-
Faisal Khan: ఇటు సోషల్ మీడియా.. అటు సోషల్ యాక్టివిటీస్లోనూ ఖాన్ సర్ ఫస్టే!
అసలు పేరు ఫైసల్ ఖాన్. టీచర్, యూట్యూబర్. ఖాన్ సర్, ఖాన్ సర్ పట్నాగా పాపులర్. సొంతూరు.. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్. అలహాబాద్ యూనివర్సిటీలో సైన్స్లో మాస్టర్ డిగ్రీ చేశాడు. 2019లో ‘ఖాన్ జీఎస్ రీసెర్చ్ సెంటర్’ పేరుతో యూట్యూబ్ చానెల్ను స్టార్ట్ చేశాడు.స్కూళ్లు, కాలేజీలు బంద్ అయిన కరోనా లాక్డౌన్ టైమ్లో అకడమిక్స్ని టీచ్ చేస్తూ ఖాన్ చేసిన వీడియోలు ఇటు యూట్యూబ్లో అటు ఇన్స్టాలో వైరలై అతనికి బోలెడంత మంది ఫాలోవర్స్ని.. సబ్స్క్రైబర్స్ని సంపాదించి పెట్టాయి. ఎంతటి కష్టమైన, క్లిష్టమైన సబ్జెక్ట్ని అయినా అరటి పండు మింగినంత అలవోకగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఖాన్ సర్ యూఎస్పీ. అందుకే అతని యూట్యూబ్ చానెల్కి స్టూడెంట్సే కాదు వరుణ్ ధవన్ లాంటి సినిమా యాక్టర్స్ కూడా సబ్స్క్రైబర్సే!సోషల్ మీడియాలోనే కాదు సోషల్ యాక్టివిటీస్లోనూ ఖాన్ సర్ ఫస్టే! స్కూల్కి వెళ్లలేని పేద పిల్లలకు ఫ్రీగా టీచ్ చేస్తాడు. ఆర్థికావసరాల్లో ఉన్న వాళ్లకు తనకు తోచిన హెల్ప్ చేస్తాడు. యూట్యూబ్ ద్వారా ఖాన్ సర్ నెలకు 15 లక్షల రూపాయలు సంపాదిస్తాడని అంచనా! ఆర్జనే కాదు సాయమందించే మనసూ ముఖ్యమే అని ప్రూవ్ చేస్తున్నాడు ఖాన్ సర్!ఇవి చదవండి: Pooja Singh: పూజా సింగ్ టు.. రింకీ దూబే.. బై శాన్వికా..! -
సుమ యోగా డే వీడియో వైరల్
ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం చాలా ఉత్సాహంగా జరిగింది. ముఖ్యంగా మన దేశంలో జమ్ము కశ్మీర్లో 50 వేల మందితో నిర్వహించిన యోగా కార్యక్రమం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతోందని, ప్రపంచ యోగా గురుగా భారత్ మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అలాగే దేశ వ్యాప్తంగా నిర్వహించిన యోగా డే వేడుకల్లో పలువురు రాజకీయ, సినీ, క్రీడారంగ ప్రముఖులు యోగాసనాలతో సందడి చేశారు. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma)ప్రముఖ యాంకర్ సుమ కనకాల అందరికీ అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ముఖ్యంగా మహిళలు ఎలాంటి ఆసనాలు వేయాలి? వాటి లాభాలను వివరిస్తూ ఇన్స్టాలో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేసింది. ప్రతీ పండుగకు ఏదో ఒక విశేషమైన వీడియోను పంచుకునే సుమ యోగా డేనుకూడా అలా వినియోగించుకుందన్న మాట. యోగాసనాలతో విన్యాసాలు చేస్తూ హిల్లేరియస్ రీల్పై నెటిజన్లు కూడా ఫన్నీగా కమెంట్స్ చేశారు. అయితే ‘‘ఎందుకొచ్చిన తిప్పలు అక్కా..హాయిగా మూడు ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, 6 ఇంటర్వ్యూలు చేసుకోక’’ అని ఒకరు, ‘ఈ వయసులో ఈ ప్రయోగాలు అవసరమా, లైక్స్ కోసం కాకపోతే’ అని మరొకరు, ‘‘ఇంత టైం ఎక్కడ దొరకుతుందక్కా నీకు’’ అంటూ మరొక అభిమాని వ్యాఖానించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ వయసులో ఉన్నవారైనా యోగాను సాధన చేయవచ్చు. కాకపోతే నిపుణుడైన గురు సమక్షంలో చేయడం ఉత్తమం. -
ఫేక్ రీల్ వైరల్ : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక
సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి రోజు రోజుకు ముదిరిపోతోంది. యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టా రీల్స్ కోసం ప్రాణాలకు తెగించి మరీ, ఫ్యామస్ అయిపోవాలనే తాపత్రయంతో కొంతమంది ప్రాణాలు మీదికి తెచ్చు కుంటోంటే.. మరికొందరు బూటకపు వేషాలు, తప్పుడు వీడియోలతో వెర్రి చేష్టలు చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. మరోవైపు ఈ వీడియోపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఫేక్. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్ మీడియాలో పాపులర్ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు. లైక్ లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా… pic.twitter.com/Eia1GCSxyr— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) June 21, 2024బస్సు కిందకి యువకుడు, పిచ్చి రీల్హైదరాబాద్లోని ఓ రోడ్డుపై ఆర్టీసీ బస్సు కింద ఒక యువకుడు అకస్మాత్తుగా బస్సు కింద పడుకోవడం, బస్సు వెళ్లిపోయాక, ఎలాంటి గాయాలు లేకుండానే, తీరిగ్గా షర్ట్కి అంటిన దుమ్ము దులుపుకుంటూ వెళ్లిపోయినట్టుగా చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఇది ఎడిటెడ్ వీడియో అని ఇట్టే తెలిసిపోతుందని నెటిజన్లు కమెంట్స్ చేశారు. ఇది ఫేక్ అంటూ తీవ్ర చర్చ సాగింది కూడా. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఫేక్. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు. లైక్లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉంది. సరదా కోసం చేసే ఎడిట్ వీడియోలు ఇతరులకు ప్రాణాప్రాయం కూడా కలిగిస్తాయి. ఇలాంటి ఘటనలను తెలంగాణా ఆర్టీసీ సీరియస్గా తీసుకుంటుంది అంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. కాగా ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడియోలను కానీ, ఇమేజెస్ను గానీ కాస్త నిశితంగా పరిశీలిస్తే ఇది నిజమో, కాదో. ఇట్టే అర్థమవుతుంది. లేదంటే గూగుల్స్ లెన్స్ ద్వారా ఇమేజ్ను ఫ్యాక్ట్ చెక్ చేయవచ్చు. వీడియో అయితే ‘ఇన్విడ్’ అనే టూల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. -
ఇదెక్కడి క్యాచ్ రా సామీ.. పొట్టి క్రికెట్లో బెస్ట్ క్యాచ్గా జేజేలు
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ 2024లో అత్యుత్తమ క్యాచ్లు నమోదవుతున్నాయి. ఈ ఎడిషన్లో ఇప్పటికే ఐదారు కళ్లు చెదిరే క్యాచ్లు ఫ్యాన్స్కు మతి పోగొట్టాయి. తాజాగా అలాంటి క్యాచే మరొకటి నమోదైంది. కార్డిఫ్ వేదికగా గ్లోసెస్టర్షైర్తో జరిగిన మ్యాచ్లో గ్లామోర్గన్ ఆటగాడు మార్నస్ లబూషేన్ మెరుపు క్యాచ్ అందుకున్నాడు.మేసన్ క్రేన్ బౌలింగ్లో బెన్ ఛార్లెస్వర్త్ లాంగ్ ఆన్ దిశగా ఆడిన భారీ షాట్ను లబూషేన్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్గా మలిచాడు. ఓ మోస్తరు ఎత్తులో వెళ్తున్న బంతిని పక్షిలా గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఈ క్యాచ్కు చూసిన వారు పొట్టి క్రికెట్లో అత్యుత్తమ క్యాచ్ అని జేజేలు పలుకుతున్నారు. ఈ క్యాచ్ను పట్టిన లబూషేన్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.MARNUS LABUSCHAGNE WITH A BLINDER. 🤯💯- One of the greatest catches ever! pic.twitter.com/ssDsUdg2aU— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024కాగా, గ్లామోర్గన్తో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో గ్లోసెస్టర్షైర్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్లోసెస్టర్షైర్ గెలుపుకు చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా.. జోష్ షా ఆండీ గోర్విన్ బౌలింగ్ సిక్సర్ కొట్టి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లామోర్గన్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేయగా.. గ్లోసెస్టర్షైర్ 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. గ్లామోర్గన్ ఇన్నింగ్స్లో సామ్ నార్త్ఈస్ట్ (46 నాటౌట్) టాప్ స్కోరర్గా కాగా.. గ్లోసెస్టర్షైర్ ఇన్నింగ్స్లో జాక్ టేలర్ (70) అత్యధిక పరుగులు సాధించాడు. -
T20 World Cup 2024: మెల్బోర్న్ ఐకానిక్ సిక్స్ను రిపీట్ చేసిన విరాట్
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (జూన్ 20) జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ 14 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), శివమ్ దూబే (10) ఔట్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ (34), హార్దిక్ పాండ్యా (11) క్రీజ్లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫజల్ హక్ ఫారూఖీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.THE GOAT HAS ARRIVED IN T20I WORLD CUP 2024. 🇮🇳 pic.twitter.com/5vZTr1vTHK— Johns. (@CricCrazyJohns) June 20, 2024ఐకానిక్ సిక్స్ను రిపీట్ చేసిన విరాట్ఈ మ్యాచ్లో విరాట్ 2022 టీ20 వరల్డ్కప్లో మెల్బోర్న్ మైదానంలో పాక్ పేసర్ హరీస్ రౌఫ్ బౌలింగ్లో బాదిన ఐకానిక్ సిక్స్ను రిపీట్ చేశాడు. నవీన్ ఉల్ హక్ బౌలింగ్లో విరాట్ కొట్టిన సిక్సర్ మెల్బోర్న్ ఐకానిక్ సిక్సర్ను గుర్తు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. ఇక ఈ మ్యాచ్లో మాంచి టచ్లో ఉన్నట్లు కనిపించిన విరాట్.. 24 బంతుల్లో సిక్సర్ సాయంతో 24 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో మొహమ్మద్ నబీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. -
Viral: రీల్స్ మోజులో యువతి పిచ్చి స్టంట్.. చేయి జారిందా అంతే!
సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ప్రజలంతా ఫోన్లపైనే రోజంతా గడిపేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విటర్.. ఇలా అన్నింట్లోనూ అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు. మరికొందరు. ఈ సామాజిక మాద్యమాల ద్వారా ఫేమస్ అయిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు చేయకూడని పనులు చేసి నలుగురిలో నవ్వులపాలు అవ్వడమే కాకుండా కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ అవ్వాలనే ఉద్ధేశంతో సాహసాలకు తెగిస్తున్నారు. ఇలాంటి ఘటనే పుణెలో వెలుగు చేసింది. గా రీల్స్ మోజులో పడిన కొంతమంది యువతీ, యువకులు.. వ్యూస్ కోసండేంజరస్ స్టంట్లు చేశారు.పుణె లోని స్వామి నారాయణ్ ఆలయం సమీపపంలోని ఎత్తయిన భవనం నుంచి ఓ యువతి కిందకు వేలాడుతూ ఉండడం వీడియోలో కనిపిస్తోంది. మరో యువకుడు పైనుంచి ఆమె చేతిని పట్టుకుని ఉన్నాడు. కిందనున్న హైవేపై భారీ వాహనాలు వెళుతున్నాయి. ఏ మాత్రం పట్టు జారినా యువతి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ తతంగాన్ని వారి స్నేహితులు కెమెరాల్లో చిత్రీకరించారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. టీనేజర్ల చర్యపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిపై సరైన చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు.#Pune: For Creating Reels and checking the strength, Youngsters risk their lives by doing stunt on an abandoned building near Swaminarayan Mandir, Jambhulwadi Pune@TikamShekhawat pic.twitter.com/a5xsLjfGYi— Punekar News (@punekarnews) June 20, 2024 -
బంతి ఆకారంలో ఉండే బ్రేక్ఫాస్ట్.. ఏ దేశం వంటకం అంటే..
ప్రతి దేశం ఒక్కో రకమైన వంటకంలో ఫేమస్ అవుతుంది. ఆ వంటకం పేరు వినగానే వెంటనే ఆ దేశం లేదా ప్రాంతం పేరు మనకు ఠక్కున గుర్తొస్తుంది. అంతలా కొన్ని రకాల వంటకాలు మన మనసులో స్థానం దక్కించుకుంటాయి. అలానే ఇక్కడొక వంటకం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వంటకం మన భారతీయ వంటకానికి దగ్గర పోలిక ఉన్న రెసిపీలానే ఉంటుంది. కానీ వాళ్లు తయారీ చేసిన విధానం మాత్రం వావ్ అనాల్సిందే. ఇంతకీ ఏంటా వంటకం, ఏ దేశానికి సంబంధించింది అంటే..జపాన్ పాకశాస్త్ర నిపుణులు బంతి ఆకారంలో ఉండే బ్రేక్ఫాస్ట్ని తయారు చేశారు. అది ఎక్కడ వంకర లేకుండా..గుండ్రటి బంతి ఆకారంలో ఉంది. పైగా ప్లేటంతా ఆక్రమించేసింది. దీన్ని ఎలా చేస్తారంటే..మైదాపిండికి కొద్ది మోతాదు బొంబాయిరవ్వను కలిపి పులియబెట్టేలా కొద్దిగా ఈస్ట్ జోడించి చపాతి పిండి మాదిరిగా నీళ్లతో కలిపి ఒక పక్కన ఉంచాలి. తర్వాత చిన్నసైజు ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తుకోవాలిన. కానీ వేయించేటప్పుడూ బంతి షేపులోకి పొంగేలా జాగ్రత్తగా వేయించాలి. అంతేగాదు ఈ పిండిని ఎంత ఎక్కువ సేపు నానిస్తే అంతలా అవి డీప్ ఫ్రై చేసేటప్పుడూ కచ్చితమైన చందామామ లాంటి ఆకృతికి వస్తాయి. మన ఇండియన వంటకమైన భాతురా రెసిపీకి దగ్గరగా ఉంటుంది ఈ వంటకం. ఇది పంజాబీ వంటకం. ఇది కూడా ఒక విధమైన పులియబెట్టిన బన్ లేదా పూరీ మాదిరిగా ఉండే వంటకం. మనం ఎలా అయితే పూరీలను సెనగలు ఆలు కర్రీ లేదా కుర్మాతో తింటామో అలానే ఈ జపాన్ రెసీపీని కూడా ఇంచుమించుగా అదే మాదిరి స్పైసీ కర్రీతో తింటారట అక్కడ ప్రజలు. దీన్ని వాళ్లు "జెయింట్ సెసేమ్ బాల్" అని పిలుస్తారట. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు ఈ రెసిపీని కాస్మిక్ భాతురా, బంతి ఆకారపు పూరీ అని రకరకాలుగా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by むにぐるめ(唯一無二の絶品グルメ) (@muni_gurume_japan) (చదవండి: బీచ్లో సరదాగా జంట ఎంజాయ్ చేస్తుండగా..అంతలోనే..) -
బీచ్లో సరదాగా జంట ఎంజాయ్ చేస్తుండగా..అంతలోనే..
