-
వచ్చేస్తోంది..వివో ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్..లాంచ్ ఎప్పుడంటే..?
ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్స్ భారీ ఆదరణను నోచుకుంటున్నాయి. ఇప్పటికే శాంసంగ్ లాంటి కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల మార్కెట్లను యేలుతున్నాయి. ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లపై వస్తోన్న ఆదరణపై దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీలు దృష్టి సారించాయి. ఇప్పటికే ఒప్పో ఫోల్డబుల్ ఎన్ పేరుతో స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ రేసులోకి వివో కూడా వచ్చి చేరనుంది. త్వరలోనే ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేసేందుకు ప్రణాళికలను రచిస్తోంది వివో. ఏప్రిల్ 11 న లాంచ్..! మొదటి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను వివో ఏప్రిల్ 11న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. వివో ఎక్స్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్కు సంబంధించిన పలు వివరాలను కంపెనీ టీజ్ చేసింది. Vivo X ఫోల్డ్ స్మార్ట్ఫోన్ భారీ స్క్రీన్, బ్యాటరీతో రానున్నుట్లు సమాచారం. దీంతో పాటుగా ఏప్రిల్లో జరిగే లాంచ్ ఈవెంట్లో...వివో ప్యాడ్ టాబ్లెట్, Vivo X ఫోల్డ్ ఫోల్డబుల్ ఫోన్, Vivo X నోట్ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ వంటి మూడు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్లకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది. చైనీస్ సోషల్మీడియా విబో ప్రకారం..వివో ఎక్స్ ఫోల్డ్ స్మార్ట్ఫోన్ 12జీబీ ర్యామ్+ 256జీబీ, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చే అవకాశం ఉంది. బ్లూ, క్రిమ్సన్, ఆరేంజ్ కలర్ వేరియంట్స్లో రానుంది. Vivo X ఫోల్డ్ స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 చిప్సెట్ ప్రాసెసర్తో రానున్నట్లు సమాచారం. చదవండి: ఆస్కార్ గెలిచిన ‘డూన్’.. అవార్డు రావడంలో మనోడిదే కీలక పాత్ర -
స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో 'లోకల్' స్కెచ్!! వేలకోట్లలో పెట్టుబడులు!
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ వివో రానున్న రెండేళ్లలో దేశీయంగా రూ.3,500 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉంది. అంతేకాకుండా ఈ కేలండర్ ఏడాది(2022)లో దేశీయంగా తయారైన మొబైల్ ఫోన్లను విదేశాలకు ఎగుమతి చేసే యోచనలో ఉంది. దేశీయంగా మొత్తం రూ. 7,500 కోట్ల పెట్టుబడులకు కట్టుబడి ఉన్నట్లు వివో ఇండియా (వ్యాపార వ్యూహాల) డైరెక్టర్ పాయిగమ్ డానిష్ తాజాగా తెలియజేశారు. తద్వారా దేశీయంగా తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ బాటలో ఇప్పటికే(2021 వరకూ) రూ.1,900కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు.రానున్న రెండేళ్లలో మరో రూ.3,500 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేశారు. పెట్టుబడులన్నీ తయారీకే వినియోగించనున్నట్లు స్పష్టం చేశారు. లోకల్ డిమాండ్ స్థానికంగా మొబైల్ ఫోన్లకున్న డిమాండుకు అనుగుణంగా గ్రేటర్ నోయిడా ప్లాంట్ల నుంచి సరఫరాలు చేస్తున్నట్లు డానిష్ పేర్కొన్నారు. ఇకపై హ్యాండ్సెట్లను ఎగుమతి చేయడంపై దృష్టిసారించనున్నట్లు వెల్లడించారు. వెరసి ఈ ఏడాది నుంచే ఎగుమతులను చేపట్టనున్నట్లు తెలియజేశారు. దేశీ అవసరాలకు అనుగుణంగా గత ఏడేళ్లలో తామెంత బలపడిందీ ఈ అంశాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశీ మార్కెట్లో వివో 10 కోట్లకుపైగా వినియోగదారులను చేరుకున్నట్లు తెలియజేశారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐడీసీ ప్రకారం 2021లో షియోమీ, శామ్సంగ్ తదుపరి 15.6 శాతం మార్కెట్ వాటాతో దేశీయంగా మూడో ర్యాంకులో నిలిచినట్లు వెల్లడించారు. మరో 5000 మందికి ఉపాధి ప్రస్తుతమున్న 6 కోట్ల స్మార్ట్ఫోన్ తయారీ సామర్థ్యాన్ని 12 కోట్లకు పెంచుకునే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు డానిష్ తెలియజేశారు. ఇందుకు వెచ్చిస్తున్న రూ. 7,500 కోట్ల పెట్టుబడులతో ఉద్యోగుల సంఖ్య 40,000కు చేరనున్నట్లు తెలియజేశారు. తయారీ యూనిట్లలో ప్రస్తుతం 10,000 మంది విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 2023లో అదనంగా 5,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు. గ్రేటర్ నోయిడాలో కొనుగోలు చేసిన మరో 169 ఎకరాలలో కొత్త ప్లాంటును నెలకొల్పుతున్నట్లు పేర్కొన్నారు. స్థానిక వస్తువులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం బ్యాటరీలను 90 శాతం, చార్జర్లను 60 శాతంవరకూ దేశీయంగానే సమకూర్చుకుంటున్నట్లు వివరించారు. 2023కల్లా 65 శాతం డిస్ప్లేలను స్థానికంగా రూపొందించనున్నట్లు వెల్లడించారు. -
పవర్ఫుల్ ర్యామ్, 50 ఎంపీ కెమెరాతో వివో 5జీ స్మార్ట్ఫోన్..ధర ఎంతంటే..?
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో తాజాగా భారత మార్కెట్లో టీ1 5జీ ఫోన్ను ఆవిష్కరించింది. టీ సిరీస్లో ఇది మొదటి స్మార్ట్ఫోన్ అని సంస్థ తెలిపింది. ఫ్లిప్కార్ట్, వివో పోర్టల్, రిటైల్ స్టోర్స్లో దీని ధర రూ. 15,990 నుంచి రూ. 19,990 వరకూ ఉంటుంది. ప్రత్యేక ఆఫర్లు వినియోగించుకుంటే రూ. 14,990కే పొందవచ్చని వివో వివరించింది. ప్రధానంగా యువతను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు తెలిపింది. రూ. 20,000 లోపు ధరలో ఇది అత్యంత పల్చని స్మార్ట్ఫోన్ అని పేర్కొంది. ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీప్లస్ ఫోన్లో 50 ఎంపీ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫన్టచ్ ఓఎస్ 12 మొదలైన ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు రంగుల్లో (స్ట్రెయిట్ బ్లాక్, రెయిన్బో ఫ్యాంటసీ) లభిస్తుంది. చదవండి: తక్కువ ధరలో సూపర్ ఫీచర్స్తో ఐటెల్ ఇయర్ బడ్స్..! ధర ఏంతంటే..? -
గంటకు 19 వేలకుపైగా స్మార్ట్ఫోన్స్ అమ్మకాలు..! ఇండియన్స్ ఫేవరెట్ బ్రాండ్ అదే..!
