనిచేస్తుంది. గేమింగ్ విషయంలో మంచి పనితీరు కనబరుస్తుంది. దీని బ్యాటరీ జీవితం కూడా ఎక్కువ వస్తుంది. ఇందులో 50 వాట్ ఫాస్ట్ చార్జర్ పొందుతారు. దీని బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే అనుకున్నంత రీతిలో పని చేయట్లేదు. ఫోన్లో ఆండ్రాయిడ్ 11 లేదు బ్లోట్వేర్ ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద చిన్న చిన్న సమస్యలు తప్ప అంత పెద్దగా ఇబ్బందులు లేవు. ఎంఐ 10ఐ షియోమీ 2021 లో మొదటగా తీసుకొచ్చిన మొబైల్ ఇదే. ఎంఐ 10ఐ ధర రూ.21,999. ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750జీ 5జీ సపోర్ట్ ప్రాసెసర్ ఉంది. ఇది 120 హెర్ట్జ్ డిస్ప్లే, 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇంత తక్కువ ధరకు ఇవి తీసుకొని రావడం ఒక మంచి విషయం. 108 మెగాపిక్సెల్ కెమెరాలలో చిన్న చిన్న సమస్యలు ఉండటం మనం గమనించవచ్చు. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా మెరుపరుస్తారో లేదో చూడాలి. మీరు ఫోటో విషయంలో పెద్దగా పట్టించుకోకపోతే రూ.25,000 ఒక మంచి ఫోన్ అవుతుంది. వివో వి20 వివో కూడా ఈ సారి మంచి ఫోన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది అని చెప్పుకోవాలి. ఇది 6.44-అంగుళాల ఆమో ఎల్ఈడీ డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఇది చూడటానికి మంచి ప్రీమియం లుక్ ఇస్తుంది. వివో వి 20 క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720జీ ప్రాసెసర్ సహాయంతో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్టచ్ ఓఎస్ తాజా వెర్షన్ మీద పనిచేస్తుంది. కెమెరా పరంగా మంచి ఫోన్ కోసం ఎదురు చూస్తుంటే ఇది ఒక మంచి ఆప్షన్. దీని ధర రూ.22,990. చదవండి: వాట్సప్ సమస్యలపై గ్రీవెన్స్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయడం ఎలా? -
ఎంఐ 11ఎక్స్కి పోటీగా వివో కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్
వివో తన వి-సిరీస్లో వివో వీ21 5జీ అనే కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ చేసింది. ఇందులో వెనుక వైపు మూడు కెమెరాలు, ముందువైపు 44 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్పై ఈ మొబైల్ పనిచేయనుంది. ఎంఐ 11ఎక్స్కి పోటీగా దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ మొబైల్ ప్రీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. సేల్ మాత్రం మే 6వ తేదీ నుంచి జరగనుంది. ఆర్కిటిక్ వైట్, డస్క్ బ్లూ, సన్ సెట్ డాజిల్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వివో వీ21 5జీ ఫీచర్లు: ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్టచ్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టం 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ప్రైమరీ కెమెరా 64 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ కెమెరా 44 ఎంపీ కెమెరా సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.29,990 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.32,990 చదవండి: 2021లో భారీగా పెరిగిన ఫేస్బుక్ ఆదాయం -
జోరుమీదున్న స్మార్ట్ఫోన్స్ విక్రయాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్మార్ట్ఫోన్ల విక్రయాలు 2021 జనవరి-మార్చిలో జోరుగా సాగాయి. వివిధ బ్రాండ్లకు చెందిన మొత్తం 3.8 కోట్ల యూనిట్లు అమ్ముడ య్యాయి. 2020 తొలి త్రైమాసికంతో పోలిస్తే ఇది 23 శాతం అధికం. నూతన మోడళ్లు, ప్రమోషన్స్, ఈఎంఐ పథకాలు, గతేడాది నుంచి కొనసాగుతున్న డిమాండ్తో మార్చి త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ మార్కెట్ను నడిపించాయి. స్మార్ట్ఫోన్స్, ఫీచర్ ఫోన్లతో కలిపి పరిశ్రమ ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 19 శాతం వార్షిక వృద్ధి సాధించింది. ఫీచర్ ఫోన్ల విపణి 14 శాతం అధికమైంది. వ్యాక్సినేషన్ ప్రారంభం కావడం జనవరి-మార్చిలో కస్టమర్ల సెంటిమెంటును బలపరిచిందని పరిశోధన సంస్థ కౌంటర్పాయింట్ అభిప్రాయపడింది. రానున్న రోజుల్లో.. మార్చి త్రైమాసికంలో జరిగిన స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో 75 శాతం వాటా చైనా బ్రాండ్లదే. షావొమీ,శామ్సంగ్, వివో, రియల్మీ, ఒప్పో వరుసగా అయిదు స్థానాల్లో ఉన్నాయి. యాపిల్ 207 శాతం, వన్ప్లస్ 300 శాతం వృద్ధి నమోదు చేశాయి. డిమాండ్ను పెంచేందుకు అన్ని బ్రాండ్లు కొత్త మోడళ్లు, ప్రమోషన్స్, ఫైనాన్షియల్ స్కీమ్స్పై దృష్టిసారించాయి. అయితే మహమ్మారి సెకండ్ వేవ్తో సెంటిమెంటు తగ్గే అవకాశం ఉందని కౌంటర్పాయింట్ చెబుతోంది. కోవిడ్-19, లాక్డౌన్స్ ప్రభావం రానున్న త్రైమాసికాలపై ఉంటుందని గుర్తు చేసింది. గతేడాది సరఫరా సమస్యలు తలెత్తిన దృష్ట్యా ముందస్తుగా నిల్వలను పెంచుకున్నామని బిగ్-సి ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. చదవండి: గూగుల్ లో నకిలీ ఫోటోలను కనిపెట్టడం ఎలా? -
బీఎమ్డబ్యూ భాగస్వామ్యంతో డిజైన్ చేసిన ఈ ఫోన్ అదరహో...!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ స్మార్ట్ఫోన్స్ బ్రాండ్ వివోకు చెందిన ఐక్యూ మొబైల్స్ తాజాగా మరో రెండు మోడల్లను భారత్లో లాంచ్ చేసింది. చైనాకు చెందిన ఈ స్మార్ట్ఫోన్ బ్రాండ్ తొలుత ఐక్యూ నియో 5ను రిలీజ్ చేయగా, దానినే రిబ్రాండ్ చేస్తూ ఐక్యూ 7గా రిలీజ్ చేసింది. దాంతో పాటుగా ఐక్యూ 7 లెజెండ్ను భారత విపణిలోకి లాంచ్ చేసింది. ఐక్యూ 7 లెజెండ్ మొబైల్ను ప్రముఖ మోటార్స్పోర్ట్ కంపెనీ బీఎమ్డబ్యూ భాగస్వామ్యంతో డిజైన్ చేసింది. ఐక్యూ 7, ఐక్యూ 7 లెజెండ్ ట్రిపుల్ రియర్ కెమెరాలను కల్గి ఉన్నాయి. దాంతో పాటుగా 66వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ను సపోర్ట్ చేస్తుంది. కాగా ఐక్యూ 7, ఎమ్ఐ 11 ఎక్స్తో పోటీ పడుతుండగా, ఐక్యూ 7 లెజెండ్ ఎమ్ఐ 11 ఎక్స్ ప్రో, వన్ప్లస్ 9 ఆర్ ఫోన్లకు సరితూగుతుంది. ఐక్యూ 7 స్టార్మ్ బ్లాక్, సాలిడ్ ఐస్ బ్లూ కలర్లో లభిస్తుంది. ఐక్యూ 7 ధరలు: (8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 31,990 (8జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 33,990 (12జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 35,990 ఐక్యూ 7 ఫీచర్లు 6.62 అంగుళాల స్క్రీన్ 1080x2400 పిక్సెళ్ల రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 11 క్వాల్కం స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 48+ 13+2-మెగాపిక్సెల్ రియర్కెమెరా 8జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ 4400 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఐక్యూ 7 లెజెండ్ ధరలు (8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 39,990 (12జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 43,990 ఐక్యూ 7 లెజెండ్ ఫీచర్లు 6.62 అంగుళాల స్క్రీన్ 1080x2400 పిక్సెళ్ల రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 11 క్వాల్కం స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 48+ 13+13-మెగాపిక్సెల్ రియర్కెమెరా 8జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ 4400 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం చదవండి: రియల్మీ 5జీ స్మార్ట్ఫోన్ : సరసమైన ధరలో -
ఏం కోహ్లి.. గాల్వాన్ ఘటన మరిచిపోయావా..?