కొందరూ ప్రేమికులు ప్రమాదకరమైన చోట్ల చేసే సరదా పనులు జీవితాలను కోల్పోయేలా చేస్తాయి. ముఖ్యంగా రైల్వే ఫ్లాట్పాంలపై, బైక్లపై చేసే పిచ్చి పనులతో ప్రాణాలు కోల్పోయిన వారెందరో. ఏ క్షణంలో మృత్యువు ఎటువైపు నుంచి వస్తుందో ఊహించను కూడా ఊహించం. అలాంటిది ఇలాంటి డేంజరస్ ప్రదేశాల్లో మనమే కాస్త జాగ్రత్తగా మసులుకోవాలి. లేదంటే ఈ ప్రేమ జంటలా కథలా విషాదంగా ముగిస్తుంది.ఏం జరిగిందంటే..రష్యాలోని సోచీలో బీచ్ వద్ద సరదాగా జంట ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ నడుస్తున్నారు. అబ్బాయి వద్దన్న పర్లేదు అంటూ కాస్త లోపలికి తీసుకువచ్చింది. వెనుక నుంచి అలల వేగం ఎక్కువయ్యింది. కానీ ఇదంత గమనించకుండా తమ అల్లరిలో మునిగిపోయిన జంట మీదకు అమాంతం పెద్ద కెరటం వచ్చింది. అంతే ఒక్కసారిగా ఆ అమ్మాయి అలల ధాటికి లోపలికి వెళ్లిపోగా..ఏదోల ఒడ్డుకు వచ్చాడు ప్రియుడు. పాపం అతడు తన ప్రియురాలిని రక్షించుకుందామని ఏదోలా ప్రయత్నించినా..అప్పటికే ఆలస్యం అవ్వడం తోపాటు ఒకదానివెంట ఒకటి వేగంగా అలలు వస్తూ..ఆమెను మరింత లోతుగా తీసుకుపోయాయి. దీంతో అతడు ఏం చేయ్యలేని సిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు రివేరా బీచ్ నుంచి మామైకా మైక్రోడిస్ట్రిక్ట్ వరకు బాధితురాలి కోసం గాలించడం ప్రారంభించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఇలాంటి చోట్ల జాగ్రత్తగానే ఉండాలని, మరింత లోపలికి వెళ్లే ప్రయత్నం అస్సలు చెయ్యకూడదని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరూ ఈత రానప్పుడూ ఇలాంటి దుస్సాహాసానికి ఒడిగట్టొదని చివాట్లు పెడుతూ పోస్టులు పెట్టారు.Woman gets swept out to sea as her boyfriend frantically tries to help save her in Sochi, Russia.Devastating.The incident reportedly happened while the couple was visiting from the Russian city of Lipetsk.The couple could be seen going to the water's edge when massive waves… pic.twitter.com/zEaFXoDjkg— Collin Rugg (@CollinRugg) June 18, 2024 (చదవండి: చేయని నేరానికి ఏకంగా 40 ఏళ్లు..! ఆ మందుల ప్రభావంతో..) -
జెప్టోలో డెలివరీ.. హెర్షే చాక్లెట్ సిరప్లో చనిపోయిన ఎలుక
ఈ మధ్యకాలంలో ఆన్లైన్ డెలివరీ పార్శిల్లో వస్తున్న వాటిని చూసి చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని రోజుల క్రితం నోయిడాలలో ఓ వ్యక్తి ఐస్క్రీంను ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అందులో తెగిన మనిషి వేలు కనిపించడం సంచలనం సృష్టించింది. దీంతో సదరు ఐస్క్రీం సంస్థ లైసెన్స్ను కూడా రద్దు చేశారు. అనంతరం బెంగళూరులోని ఓ వ్యక్తి అమెజాన్ నుంచి ఎక్స్ బాక్స్ కంట్రోలర్ను ఆర్డర్ చేయగా.. పార్శిల్ బాక్స్లో చిన్న తాచు పాము వుండడం చూసి ఒక్కసారిగా కస్టమర్ భయాందోనకు గురయ్యాడు.తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది. ఆన్ లైన్ డెలివరీ సంస్థ జెప్టో ద్వారా ఆర్డర్ చేసిన హెర్షే చాక్లెట్ సిరప్ బాటిల్లో చనిపోయిన ఎలుకను చూసి ప్రమీ శ్రీధర్ అనే మహిల ఒక్కసారిగా షాక్కు గురైంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో తన అనుభవాన్ని పంచుకున్నారు.జెప్టో నుంచి హెర్షే చాక్లెట్ సిరప్ని బ్రౌనీ కేక్లతో తినడానికి ఆర్డర్ చేయగా... సిరప్ను కప్లో పోస్తుండగా అందులో చనిపోయిన ఎలుక కనిపించిందని అని పేర్కొన్నారు. అయితే ఈ విషయం తెలియక ముందు కుటుంబ సభ్యులు సిరప్ రుచి చూశారని, దీంతో వారు అస్వస్థతకు గురయ్యారని తెలిపింది. ఏదైనా వస్తువు ఆర్డర్ చేసి తినే ముందు తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేయాలని, కేసు వేయాలని సూచిస్తున్నారు.దీంతో హెర్షే సంస్థ స్పందించింది. ఇలాంటి ఘటన ఎదురైనందుకు తాము చింతిస్తున్నామని తెలిపింది. దయచేసి తమకు UPC అలాగే తయారీ కోడ్ను consumercare@hersheys.comకు రిఫరెన్స్ నంబర్ 11082163తో పంపాలని తెలిపింది. తద్వారా తమ బృంద సభ్యులు మీకు సహాయం చేయగలరని పేర్కొంది. View this post on Instagram A post shared by Prami Sridhar (@pramisridhar) -
నా కుటుంబం జోలికి వస్తే ఇలాగే చేస్తా: పాక్ స్పీడ్స్టర్
పాకిస్తాన్ స్పీడ్స్టర్ హ్యారిస్ రవూఫ్ తనపై జరుగుతున్న ట్రోలింగ్ పట్ల స్పందించాడు. ఆటగాడిగా తనను విమర్శిస్తే పట్టించుకోనని.. అయితే.. తన కుటుంబం జోలికి వస్తే అస్సలు ఊరుకోనని స్పష్టం చేశాడు.ఎదురుగా ఎవరు ఉన్నారన్న విషయంతో కూడా తన సంబంధం ఉండదని.. తన స్పందన ఇలాగే ఉంటుందని రవూఫ్ పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో పాకిస్తాన్ లీగ్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.గ్రూప్-ఏలో ఉన్న బాబర్ ఆజం బృందం తొలుత అమెరికా, టీమిండియా చేతిలో ఓడింది. ఆ తర్వాత కెనడా, ఐర్లాండ్ జట్లపై గెలిచినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లీగ్ మ్యాచ్లన్నీ అమెరికాలోనే ఆడిన పాక్.. సూపర్-8 రేసు నుంచి అప్పటికే అవుటై పోయింది.పాకిస్తాన్ ఆటగాళ్ల తీరుపై విమర్శలుఈ క్రమంలో మాజీ క్రికెటర్లు సహా సొంత అభిమానులు సైతం పాకిస్తాన్ ఆటగాళ్ల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. జట్టులో ఐక్యత లేకుండా గ్రూపులు కట్టి.. సర్వనాశనం చేశారని మండిపడుతున్నారుఈ నేపథ్యంలో హ్యారిస్ రవూఫ్ తన భార్యతో కలిసి అమెరికా వీధుల్లో వెళ్తుండగా ఓ వ్యక్తి అతడిని విమర్శిస్తూ మాటల యుద్ధానికి దిగాడు. దీంతో రవూఫ్ సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తూ.. అతడి పైకి దూసుకెళ్లాడు.భార్య వద్దని వారిస్తూనే ఉన్నా.. కోపాన్ని నియంత్రించుకోలేక సంమయనం కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ నేపథ్యంలో హ్యారిస్ రవూఫ్ తొలిసారిగా స్పందించాడు.నా తల్లిదండ్రులు, కుటుంబం జోలికి రానంతవరకే‘‘సోషల్ మీడియా వరకు ఈ విషయం రావొద్దని అనుకున్నా. కానీ వీడియో ఎలాగో బయటకు వచ్చింది. కాబట్టి నేను స్పందించక తప్పడం లేదు.పబ్లిక్ ఫిగర్లుగా ఉన్న కారణంగా పబ్లిక్ నుంచి అన్ని రకాల ఫీడ్బ్యాక్ను మేము తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్లే మమ్మల్ని సమర్థిస్తారు. ఒక్కోసారి విమర్శిస్తారు కూడా!కానీ.. నా తల్లిదండ్రులు, కుటుంబం జోలికి రానంతవరకే నేను వాటన్నింటినీ భరిస్తాను. ఒకవేళ ఈ విషయంలో వాళ్లు హద్దు దాటితే నేను కూడా వారికి తగ్గట్లుగానే బదులిస్తాను.ప్రొఫెషన్లకు అతీతంగా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మనం గౌరవించాల్సి ఉంటుంది’’ అని హ్యారిస్ రవూఫ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో ఈ రైటార్మ్ పేసర్ ఏడు వికెట్లు తీశాడు.pic.twitter.com/KuUSZWoDaq— Haris Rauf (@HarisRauf14) June 18, 2024 -
T20 World Cup 2024: అభిమానిపైకి దూసుకెళ్లిన పాక్ పేసర్.. భార్య వారించినా..!