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 అన్ని రంగాలపై భారీ ప్రభావాన్ని చూపింది. ఆటోమొబైల్, సర్వీస్ సెక్టార్స్ భారీ నష్టాలను చవిచూశాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రేరిత బాధల నుంచి స్మార్ట్ఫోన్ ఇండస్ట్రీ సురక్షితంగా తప్పించుకుంది. 2021లో భారత్ స్మార్ట్ఫోన్ మార్కెట్ సుమారు రెండు లక్షల కోట్ల విలువైన స్మార్ట్ఫోన్ అమ్మకాలను ఆయా స్మార్ట్ఫోన్ కంపెనీలు జరిపినట్లు తెలుస్తోంది. చిప్స్ కొరత ఉన్నప్పటీకి..! ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీలకు చిప్స్ కొరత తీవ్రంగా వేధించింది. చిప్స్ కొరత ఉన్పప్పటీకి భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ ఆదాయం 38 బిలియన్ డాలర్లను అధిగమించింది. 2021లో దాదాపు రూ. 2,83,666 కోట్లకు చేరుకుంది. 2020తో పోలిస్తే 27 శాతం అధికంగా స్మార్ట్ఫోన్ అమ్మకాలు జరిగాయి. 2021లో భారతీయులు ప్రతి గంటకు 19,406 స్మార్ట్ఫోన్స్ను కొనుగోలు చేశారు. మొత్తంగా 16 కోట్లకు పైగా స్మార్ట్ఫోన్ అమ్మకాలు జరిగాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. ఇది భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ ఇప్పటివరకు చూసిన అత్యధిక షిప్మెంట్. ఇదిలా ఉండగా కాంపోనెంట్ కొరత కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో ఎగుమతులు మందగించడం విశేషం. టాప్ బ్రాండ్ అదే..! భారత స్మార్ట్ఫోన్ ఇండస్ట్రీలో 2021గాను షావోమీ బ్రాండ్ టాప్ ప్లేస్లో నిలిచింది. షావోమీ 24 శాతం వాటాను ఆక్రమించింది. Mi 11 సిరీస్ అమ్మకాలతో కంపెనీ ఆదాయంలో 258 శాతం పెరుగుదల కన్పించింది. అయినప్పటికీ, కాంపోనెంట్స్ సరఫరాలో పరిమితుల కారణంగా కంపెనీ నాల్గవ త్రైమాసికంలో ఎగుమతులలో మందగమనాన్ని ఎదుర్కొంది. ఇక రెండో స్థానంలో శాంసంగ్ నిలిచింది. శాంసంగ్ 2021లో 8 శాతం క్షీణతను నమోదుచేసింది. రూ. 20,000 నుంచి రూ. 45,000 సెగ్మెంట్లోని 5G స్మార్ట్ఫోన్ల ద్వారా మార్కెట్లో 18 శాతం వాటాను పొందింది. శామ్సంగ్కు ఇది శుభవార్త అయినప్పటికీ, ఇది కూడా సరఫరా గొలుసు అంతరాయాలను ఎదుర్కోవలసి వచ్చింది. శాంసంగ్ ఫోల్డబుల్ విభాగంలో అగ్రగామిగా నిలిచింది. ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లలో 2021గాను 388 శాతం వృద్ధిని శాంసంగ్ సాధించింది. రియల్మీ మూడో స్థానంలో నిలవగా, భారత్లో అత్యంత చురుకైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ రియల్మీ అవతరించింది. Vivo, Oppo నాలుగు, ఐదవ స్థానాలను కార్నర్ చేయగలిగాయి. వివో 2021లో 19 శాతం వాటాతో టాప్ 5G స్మార్ట్ఫోన్ బ్రాండ్గా అవతరించిగా...ఒప్పో 6 శాతం వృద్ధిని కనబరిచింది. ఇక యాపిల్ 2021గాను 108 శాతం వృద్దిని నమోదుచేసింది. చదవండి: చిప్ షార్టేజ్ సంక్షోభం.. అయినా 583.5 బిలియన్ డాలర్ల షాకింగ్ బిజినెస్తో హిస్టరీ! -
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ నుండి తప్పుకున్న వివో
-
ఇకపై 'వివో' కాదు 'టాటా' ఐపీఎల్.. ఐపీఎల్ 2022లో కీలక మార్పు
Tata IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్కు సంబంధించి కీలక మార్పు చోటు చేసుకుంది. టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి చైనా మొబైల్ సంస్థ ‘వీవో’ తప్పుకుంది. 2018 నుంచి టైటిల్ స్పాన్సర్గా ఉన్న వీవో.. మరో రెండేళ్ల గడువు ఉండగానే నాటకీయ పరిమాణాల మధ్య వైదొలగడంతో దేశీయ వ్యాపార దిగ్గజం 'టాటా' టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించనుందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వెల్లడించింది. ఈ ఏడాది ఐపీఎల్తో పాటు 2023 సీజన్కు కూడా టాటానే టైటిల్ స్పాన్సర్ చేయనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ ప్రకటించారు. కాగా, భారత్-చైనాల మధ్య వివాదాల కారణంగా 2020 సీజన్లో వీవో టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పించబడిన సంగతి తెలిసిందే. అప్పుడు వీవో స్థానంలో ‘డ్రీమ్ 11’ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించింది. చదవండి: ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కీలక సమావేశం.. ఖరారు కానున్న షెడ్యూల్! -
ఊసరవెల్లిలా రంగులు మార్చే ఫోన్ చూశారా..?