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్గా ఉన్న ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ వివోకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తుండటంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోహ్లికి ఉన్న క్రేజ్ తమ ఉత్పత్తుల ప్రమోషన్కు ఉపయోగపడుతుందని భావించిన సదరు సంస్థ కోహ్లిని ప్రచాకర్తగా నియమించుకుంది. అయితే ఇండో-చైనా సరిహద్దుల్లో గతకొంత కాలంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కోహ్లి చైనా కంపెనీకి ప్రచాకర్తగా వ్యవహరించడమేంటని భారతీయ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. Virat Kohli named brand ambassador of VIVO. Virat Kohli should be shy to promote Chinese products! People trolled Ms dhoni last year I guess. Now the same people will defend Virat Kohli. Complete hypocrites! pic.twitter.com/hfS2EINDjO — Kp (@LoyalCSKfan) April 7, 2021 చైనా కంపెనీ అయిన వివోకు ప్రచారకర్తగా ఉండేందుకు సిగ్గుందా? అని కోహ్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాల్వాన్ ఘటన సమయంలో దేశభక్తి చాటిన నువ్వు.. ఏడాది తిరగకుండానే వీర జవాన్ల మరణాలు మరిచిపోయావా? అంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో కోహ్లి చేసిన ట్వీట్ను అభిమానులు రీట్వీట్ చేసి మరీ నిలదీస్తున్నారు. కాగా, గతేడాది గాల్వాన్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో ఇరు దేశాలకు చెందిన సైనికలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. జవాన్ల మధ్య జరిగిన ముఖాముఖి పోరాటంలో తెలుగువాడైన కల్నల్ సంతోష్తో పాటు 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. Patriot Virat Kohli has become a brand ambassador of Vivo pic.twitter.com/dNf5ShoWbJ — Dennis (@DennisCricket_) April 7, 2021 VIVO is back as title sponsor of IPL. Good day to remember this pic.twitter.com/rRI4LvPOEW — Nimo Tai 2.0 (@Cryptic_Miind) April 7, 2021 అయితే, ఇదంతా జరిగి ఏడాది తిరక్కుండానే కోహ్లి చైనా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం, బీసీసీఐ తిరిగి వివోను టైటిల్ స్పాన్సర్గా కొనసాగించడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వాస్తవానికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం వివో బీసీసీఐతో 2018లో ఐదేళ్ల కాలానికి రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే గాల్వాన్ లోయలో ఉద్రిక్తతల కారణంగా దేశ ప్రజల్లో చైనా ఉత్పత్తులపై వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో 2020 సంవత్సరానికి మాత్రం బీసీసీఐ.. వివోతో భాగస్వామ్యాన్ని రద్దు చేసుకొని, ఐపీఎల్ 2020 సీజన్కు డ్రీమ్ 11ను టైటిల్ స్పాన్సర్గా నియమించుకుంది. ఇదిలా ఉండగా, కొద్ది గంటల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 సీజన్ తొలి మ్యాచ్ ప్రారంభంకానుంది. చదవండి: ఫేస్ టు ఫేస్ ఫైట్లో ముంబైదే పైచేయి -
వన్ప్లస్కు పోటీగా వివో ఎక్స్60 సిరీస్ ఫోన్లు విడుదల
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో వన్ప్లస్కు పోటీగా ఎక్స్60 సిరీస్ ఫోన్లను మనదేశంలో లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో వివో ఎక్స్60, ఎక్స్60 ప్రో, ఎక్స్60 ప్రో ప్లస్ ఫోన్లు ఉన్నాయి. ఇందులో వన్ప్లస్కు దీటుగా మంచి ఫీచర్లను అందించారు. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ ప్లేలు ఇందులో ఉన్నాయి. వివో ఎక్స్60లో ఎక్కువ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ఎక్స్60 ప్రో, ఎక్స్60 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లలో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. వన్ ప్లస్ 9 సిరీస్, ఎంఐ 10 సిరీస్ ఫోన్లతో వివో ఎక్స్60 సిరీస్ పోటీ పడనుంది. వివో ఎక్స్60 స్పెసిఫికేషన్లు: 6.56 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ 8 జీబీ, 12 జీబీ ర్యామ్ 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ 48 ఎంపీ మెయిన్ కెమెరా (సోనీ ఐఎంఎక్స్598 సెన్సార్) 13 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా 13 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరా బ్యాటరీ సామర్థ్యం 4200 ఎంఏహెచ్ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్టచ్ఓఎస్ 11.1 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,990 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,990 వివో ఎక్స్60 ప్రో స్పెసిఫికేషన్లు 6.56 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ 48 ఎంపీ మెయిన్ కెమెరా (సోనీ ఐఎంఎక్స్598 సెన్సార్) 13 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా 13 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరా బ్యాటరీ సామర్థ్యం 4200 ఎంఏహెచ్ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్టచ్ఓఎస్ 11.1 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,990 వివో ఎక్స్60 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు 6.56 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ 50 ఎంపీ మెయిన్ కెమెరా (జీఎన్1 సెన్సార్) 48 ఎంపీ కెమెరా (సోనీ ఐఎంఎక్స్598 సెన్సార్) 32 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా 8 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరా బ్యాటరీ సామర్థ్యం 4200 ఎంఏహెచ్ 55 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్టచ్ఓఎస్ 11.1 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,990 చదవండి: జియో ఫైబర్ యూజర్లకు గుడ్ న్యూస్ -