టీ20 వరల్డ్కప్ 2024లో పాక్ గ్రూప్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. గ్రూప్-ఏలో పాక్.. భారత్, యూఎస్ఏ చేతుల్లో ఓటమిపాలై సూపర్-8కు అర్హత సాధించలేకపోయింది. పాక్ కంటే మెరుగ్గా రాణించిన ఆతిథ్య దేశం యూఎస్ఏ.. భారత్తో పాటు సూపర్-8లోకి ప్రవేశించింది.ప్రస్తుత ప్రపంచకప్లో పాక్ పోరాటం ముగిసినా ఆ జట్టు ఇంకా స్వదేశానికి తిరుగు ముఖం పట్టలేదు. మరికొద్ది రోజుల పాటు పాక్ బృందం యూఎస్ఏలోనే గడపనున్నట్లు సమాచారం.A heated argument between Haris Rauf and a fan in the USA. pic.twitter.com/d2vt8guI1m— Mufaddal Vohra (@mufaddal_vohra) June 18, 2024అయితే ఈ మధ్యలో పాక్ పేసర్ హరీస్ రౌఫ్కు చేదు అనుభవం ఎదురైంది. భార్యతో కలిసి అమెరికా వీధుల్లో షికారుకు వెళ్లిన రౌఫ్పై ఓ అభిమాని మాటల దాడికి దిగాడు. ఇందుకు ప్రతిగా రౌఫ్ సైతం గట్టిగానే స్పందించాడు. తాను ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ అన్న విషయాన్ని మరిచి అభిమానిపై దాడికి యత్నించాడు. కూడా ఉన్న భార్య వారించినా రౌఫ్ వినలేదు. ఆ అభిమానిపైకి ఒంటికాలితో దూసుకెళ్లాడు. ఈ క్రమంలో అతని చెప్పులు సైతం జారిపోయినా పట్టించుకోలేదు. ఆ అభిమాని ఏమన్నాడో తెలియదు కానీ.. రౌఫ్ కోపంతో ఊగిపోయాడు. దారిన పోయేవారు.. సెక్యూరిటీ వారిండంతో రౌఫ్ ఆడిపోయాడు. ఈ లోపు రౌఫ్ను రెచ్చగొట్టిన అభిమాని అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. అభిమాని పట్ల రౌఫ్ ప్రవర్తన చూసి సొంత దేశ అభిమానులు కూడా అతన్ని అసహ్యించుకుంటున్నారు. రౌఫ్ ప్రొఫెషనల్ క్రికెటర్ అన్న విషయాన్ని మరిచి వీధి రౌడీలా ప్రవర్తించాడని చివాట్లు పెడుతున్నారు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లకు ఇలాంటి అనుభవాలు సహజమేనని.. ఇలాంటి సందర్భాల్లో పరిణితి ప్రదర్శించి చూసీ చూడనట్లు వ్యవహరించాలని హితవు పలుకుతున్నారు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్లో సూపర్-8 బెర్త్లు ఖరారైన విషయం తెలిసిందే. గ్రూప్-ఏ నుంచి భారత్తో (A1) పాటు యూఎస్ఏ (A2) సూపర్-8కు అర్హత సాధించింది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1), ఇంగ్లండ్ (B2), గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1), వెస్టిండీస్ (C2), గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1), బంగ్లాదేశ్ (D2) సూపర్-8లోకి ప్రవేశించాయి.సూపర్-8 గ్రూప్-1లో గ్రూప్-ఏ నుంచి భారత్ (A1).. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1).. గ్రూప్-డి నుంచి బంగ్లాదేశ్ (D2) జట్లు ఉన్నాయి.సూపర్-8 గ్రూప్ 2లో గ్రూప్-ఏ నుంచి యూఎస్ఏ (A2).. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ (B2).. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్ (C2).. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి.సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్లు..జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (సెయింట్ విన్సెంట్)సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్లు..జూన్ 19- యూఎస్ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)జూన్ 21- యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)జూన్ 23- యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా) -
ఐసీయూలో వెంటిలేటర్పై తండ్రి, ఆసుపత్రిలోనే కూతుళ్ల పెళ్లి...వైరల్ వీడియో
అల్లారుముద్దుగా పెంచుకున్న తమ ఇంటి ఆడబిడ్డను ఒక అయ్య చేతిలో పెట్టాలని ప్రతీ తల్లీదండ్రి ఆశపడతారు. ముఖ్యంగా పేద, ధనిక తేడాల్లేకుండా ప్రతీ కుటుంబంలోనూ ఉండే అత్యంత సమజమైన కోరిక. మరీముఖ్యంగా అమ్మలాంటి తన కూతురిపెళ్లిని ఉన్నంతలో ఘనం చేయాలనికోరుకుంటారు తండ్రులు. కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో హృదయాన్ని పిండేసే రీతిలో ఒక సంఘటన జరిగింది.లక్నోలోని మోహన్లాల్గంజ్ గ్రామానికి చెందిన మహ్మద్ ఇక్బాల్ సరిగ్గా కుమార్తె పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాక అనారోగ్యానికి గురయ్యాడు. కోలుకోకపోవడంతో ఆస్పత్రిలో చేరాడు. అయినా ఆరోగ్యం కుదుట పడలేదు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా పరిస్థితి మరింత విషమించి ఇక్బాల్ ఎరా మెడికల్ కాలేజీ ఐసియులో ఉన్నాడు. అయితే తండ్రి కోరిక మేరకు ఆయన కళ్లముందే ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.జూన్ 22న ముంబైలో వీరి వివాహం జరగాల్సి ఉంది. కానీ తండ్రి పరిస్థితిని గమనించిన కుమార్తెలు కూతుళ్లు దర్శా, తాంజిలా ఆస్పత్రి ఐసీయూలోనే పెళ్లిచేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని తండ్రి ఆశీర్వాదం పొందారు. కుటుంబ సభ్యులు, పెళ్లి పెద్ద,వధూవరులు ఆసుపత్రి దుస్తుల్లో..ఆసుపత్రి అధికారుల అనుమతితోనే పెళ్లి తంతు మొత్తం జరిగింది. ఇతర రోగులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా వివాహాన్ని త్వరితగతిన నిర్వహించాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆస్పత్నిని సిబ్బందిని అభినందించారు. అలాగే నూతన వధూవరులకు ఆశీర్వాదాలందించారు.Unique marriage took place with simplicity and rituals in the ICU of Era Hospital, #Lucknow !Father admitted in ICU got his daughters married in front of hi. pic.twitter.com/rFJIhRCpsK— Nuzba Amen Sheakh (@nuzzu52103) June 16, 2024 -
నిప్పూ, నీళ్లూ! వెరైటీ షవర్ : ఇలా ఉన్నారేంట్రా మీరు! వైరల్ వీడియో
షవర్ బాత్ తెలుసు.. ఐస్ బాత్ గురించి విన్నాం...కానీ మీరెపుడైనా ఫైర్ బాత్ గురించి విన్నారా? అవును నిజంగానే ఫైర్ బాత్ స్నానం చేస్తున్నాడు ఓ వ్యక్తి, నీళ్లు, నిప్పుతో కలిసి బాత్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్ హల్ చల్ చేస్తోంది.ఈ వీడియోలో ఒక పైప్ నుంచి నీళ్లతోపాటు, అగ్ని కూడా సెగలు కక్కుతూ ఒకేసారి కలిసి వస్తున్నాయి. లావాలా ఉబికి వస్తున్న ఈ నీళ్లలోనే ఒక వ్యక్తి ఎంచక్కా షవర్ బాత్ చేస్తున్నాడు. అచ్చం పైనుంచి జాలువారే జలపాతం వద్ద ఎంజాయ్ చేస్తున్నట్టుగా. ఈ వీడియోపై నెటిజనులు విభిన్నంగా స్పందించారు. అతని ఆరోగ్యంపై కొందరు ఆందోళనవ్యక్తం చేశారు. ఇలాంటి ఫీట్స్ ప్రమాదకరమని కొందరు, ఇలా చేస్తే కేన్సర్ బారిన పడటం ఖాయమని కొందరు వ్యాఖ్యానించారు.This must be one of the strangest showers in the world! 🚿🔥It's apparently located in Russia & spews both water and fire at the same time! 🤔 pic.twitter.com/Gh5fpW3ZQ4— H0W_THlNGS_W0RK (@HowThingsWork_) June 17, 2024 సహజ వాయువు, నిప్పు, నీరుతో స్నానం ఇదని, ఈ నీటిలో ఎక్కడో ఒక రకమైన గ్యాస్ ఉందని, దీంతో నీటితో పాటు తేలికగా మంటలు వస్తున్నాయని కమెంట్స్ ఎక్కువగా కనిపించాయి. అలాగే చాలా చల్లగా ఉంటుంది కానీ దుర్వాసన కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ విచిత్రమైన ఘటన రష్యాలో జరిగిందని, ఇలాంటి ఘటనలు రష్యాలోనే మాత్రమే చోటు చేసుకుంటాయంటూ మరికొందరు కమెంట్ చేశారు. -
T20 World Cup 2024: సేద తీరుతున్న టీమిండియా క్రికెటర్లు