ఊసరవెల్లిలా రంగులు మారే ఫోనేంటి...? ఆశ్యర్యపోతున్నారా...మీరు చూసింది నిజమే... ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో లాంచ్ చేసిన స్మార్ట్ఫోన్ బ్యాక్ ప్యానల్ అచ్చం ఊసరవెల్లిలాగా రంగులు మార్చేస్తుంది. తొలి కలర్ ఛేజింగ్ బ్యాక్ ప్యానల్ స్మార్ట్ఫోన్ను వివో భారత్లో బుధవారం రోజున లాంచ్ చేసింది. ఏరోస్పేస్ గ్రేడ్తో స్మార్ట్ఫోన్...! చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో భారత్లోకి సరికొత్త వివో వీ23 సిరీస్ స్మార్ఫోన్ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ బ్యాక్ ప్యానల్ రంగులు మారడంతో పాటుగా భారతదేశపు మొట్టమొదటి 50ఎంపీ 'ఐ ఏఎఫ్(ఆటోఫోకస్) డ్యూయల్ సెల్ఫీ' కెమెరా స్మార్ట్ఫోన్గా వివో వీ23 సిరీస్ నిలుస్తోంది. వివో వీ23 స్మార్ట్ఫోన్ను ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ డిజైన్తో రానుంది. ఈ ఫోన్ కేవలం 30 నిమిషాల్లో 1 నుంచి 63 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతోంది. ఇండియన్ ఫస్ట్ ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరాగా ఇది నిలుస్తోంది. వీ23 సిరీస్ స్మార్ట్ఫోన్స్ ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేశారు. ఇది మెటల్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్లో అద్భుతంగా సెట్ చేశారు.దీంతో స్మార్ట్ఫోన్ సన్నగా కేవలం 7.39 mm మందంతో ఉండనుంది. దీని బరువు కేవలం 179 గ్రాములు మాత్రమే. ధర ఎంతంటే..? న్యూ వివో వీ23, వీ23 ప్రొ అనే రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్ఫోన్ రానుంది. సన్షైన్ గోల్డ్, స్టార్డస్ట్ బ్లాక్ కలర్ వేరియంట్స్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. వీ23 ప్రో 8GB ర్యామ్+128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 38,990, వీ23 ప్రో 12GB ర్యామ్+256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 43,990 గా ఉంది. వివో వీ23 8GB ర్యామ్+128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,990 కాగా, 12GB ర్యామ్+256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,990గా ఉంది. ఈ స్మార్ట్ఫోన్లను జనవరి 13 నుంచి ఫ్లిప్ కార్ట్లో, జనవరి 19 నుంచి అన్ని వివో ఇండియా రిటైల్ స్టోర్స్లో విక్రయానికి అందుబాటులో ఉండనున్నాయి. వివో వీ23 ప్రో ఫీచర్స్ 6.56-అంగుళాల ఫుల్హెచ్డీ AMOLED డిస్ప్లే మీడియాటెక్ డిమెన్సీటీ 1200 చిప్ సెట్ ఫన్టచ్ ఒఎస్ 12 బేస్డ్ఆన్ ఆండ్రాయిడ్ 12 50ఎంపీ ఆటోఫోకస్డ్ డ్యూయల్ ఫ్రంట్ కెమెరా 108 ఎంపీ రియర్ కెమెరా 12జీబీ ర్యామ్+ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 5జీ సపోర్ట్ 4300mAh బ్యాటరీ 44W ఫాస్ట్ చార్జింగ్ చదవండి: బ్లాక్బెర్రీ.. ఒకప్పుడు ‘స్మార్ట్’ కింగ్.. మరి పతనానికి కారణాలు తెలుసా? ఇవే.. -
ఇది స్మార్ట్ఫోనా..ల్యాప్ట్యాపా...! వివో నుంచి కళ్లుచెదిరే గాడ్జెట్..!
ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్స్ భారీగా ఆదరణను నోచుకుంటున్నాయి. ఇప్పటికే శాంసంగ్ లాంటి కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల మార్కెట్లను యేలుతున్నాయి. ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లపై వస్తోన్న ఆదరణతో ఒప్పో, వివో లాంటి కంపెనీలు కూడా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను తయారుచేసే పనిలో నిమగ్నమైనాయి. ఇది స్మార్ట్ఫోనా..లేదా ల్యాప్ట్యాపా...! ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో అద్బుతమైన ఆవిష్కరణకు సిద్ధమైంది. ఫోల్టబుల్ స్మార్ట్ఫోన్లలో సరికొత్త ఆవిష్కరణతో వివో ముందుకురానుంది. స్మార్ట్ఫోనా లేదా ల్యాప్ట్యాపా అన్నట్లుగా వివో ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ ఉండనుంది. సాధారణంగా మనం వాడే ల్యాప్ట్యాప్లో స్క్రీన్తో పాటుగా కీబోర్డు హింజ్ సహయంతో కనెక్ట్ అయ్యి ఉంటాయనే విషయం తెలిసిందే. ప్రస్తుతం వివో ఇలాంటి ఆవిష్కరణను ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లో తెచ్చేందుకు సన్నాహాలను చేస్తోన్నట్లు తెలుస్తోంది. వివో హింజ్లెస్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్..! వివో మూడు మడతలతో ఫోల్టబుల్ స్మార్ట్ఫోన్కు సంబంధించిన పేటెంట్ కోసం ఈ ఏడాది జూన్లో USPTO (యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్మార్క్ ఆఫీస్)కి ఫైల్ చేసినట్లు లెట్స్ గో డిజిటల్ వెల్లడించింది. ఇది మడతపెట్టినప్పుడు సాధారణ స్మార్ట్ఫోన్లా కన్పిస్తూ టాబ్లెట్లా మారిపోతుంది. ఈ ఆవిష్కరణలో వర్చువల్ ప్రొజెక్షన్ కీబోర్డు హైలెట్గా నిలవనున్నుట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్లో అమర్చిన ప్రొజెక్టర్ ద్వారా వర్చువల్ కీబోర్డు కన్పించనుంది. లెట్స్గోడిజిటల్ భాగస్వామ్యంతో పర్వేజ్ ఖాన్ అనే గ్రాఫిక్ డిజైనర్ వివో పేటెంట్కు అప్లై చేసిన మోడల్ స్మార్ట్ఫోన్ వీడియోను తయారుచేశారు. చదవండి: అదిరిపోయే ఫీచర్లతో షావోమీ నుంచి 5జీ స్మార్ట్ఫోన్..! -
షావోమీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ఒప్పో,వివో..!