వెల్లువెత్తనున్న ప్రకటనలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రకటనలు, మార్కెటింగ్ కార్యకలాపాలకు కంపెనీలు 2021-22లో పెద్ద ఎత్తున వ్యయం చేయనున్నాయి. కోవిడ్-19 కారణంగా 2020లో భారత ప్రకటనల పరిశ్రమ విలువ పరంగా 21.5 శాతం తగ్గింది. ప్రస్తుత సంవత్సరంలో 23.2 శాతం వృద్ధితో పరిశ్రమ రూ.80,123 కోట్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. మారుతి సుజుకి, అమూల్, ఎల్జీ, పార్లే, పెప్సికో, వివో, మారికో, ఇమామి, వోల్టాస్, బ్లూ స్టార్ వంటి ప్రముఖ కంపెనీలు ప్రకటనలు, మార్కెటింగ్కు భారీగా ఖర్చు చేయనున్నాయి. కొన్ని సంస్థలు గతం కంటే 50 శాతం వరకు అధికంగా వెచ్చించనున్నట్టు సమాచారం. ఆదాయంతోపాటు మార్కెట్ వాటాను పెంచుకునే వేటలో కంపెనీలు ఖర్చుకు వెనుకాడడం లేదు. డిమాండ్ నేపథ్యంలో.. కొన్ని నెలలుగా కస్టమర్లు వస్తువులు, ఉత్పత్తుల కోసం ఖర్చు చేస్తుండడం కంపెనీలను ఆకట్టుకుంటోంది. మహమ్మారి మూలంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టపోయిన వ్యాపారం నుంచి రికవరీకి 2021-22లో చేసే వ్యయాలు దోహదం చేస్తాయని సంస్థలు భావిస్తున్నాయి. వేసవిలో ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, శీతల పానీయాలు, ఐసీ క్రీమ్స్ వంటి విభాగాలకు డిమాండ్ ఉంటుంది. ఈ విభాగాల్లో వ్యాపారం సాగిస్తున్న కంపెనీలు ఆ మేరకు ప్రకటనలు, మార్కెటింగ్పై వ్యయాలను పెంచనున్నాయి. గతేడాది డిజిటల్ ప్రకటనలకు పరిమితమైన ఈ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని వేదికలనూ వినియోగించు కోనున్నాయి. ప్రధానంగా ప్రింట్ మీడియా కీలకం కానుందని కాంటినెంటల్ కాఫీ మార్కెటింగ్ హెడ్ ప్రీతమ్ పటా్నయక్ తెలిపారు. ఎఫ్ఎంసీజీ రంగం 15-20 శాతం అధికంగా వ్యయం చేయనుందని అన్నారు. ఖర్చుల్లోనూ పోటీయే.. ప్రకటనలు, మార్కెటింగ్ కోసం చేసే వ్యయాల్లోనూ కంపెనీలు పోటీపడుతున్నట్టు ఉంది. 2021-22లో ఎల్జీ ఏకంగా రూ.650 కోట్లు వ్యయం చేయనుంది. గతంతో పోలిస్తే ఇది ఏకంగా 50 శాతం అధికం. ఇప్పటి వరకు ఎల్జీ ఇండియా ఈ స్థాయిలో ఖర్చు చేయకపోవడం గమనార్హం. అంచనాలను మించి మార్కెట్ రికవరీ అయిందని, ప్రీమియం ఉత్పత్తుల పట్ల కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారని ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ విజయ్ బాబు అన్నారు. బ్లూ స్టార్ రూ.35 కోట్ల నుంచి రూ.64 కోట్లకు బడ్జెట్ పెంచింది. గతేడాది లాక్డౌన్ సడలింపుల తర్వాత ఆగస్టు-సెప్టెంబర్ నుంచి కంపెనీలు ప్రకటనలు, మార్కెటింగ్ కోసం ఖర్చు చేయడం ప్రారంభించాయి. దాదాపు 2019-20 మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ వ్యయాలు చేశాయి. ముందు వరుసలో ఎఫ్ఎంసీజీ.. భారత్లో ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) విభాగంలోని కంపెనీలు ప్రకటనలు, మార్కెటింగ్ విషయంలో ముందున్నాయి. ఆ తర్వాత ఈ-కామర్స్, ఆటోమొబైల్, టెలికం, రిటైల్, డ్యూరబుల్స్ కంపెనీలు పోటీపడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనూ ఎఫ్ఎంసీజీ కంపెనీల ప్రకటనలు ప్రధానంగా వెలువడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో రియల్టీ రంగం ప్రధాన ఆకర్షణ అని బ్రాండింగ్ సేవల్లో ఉన్న జాన్రైజ్ క్రియేటివ్ డైరెక్టర్ సుమన్ గద్దె తెలిపారు. గతంలో లేని విధంగా ఆరోగ్య బీమా, మ్యూచువల్ ఫండ్స్ ప్రకటనలూ వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. ఇక్కడి మార్కెట్లో హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, వరంగల్, గుంటూరు వంటి పెద్ద నగరాలు, ఖర్చులకు వెనుకాడని కస్టమర్లు ఉండడమూ కంపెనీలకు కలిసి వస్తోందని వివరించారు. చదవండి: ఫేస్బుక్ మరో సంచలనం -
వన్ ప్లస్ కి పోటీగా ఐక్యూ 7
ప్రముఖ స్మార్ట్ఫోన్ వివో సబ్ బ్రాండ్ ఐక్యూ గతేడాది మనదేశంలో ఐక్యూ 3 పేరిట ఒక ఫోన్ తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. అప్పటి నుంచి మనదేశంలో ఐక్యూ స్మార్ట్ఫోన్లు లాంచ్ చేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో ఫ్లాగ్షిప్ ఐక్యూ 7 మొబైల్ ని తీసుకొనివచ్చింది. ఇప్పుడు మనదేశంలో కూడా ఐక్యూ 7ను మార్చి చివరి నాటికి లాంచ్ చేయడానికి ఆ కంపెనీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. దీనిలో 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని, 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ది-బాక్స్ తీసుకురానున్నట్లు సమాచారం. ప్రముఖ టిప్స్టెర్ దేబయన్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి చివరి నాటికి ఐక్యూ 7 భారతదేశంలో లాంచ్ చేయనున్నారు. మరో రెండు స్మార్ట్ఫోన్లు ఏప్రిల్ చివరి నాటికి లాంచ్ అవుతాయి. ఐక్యూ 7 బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ చైనాలో సిఎన్వై 3,798(సుమారు రూ.43,100)కు,12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,198 యువాన్లుకు(సుమారు రూ.47,600) తీసుకొచ్చారు. వన్ ప్లస్ కి పోటీగా ఐక్యూ 7లో క్వాల్ కాం స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకొస్తున్నట్లు సమాచారం. ఐక్యూ 7 ఫీచర్స్(అంచనా) డిస్ప్లే: 6.62 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ రిఫ్రెష్ రేట్: 120హెర్ట్జ్ బ్యాటరీ: 4,000 ఎమ్ఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్: 120వాట్ ర్యామ్: 8జీబీ, 12జీబీ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ ప్రాసెసర్: స్నాప్డ్రాగన్ 888 బ్యాక్ కెమెరా: 48 ఎంపీ + 13 ఎంపీ + 13 ఎంపీ సెల్ఫీ కెమెరా: 16 ఎంపీ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ఓఎస్ కలర్స్: బ్లాక్, లేటెంట్ బ్లూ కనెక్టివిటీ: 5జీ, 4జీ ఎల్టిఇ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2 చదవండి: ఆపిల్ కంప్యూటర్ ఖరీదు రూ.11కోట్లు? బిగ్ బ్యాటరీతో వస్తున్న గెలాక్సీ ఎఫ్ 62 -
వివో నుంచి మరో వై-సిరీస్ మొబైల్
మొబైల్ తయారీ సంస్థ వివో మరో కొత్త స్మార్ట్ఫోన్ వివో వై31ను నేడు భారతదేశంలో విడుదల చేసింది. వివో వై-సిరీస్లో ఇప్పటికే మూడు ఫోన్లు విడుదలయ్యాయి. వివో వై31లో వాటర్ డ్రాప్ స్టైల్ డిస్ ప్లేను అందించారు. ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 600-సిరీస్ ప్రాసెసర్ ను అందించారు. ఇది ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. వివో వై31ఎస్ ఇటీవలే చైనాలో 5జీ సపోర్ట్తో లాంచ్ అయింది.(చదవండి: వివో వై31 ఫీచర్స్: వివో వై31 ఒక మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్. ఇది స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో 6జీబీ ర్యామ్, 128జీబీ ఆన్బోర్డ్ స్టోరేజ్ ఉంది. ఇది 6.58-అంగుళాల ఎఫ్హెచ్డి ఐపిఎస్ డిస్ప్లేతో వస్తుంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కోసం వాటర్డ్రాప్ నాచ్ను కలిగి ఉంది. వెనుక భాగంలో 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, డ్యూయల్ 2-మెగాపిక్సెల్ యూనిట్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్లో 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్టచ్ ఓఎస్ 11 మీద పనిచేస్తుంది. కనెక్టివిటీ కోసం 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్టులు కూడా ఇందులో ఉన్నాయి. భారతదేశంలో వివో వై31 ధర రూ.16,490గా నిర్ణయించబడింది. అమెజాన్ ఇండియా, ఫ్లిప్కార్ట్, పేటీఎం, వివో ఇండియా ఇ-స్టోర్, ఇతర ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రిటైల్ దుకాణాల నుండి మీరు ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. ఇది రేసింగ్ బ్లాక్, ఓషన్ బ్లూ అనే రెండు రంగులలో లభిస్తుంది. -