టీ20 వరల్డ్కప్ 2024లో సూపర్-8 బెర్త్లు ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. సూపర్-8లో టీమిండియా.. ఆఫ్ఘనిస్తాన్ (జూన్ 20, బార్బడోస్), బంగ్లాదేశ్ (జూన్ 22, ఆంటిగ్వా), ఆస్ట్రేలియా (జూన్ 24, సెయింట్ లూసియా) జట్లతో తలపడనుంది.ఈ మ్యాచ్లకు ముందు భారత ఆటగాళ్లకు మూడు రోజుల విశ్రాంతి లభించింది. ఈ ఖాళీ సమయాన్ని టీమిండియా ఆటగాళ్లు సరదాగా ఆస్వాధిస్తున్నారు. సూపర్-8లో తమ తొలి మ్యాచ్కు (ఆఫ్ఘనిస్తాన్) వేదిక అయిన బార్బడోస్కు ఇదివరకే చేరుకున్న భారత ఆటగాళ్లు స్థానిక బీచ్లో వాలీబాల్ ఆడుతూ సేద తీరారు.📍 Barbados Unwinding at the beach 🌊, the #TeamIndia way! #T20WorldCup pic.twitter.com/4GGHh0tAqg— BCCI (@BCCI) June 17, 2024విరాట్ కోహ్లి, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్ తదితరులు రెండు గ్రూప్లుగా విడిపోయి బార్బడోస్ సాగర తీరాన వాలీబాల్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరలవుతుంది.కాగా, గ్రూప్ దశలో భారత్ ఆడాల్సిన చివరి మ్యాచ్ (కెనడా) వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. భారత్ గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్ల్లో విజయం సాధించి అజేయ జట్టుగా కొనసాగుతుంది.ఇదిలా ఉంటే, గ్రూప్-ఏ నుంచి భారత్తో (A1) పాటు యూఎస్ఏ (A2) సూపర్-8కు అర్హత సాధించింది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1), ఇంగ్లండ్ (B2), గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1), వెస్టిండీస్ (C2), గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1), బంగ్లాదేశ్ (D2) సూపర్-8లోకి ప్రవేశించాయి.సూపర్-8 గ్రూప్-1లో గ్రూప్-ఏ నుంచి భారత్ (A1).. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1).. గ్రూప్-డి నుంచి బంగ్లాదేశ్ (D2) జట్లు ఉన్నాయి.సూపర్-8 గ్రూప్ 2లో గ్రూప్-ఏ నుంచి యూఎస్ఏ (A2).. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ (B2).. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్ (C2).. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి.Team India. 🥶🇮🇳 pic.twitter.com/tE8TVVd9Pv— Mufaddal Vohra (@mufaddal_vohra) June 17, 2024సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్లు..జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (సెయింట్ విన్సెంట్)సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్లు..జూన్ 19- యూఎస్ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)జూన్ 21- యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)జూన్ 23- యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా) -
బొమ్మలా నిల్చున్న బైడెన్.. ఒబామా ఏం చేశారంటే..
న్యూయార్క్: గత కొంత కాలంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తన, ఫిట్నెస్పై తీవ్ర విమర్శల పాలువుతున్నారు. ఆయన అధిక వయసు, మతిమరుపు కారణంగా పలు వేదికలపై వింతగా ప్రవర్తిస్తూ కొన్ని క్షణాల పాటు ఫ్రీజ్ అయిపోతున్నారు. పక్కనున్న వాళ్లు ఆయన్ను కదిలిస్తేగాని బైడెన్ తేరుకోవటం లేదు. ఇటువంటి ఘటన మరోకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ప్రెసిడెంట్ జో బైడెన్ శనివారం ఓ ఫండ్రైజింగ్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. పికాక్ థియేటర్లో జిమ్మి కిమ్మెల్తో ఇంటర్వ్యూ ముగిసిన అనంతరం స్టేజీపై ప్రెసిడెంట్ బైడెన్, మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కలిసి నిల్చున్నారు. ఈ క్రమంలో భారీ వచ్చిన జనాలను చూసి.. ఒక్కసారిగా బైడెన్ కళ్లు దగ్గరుకు చేసుకొని విగ్రహంగా కదలకుండా 10 సెకండ్లపాటు ఫ్రీజ్ అయిపోయారు. దీంతో పక్కనే ఉన్న ఒబామా చేయిపట్టుకొని కదిలించటంతో బైడెన్ తేరుకొని ముందుకు నడిచినట్లు వీడియో దృష్యాల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.🔥🚨DEVELOPING: President Obama had to guide Joe Biden off the stage with Jimmy Kimmel at Biden’s fundraising event in The Hamptons with George Clooney. pic.twitter.com/5OoWVhajOl— Dom Lucre | Breaker of Narratives (@dom_lucre) June 16, 2024 ఇటీవల జరిగిన జీ-7దేశాల సమ్మిట్కు హాజరైన బైడెన్ వింతగా ప్రవర్తించారు. ఇటలీలోని అపూలియాలో తీర ప్రాంతంలో వాటర్ స్పోర్ట్స్ను దేశాధినేతలు వీక్షిస్తుంటే.. దానికి దూరంగా వెళ్లుతూ.. అక్కడ ఎవరూ లేకపోయినా షేక్ హ్యాండ్ ఇస్తూ పలకరించినట్లు వీడియోల్లో కనిపించి విషయం తెలిసిందే. వెంటనే ఇటలీ ప్రెసిడెంట్ జార్జీయా మెలోని ఆయన దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకొని మరీ వెనక్కి తీసుకువచ్చారు.LMFAOOO is Joe Biden okay??? pic.twitter.com/kvAJHBcwAd— kira 👾 (@kirawontmiss) June 13, 2024గతంలో పలు సందర్భాల్లో జో బైడెన్ ఫ్రీజ్ కావటం, తడబడటానికి సంబంధించిన వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. మరోవైపు బైడెన్ ఫ్రీజ్ మరోసారి ఫ్రీజ్ అయిపోయారనే వార్తలను వైట్హౌజ్ ఖండించింది. ప్రెసిడెంట్ బైడెన్ ఇక్కడ ప్రేక్షకులు చప్పట్లతో చూపించిన ప్రేమలో మునిగిపోయి అలా కొన్ని క్షణాలు ఉండిపోయారని తెలిపింది. నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో సైతం బైడెన్ ప్రవర్తన, ఫిట్నెస్ను ప్రతిపక్ష పార్టీ ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే.It took Joe Biden exactly 3 seconds to forget he had already shaken Schumer's hand. pic.twitter.com/V3eEOuaFuz— Gain of Fauci (@DschlopesIsBack) June 12, 2024 -
కరివేపాకులు ఆరు నెలలు వరకు నిల్వ ఉండాలంటే..!
కరివేపాకులు కూరల్లో వేస్తే దాని రుచే వేరు. కరివేపాకుతో పెట్టే పోపు దగ్గర నుంచి పులుసులు వరకు అది ఉంటే ఏ రెసిపీ అయినా ఘమఘమలాడిపోవాల్సిందే. అలాంటి కరివేపాకుని నిల్వ చేసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. ఎలా అయినా కనీసం నాలుగు రోజులు అవ్వంగానే నెమ్మదిగా గోధుమ వర్ణంలోకి వచ్చి వాసన పోయి..క్రమేణ ఆకుపచ్చదనం కూడా తగ్గిపోతుంది. ఎలా అయినా.. అబ్బా..! వీటిని నిల్వ చేయడం కష్టం రా బాబు అనుకుంటారు చాలామంది గృహిణులు. అందుకే చాలమంది వీటిని డ్రైగా చేసి పొడిరూపంలోనూ లేదా ఇతర విధాలుగా నిల్వ చేసుకుని కూరల్లో ఆ ఫ్లేవర్ వచ్చేలా చేస్తారు. అయితే ఆ సమస్యలన్నింటికి చెక్పెట్టేలా తాజాగా నిల్వ చేసుకునే సరికొత్త ట్రిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే..కరివేపాకులు నిల్వ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఈ ట్రిక్ ఫాలో అయితే ఆకులు కలర్ మారకుండా, వాటి వాసన కూడా ఏ మాత్రం పోకుండా చక్కగా తాజాగా ఉంచుకోవచ్చు. ఏకంగా ఇలా ఆరునెలలపాటు నిల్వ చేసుకోవచ్చట. అదేంటంటే..ఒక ఖాళీ ఐస్ ట్రైని తీసుకుని అందులో కరివేపాకు కొమ్మలు నుంచి వేరు చేసిన ఆకులను మూడు లేదా నాలుగు చొప్పున ఆకులను ట్రైలో పెట్టుకుంటూ వచ్చి దానిలో నీళ్లు పోయాలి. ఆ ట్రైని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి అంతే అవన్నీ గడ్డకట్టేసిన క్యూబ్లు మాదిరిగా అయిన తర్వాత బయటకు తీసి జిప్ లాక్ బ్యాగ్లో ఆ క్యూబ్లు వేసుకుని ఫ్రిడ్జ్లో భద్రపర్చుకోవాలి. కావాల్సినప్పడు ఆ బ్యాగ్ ఫ్రిడ్జ్లోంచి తీసి ఆ క్యూబ్లను ఓ గిన్నెలో వేసి దానిలో కొద్దిగా గోరు వెచ్చిని నీళ్లు వేసి కాసేపటి తరువాత చూస్తే తాజా కరివేపాకులు నీటిపై తేలుతూ కనిపిస్తాయి. అవి జస్ట్ ఇప్పుడే చెట్టునుంచి తెంపిన ఆకుల్లా తాజాగా కనిపిస్తాయి. వాటి వాసన కూడా పోదు. ఇలా ఆరునెలలపాటు సులభంగా నిల్వ చేసుకోవచ్చట. ఇది ఎక్కువగా శీతాకాలంలో ఉపయోగపడుతుందట. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు.. ఇలాంటి ట్రిక్ విదేశాల్లో ఉండే వారికి చాలా అద్భుతంగా ఉపయోగపుడుతుందని అంటున్నారు. అంతేగాదు జిప్లాక్ బ్యాగ్లో పుదీనా, కొత్తిమీర, పార్స్లీ ఆకులు ఉంచితే చాలా కాలం పాటు తాజాగా ఉంటాయని చెబుతున్నారు. View this post on Instagram A post shared by Dhara (@twinsbymyside) (చదవండి: రూ. 83 లక్షల జీతం వదులుకుని మరీ పేస్ట్రీ చెఫ్గా..రీజన్ వింటే షాకవ్వుతారు!) -
18 ఏళ్ల అందమైన అమ్మాయితో 90 ఏళ్ల తాత పెళ్లి : వీడియో మామూలుగా లేదుగా!
ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట... అయిదు రోజుల పెళ్లి ఇది ఒకప్పటి పెళ్లిళ్ల చరిత్ర. అంతేకాదు చిలకా గోరింకల్లా, రాధి కృష్ణుల్లా జంట భలే ముచ్చటగా ఉన్నారు అని పెద్దలు దీవించే వారు. ఇపుడు ట్రెండ్ మారింది గురూ. లేటు వయసులో ఘాటు ప్రేమలు, పెళ్లిళ్లు చాలానే చూస్తున్నాం. తాజాగా 90 ఏళ్ల వృద్ధుడు, 18 ఏళ్ల అందమైన అమ్మాయిని పెళ్లాడాడు. అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. అంతేకాదు డీజేకి తగ్గట్టుగా వరుడు, వధువుతో స్టెప్పులేశాడు. దీనికి సంబంధించి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అమేజింగ్ బిహార్ అనే ఇన్స్టాలో ‘పవర్ ఆఫ్ మనీ’ పేరుతో షేర్ అయింది. పెళ్లి అనేది వ్యక్తిగత అవసరం అభీష్టం. కానీ సోషల్ మీడియా మాత్రంలో నెటిజన్లు రక రకాల కామెంట్స్తో సందడి చేస్తున్నారు. ‘అరే..కాస్త విషంతీసుకుండిరా... ఈ వీడియో చూస్తూ..చూస్తూ చచ్చిపోతా’’ అనే కామెంట్ మాత్రం క్రేజీగా నిలిచింది. View this post on Instagram A post shared by ⚠️⃝⃜ LAKHISARAI BIHAR ⚠⃤ (@amazing__bihar) -
నడిరోడ్డులో ఈ బిల్డప్ అవసరమా? ఇంకెక్కడా చోటే లేదా బాస్?! వైరల్ వీడియో
సోషల్ మీడియా యూజర్ల ఆగడాలు రోజుకి రోజుకి మరింత ఇబ్బంది కరంగా మారుతున్నాయి. తాజాగా ఇదేం చోద్యం రా బాబూ అనిపించేలా ఒక ఒక షూట్ వీడియో ఒకటి ఇంటర్నెట్లో సందడి చేస్తోంది. ఇది విశాఖపట్నం నగర వీధుల్లోచూసినట్టు తెలుస్తోంది. నడిరోడ్డుమీద అందంగా ముస్తాబైన ఒక అమ్మాయిని అడ్డంగా నిలబెట్టి వీడియో తీస్తున్నాడో వ్యక్తి. అటూ ఇటూ వాహనదారులు ఇబ్బందిగా చూస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో చూడవచ్చు. బ్యాక్ గ్రాండ్లో తెలుగు పాటను, ఫోటోగ్రాఫర్ తెలుగులో ఇస్తున్న డైరెక్షన్స్ను కూడా ఈ వీడియోలో మనం గమనించవచ్చు. ప్రతీక్ సింగ్ అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. బిజీగా ఉన్న రోడ్డులో ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అవసరమా అనే క్యాప్షన్తో దీన్ని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వైజాగ్ ట్రాఫిక్ పోలీసును ట్యాగ్ చేస్తూ దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కమెంట్ చేశారు.The courage, the confidence, and the excitementPre-wedding shoot on a bustling road.Is it necessary? pic.twitter.com/Es4hTmuf47— Prateek Singh (@Prateek34381357) June 14, 2024 -
సెహ్వాగా?.. అతడెవరు? షకీబ్ అల్ హసన్ కామెంట్స్ వైరల్
బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అసలు సెహ్వాగ్ ఎవరో తనకు తెలియదంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 ఆడే బంగ్లాదేశ్ జట్టుకు ఎంపికైన షకీబ్ అల్ హసన్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అరుదైన రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్ వరల్డ్కప్ కప్ ఆరంభ ఎడిషన్ నుంచి ఇప్పటిదాకా కొనసాగిన ఆటగాడిగా రోహిత్తో పాటు అతడు నిలిచాడు.అయితే, గ్రూప్ దశలోని తొలి రెండు మ్యాచ్లలో ఈ వెటరన్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. శ్రీలంక, సౌతాఫ్రికా మ్యాచ్లలో వరుసగా ఎనిమిది, మూడు పరుగులు చేసిన షకీబ్.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.ముఖ్యంగా సౌతాఫ్రికాతో మ్యాచ్లో అతడు అవుటైన తీరు విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. అనవసర షాట్లకు అవుట్ కావడం ఏమిటని, ఎప్పుడో రిటైర్ అవ్వాల్సిన క్రికెటర్ ఇంకా ఆడితే ఇలాగే ఉంటుందని విమర్శించాడు.అంతేకాకుండా నువ్వేమీ మాథ్యూ హెడ్న్, ఆడం గిల్క్రిస్ట్ కాదని.. జస్ట్ బంగ్లాదేశ్ ప్లేయర్వి అని వీరూ భాయ్ షకీబ్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే, తాజాగా నెదర్లాండ్స్తో మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలుపొంది సూపర్-8కు చేరువైంది.ఈ విజయంలో షకీబ్ అల్ హసన్ కీలక పాత్ర పోషించాడు. 46 బంతుల్లో 64 పరుగులతో రాణించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. కీలక సమయంలో రాణించి.. జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా సెహ్వాగ్ విమర్శల గురించి ఓ జర్నలిస్టు ప్రశ్నించగా.. ‘‘సెహ్వాగ్? అతడెవరు?’’ అంటూ షకీబ్ అల్ హసన్ ఎదురు ప్రశ్నించాడు. ‘‘విమర్శకులు చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం ఆటగాళ్లకు లేదు.జట్టుకు ఏ విధంగా ఉపయోగపడగలం అని మాత్రమే మనం ఆలోచించాలి. అలా ఆలోచించని వాళ్లే అనవసరపు విషయాల గురించి పట్టించుకుంటారు.బ్యాటర్ బ్యాటింగ్ గురించి.. బౌలర్ బౌలింగ్ గురించి.. ఫీల్డింగ్ చేసే సమయంలో క్యాచ్లు లేదంటే పరుగులు సేవ్ చేయడం గురించి మాత్రమే ఆలోచిస్తారు. అంతేగానీ ఇలాంటి వాటికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఆటగాళ్లకు ఏమాత్రం ఉండదు’’ అని షకీబ్ అల్ హసన్ సెహ్వాగ్ను ఉద్దేశించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.చదవండి: అందరికీ పది నిమిషాలు.. అతడికి ఇరవై: పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలుShakib Al Hasan, the most arrogant cricketer in the his history.Journalist: There has been lot of discussions about your performance especially criticize by Virendra Sehwag"Shakib: Who is Sehwag?pic.twitter.com/wtqlGrdeX3— Farrago Abdullah Parody (@abdullah_0mar) June 14, 2024 -
అమిత్ షా మందలించారా?.. స్పందించిన తమిళిసై
చెన్నై: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తమిళనాడు బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ మధ్య సీరియస్గా సాగిన సంభాషణ వైరల్గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై అంతటా తీవ్ర చర్చకు దారితీసింది. ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారు? ఆ సమయంలో ఇంత సీరియస్ చర్చేంటి? అంటూ రకరకాల ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారాని ముందు ఆహ్వానితుల జాబితాలో ఉన్న తమిళిసై అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఆ టైంలో వేదిక మీద ఉన్న బీజేపీ అగ్రనేతలకూ ఆమె నమస్కరించుకుంటూ పోసాగారు. అయితే ఆమెను వెనక్కి పిలిచిన అమిత్ షా.. ఏదో సీరియస్గా మాట్లాడారు. ఆమె వివరణ ఇవ్వబోతుండగా.. వేలు చూపించి మరీ ఏదో సీరియస్గానే చెప్పారు. దీంతో తమిళిసైకి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారనే అంతా భావించారు. అయితే.. అన్నామలై తో పంచాయతీ బంద్ చెయ్ అంటున్నాడా ?? pic.twitter.com/NVeTII7Sxl— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) June 12, 2024VIDEO CREDITS: 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨ఈ ఘటనకు సంబంధించి తమిళిసై తాజాగా స్పందించారు. అమిత్ షాతో చర్చకు సంబంధించిన ఊహాగానాలను ఆమె కొట్టిపారేశారు. ఈ వీడియోను తప్పుగా అర్థం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. ‘‘లోక్సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఏపీలో జరిగిన కార్యక్రమంలో తొలిసారిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశాను. పోలింగ్ తర్వాత సమీకరణాలు, ఎన్నికల్లో నేను ఎదుర్కొన్న సవాళ్ల గురించి తెలుసుకునేందుకు అమిత్ షా నన్ను పిలిచారు. నేను ఆయనకు వివరిస్తున్నప్పుడు సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన మాట్లాడారు. రాజకీయ, నియోజకవర్గ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని సలహా ఇచ్చారు. ఆ మాటలు నాకు ఎంతో భరోసా కలిగించాయి. ఈ అంశం చుట్టూ తిరుగుతున్న అన్ని ఊహాగానాలకు ఇది స్పష్టత ఇస్తుంది’’ అని తమిళిసై పేర్కొన్నారు. Yesterday as I met our Honorable Home Minister Sri @AmitShah ji in AP for the first time after the 2024 Elections he called me to ask about post poll followup and the challenges faced.. As i was eloborating,due to paucity of time with utmost concern he adviced to carry out the…— Dr Tamilisai Soundararajan (மோடியின் குடும்பம்) (@DrTamilisai4BJP) June 13, 2024తమిళనాడులో బీజేపీ నేతల మధ్య అంతర్గత విభేదాల గురించే వీరి చర్చ సాగినట్లు కొందరు సోషల్మీడియాలో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం, ఎన్నికల కోసం అన్నాడీఎంకే పొత్తును ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై వ్యతిరేకించారని.. ఒకవేళ పొత్తుగా వెళ్లి ఉంటే బీజేపీ కచ్చితంగా విజయం సాధించి ఉండేదన్న అభిప్రాయం తమిళిసై వ్యక్తం చేశారని.. ఈ నేపథ్యంలో అమిత్షా ఆమెను పిలిచి మందలించారంటూ కొందరు అభిప్రాయపడ్డారు. మరోవైపు తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఈ పరిణామంపై స్పందించింది. ఓ మహిళా నేతతో ఇలాగేనా వ్యవహరించేది.. ఇదేనా బీజేపీ సంస్కృతి అంటూ మండిపడింది. ఇంకోవైపు.. అమిత్ షా అంత కఠువుగా వ్యవహరించి ఉండాల్సింది కాదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే ఆయన తననేం తిట్టలేదన్నట్లుగా ఇప్పుడు తమిళిసై వివరణ ఇచ్చుకొచ్చారు. -
T20 World Cup 2024: రాకాసి బౌన్సర్.. తృటిలో తప్పిన అపాయం
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్-నెదర్లాండ్స్ మధ్య ఇవాళ (జూన్ 13) జరుగుతున్న కీలక మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నెదర్లాండ్స్ పేసర్ వివియన్ కింగ్మా సంధించిన రాకాసి బౌన్సర్ను ఎదుర్కొనే క్రమంలో బంగ్లా బ్యాటర్ తంజిద్ హసన్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్ 3వ ఓవర్లో జరిగిన ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.ఇంతకీ ఎం జరిగిందంటే.. ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి బంగ్లాదేశ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. బంగ్లా ఇన్నింగ్స్ మూడో ఓవర్ నాలుగో బంతికి తంజిద్ హసన్ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. డచ్ పేసర్ వివియన్ కింగ్మా సంధించిన రాకాసి బౌన్సర్ను ఎదుర్కొనే క్రమంలో బంతి తంజిద్ హెల్మెట్ గ్రిల్లో ఇరుక్కుపోయింది. View this post on Instagram A post shared by ICC (@icc)ఒకవేళ బంతి ఇంకాస్తా వేగంగా వచ్చి ఉంటే హెల్మెట్ గ్రిల్ లోనుంచి దూసుకుపోయి తంజిద్ కంటికి పెద్ద గాయం చేసేది. ఊహించని ఈ ఘటనలో తంజిద్ షాక్కు గురయ్యాడు. కొద్ది సేపటి వరకు అతనికి ఏమీ అర్దం కాలేదు. బంతి కంటి దగ్గరకు రావడంతో కళ్లు మూసుకున్న తంజిద్, కొద్ది సేపటి తర్వాత కళ్లు తెరిచి చూసే సరికి అంగులాల దూరంలో బంతి ఉంది. షాక్ నుంచి తేరుకున్న తంజిద్ వెంటనే హెల్మెట్ తీసి నేలపై పెట్టాడు. ఫిజియో హుటాహుటిన మైదానంలోకి వచ్చి తంజిత్కు ఫస్ట్ ఎయిడ్ అందించాడు.కాగా, ఈ ఘటన తర్వాత మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసిన తంజిద్ 26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 35 పరుగులు చేసి ఔటయ్యాడు. దీనికి ముందు ఆర్యన్ దత్ (2 వికెట్లు) చెలరేగడంతో బంగ్లాదేశ్ 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తంజిద్.. షకీబ్ సాయంతో బంగ్లా ఇన్నింగ్స్ను నిర్మించాడు. 17.2 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 130/4గా ఉంది. షకీబ్ (50), మహ్మదుల్లా (25) క్రీజ్లో ఉన్నారు. బంగ్లా ఇన్నింగ్స్లో షాంటో (1), లిటన్ దాస్ (1), తౌహిద్ హ్రిదోయ్ (9) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. డచ్ బౌలర్లలో వివియర్ కింగ్మా 2, పాల్ వాన్ మీకెరెన్, టిమ్ ప్రింగిల్ తలో వికెట్ పడగొట్టారు. -
ఆటిజం బిడ్డలు, ఆ అమ్మలకు హ్యట్సాఫ్ : వీడియో వైరల్
ఆటిజంతో బాధపడుతున్న పిల్లల్ని పెంచి పెద్ద చేయడం తల్లి తండ్రులకు ఒక సవాల్. కానీ వారికి రోజువారీ కార్యకలాపాల నిర్వహణలో శిక్షణ ఇవ్వాలి. అలాగే ఆటిజం పిల్లల్లో స్పెషల్ టాలెంట్ ఉంటుంది. దాన్ని గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇస్తే బాగా రాణిస్తారు. దీనికి ఉదారణలు చాలానే ఉన్నాయి. తాజాగా తన బిడ్డ డ్యాన్స్ ప్రదర్శన కోసం తపన పడుతున్న ఓ తల్లి వీడియో ఒకటి ఇంటర్నెట్లో ఆసక్తికరంగా మారింది.ఒక తల్లి తన ఆటిస్టిక్ బిడ్డకు నృత్య పోటీలో ప్రదర్శన ఇవ్వడానికి సహాయం చేస్తోంది అంటూ అపర్ణ అనే యూజర్ ఎక్స్లో ఒక వీడియోను షేర్ చేశారు. ‘‘ప్రత్యేక పిల్లలను పెంచడానికి అనుభవించే బాధ.. సహనం.. ఎంత అంకితభావం అవసరమో ఊహించను కూడా ఊహించలేం.. హ్యాట్సాఫ్’’ అంటూ వ్యాఖ్యానించారు.A mother helps her autistic child perform in a dance competition ...Can't even imagine the amount of pain, patience and dedication required to bring up special children! Hats off 🙏💕 pic.twitter.com/JbEETe4yzC— Aparna 🇮🇳 (@apparrnnaa) June 10, 2024ఈ వీడియోలో ఆటిజంతో బాధపడుతున్న ఒక బాలిక స్టేజ్పై శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అక్కడే ఆమెకు ఎదురుగా కూర్చున్న తల్లి స్వయంగా ఆయా భంగిమలను చూపిస్తూ ఉంటుంది. దాని కనుగుణంగా ఆ పాప తన డ్యాన్స్ను కొనసాగిస్తుంది. ఈ వీడియో ఇపుడు వైరల్గా మారింది.ఆటిజంఆటిజం అనేది చిన్నపిల్లల్లో ఏర్పడే ఒక మానసిక స్థితేకానీ, రుగ్మత కాదు. తల్లి గర్భం దాల్చిన సమయంలో ఆమె మానసిక స్థితిని బట్టి లేదా మేనరికం కొన్ని జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. చెప్పిన విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవడం, ఎవరితో అయినా మాట్లాడే సమయంలో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకపోవడం, చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తుండటం, ఒక పనిని ఎప్పుడూ చేసినా తిరిగి అలాగే చేయాలని ప్రయత్నించడం, కొందరు సంతోషం కలిగితే చేతులను కాళ్ళను పైకి కిందికి అదే పనిగా ఆడించడం,చెప్పిన పని చేయకపోవడం, నేలపై నడిచేటప్పుడు నిటారుగా నడవకుండా వేళ్లపై నడవడం లాంటి లక్షణాలు ఉంటాయని అంటున్నారు నిపుణులు. ఇలాంటి సమస్యలు చిన్నపిల్లల్లో జన్మించిన మూడు సంవత్సరాల నుండి మొదలయ్యే అవకాశం ఉంటుందని, ఇలాంటి లక్షణాలు తల్లిదండ్రులు కనుగొన్నట్లయితే వెంటనే మానసిక వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స అందించాలి. లేకపోతే సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. -
అమిత్ షా-తమిళిసై మధ్య అసలేం జరిగింది!