Xiaomi Revenue Fails To Meet Expectations As Competition From Oppo Vivo Intensifies: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమికి సమీప ప్రత్యర్థి స్మార్ట్ఫోన్ కంపెనీలైన ఒప్పో, వివో భారీ షాక్ను ఇచ్చాయి. స్మార్ట్ఫోన్ మార్కెట్లలో ఒప్పో, వివో కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ రావడంతో కంపెనీ ఆదాయ అంచనాలను చేరుకోవడంలో షావోమీ విఫలమైంది. కంపెనీ క్యూ3 రెవెన్యూలో కేవలం 0.4 శాతం వృద్దిని మాత్రమే నమోదు చేసింది. క్యూ3 రెవెన్యూలో షావోమీ 8.2 శాతం పెరుగుదలను సాధించింది. రిఫీనిటివ్ డేటా ప్రకారం...మూడు నెలల్లో (జూలై -సెప్టెంబర్) దాదాపు రూ. 90,910 కోట్ల విక్రయాలను షావోమీ జరిపింది. ఈ క్యూ3లో సుమారు రూ. 92,300 కోట్లను షావోమీ అంచనా వేసినట్లు తెలుస్తోంది. వన్-టైమ్ లాభాలు, నష్టాలను మినహాయించి, షావోమీ సుమారు రూ. 6,040 కోట్ల లాభాన్ని ఆర్జించింది. షావోమీ ఆదాయం కేవలం 0.4 శాతం పెరిగి రూ. 55,655 కోట్లకు చేరుకుంది. రీసెర్చ్ సంస్థ కెనాలిస్ ప్రకారం... చైనాలో స్మార్ట్ఫోన్ అమ్మకాలు జూలై-సెప్టెంబర్ కాలంలో దాదాపు 5 శాతం మేర పడిపోయాయి. హువావేపై అమెరికా ఆంక్షలను విధించడంతో షావోమీ ఈ మేర లాభాలను పొందినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమీప ప్రత్యర్థులు ఒప్పో, వివో కంపెనీలు క్యూ3లో గడించిన వృద్ధిని షావోమీ పొందలేకపోయింది. చైనాలో షావోమీ షిప్మెంట్లు మూడో త్రైమాసికంలో కేవలం 4 శాతం మేర పెరిగాయని కెనాలిస్ తెలిపింది. చదవండి: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే! -
ఎలక్ట్రిక్ వాహన మార్కెట్పై స్మార్ట్ఫోన్ కంపెనీల దండయాత్ర!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం. 91మొబైల్స్ నివేదిక ప్రకారం.. 2023 చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రారంభించాలని ఒప్పో కంపెనీ యోచిస్తోంది. ఒప్పో ఎలక్ట్రిక్ వేహికల్ గురించి వార్తలు ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా వార్తలు వినిపించాయి. ఈ నెల ప్రారంభంలో ఒప్పో తన సహ బ్రాండ్లు అయిన రియల్ మీ, వివోతో కలిసి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తులను దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒప్పో నిజంగా భారతదేశంలో ఈవీలను లాంఛ్ చేస్తుందా అనే విషయం గురుంచి కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. అయితే స్మార్ట్ఫోన్లతో పాటు దేశంలో ఎలక్ట్రిక్ వాహనలను తీసుకొనిరావలనే కంపెనీ విస్తరణ ప్రణాళికలను ఇది తెలియజేస్తుంది. తాజా నివేదిక ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఒప్పో ప్రణాళిక పనుల్లో ఇప్పటికే బిజీగా ఉంది. 2023 చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో దేశంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఒప్పో ఇప్పటికే తన ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై పని ప్రారంభించిందని, టెస్లాకు బ్యాటరీ అందజేసే తయారీదారులు, విడిభాగాల సరఫరాదారులతో ఒప్పో కంపెనీ సీఈఓ టోనీ చాన్ సమావేశాలు నిర్వహించారని ఈ ఏడాది మేలో వార్తలు వచ్చాయి. (చదవండి: కస్టమర్లకు గుడ్న్యూస్ చెప్పిన స్విగ్గీ..! ఇక అన్లిమిటెడ్..!) ఇక తన ప్రధాన ప్రత్యర్థి కంపెనీ షియోమీ కూడా 2024 మొదటి అర్ధభాగంలో తన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొని రావాలని యోచించడంతో ఒప్పో కూడా ఆ మార్కెట్లోకి రావాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది మార్చిలో ఈవీ మార్కెట్లోకి ప్రవేశించి, రాబోయే 10 ఏళ్లలో ఈ వ్యాపారంలో 10 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని షియోమీ తన ప్రణాళికల గురుంచి ప్రకటించింది. ఇది గత నెలలో తన ఎలక్ట్రిక్ వాహన వ్యాపారం కోసం షియోమీ ఈవీ ఇంక్ పేరునును కూడా నమోదు చేసింది. ఇప్పటికే భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో బలమైన ఉనికి కలిగి ఉన్న ఒప్పో, రియల్ మీ, షియోమీ వంటి కంపెనీలు ఈవి మార్కెట్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాయి. (చదవండి: ఆధార్ కార్డుదారులకు తీపికబురు.. కొత్తగా మరో 166 కేంద్రాలు!) -
ఈ ఫోన్ దూకుడు మామూలుగా లేదుగా, అదిరిపోయే ఫీచర్లతో
దసరా,దివాళీ సేల్స్తో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సందడి చేసిన చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో...తాజాగా మరో సిరీస్ ఫోన్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వరుస సిరీస్ విడుదలతో దూకుడు మీదున్న వివో సంస్థ ఇప్పటుడు'వీ23ఈ' పేరుతో మరో సిరీస్ను విడుదల చేయనుంది. త్వరలో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అందుబాటులోకి రానున్న సిరీస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు వెలుగులోకి వచ్చాయి. వివో వీ23ఈ ఫీచర్లు వివో వీ23ఈ సిరీస్ ఫోన్ ఫీచర్లపై టిప్స్టర్ సుధాన్షు ఆంబోర్ ట్వీట్ చేశారు. ఈ ఫోన్లో మీడియా టెక్ హీలియా జీ96 చిప్ సెట్, 4,050ఎంఏహెచ్ బ్యాటరీ, రెక్టాంగిల్ కెమెరా మాడ్యుల్, ట్రిపుల్ కెమెరా సెటప్, ఫోన్ వెనుక భాగంలో 64 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, వాటర్డ్రాప్ స్టైల్ నాచ్ డిస్ప్లే, డ్యూయల్-సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 11 వెర్షన్ బేస్డ్ ఫన్ టచ్ 12తో రన్ అవుతుంది. 6.44-అంగుళాల, 2,400x1,080 పిక్సెట్స్, ఆమోలెడ్ డిస్ప్లే, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ను అందిస్తుంది. ఫోటోలు, వీడియోల కోసం వివో 64 మెగాపిక్సె మెయిన్ సెన్సార్లతో ట్రిపుల్ రేర్ కెమెరా, కెమెరా సెటప్లో 8-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ 3వ స్నాపర్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. టిప్స్టర్ ప్రకారం..వివో వీ23ఈ 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 4,050mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. హ్యాండ్సెట్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆన్బోర్డ్ సెన్సార్లు గ్రావిటీ సెన్సార్, లైట్ సెన్సార్, గైరోస్కోప్, టెలస్కోప్ ఫీచర్లతో పాటు కనెక్టివిటీ కోసం డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ సదుపాయంతో అందుబాటులో రానున్నట్లు లీకైన రిపోర్ట్లలో తెలుస్తోంది. చదవండి: దేశంలో దూసుకెళ్తున్న 5జీ స్మార్ట్ఫోన్ అమ్మకాలు -
బంపర్ ఆఫర్..! రూ.101కే వివో ఫోన్..షరతులు వర్తిస్తాయి..!