సూపర్ ఫీచర్లు, తక్కువ ధర : వివో కొత్త ఫోన్
సాక్షి,ముంబై : ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ వివో కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. డ్యూయల్ రియర్ కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై 12ఎస్ ను భారత్లో లాంచ్ చేసింది. వాటర్డ్రాప్ తరహా డిస్ప్లే నాచ్ లాంటి ఫీచర్లతో వచ్చిన బడ్జెట్ ఫోన్గా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వివో వై 12 ఎస్ ధర, లభ్యత సింగిల్ వేరియంట్లో వివోవై12 ఎస్ లభ్యం. 3 జీబీ+ 32జీబీ స్టోరేజ్ వేరియంట్కు 9,990 రూపాయలుగా నిర్ణయించింది. ఈ స్మార్ట్ఫోన్ ఫాంటమ్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది. వివో ఇండియా ఆన్లైన్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటీఎం, టాటా క్లిక్, దేశంలోని ఇతర భాగస్వామి రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. వివో వై 12ఎస్ స్పెసిఫికేషన్లు 6.51అంగుళాల హెచ్డీ డిస్ప్లే 720x1,600 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పీ 35 సాక్ 13+2 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఎక్స్ 60 ప్రోను లాంచ్ చేసిన వివో
చైనా: వివో ఎక్స్ 60, ఎక్స్ 60 ప్రో ధరలు, ఫీచర్స్, అమ్మకపు తేదీలను అధికారికంగా సంస్థ ప్రకటించింది. స్నాప్డ్రాగన్ 888 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తో రాబోయే వివో ఎక్స్ 60 ప్రో ప్లస్ జనవరిలో లాంచ్ కానుంది. వివో ఎక్స్ 60, ఎక్స్ 60 ప్రో రెండూ శామ్సంగ్ ఎక్సినోస్ 1080 5జీ ప్రాసెసర్ తో రానున్న ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ఫోన్లు ఇవి. వివో ఎక్స్ 60, ఎక్స్ 60 ప్రో 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో ఫుల్హెచ్డి ప్లస్ డిస్ప్లే కలిగి ఉన్నాయి. అయితే భారతదేశంలో వీటిని ఎప్పుడు తీసుకొస్తారో అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. వివో ఎక్స్ 60 ప్రో ఫీచర్స్: వివో ఎక్స్ 60 ప్రో 6.56-అంగుళాల అమోలేడ్ డిస్ప్లేతో ఎఫ్హెచ్డి ప్లస్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుంది. ఈ మొబైల్ 5నానోమీటర్ తయారు చేయబడిన ఎక్సినోస్ 1080 ప్రాసెసర్ తో పని చేయనుంది. ఇది 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఫోన్ సరికొత్త ఆరిజిన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో పని చేసే 4,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. వివో ఎక్స్ 60 ప్రోలో 48 ఎంపీ(ఎఫ్/1.48) సోనీ ఐఎమ్ఎక్స్ 598 ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 13 ఎంపీ 120-డిగ్రీల అల్ట్రా-వైడ్, 13ఎంపీ లెన్స్ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. ఇది సెకండ్-జెన్ మైక్రో-గింబాల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజషన్ టెక్నాలజీతో వస్తుంది. వివో ఎక్స్ 60 ప్రోలో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 32ఎంపీ కెమెరా ఉంది. ఇందులో భద్రత కోసం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. కనెక్టివిటీ పరంగా వివో 60 ప్రోలో డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్సి, యుఎస్బి టైప్-సి, ఫేస్ అన్లాక్ ఉన్నాయి. వివో ఎక్స్ 60 ప్రో 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ ధర సీఎన్వై 4,498 (సుమారు రూ.50,500)కి లభిస్తుంది. ఈ మొబైల్ బ్లూ, బ్లాక్ రంగులలో లభిస్తుంది. వివో ఎక్స్ 60 ఫీచర్స్: వివో ఎక్స్ 60 ఫీచర్స్ ప్రో మోడల్ మాదిరిగానే ఉంటాయి. ఈ హ్యాండ్సెట్లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, ఎక్సినోస్ 1080 ప్రాసెసర్, 32ఎంపీ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ ఓఎస్. వివో ఎక్స్ 60 4,200 ఎంఏహెచ్ బ్యాటరీతో నడుస్తుంది. చైనాలో వివో ఎక్స్ 60 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్కు ధర సీఎన్వై 3,498 (సుమారు రూ.39,400), 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్వై 3,798(సుమారు రూ.42,700), 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్వై 3,998(సుమారు రూ.45,000)కి లభిస్తుంది. -
వివో నుండి మరో బడ్జెట్ మొబైల్
చైనా: వివో చైనాలో తన కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. వివో వై30 స్టాండర్డ్ ఎడిషన్ అని పిలువబడే ఈ మొబైల్ జూలైలో భారతదేశంలో లాంచ్ అయిన వివో వై30 యొక్క డౌన్గ్రేడ్ వెర్షన్ అని తెలుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం ఒక్క వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. చైనాలో వివో వై 30 ధర 1,398యువాన్లు(సుమారు రూ.15,700)గా నిర్ణయించబడింది.(చదవండి: పదకొండు వేలకే రెడ్మీ 9 పవర్) వివో వై 30 ఫీచర్స్: వివో వై 30 స్టాండర్డ్ ఎడిషన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ పై నడుస్తుంది. ఇందులో పవర్వీఆర్ జీఇ8320 జీపీయును తీసుకొచ్చింది. దీనిలో 6జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఈ మొబైల్ లో మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 256జీబీ వరకు విస్తరించవచ్చు. ఇది 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. రెగ్యులర్ వివో వై 30 మాదిరిగానే వివో వై 30 స్టాండర్డ్ ఎడిషన్ 6.5-అంగుళాల ఐపీఎస్ ఎల్సిడి ప్యానల్తో వస్తుంది. ఇది 720 x 1600 రిజల్యూషన్ కలిగి ఉంది. ఇందులో వివో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. వివో వై 30 స్టాండర్డ్ ఎడిషన్ లో 13మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2మెగాపిక్సల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 8మెగాపిక్సల్ కెమెరా ఉంది. కనెక్టివిటీ విషయానికొస్తే 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జిపిఎస్, గ్లోనాస్, యుఎస్బి ఒటిజి, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్ను అందిస్తుంది. -
వివో సబ్ బ్రాండ్ కొత్త 5జీ మొబైల్