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికపై ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. బీజేపీ అగ్రనేత అమిత్ షా ఆ పార్టీ మహిళా నేత తమిళిసై సౌందరరాజన్ మధ్య జరిగిన సన్నివేశమది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ కూడా హాజరయ్యారు. అక్కడే వేదిక మీద ఉన్న బీజేపీ పెద్దలకు నమస్కారం చేసి ముందుకు వెళ్లబోయారు. అయితే.. కేంద్ర మంత్రి అమిత్ షా ఆమెను వెనక్కి పిలిచారు. ఒక్కసారిగా ఆమెపై సీరియస్ అయ్యారు. తమిళిసై ఏదో చెప్పబోతుండగా.. అడ్డుకుని మరీ అమిత్ షా ఆమెను ఏదో వారించినట్లు ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అన్నామలై తో పంచాయతీ బంద్ చెయ్ అంటున్నాడా ?? pic.twitter.com/NVeTII7Sxl— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) June 12, 2024తమిళిసైకి, కేంద్ర మంత్రి అమిత్ షాకి మధ్య అసలు ఏం జరిగింది?. ఆమెపై కేంద్రమంత్రి అమిత్ షా ఎందుకు అంత సీరియస్ అయ్యారని షోషల్మీడియాలో చర్చ జరుగుతోంది.ఇటీవల లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలైతో పాటు తమిళిసై కూడా ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే ఆమె అన్నామలైకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా పంచాయితీలు పెట్టొద్దంటూ ఆమెను వారించి ఉంటారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై బీజేపీ స్పందిస్తేనే అసలేం జరిగిందనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
మందు మింగడానికి మీ ‘పప్పీ’ మారాం చేస్తోందా? ఇదిగో ఇంట్రస్టింగ్ టిప్
ఆధునిక కాలంలో ఇంట్లో పెంపుడు జంతువు (పెట్స్) పెంచుకోవడం ఒక అవసరంగా మారిపోయింది. వీటిల్లో కుక్క, పిల్లిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే జాగ్రత్తగా చూసుకోవడం, వాటి ఆరోగ్యం, ఆహారం, వ్యాయామం , శ్రద్ధ సంరక్షణ ఇవన్నీ యజమాని బాధ్యత. పెంపుడు జంతువుల బ్రీడ్ లేదా సైజుతో సంబంధం లేకుండా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడానికి సాధారణ వ్యాయామం, మానసిక ప్రేరణ అవసరం. ఇంట్లో , బయటా ఆడుకోవడానికి, పరిగెత్తడానికి అవకాశం ఉండేలా చూసుకోవాలి.Tip for giving medication to dogs, dip the syringe in something they like 📹 igotthissitpic.twitter.com/6yCsPxmIMR— Science girl (@gunsnrosesgirl3) June 10, 2024ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. మనుషుల మాదిరిగానే పోషకాలతో నిండిన,సమతుల్య ఆహారం చాలా అవసరం. వాటి బ్రీడ్ వయస్సుతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా పశువైద్యుడిని సంప్రదించి టీకాలు వేయించాలి. గ్రూమింగ్, జనరల్ చెక్-అప్లు చేయించాలి. ఏదైనా అనారోగ్యం వస్తే సరైన చికిత్స చేయించాలి. అంతేకాదు పెంపుడు జంతువు వైద్య ఖర్చుల కోసం పెట్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కూడా ఉన్నాయి.సాధారణంగా అనారోగ్యానికి గురైన కుక్కలకు మందులు వేయడం యజమానులకు ఒక పెద్ద టాస్క్అని చెప్పాలి. ఒక్క పట్టాన మాట వినవు. మారాం చేస్తాయి. ఈ నేపథ్యంలో వాటికి మందులు ఎలా వేయాలో చిన్న చిట్కా అంటూ ఒక వీడియో ఇంటర్ నెట్లో ఆసక్తికరంగా మారింది. చిన్ని పిల్లల్ని మాయ చేసి, మ్యాజిక్ చేసినట్టే.. పెట్స్కి కూడా వాటికిష్టమైన ఆహారంలో పెట్టి తినిపించేయడమే. అదెలాగో మీరూ చూసేయండి. -
T20 World Cup 2024: బ్యాట్ను రెండుగా చీల్చేసిన బంగ్లాదేశ్ బ్యాటర్
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా సౌతాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య నిన్న (జూన్ 10) జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశీ బ్యాటర్ జాకెర్ అలీ కోపంతో బ్యాట్ను రెండు ముక్కలుగా చీల్చేశాడు. బంగ్లాదేశ్ గెలుపుకు 7 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన తరుణంలో జాకెర్ అలీ ఈ పనికి పాల్పడ్డాడు. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఓట్నీల్ బార్ట్మన్ బౌలింగ్లో పుల్ షాట్ ఆడే క్రమంలో జాకెర్ అలీ బ్యాట్ డ్యామేజ్ అయ్యింది. షాట్ మిస్ టైమ్ కావడంతో కోపంతో ఊగిపోయిన జాకెర్ స్వల్పంగా డ్యామేజ్ అయిన బ్యాట్ను రెండుగా చీల్చాడు. అనంతరం జాకెర్ కొత్త బ్యాట్ కోసం డ్రెస్సింగ్ రూమ్కు సైగ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. View this post on Instagram A post shared by ICC (@icc)ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా నిర్దేశించిన 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి బంగ్లాదేశ్.. చివరి వరకు పోరాడి 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. బంగ్లాదేశ్ గెలుపుకు ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి. కేశవ్ మహారాజ్ ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన రెండు వికెట్లు తీశాడు. ఈ రెండు వికెట్లకు సంబంధించిన క్యాచ్లను కెప్టెన్ మార్క్రమ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్లో 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న సౌతాఫ్రికా టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో అత్యల్ప స్కోర్ను ఢిఫెండ్ చేసుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో క్లాసెన్ (46), డేవిడ్ మిల్లర్ (29), డికాక్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లా బౌలరల్లో తంజిమ్ సకీబ్ 3, తస్కిన్ అహ్మద్ 2. రిషద్ హొసేన్ ఓ వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. కేశవ్ మహారాజ్ (4-0-27-3), నోర్జే (4-0-17-2), రబాడ (4-0-19-2) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లా ఇన్నింగ్స్లో తౌహిద్ హ్రిదోయ్ (37) టాప్ స్కోరర్గా నిలిచాడు. షాంటో (14), మహ్మదుల్లా (20) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.