దీపావళి ఫెస్టివల్ సీజన్ సందర్భంగా కొత్త స్మార్ట్ ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకో శుభవార్త. దివాళీ ఫేస్టివల్ సందర్భంగా ఖరీదైన స్మార్ట్ ఫోన్ కేవలం రూ.101 డౌన్ పేమెంట్తో సొంతం చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అదిరిపోయే దివాళీ సేల్ ఆఫర్ను ప్రకటించింది. కేవలం రూ.101 చెల్లించి స్మార్ట్ఫోన్ను సొంతం చేసుకోవచ్చవని తెలిపింది. ఇక ఈ ఆఫర్ లో వివో ఎక్స్70 సిరీస్ కు చెందిన వివో వీ21, వివో వై 73, వివో వై33ఎస్ ఫోన్లు ఉన్నాయని వెల్లడించింది. నేటి నుంచి నవంబర్ 7వరకు అన్నీ ఆఫ్లైన్ ఛానళ్లలో అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. బజాజ్ ఫైనాన్స్లో డౌన్ పేమెంట్ కింద రూ.101 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని ఫోన్ ధరను బట్టి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ను పొందాలంటే వివో ఫోన్ ధర రూ. 15,000 కంటే ఎక్కువ ధరను కలిగి ఉండాలి. ఇదే కాదు.. ఇంకా ఆఫర్లు ఉన్నాయ్ వివో ఎక్స్70 సిరీస్ ఫోన్లను సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్డీబీ కార్డ్లతో కొనుగులో చేసిన కస్టమర్లకు 10 శాతం వరకు క్యాష్బ్యాక్ పొందవచ్చు. వివో ఎక్స్ 70 సిరీస్, వీ21 5జీ, వీ 21 ఈ 5జీ స్మార్ట్ఫోన్లపై వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ను కూడా అందిస్తోంది. కస్టమర్లు క్రెడిట్ కార్డ్ లేకుండా ఈఎంఐ సదుపాయాన్ని అందించే 'జెస్ట్ మనీ' సంస్థ సాయంతో ఒక సంవత్సరం పొడిగించిన వారంటీ ఆఫర్ను కూడా పొందవచ్చు. దీంతో పాటు రిలయన్స్ జియో నుండి రూ. 10,000 విలువైన ప్రయోజనాలను పొందవచ్చని తెలుస్తోంది. అయితే వివో కస్టమర్లు పొందే జియో ప్రయోజనాల గురించి వివరాల్ని వెల్లడించలేదు. వివో స్మార్ట్ఫోన్ ధరలు వివో స్మార్ట్ఫోన్ ధరల విషయానికి వస్తే వివో ఎక్స్ 70ప్రో ప్లస్ వేరియంట్ 12జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ వెర్షన్ ధర రూ.79,990కి అందుబాటులో ఉంటుంది. వివో ఎక్స్ 70ప్రో 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ వేరియంట్ ధర రూ.46,990 అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ స్పేస్ వేరియంట్ ధరరూ 49,990 12జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ వేరియంట్ స్మార్ట్ఫోన్ ధర రూ.52,990 వివో 21 8జీబీ ప్లస్128జీబీ వేరియంట్ ధర రూ.29,990 8జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్ ధర రూ.32,990 వివో వీ21ఈ 8జీబీ ప్లస్ 128జీబీ వేరియంట్ ధర రూ.24,990 వివో వై 73 ధర రూ.17,990 గా ఉంది. చదవండి: షావోమి అదిరిపోయే ఆఫర్..సగానికి సగం ధరకే ఫోన్లు -
అదరగొట్టే స్మార్ట్ ఫోన్.. ఆకట్టుకునే ఫీచర్లు
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో వరుసగా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తుంది. ఆకట్టుకునే ఫీచర్లు, ఆకర్షణీయమైన ధరల్లో ఆఫోన్లు లభ్యం కావడంతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే తాజాగా వివో 'వై71టీ' సిరీస్ ఫోన్ను లాంఛ్ చేసింది. ముందుగా ఈఫోన్ చైనా మార్కెట్లో అందుబాటులో ఉండగా..త్వరలో భారత్లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. వివోవై71టీ స్పెసిఫికేషన్స్ వివోవై71టీ 4,000ఎంఏహెచ్ బ్యాటరీ, 6.44అంగుళాల (1,080*2, 2,400 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ప్లే, 20.9 యాస్పెట్ రేషియో అండ్ 90.1పర్సెంట్ స్క్రీన్ టూ బాడీ రేషియో,ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 810ఎస్ఓఎస్, జీ57జీపీయూ, ఎల్డీఆర్ఆర్4 ర్యామ్తో 8జీబీని అందిస్తుంది. వర్చువల్ వర్క్తో పాటు మల్టీటాస్క్ వర్క్ కోసం 4జీబీని అదనంగా వినియోగించుకోవచ్చు. ఇక ఫోటోస్, వీడియోస్ కోసం డ్యూయల్ రేర్ కెమెరా సెటప్, ఎఫ్/1.79లెన్స్తో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్,ఎఫ్/2.2 ఆల్ట్రావైడ్ లెన్స్తో 8 మెగాపిక్సెల్ సెన్సార్, 16మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, ముందు భాగంలో ఎఫ్/2.0లెన్స్ కెమెరా సెన్సార్లు ఉన్నాయి. వివో వై71టీ యూఎఫ్ఎస్ 2.1 ఆన్బోర్డ్ స్టోరేజ్తో 256వరకు జీబీ, కనెక్టివిటీ కోసం 5జీ, 4జీ వివోఎల్టీఈ,వైఫై, బ్లూటూత్ బీ 5.1, జీపీఎస్/ఏ-జీవీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యాంబీనెట్ లైట్, గ్రైస్కోప్, మ్యాగ్నెటోమీటర్,ప్రోక్సిమిటీ సెన్సార్ తో పాటు డిస్ప్లేలో ఫింగర్ ఫ్రింట్ సెన్సార్లు ఉన్నాయి. వివో వై 71టీ ధర వివో వై 71టీ 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.21,000 ఉంది. 8జీబీ ప్లస్ 256జీబీ ఆప్షన్ ఉన్న ఫోన్ ధర రూ.23,400 ఉండనుంది. మిరేజ్, మిడ్ నైట్ బ్లూ కలర్లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ప్రీ ఆర్డర్లు చైనాలో ప్రారంభమయ్యాయి. నవంబర్ 1 నుంచి అమ్మకాలు ప్రారంభం కాగా మిగిలిన దేశాల్లో ఆఫోన్ ధర ఎంత ఉంటాయనేది వివో ప్రకటన చేయాల్సి ఉంది. చదవండి: Xiaomi: షావోమి దూకుడు, ఫాస్ట్ డేటా షేరింగ్ కోసం.. -
మార్కెట్లో అదిరిపోయే ఫీచర్స్తో బడ్జెట్ ఫోన్..ఓ లుక్కేయండి!