వివో సబ్ బ్రాండ్ ఐక్యూ చైనాలో ఐక్యూ యు 3ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ 6.58-అంగుళాల స్క్రీన్తో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది మరియు ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800 యు 5జీ ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఐక్యూ యు 3 5జీ మొబైల్ చైనాలో ప్రీ-ఆర్డర్ల కోసం డిసెంబర్ 18 నుండి సేల్ లో ఉంచింది. ఐక్యూ యు 3 గ్లో కలర్, టూ ఎర్లీ బ్లాక్ లభిస్తుంది. ఈ బ్రాండ్ చైనాలో వివోలో భాగంగా పనిచేస్తుంది, కానీ దేశంలో చైనా బ్రాండ్ల పట్ల పెరుగుతున్న ఆగ్రహం కారణంగా దీనిని స్వతంత్ర బ్రాండ్గా తీసుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని ఎప్పుడు తీసుకొస్తారో ఇంకా సమాచారం లేదు. ఐక్యూ యు 3 ఫీచర్స్: ఐక్యూ యు3 మొబైల్ 6.58-అంగుళాల ఎల్సిడి స్క్రీన్ను 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800 యు 5 జి చిప్సెట్ ద్వారా 8 జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్తో జతచేయబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10తో నడుస్తుంది. ఐక్యూ యు 3లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరాతో ఎఫ్/1.79 ఎపర్చరు, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఎఫ్ /2.4 ఎపర్చరుతో ఉంటుంది. ఇది 4కేలో వీడియోలను రికార్డ్ చేయగలదు, 10x డిజిటల్ జూమ్ కలిగి ఉంటుంది. ఐక్యూ యు 3లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది. ఐక్యూ యు 3 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పనిచేస్తుంది. కనెక్టివిటీ విషయానికివస్తే 5జీ, 4జీ ఎల్టిఇ, వై-ఫై, బ్లూటూత్ 5.1, యుఎస్బి టైప్-సి, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్ 6 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్కు 1,498 యువాన్లు(సుమారు రూ.16,800), 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్కు సిఎన్వై 1,698 యువాన్లు(సుమారు రూ.19,000) ధరను నిర్ణయించారు. -
త్వరలో జియో బడ్జెట్ 4జీ స్మార్ట్ ఫోన్స్
జియో ఈ నెలలో చవకైన 4జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. తన 4జీ ఫీచర్ ఫోన్ వినియోగదారులను స్మార్ట్ఫోన్లకు తరలించే ప్రయత్నంలో భాగంగా రిలయన్స్ జియో చైనా ఫోన్ తయారీ సంస్థ వివోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఫోన్ వివో వై-సిరీస్లో రానుందని ధర రూ.8 వేల రేంజ్లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. డిస్కౌంట్లు, ఒటిటి సబ్ స్క్రిప్షన్, వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్ మెంట్ వంటి ఆఫర్లతో జియో త్వరలో 'ఎక్స్క్లూజివ్' స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి జియో యోచిస్తుంది. దీనికి సంబందించిన అధికారిక సమాచారం లేనప్పటికీ, ఒక నివేదిక ప్రకారం జియో వీటిని తీసుకురావడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ ఫోన్ లో కేవలం రిలయన్స్ జియో సిమ్ కార్డు మాత్రమే పనిచేసే విధంగా రూపకల్పన చేస్తుంది.(చదవండి: గెలాక్సీ నోట్ ఫోన్లకు శాంసంగ్ స్వస్తి) రిలయన్స్ జియో వివోతో పాటు కార్బన్, లావా మరియు ఇతర చైనా బ్రాండ్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. వివో ఈ మధ్యే వివో వై1ఎస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధరను మనదేశంలో రూ.7,990గా నిర్ణయించారు. అలాగే జియో టెక్ దిగ్గజం గూగుల్తో పొత్తు పెట్టుకుని తక్కువ ధర గల 4జీ ఫోన్లను వచ్చే ఏడాది తీసుకురావాలని జియో యోచిస్తోంది. రిలయన్స్ జియో 3000 నుంచి 4000 మధ్య తక్కువ ధర గల స్మార్ట్ఫోన్లను తయారు చేయడానికి ఇంతక ముందు ఐటెల్ కంపెనీతో కలిసి పనిచేసింది. జియో ప్రధాన ప్రత్యర్థి అయిన భారతి ఎయిర్టెల్ కూడా స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసే ప్రయత్నాల్లో భాగంగా లావా, కార్బన్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఎయిర్ టెల్ ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించింది. -
ఫోన్ కొనాలనుకుంటున్నారా.. ఇవి చూడండి?
భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్ లో ఎప్పుడు చాలా గట్టి పోటీ ఉంటుంది. అందుకే చాలా మొబైల్ సంస్థలు ఈ పోటీని తట్టుకోవడానికి ప్రతి నెల ఎదో ఒక ఫోన్ ని విడుదల చేస్తూ ఉంటాయి. వీటితో మంచి ఆఫర్లను కూడా మొబైల్స్ పై అందిస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం చైనా కంపెనీల మద్యే ఎక్కువ పోటీ ఉంది. ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ లో లాంచ్ చేయబోయే మొబైల్స్ ని మీకోసం తీసుకొస్తున్నాం. మొబైల్స్ యొక్క ధర, ఫీచర్స్ వంటి వివరాలు ఉన్నాయి. అందుకే ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు, బంధుమిత్రులకు షేర్ చేయండి. (చదవండి: వాట్సప్ స్టేటస్ ని సీక్రెట్ గా చూడండి) వివో వీ20 ప్రో 5జీ శాంసంగ్ ఏ32 5జీ ఒప్పో రెనో ప్రో 5జీ శాంసంగ్ ఏ12 ఒప్పో రెనో ప్రో ప్లస్ 5జీ రెడ్ మీ నోట్ 10 5జీ ఒప్పో రెనో 5ప్రో రెడ్ మీ నోట్ 10 5జీ ప్రో రియల్ మీ ఎక్స్ 7 ప్రో పోకో ఎం3 రియల్ మీ ఎక్స్ 7 ఒప్పో ఏ53 5జీ రియల్ మీ వి5 మోటో జీ9 పవర్ -
డిసెంబర్ 2న వివో వీ20 ప్రో లాంచ్..
వివో వీ20 ప్రో 5జీ వచ్చే వారం భారతదేశంలో లాంచ్ కానుంది. ఇది గతంలో థాయ్ ల్యాండ్లో విడుదలైన ఫోన్ మాదిరిగానే ఉండనుంది. డిసెంబర్ 2వ తేదీన ఈ ఫోన్ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ ని సంస్థ యొక్క యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. వివో వీ20 ప్రో అమెజాన్ మరియు దేశవ్యాప్తంగా ఇతర రిటైల్ కేంద్రాలలో అందుబాటులో ఉండనుంది. (చదవండి: నోకియా 9.3 ప్యూర్వ్యూ మళ్లీ వాయిదా) వివో వీ20 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్ ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్తో ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఫన్టచ్ ఓఎస్ 11పై పని చేయనుంది. ఇందులో 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఇందులో 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, హెచ్డిఆర్ 10 సపోర్ట్, స్టాండర్డ్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డ్యూయల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉన్నాయి. వివో వీ20 ప్రోలో వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగా పిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ సెన్సార్ను అందించారు. దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 44 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అందుబాటులో ఉంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్ పై వివో వీ20 ప్రో పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ను ఈ స్మార్ట్ ఫోన్లో అందించారు. వివో వీ20 ప్రో 5జీ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. కనెక్టివిటీ కోసం 5జీ, 4జీ ఎల్టిఇ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జిపిఎస్, యుఎస్బి టైప్-సి పోర్ట్ ఫీచర్లను ఇందులో అందించారు. దీని బరువు 170 గ్రాములుగానూ ఉంది. వివో వీ20 ప్రో 5జీ ని భారతదేశంలో 29,990 ధరకే తీసుకురానున్నట్టు సమాచారం. మూన్ లైట్ సొనాటా, మిడ్ నైట్ జాజ్, సన్ సెట్ మెలోడీ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. -