స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త. చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో 'వై3ఎస్' పేరుతో బడ్జెట్ ఫోన్ను మార్కెట్లో విడుదల చేసింది. ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ మిగిలిన బడ్జెట్ ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వివో వై3ఎస్ ఫీచర్లు, ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.10వేలు, అంతకాన్న ధరల్లో లభించే స్మార్ట్ ఫోన్ల లో వివో వై3ఎస్ నిలిచింది. రూ.9,490 ఉన్న ఈ ఫోన్లో 6.51 అంగుళాల హెచ్డీ 1600*720 పిక్సెల్స్తో ఎల్సీడీ డిస్ ప్లే, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 11 గ్రో ఎడిషన్ + ఫన్టచ్ ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది. స్మార్ట్ఫోన్ వెనుకవైపు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటే, సెల్ఫీ కెమెరాకు వాటర్ డ్రాప్ నాచ్ ఫీచర్ కూడా ఉంది. వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉన్న ఈ ఫోన్ 19 గంటల పాటు ఆన్లైన్ హెచ్డీ మూవీ చూడొచ్చని, 8 గంటలు గేమ్స్ ఆడొచ్చని కంపెనీ చెబుతోంది. వీటితో పాటు ఫేస్ అన్లాక్, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ 2.0 పోర్ట్, జీపీఎస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వివో వై3ఎస్ స్మార్ట్ఫోన్ స్టారీ బ్లూ, మింట్ గ్రీన్, పెరల్ వైట్ కలర్స్లో అందుబాటులో ఉందని వివో ప్రతినిధులు తెలిపారు. ఒక్కవేరియంట్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ లో 2జీబీ ర్యామ్ అండ్ 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సదుపాయం ఉంది. వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా క్లిక్, పేటీఎం, బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ స్టోర్, ఇతర రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. మూడు నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. చదవండి: గూగుల్ పిక్సెల్ 6 సిరీస్: సొంత చిప్తోనే అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే.. -
ఈ స్మార్ట్ఫోన్ ధరను భారీగా పెంచిన వివో...!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో కీలక నిర్ణయం తీసుకుంది. వివో వై33 మోడల్ స్మార్ట్ఫోన్ ధరను భారీగా పెంచేసింది. వివో వై33 మోడల్పై సుమారు రూ. 1000 వరకు పెంచింది. దీంతో వివో వై33 స్మార్ట్ఫోన్ ధర రూ. 18,990కు చేరుకుంది. ఈ ఏడాది ఆగస్టులో మీడియా టెక్ ఆక్టాకోర్ ప్రాసెసర్తో వివో వై33 స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. వివో వై 33 స్మార్ట్ఫోన్ పాత ధర రూ. 17,990 ఉంది. గత నెలలో ఒప్పో ఎ54, ఒప్పో ఎఫ్19 స్మార్ట్ఫోన్ ధరలను వెయ్యికిపైగా ఒప్పో కూడా పెంచింది. చదవండి: డీమార్ట్ దెబ్బకు బిలియనీర్ అయిపోయాడే...! వివో వై33 ఫీచర్స్...! 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే ఆండ్రాయిడ్-11 8జీబీ ర్యామ్+ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 50+2+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ చదవండి: సై అంటే సై అంటూన్న దిగ్గజ టెక్ కంపెనీలు..! -
మార్కెట్లో మరో బడ్జెట్ ఫోన్, ఫీచర్లు మాత్రం అదుర్స్
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్సేల్ ముగియగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతుంది.అయితే ఈ సేల్ను క్యాష్ చేసుకునేందుకు ఆయా టెక్ సంస్థలు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. తాజాగా భారత్ మార్కెట్లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో బడ్జెట్ ఫోన్ను లాంఛ్ చేసింది. వివో వై20టీ ఫీచర్లు 'వివో వై20టీ' సిరీస్లో విడుదలైన ఈ ఫోన్లో సూపర్ ఫీచర్లు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 6.51 అంగుళాల 720పీ హెచ్డీ క్వాలిటీతో పాటు సెక్యూర్ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 18 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 662 చిప్ సెట్, 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్, ర్యామ్ను ఎక్స్టెండ్ చేసుకుందుకు ర్యామ్ 2.0 ఫీచర్, 1జీబీ వర్చువల్ మెమెరీ, గేమ్లతో పాటు ఇతర మల్టీ టాస్కింగ్ వర్క్ పర్పస్ కోసం 7జీబీ మెమెరీ అందుబాటులో ఉంది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 13ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ బొకేహ్ కెమెరా, కెమెరాకు అతి దగ్గరలో (4 సెంటీ మీటర్లు) ఉన్న ఫోటోలు తీసేందుకు సూపర్ మ్యాక్రో కెమెరా, Aura స్క్రీన్ లైట్ అండ్ పోట్రేట్ మోడ్ సాఫ్ట్వేర్ ఫీచర్ మోడ్లో 8ఎంపీ సెల్ఫీ షూటర్ సదుపాయం ఉంది. వివో వై20 టీ ధర ఎంతంటే భారత్లో విడుదలైన వివో వై20 టీ ఫోన్ ప్యూరిస్ట్ బ్లూ,అబ్సిడియన్ బ్లాక్ కలర్స్లో లభ్యమవుతున్న 6జీబీ/ 128 జీబీ ర్యామ్ స్టోర్ వేరియంట్ ధర రూ.15,490 ఉంది. ఈ ఫోన్ ను బజాజ్ ఫిన్ సర్వ్లో 12నెలలు పాటు నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యంతో సొంతం చేసుకోవచ్చు. వివో ఈ-స్టోర్లో కొనుగోలు దారులకు రూ.500 క్యాష్ బ్యాక్తో పాటు అమెజాన్, పేటీఎం, టాటా క్లిక్ స్టోర్లలో 6నెలల పాటు నో కాస్ట్ ఎక్ఛేంజ్ ఆఫర్ను అందిస్తున్నట్లు వివో అధికారికంగా ప్రకటించింది. చదవండి: ఈ ల్యాప్ ట్యాప్పై అదిరిపోయే డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్ కూడా.. -
క్వాడ్ కెమెరా సెటప్తో వివో నుంచి కొత్త స్మార్ట్ఫోన్...!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో ఎక్స్ సిరీస్లో భాగంగా భారత్లో కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనుంది. వివో ఎక్స్70 , వివో ఎక్స్70, వివో ఎక్స్70 ప్రో ప్లస్ స్మార్ట్ఫోన్స్ భారత మార్కెట్లోకి ఈ నెల 30న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వివో ఎక్స్70 ప్రో ప్లస్ 8జీబీ, 12జీబీ ర్యామ్ వేరియంట్స్తో రానున్నాయి. ఈ మోడళ్లు 128జీబీ, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ను కలిగి ఉన్నాయి. ఈ మూడు స్మార్ట్ఫోన్లు జీస్ టి సర్టిఫైడ్ కోటింగ్తో రానున్నాయి. స్మార్ట్ఫోన్లు రియల్ టైమ్ ఎక్స్ట్రీమ్ నైట్ విజన్, సూపర్ నైట్ వీడియో, ప్యూర్ నైట్ వ్యూ, ప్రో సినిమాటిక్ మోడ్ మరిన్ని కెమెరా ఫీచర్లను అందిస్తున్నాయి. వివో ఎక్స్70 ప్రో ప్లస్ స్మార్ట్ఫోన్ ఫీచర్స్ 6.78-అంగుళాల అమ్లోడ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే క్వాలకమ్ స్నాప్డ్రాగన్ 870 4500ఎమ్ఏహెచ్ బ్యాటరీ క్వాడ్ కెమెరా సెటప్ విత్ మైక్రో గింబల్ స్టెబిలైజేషన్ 50 ఎమ్పీ ప్రైమరీ కెమెరా 8 ఎమ్పీ పెరిస్కోప్ జూమ్ లెన్స్ 12 ఎమ్పీ టెలిఫోటో లెన్స్ 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ -
గేమింగ్ ప్రియుల కోసం ఐక్యూ నుంచి కొత్త ఫోన్..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో సబ్ బ్రాండ్ ఐక్యూ చైనా మార్కెట్లలోకి ఐక్యూ జెడ్5 స్మార్ట్ఫోన్ను సెప్టెంబర్ 23న లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లలోకి కూడా వస్తుందని తెలుస్తోంది. సెప్టెంబర్ చివరి నాటికి ఐక్యూ జెడ్5 భారత్లో ఆవిష్కరించే అవకాశం ఉందని జీఎస్ఎమ్ఎరీనా పేర్కొంది. రాబోయే ఐక్యూ జెడ్5 భారత మార్కెట్లలో సుమారు రూ. 30వేల లోపే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఐక్యూ జెడ్5 అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్తో గేమింగ్ ప్రియులకు సౌకర్యవంతంగా ఈ స్మార్ట్ఫోన్ ఉంటుందని తెలుస్తోంది. (చదవండి: బ్లాక్బస్టర్ డీల్స్తో..అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్) ఐక్యూ జెడ్5 ప్రో స్పెసిఫికేషన్లు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ LPDDR5 ర్యామ్ 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 16ఎంపీ ఫ్రంట్ కెమెరా 64 ఎంపీ రియర్ కెమెరా ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ స్టీరియో స్పీకర్లు, హై-రెస్ ఆడియో , హై-రెస్ ఆడియో వైర్లెస్ సపోర్ట్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ చదవండి: ఆన్లైన్లో వైరల్ అవుతున్న రియల్మీ జీటీ నియో 2 ఫీచర్స్ -
Apple: పడిపోయిన యాపిల్ మార్కెట్! భారమంతా ఐఫోన్ 13 పైనే?
Apple iPhone 13: టెక్ దిగ్గజం యాపిల్కి షాక్ తగిలింది. నూతన ఆవిష్కరణలు, సరికొత్త ఫీచర్లకు కేరాఫ్ అడ్రస్గా చెప్పుకునే ఐఫోన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ట్రెండ్ ఫోర్స్ తాజా లెక్కలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. తగ్గిన అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్కు సంబంధించి ట్రెండ్ ఫోర్స్ సంస్థ తాజా గణంకాలు విడుదల చేసింది. ఇందులో రెండో క్వార్టర్కి సంబంధించి గ్లోబల్ మార్కెట్లో ఐఫోన్ అమ్మకాలు 13.7 శాతానికే పరిమితమైనట్టుగా తెలిపింది. గతేడాది ఫోన్ అమ్మకాలతో పోల్చితే 22 శాతం మేరకు ఐఫోన్ అమ్మకాలు తగ్గినట్టు ట్రెండ్సెట్ పేర్కొంది. నాలుగో స్థానానికి ఒక్కసారిగా ఫోన్ల అమ్మకాలు పడిపోవడంతో గ్లోబల్ మార్కెట్లో యాపిల్ సంస్థ నాలుగో స్థానానికి పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసినికి సంబంధించిన అమ్మకాల్లో 19 శాతం మార్కెట్ వాటాతో శామ్సంగ్ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత 16.1 శాతం అమ్మకాలతో షావోమీ, ఒప్పోలో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వాటి తర్వాత 13.7 శాతం మార్కెట్తో యాపిల్ నాలుగో స్థానానికి పరిమితమైంది. 11.1 శాతం వాటాతో వివో ఐదో స్థానంలో ఉంది. వివో సంస్థ అమ్మకాల్లో సైతం 18 శాతం తగ్గుదల నమోదైంది. ఐఫోన్ 13పైనే భారం యాపిల్ సంస్థ ఈ నెలాఖరు కల్లా సరికొత్త మోడల్ ఐఫోన్ 13ను రిలీజ్ చేయబోంది. ఇప్పటికే ఐఫోన్ 13 ఫీచర్లకు సంబంధించి మార్కెట్లో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సిమ్తో పని లేకుండా లో ఎర్త్ ఆర్బిట్ టెక్నాలజీపై ఐఫోన 13 పని చేస్తుందంటూ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఐఫోన్ 13కి మరింత క్రేజ్ తెచ్చేందుకు యాపిల్ వాచ్ 7 సిరీస్ను సైతం రిలీజ్ వచ్చంటూ కథనాలు వస్తున్నాయి. మొత్తంగా పడిపోయిన మార్కెట్ షేర్ను దక్కించుకునేందుకు ఐఫోన్ 13పైనే ఆ సంస్థ భారం వేసింది. చదవండి: గూగుల్ సెర్చ్లో తొలి పదం.. ఆసక్తికరమైన విషయం -
అదిరిపోయే లుక్, స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన వివో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో తాజాగా వై33ఎస్ మోడల్ను విడుదల చేసింది. ధర రూ.17,990 ఉంది. 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఇన్సెల్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ80 ఆక్టాకోర్ ప్రాసెసర్, ఫన్టచ్ ఓఎస్ 11.1, బిల్ట్ ఇన్ బ్లూలైట్ ఫిల్టర్, 8 జీబీ ర్యామ్, 4 జీబీ ఎక్స్టెండెడ్ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ సూపర్ నైట్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఏర్పాటు ఉంది. చదవండి : ఈ టెక్నాలజీని ఒకేసారి ఎంతమంది వినియోగించుకోవచ్చో తెలుసా? -
వివో నుంచి మరో కొత్త ఫోన్..! ధర ఎంతంటే..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో భారత మార్కెట్లలోకి కొత్త మొబైల్ను లాంచ్ చేసింది. వివో కంపెనీ వై సిరీస్లో భాగంగా వివో వై 53 ఎస్ స్మార్ట్ఫోన్ను రిలీజ్చేసింది. ఈ స్మార్ట్ఫోన్ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎం 51 వంటి స్మార్ట్ఫోన్లకు గట్టిపోటీని ఇవ్వనుంది. వివో వై53 స్మార్ట్ఫోన్ను మొదటిసారిగా వియత్నాంలో గతనెలలో లాంచ్ చేసింది. భారత్ మార్కెట్లో వివో వై53ఎస్ 8జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,490గా నిర్ణయించారు. డీప్ బ్లూ, ఫెంటాస్టిక్ రెయిన్బో కలర్ వేరియంట్లలో లభించనుంది. ఈ స్మార్ట్ఫోన్లను అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటీఎం, టాటాక్లిక్, బజాజ్ స్టోర్, వివో ఇండియా ఈ-స్టోర్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. లాంచింగ్ ఆఫర్లలో భాగంగా వివోవై53 ఎస్ స్మార్ట్ఫోన్ను హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్పై కొనుగోలు చేస్తే రూ. 1500 క్యాష్బ్యాక్ రానుంది. వివో వై53ఎస్ ఫీచర్లు ఆండ్రాయిడ్ 11 ఆపరేటిండ్ సిస్టమ 6.58-అంగుళాల ఫుల్-హెచ్డి+ (1,080x2,400 పిక్సెల్స్) డిస్ప్లే 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో పాటు 20: 9 యాస్పెక్ట్ రేషియో మీడియాటెక్హెలియో జీ20 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ యూఎస్బీ టైప్ సీ పోర్ట్ 64ఎమ్పీ రియర్ కెమెరా 16ఎమ్పీ ఫ్రంట్ కెమెరా 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ -
శాంసంగ్ కు పోటీగా దూసుకెళ్తున్న షియోమీ
గ్లోబల్ స్మార్ట్ఫోన్ షిప్ మెంట్స్ పరంగా దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్, చైనా దిగ్గజం షియోమీ పోటీపడుతున్నాయి. ప్రముఖ రీసెర్చ్ సంస్థ అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) విడుదల చేసిన గ్లోబల్ స్మార్ట్ఫోన్ గ్రోత్ ఇన్ 2021 క్యూ2 నివేదిక ప్రకారం.. స్మార్ట్ఫోన్ షిప్ మెంట్స్ పరంగా శాంసంగ్ అగ్రభాగాన ఉంది. శాంసంగ్ తర్వాత రెండవ స్థానంలో చైనా దిగ్గజం షియోమీ ఉంది. షియోమీ మొదటిసారి రెండవ స్థానానికి చేరుకుంది. క్యూ2 2021లో యాపిల్ ను మూడవ స్థానానికి నెట్టింది. మొత్తం షిప్ మెంట్ వాల్యూమ్ పరంగా సంవత్సరానికి 13.2 శాతం పెరిగాయి. స్మార్ట్ఫోన్ విక్రేతలు త్రైమాసికంలో మొత్తంగా 313.2 మిలియన్ పరికరాలను రవాణా చేశారు. 