వివో వై1ఎస్ వచ్చేసింది
వివో భారతదేశంలో కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఎంట్రీ లెవల్ వినియోగదారుల కోసం వివో వై1ఎస్ రూపంలో మొబైల్ ని తీసుకొచ్చింది. సాదారణంగా సోషల్ మీడియా ద్వారా ఫోన్ను ప్రకటించే బదులు, ఈ సారి తన వెబ్సైట్ ద్వారా ఫోన్ను తీసుకొచ్చింది. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, 4030 ఎంఏహెచ్ బ్యాటరీలను ఇందులో అందించారు.(చదవండి: పడిపోయిన మొబైల్ అమ్మకాలు) వివో వై1ఎస్ స్పెసిఫికేషన్స్ వివో వై1ఎస్ లో 6.22 అంగుళాల హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేను అందించనున్నారు. దీని పిక్సెల్ రిజల్యూషన్ 720 x 1520గా ఉండనుంది. స్క్రీన్ టు బాడీ రేషియో 88.6 శాతంగా ఉండనుంది. మీడియాటెక్ హీలియో పీ35 ఎంటీ6765 ప్రాసెసర్పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఇందులో అందించనున్నారు. స్టోరేజ్ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఇందులో సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఫోన్ వెనుక భాగంలో ఎల్ఈడి ఫ్లాష్ ఉన్న13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆధారిత ఫన్టచ్ ఓఎస్ 10.5పై నడుస్తుంది. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4,030 ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చింది. అరోరా బ్లూ, ఆలివ్ బ్లాక్ అనే రెండు రంగులలో లభిస్తుంది. డ్యూయల్ 4జీ వోల్టే, 2.4 గిగా హెర్ట్జ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, మైక్రో యూఎస్బీ 2.0, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ ఓటీజీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు. ఈ ఫోన్ కంపెనీ వెబ్ సైట్లో లిస్ట్ అయింది. కానీ దీని ధరను అధికారికంగా ప్రకటించలేదు. అయితే ముంబైకి చెందిన రిటైలర్ మహేష్ టెలికాం దీని 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.7,999గా పేర్కొన్నారు. -
పడిపోయిన మొబైల్ అమ్మకాలు
న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగా సీజన్ లో రికార్డు స్థాయిలో జరిగిన స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఆ తర్వాత డిమాండ్ 20-25% పడిపోయిందని నిపుణులు తెలిపారు. ఇది తమకు బ్లాక్ సీజన్ అని నేషనల్ రిటైల్ స్టోర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఏడాది అమ్మకాలు సంవత్సరానికి 50% పైగా పడిపోయాయని చెప్పారు. కౌంటర్ పాయింట్ టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ ప్రకారం, స్మార్ట్ ఫోన్ అమ్మకాలు నవంబర్ లో 25% వరకు పడిపోయాయి. వచ్చే డిసెంబరు నెలలో మరింత తగ్గుతాయి అని తెలిపింది. సాధారణంగా దీపావళి తరువాత నెలవారీ అమ్మకాలు పడిపోతాయి. అయితే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా పడిపోయే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దసరా పండుగ సీజన్ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో ఎక్కువ షిప్మెంట్స్ ఉంటాయి. ఈసారి దీపావళి తర్వాత కూడా సేల్స్ వెంటనే పడిపోయాయి. (చదవండి: బడ్జెట్ లో రెడ్మీ నోట్ 9 5జీ మొబైల్స్) "పండుగ అమ్మకాల కోసం కంపెనీలు ఫోన్లను నిల్వ చేయటం వల్ల సెప్టెంబర్ లో సాధారణంగా కన్న ఎక్కువ అమ్మకాలు జరిగాయి. కానీ దీపావళి అమ్మకాల తరువాత వెంటనే అమ్మకాలు పడిపోయాయి. దాదాపు ఈ తగ్గుదల శాతం 20 నుండి 25 వరకు ఉండవచ్చని" కౌంటర్ పాయింట్ పరిశోధనా డైరెక్టర్ తరుణ్ పాథక్ అన్నారు. సాధారణంగా పండుగ సీజన్ లో డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు ఇవ్వడం వల్ల సాధారణం కంటే 2-3 రెట్లు ఎక్కువ అమ్మకాలు జరుగుతాయి. అలాగే పండుగ సీజన్ తర్వాత అమ్మకాలు తగ్గుతాయని అశ్విని భడోరియా అన్నారు. షియోమి, వివో, రియల్మీతో సహా అగ్ర బ్రాండ్లు ఈ సీజన్లో అత్యధిక దీపావళి అమ్మకాలను జరిపినట్లు తెలిపాయి. ఆపిల్ జూలై-సెప్టెంబర్ కాలంలో అత్యధికంగా ఎగుమతులు నమోదు చేసింది. లేటెస్ట్ ఐఫోన్స్ లాంచింగ్కు ముందే సేల్స్ రికార్డు సృష్టించాయి. తమకు అక్టోబర్ ఒక చెత్త నెల అని, నవంబర్ నెలలో సేల్స్ పుంజుకున్నప్పటికీ దీపావళి తర్వాత మళ్లీ పడిపోయాయని రిటైలర్స్ వాపోతున్నారు. -
వివో నుండి మరో బడ్జెట్ ఫోన్
మొబైల్ ప్రపంచంలో చైనా మొబైల్ సంస్థల హవా కొనసాగుతూనే ఉంది. తాజాగా వివో తమ వినియోగదారుల కోసం బడ్జెట్ ధరలో మరో మొబైల్ ని తీసుకువచ్చింది. "వివో వై12ఎస్" పేరుతో హాంకాంగ్ మరియు వియత్నాం మార్కెట్ లోకి ప్రవేశ పెట్టింది. ఈ మొబైల్ లో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ను అందించింది. వివో వై 12 ఎస్ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ వి 10 (క్యూ) ఆపరేటింగ్ సిస్టమ్పై నడుస్తుంది. దీనిలో 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఫాంటం బ్లాక్, గ్లేసియర్ బ్లూ రంగుల్లో లభించనున్నాయి. వివో వై 12 ఎస్ స్మార్ట్ఫోన్లో ఐపిఎస్ ఎల్సిడి డిస్ప్లే ఉంది. స్క్రీన్ 720 x 1600 పిక్సెల్స్ మరియు 270 పిపిఐ పిక్సెల్ డెన్సిటీ రిజల్యూషన్ కలిగి ఉంది. కెమెరా ముందు భాగంలో 8 ఎంపీ కెమెరా, అలాగే ప్రధాన కెమెరా విషయానికి వస్తే 16 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ వైడ్ యాంగిల్, అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ కెమెరా ఉన్నాయి. ఇది 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్ ఫీచర్లు కూడా ఉన్నాయి. డ్యూయల్ 4జీ వోల్టే, 2.4 గిగాహెర్ట్జ్ వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, మైక్రో యూఎస్బీ 2.0, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందించారు. భారతదేశంలో వివో వై 12 ఎస్ స్మార్ట్ఫోన్ ధర రూ .11,999గా ఉండనుంది. -
దివాలీ ఆఫర్ : 101 రూపాయలకే స్మార్ట్ఫోన్
సాక్షి, ముంబై: పండగ సీజన్ను పురస్కరించుకుని మొబైల్ కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించడం కామనే. ఈ క్రమంలోనే రానున్న దీపావళి పర్వదినం సందర్భంగా స్మార్ట్ఫోన్ తయారీదారు వివో బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండుగ సందర్భంగా వీ 20ఎస్, వీ 20, ఎక్స్ 50 సీరిస్ స్మార్ట్ఫోన్లను 101 రూపాయలకే సొంతం చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ఐసీఐసీఐ, కోటక్, ఫెడరల్బ్యాంకు , బ్యాంక్ ఆఫ్బరోడాల కార్డు కొనుగోళ్లపై 10శాతం క్యాష్బ్యాక్ అందిస్తోంది. దీపావళి ఆఫర్లతో కొత్త ఆనందాన్ని వెలిగించండి అంటూ వివో తాజాగా ట్వీట్ చేసింది. కేవలం రూ. 101 చెల్లించి మీ రెంతో ఇష్టపడే వివో ఫోన్ను సొంతం చేసుకోండి. దీంతోపాటు అదనపు ప్రయోజనాలను కూడా ఆస్వాదించండని పేర్కొంది. అయితే ఎప్పటినుంచి ఎప్పటివరకు ఈ ఆఫర్ అందుబాటులోఉండనుందీ స్పష్టత ఇవ్వలేదు. ఈ ఆఫర్ ప్రకారం మొదట 101 రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించి పైన పేర్కొన్న వాటిలో నచ్చిన స్మార్ట్ఫోన్ను సొంతం చేసుకోవచ్చు. అనంతరం ఫోన్ విలువ మొత్తాన్ని ఎంపికచేసిన సులభ ఈఎంఐ వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. Light up a new delight with great Diwali offers. Get your hands on the most loved vivo phones by paying just ₹101 and enjoy additional benefits. Click on the link to find the nearest vivo store: https://t.co/GYFTgNDbnQ pic.twitter.com/zzTwxLPhqv — Vivo India (@Vivo_India) November 6, 2020 -
5జీ ఫోన్ల హవా : వివో ఎక్స్ 50ఈ
సాక్షి, ముంబై: స్మార్ట్ఫోన్ మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు కూడా వివో కూడా 5 జీ సిరీస్ లో వివో ఎక్స్ 50 , వివో ఎక్స్ 50 ప్రో ఫోన్లతో విభాగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఎక్స్ 50 ఈ 5 జీ తైవాన్లో విడుదల చేసింది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765 జీ సాక్, 6.44-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, క్వాడ్ రియర్ కెమెరా సెటప్తో దీన్ని తీసుకొచ్చింది. వివో ఎక్స్ 50ఈ 5 జీ ధర సుమారు రూ .35600 వివో ఎక్స్ 50ఈ 5జీ ఫీచర్లు 6.44 అంగుళాలు అమోలెడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 10 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765జీ సాక్ చే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీకెమెరా 48+13+8+2 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా 4350 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం -
ఐపీఎల్ 2020 : బిడ్డింగ్ రేసులో పతంజలి
సాక్షి,న్యూఢిల్లీ : మెగా స్పోర్ట్స్ ఈవెంట్ ఐపీఎల్-2020 టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి వివో నిష్క్రమించిన తరువాత, యోగా గురువు బాబా రాందేవ్కు చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి రేసులో ముందుకు వచ్చింది. తన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చే వ్యూహంలో పంతాంజలి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం ప్రయత్నిస్తోంది. ఈ అంశాన్ని తాము పరిశీలిస్తున్నామంటూ ప్రతినిధి ఎస్ కె టిజరవాలా ధృవీకరించారు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆగస్టు 14 లోగా తన ప్రతిపాదనను సమర్పించాల్సి ఉందని చెప్పారు. (‘వివో’ లేకుంటే నష్టమేం లేదు: గంగూలీ ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)13 వ ఎడిషన్ టైటిల్ స్పాన్సర్ల వివాదం నేపథ్యంలోస్వదేశీ బ్రాండ్ పతంజలి రంగంలోకి దిగింది. తద్వారా తమ బ్రాండ్ కు అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావాలని భావిస్తోంది. హరిద్వార్కు చెందిన పతంజలి గ్రూప్ టర్నోవర్ సుమారు10,500 కోట్ల రూపాయలు. అదానీ గ్రూపుతో పోటీ పడి పరీ భారీ అప్పుల్లో కూరుకుపోయిన రుచీ సోయాను కొనుగోలు చేసింది. అయితే ఇటీవల ఆయుర్వేద మందు కరోనిల్ కరోనా నివారణకు విజయవంతంగా పనిచేస్తుందని ప్రకటించి వివాదంలో పడింది. (ఐపీఎల్ : ఒమర్ అబ్దుల్లా సెటైర్లు) కాగా చైనా-ఇండియా సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా కంపెనీలతో సహా అన్న స్పాన్సర్ షిప్ లను కొనసాగిస్తూ బీసీసీఐ తీసుకున్ననిర్ణయం విమర్శలకు దారితీసింది. ఇప్పటికే అమెజాన్, బైజూస్, డ్రీమ్ 11 వంటి టాప్ బ్రాండ్స్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ రేసులో ఉన్న సంగతి తెలిసిందే. -
‘వివో’ లేకుంటే నష్టమేం లేదు: గంగూలీ
న్యూఢిల్లీ: చైనా మొబైల్ సంస్థ ‘వివో’ ఈ ఏడాది ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకున్నంత మాత్రాన బోర్డు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. బీసీసీఐ దగ్గర ఎప్పుడూ ప్లాన్ ‘బి’ ఉండనే ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఒక వెబినార్లో అతడు మాట్లాడుతూ ‘నేను దీన్ని పెద్ద ఆర్థిక నష్టంలా భావించడం లేదు. ఇది కేవలం తాత్కాలిక సమస్య మాత్రమే. గత బోర్డు పాలకులు, మేటి ఆటగాళ్లు బీసీసీఐకి పటిష్ట పునాదులు వేశారు. అప్పుడపుడు ఎదురయ్యే సమస్యల్ని బలమైన బోర్డు ఎప్పట్లాగే అధిగమిస్తుంది. (ఆర్సీబీతోనే నా ప్రయాణం) గొప్ప ఘనతలు, విశేషాలు ఇవన్నీ రాత్రికి రాత్రే జరిగిపోవు. అలాగే ఒక్కరాత్రితోనూ కూలిపోవు. కొన్ని నిర్ణయాలు లాభాలు తెస్తే మరికొన్ని నష్టాలు తేవొచ్చు. దేన్నయినా ఎదుర్కోవాలి. ధైర్యంగా సాగాలి’ అని అన్నాడు. చైనీస్ మొబైల్ బ్రాండ్ 2018– 2022 కాలానికి గానూ రూ. 2199 కోట్లు చెల్లించేలా బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులతో భారత్లో చైనా ఉత్పాదనలన్నీ నిషేధించాలనే ఉద్యమం మొదలైంది. ఈ నేపథ్యంలో ‘వివో’ ఈ ఏడాది టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకోవడంతో బీసీసీఐ స్పాన్సర్ వేటలో పడింది. అంతేకాకుండా 2021లో జరిగే పురుషుల టి20 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను భారత్ చేజిక్కించుకోవడం తనకేం ఆశ్చర్యాన్ని కలిగించలేదని గంగూలీ అన్నాడు. ‘షెడ్యూల్ ప్రకారం 2021లో టి20, 2023లో వన్డే ప్రపంచ కప్లు భారత్ వేదికగా జరగాల్సి ఉన్నాయి. ఇప్పుడు అదే జరుగుతోంది’ అని గంగూలీ పేర్కొన్నాడు. 2022 టి20 ప్రపంచ కప్కు ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది.(సూపర్ కింగ్స్ ట్రైనింగ్కు గ్రీన్ సిగ్నల్) -
ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ ఎవరు?