2021 క్యూ2లో శామ్ సంగ్ 59 మిలియన్ యూనిట్లను రవాణా చేసినట్లు ఐడీసీ నివేదించింది. దీంతో మొత్తం మార్కెట్లో దీని వాటా 18.8 శాతం. దక్షిణ కొరియా దిగ్గజం గత ఏడాది ఇదే త్రైమాసికంలో 54 మిలియన్ యూనిట్లను రవాణా చేసింది. మరోవైపు, షియోమీ క్యూ2 2021లో 53.1 మిలియన్ యూనిట్లతో షిప్ మెంట్ లలో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఇక మార్కెట్లో దీని వాటా 16.9 శాతం. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రవాణా చేసిన 28.5 మిలియన్ యూనిట్ల నుంచి ఇది భారీ పెరుగుదల. ఐడీసీ నివేదికల ప్రకారం.. 44.2 మిలియన్ షిప్ మెంట్లు, 14.1 శాతం మార్కెట్ వాటాతో యాపిల్ మూడవ స్థానానికి చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో యాపిల్ 37.6 మిలియన్ యూనిట్లను రవాణా చేసి 13.6 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇక తర్వాత వరుసలో ఒప్పో(32.8 మిలియన్లు), వివో 31.6 మిలియన్ల షిప్ మెంట్లతో ఐడీసీ జాబితాలో మూడవ, నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. -
ఆ ఫోన్ దూకుడు మామూలుగా లేదుగా.. 40కోట్లు దాటిన యూజర్లు
హైదరాబాద్: అంతర్జాతీయంగా స్మార్ట్ఫోన్ల షిప్మెంట్పై కేనలిస్ డేటా విడుదల చేసింది. ఆ డేటా ప్రకారం వరల్డ్ వైడ్ గా స్మార్ట్ఫోన్ల వినియోగం 12శాతం పెరిగాయి. వాటిలో శాంసంగ్ 19శాతం స్మార్ట్ ఫోన్ల వినియోగంతో తొలిస్థానాన్ని దక్కించుకుంది. షియోమి17శాతంతో రెండో స్థానంలో ఉండగా.. 14శాతంతో యాపిల్ సైతం మూడో స్థానంలో నిలిచింది. వివో,ఒప్పో స్మార్ట్ఫోన్లు ఐదోస్థానంలో నిలిచింది. తొలి క్వార్టర్లో 10 శాతం మార్కెట్ వాటాతో ఐదో స్థానంలో ఉంది. గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 27 శాతం అధికంగా స్మార్ట్ఫోన్లను షిప్మెంట్ చేసినట్టు కేనలిస్ డేటా తెలియజేస్తోంది. గతేడాది కూడా వివో ఐదో స్థానంలో నిలవడం గమనార్హం. 50కు పైగా దేశాల్లో వివోకు విక్రయ నెట్వర్క్ ఉండగా.. 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారని కేనలిస్ డేటాలో పేర్కొంది. చదవండి: 'పెగసెస్' మీ స్మార్ట్ఫోన్ పై దాడి చేసిందో లేదో తెలుసుకోండిలా?! -
5జీ స్మార్ట్ఫోన్స్ అమ్మకాల్లో దూసుకెళ్తున్న వివో
న్యూఢిల్లీ: చైనా మొబైల్ తయారీ కంపెనీ వివో 5జీ స్మార్ట్ఫోన్స్ విభాగంలో సత్తా చాటుతోంది. జనవరి-మార్చి త్రైమాసికంలో 5జీ స్మార్ట్ఫోన్స్ అమ్మకాల్లో శామ్ సంగ్ తర్వాత ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న రెండవ బ్రాండ్ గా నిలిచినట్టు పరిశోధన సంస్థ స్ట్రాటజీ ఎనలిటిక్స్ వెల్లడించింది. అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే వివో అమ్మకాలు 62 శాతం పెరిగి 1.94 కోట్ల యూనిట్లు నమోదయ్యాయని వివరించింది. 5జీ ప్రమాణాలు, కీలక సాంకేతికత విషయంలో కంపెనీ పురోగతి సాధించిందని వివో తెలిపింది. చైనా యూరప్లో వివో సుస్థిర స్థానం సంపాదించింది. ఆపిల్ ఇప్పటికి 5జీ టాప్ బ్రాండ్ గా కొనసాగుతుంది. ప్రపంచ మార్కెట్లో ఈ కంపెనీ 29.8 శాతం వాటాను కలిగి ఉంది. తరువాత స్థానంలో ఒప్పో 15.8 శాతం వాటాతో ఉండగా, వివో 14.3 శాతం వాటాను కలిగి ఉన్న మూడవ అతిపెద్ద 5జి బ్రాండ్ గా నిలిచింది. -
వివో నుంచి గాల్లో ఎగిరే కెమెరా!..ఫోటోలు వైరల్!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు వివో గింబల్ను అమర్చి ఉన్న కెమెరా ఫోన్ ఎక్స్ 50, ఎక్స్ 60 మోడళ్లను మార్కెట్లోకి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా వివో నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ను త్వరలోనే ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. వివో ఇంటిగ్రేట్డ్ ఫ్లయింగ్ కెమెరాతో పనిచేసే స్మార్ట్ఫోన్పై పనిచేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. డ్రోన్ లాంటి సామర్థ్యాలను కలిగి ఉన్న స్మార్ట్ఫోన్ను వివో రూపొందించనుంది. భవిష్యత్తులో రాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్కు తేలికపాటి డ్రోన్ను అమర్చనున్నారు. ఈ డ్రోన్ సహయంతో ఏరియల్ ఫోటోలను, వీడియోలను తీయవచ్చును. వివో 2020 డిసెంబర్లో వరల్డ్ ఇంటలెక్ట్చువల్ ప్రాపర్టీ కార్యాలయంలో ఈ స్మార్ట్ఫోన్కు పేటెంట్ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది.కాగా తాజాగా ఇప్పుడు గాల్లో తేలే కెమెరాతో ఉన్న వివో స్మార్ట్ ఫోన్ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. పేటెంట్ కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తోందని భావించడంలేదు. చాలా స్మార్ట్ఫోన్ కంపెనీలు పేటెంట్ కంపెనీ వద్ద సుమారు కొన్ని వేల స్మార్ట్ఫోన్ మోడళ్లకు పేటెంట్లు నమోదైన అందులో కేవలం కొన్ని మాత్రమే మార్కెట్లోకి వస్తున్నాయని పేటెంట్లను నమోదుచేసే సంస్థలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అంతకుముందు వివో గింబల్ సిస్టమ్ కెమెరాతో స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. వివో ఎక్స్ 50 ప్రో గింబల్ వ్యవస్థను కలిగి ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 13 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ను అమర్చారు. ఈ స్మార్ట్ ఫోన్లో 90Hz అధిక రిఫ్రెష్ రేటుతో 6.56 అంగుళాల AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. వివో ఎక్స్ 50 ప్రో ఆండ్రాయిడ్ 10 వెర్షన్ను కలిగి ఉంది . ఈ స్మార్ట్ఫోన్ ధర భారత్లో రూ .49,990.