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)టైటిల్ స్పాన్సర్గా ఉండలేమన్న వివో అభ్యర్థనను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) మన్నించింది. గురువారం వివోతో కటీఫ్కు భారంగానే ఓకే చెబుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు చైనా యాప్లను భారత ప్రభుత్వం నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న సమయంలో వివోను బీసీసీఐ కొనసాగించడం పెద్ద దుమారం లేచింది. అటు రాజకీయ విమర్శలతో పాటు ఇటు సోషల్ మీడియాలో సైతం బీసీసీఐ తీరును ఎండగడుతూ పోస్టులు పెట్టారు. దాంతో వివోనే సొంతంగా తప్పుకోవడానికి నిర్ణయించుకుంది. ఇదే ప్రతిపాదనను బీసీసీఐ ముందుంచగా దానికి ఎట్టకేలకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. అయితే కొత్త టైటిల్ స్పాన్సర్ వేటలో పడింది బీసీసీఐ. ఐపీఎల్ నిర్వహణకు ఇంకో నెల మాత్రమే సమయం ఉండటంతో టైటిల్ స్పాన్సర్ను ఎంపిక చేసుకోవడం బీసీసీఐకి సవాల్గా మారింది. వచ్చే నెల 19వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ ప్రారంభం కానున్న తరుణంలో టైటిల్ స్పాన్సర్ కోసం వెతుకులాట ఆరంభించాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టైటిల్ స్పాన్సర్షిప్ కోసం ఎవరు ముందుకొస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ టైటిల్ స్పాన్సర్ కోసం ఎవరైనా వచ్చినా తక్కువ మొత్తంలోనే దానికి డీల్ కుదుర్చుకునే అవకాశం కూడా లేకపోలేదు. (కోహ్లికి ఒత్తిడి తగ్గిస్తా: ఆసీస్ కెప్టెన్) 2008లో ఐపీఎల్ మొదలైన తర్వాత ముందుగా డీఎల్ఎఫ్, ఆ తర్వాత పెప్సీ ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరించాయి. అయితే స్పాట్ ఫిక్సింగ్ అనంతరం వచ్చి న వివాదాలతో పెప్సీ అర్ధాంతరంగా తమ కాంట్రాక్ట్ను రద్దు చేసుకోగా మధ్యలో రెండేళ్ల కాలానికి ‘వివో’ స్పాన్సర్షిప్ కోసం ముందుకు వచ్చింది. ఆ తర్వాత 2017లో బోర్డుతో వివో ఐదేళ్ల కాలానికి భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుంది. 2018–2022 మధ్య ఐదేళ్ల ఐపీఎల్కు రూ. 2199 కోట్లు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ ఏడాదికి రూ. 440 కోట్ల చొప్పున చెల్లించేందుకు సిద్ధమైంది. ఇందులో ప్రస్తుతం రెండేళ్లు మాత్రమే పూర్తి కాగా, మూడో ఏడాదే సమస్యలు తలెత్తాయి. చైనాతో విభేదాల కారణంగా ఆ దేశానికి చెందిన కంపెనీలపై భారత్ దృష్టి పెట్టిన నేపథ్యంలో వివో అందులో చేరింది. ఈ క్రమంలోనే విమర్శల దాటిని తట్టుకోలేక వివో స్వచ్ఛందంగా తప్పుకోవడానికి మొగ్గుచూపింది. దీనిపై బీసీసీఐ పెద్దలు పలుమార్లు చర్చలు జరిపిన పిదప చేసేది లేక అంగీకారం తెలిపారు. ఇప్పటికే టీమిండియా కిట్ స్పాన్సర్షిప్ కోసం బిడ్లు ఆహ్వానించిన బీసీసీఐ.. ఇప్పుడు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ కోసం వేట ప్రారంభించాల్సి ఉంది. దీనికి బిడ్లు వేస్తారా లేక ఏ సంస్థకైనా తమ ఇష్టప్రకారం టైటిల్ స్పాన్సర్ హక్కులు ఇస్తారా అనేది చూడాలి. ఇది ఈ ఏడాదికే అని చెబుతున్నా రాబోవు సీజన్లో కూడా వివోతో బీసీసీఐ ఎంతవరకూ జోడి కడుతుందా అనే ప్రశ్న కూడా మొదలవుతుంది. ఇరు దేశాల మధ్య ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు దానికి తొందరగా ముగింపు దొరుకుతుందనుకుంటే పొరపాటు. చైనాను ఆర్థికంగా దెబ్బ కొట్టి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని భారత ప్రభుత్వం చూస్తున్న సమయంలో వివోతో మళ్లీ ఒప్పందం అనేది ఉంటుందా అనేది క్రికెట్ అభిమానులకు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ వివోతో ఒప్పందం ఓవరాల్గా రద్దయితే మాత్రం బీసీసీఐ భారీ మొత్తంలోనే నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఇప్పటికే ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్కు వెళుతున్న బీసీసీఐ.. ఎంతకొంతా ఉపశమనం పొందినా పూర్తిస్థాయి లాభాలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ చూడలేదు. ఇటువంటి తరుణంలో వివో తప్పుకోవడం బీసీసీఐకి మరో దెబ్బ. అయినప్పటికీ ప్రపంచ ధనిక క్రికెట్ బోర్డుల్లో టాప్ ప్లేస్లో ఉన్న బీసీసీఐకి ఈ నష్టం నుంచి బయటపడటానికి కూడా ఎంతో సమయం పట్టకపోవచ్చు. ఇదిలా ఉంచితే, అనేక సమస్యల మధ్య ఐపీఎల్కు వెళుతున్న బీసీసీఐ.. ఈ క్యాష్ రిచ్ లీగ్ను ఎంతవరకూ సక్సెస్ ముగిస్తుందనే విషయంలో కూడా ఆసక్తి ఏర్పడింది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ.. ఐపీఎల్ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతోనే అందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. బయో సెక్యూర్ విధానంలో ఐపీఎల్ను సమర్థవంతంగా నిర్వహించడం అనేది ఇప్పుడు బీసీసీఐ ముందున్న చాలెంజ్. -
ఐపీఎల్ నుంచి వివో తప్పుకుంది!
న్యూఢిల్లీ: భారత్-చైనా వివాదం నేపథ్యంలో చైనాకు చెందిన యాప్లపై భారత్ నిషేధం విధించుకుంటూ పోతుంటే, చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ వివోను ఐపీఎల్కు టైటిల్ స్పాన్సర్గా కొనసాగించడానికి బీసీసీఐ మొగ్గుచూపడంతో ఇప్పటివరకూ తీవ్ర దుమారం రేగింది. అదే సమయంలో బీసీసీఐ వ్యహరిస్తున్న తీరును వేలెత్తి చూపుతూ రాజకీయ విమర్శలు ఊపందుకున్నాయి. ప్రధానంగా సోషల్ మీడియాలో విమర్శల జోరు అందుకోవడంతో వాటికి ముగింపు పలకడానికి వివో సిద్ధమైంది. ఈ క్రమంలోనే స్వచ్ఛందంగానే ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. (‘కిట్’ స్పాన్సర్ వేటలో...) అయితే బీసీసీఐ మాత్రం ఇంకా అంగీకరించనట్లే తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరి మధ్య చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఇటీవల భారతదేశం – చైనా సరిహద్దు లలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో వివిధ రంగాల నుండి చైనా వస్తువులను బాయ్ కాట్ చెయ్యాలని పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం చైనా దేశానికి సంబంధించి 59 యాప్లను నిషేధించిన సంగతి కూడా విదితమే. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ స్పాన్సర్ గా కొనసాగడం మంచిది కాదని భావించిన వివో సంస్థ స్వచ్ఛందంగా స్పాన్సర్ షిప్ నుండి విరమించుకోవడానికి సన్నద్ధమైంది. (వద్దు సార్.. జట్టును నాశనం చేస్తాడు!) అయితే కేవలం ఈ సంవత్సరానికి మాత్రమే తప్పుకునే విధంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్ షిప్ సంబంధించి వివో హక్కులను ఐదు సంవత్సరాల కాలంలో ఏకంగా రూ. 2199 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి వివో ప్రతి సంవత్సరం జరిగే లీగ్ లో రూ. 440 కోట్లు చెల్లించేలా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే తాజాగా జరిగిన ఐపిఎల్ సమావేశంలో చర్చల తర్వాత వివో కంపెనీని ఐపీఎల్ స్పాన్సర్ గా కొనసాగుతుందని బీసీసీఐ తెలిపిన తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో బీసీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఐపీఎల్ ను బహిష్కరించాలని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరన్ మంచ్ పిలుపు ఇచ్చింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వివో సంస్థ స్పాన్సర్ షిప్ తప్పుకోవడమే మంచిదని నిర్ణయించింది. అది కూడా ఈ ఏడాది సీజన్ ఐపీఎల్కు దూరంగా ఉండబోతున్నట్లు బీసీసీఐకి తెలిపింది. దీనిపై బీసీసీఐ-వివోల మధ్య చర్చలు నడుస్తున్నాయి. (ఐపీఎల్కు కేంద్రం గ్రీన్సిగ్నల్)