-
అంబానీ ఫ్యామిలీ ఫోటో అదిరిందిగా : ఫోటోలు వైరల్
రిలయన్స్అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త కుమార్తె, అనంత్ ప్రేయసి రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకులు ఘనంగా ముగిసాయి. గుజరాత్లోని జామ్ నగర్లో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరిగాయి. అంబానీ పెద్దకోడలు, ఆకాశ్ భార్య శ్లోకా అంబానీ మన దేశం నెక్స్ట్ జనరేషన్ లీడర్లు ఒకే ఫ్రేమ్లో అంటూ ఈ ఫోటోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. జామ్నగర్లో డిన్నర్ సందర్భంగా తీసుకున్న ఫోటోకి ఆకాష్, శ్లోక ఇషా, ఆనంద్, అనంత్, రాధికల బెస్ట్ ఫోటో అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో అద్భుతం అంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. రిలయన్స్ అంబానీ కుటుంబం రేపటి తరం అంటూ సోషల్ మీడియా పోస్ట్లు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మూవీ ‘హమ్ సాథ్ సాథ్ హై’ పోస్టర్తో పోస్టింగ్లు వెల్లువెత్తాయి. మరోవైపు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఫౌండర్ చైర్మన్గా ఉన్న ఎన్ఎంఏసీసీకి చెందిన ట్విటర్ ఖాతా కూడా వేడుకలు ఘనంగా ముగిసాయి అంటూ ట్వీట్ చేసింది. దీనికి సంబంధించి రెండు ఫోటోలను కూడా షేర్ చేసింది. Ambani family and their furry family member ‘Happy’, strike a relaxed pose at the successful completion of the pre-wedding celebrations of Anant and Radhika which started with Anna Seva for nearby village communities, followed by three day festivities with friends and family. pic.twitter.com/crLugfuX2y — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) March 8, 2024 View this post on Instagram A post shared by Shloka Akash Ambani (@shloka_ambani) -
Rakul-Jackky Wedding : జాకీ స్పెషల్ సర్ప్రైజ్, ఫోటోలు వైరల్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ , నటుడు-నిర్మాత జాకీ భగ్నానీ పెళ్లి ముహూర్తం వచ్చేసింది. ఈరోజు గోవాలో ఫిబ్రవరి 21 న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. దీనికి సంబంధించి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు, తరలి వెళుతున్న సెలబ్రిటీల ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రకుల్, జాకీ పెళ్లికి భగ్నానీ & సింగ్ కుటుంబం స్వాగతం పలుతుకున్న వేదిక దగ్గర్నించి, RJ లవ్బర్డ్స్ పేర్ల తొలి అక్షరాలను రాసిన కొబ్బరికాయ, గోవా చేరుకుంటున్న పలువురు సినీరంగ ప్రముఖుల ఫోటోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. రకుల్ జాకీ వారి మెహందీ, సంగీత వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంగీత్లో వరుణ్ 'కూలీ నంబర్ 1' లోని 'హస్న్ హై సుహానా'కి డ్యాన్స్ చేయగా,. వరుణ్తో పాటు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా , ఇతర కుటుంబ సభ్యులు కూడా స్టెప్పులేశారు. అంతేకాదు జాకీ భగ్నాని తన లవ్ లేడీని ఓ పాటతో సర్ ప్రైజ్ చేయాలని ప్లాన్ చేశాడట. వారి ప్రేమకథను సూచించే బిన్ తేరే అంటూ సాగే ఈ పాట వేడుకకు ఓ ప్రత్యేకతను తీసుకొచ్చిందట. ఈ పాటకు మయూర్ పూరి సాహిత్యం అందించగా, తనిష్క్ బాగ్చి కంపోజిషన్లో జహ్రా ఎస్ ఖాన్, రోమీ మతనిష్క్ బాగ్చి పాడారు. రకుల్కి గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉండేలా ఈ పాటను ప్లాన్ చేశాడట. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) పంజాబీ వెడ్డింగ్లంటే చుడా వేడుక అతిముఖ్యమైంది. వధువు మేనమామ పాలతో శుద్ధి చేసిన గాజులను అందిస్తాడు. ఇద్దరు మేనమామలుంటే, ఎవరు ఎక్కువ గాజులు పెడతారనే అందమైన పోటీ ఉంటుంది ఇద్దరి మధ్యా. ఉదయం 'చుడా' వేడుక ఆ తర్వాత గోవా ITC గ్రాండ్ సౌత్ 'సాథ్ ఫేరా' ఉంటుందని సమాచారం. రకుల్ , జాకీ రెండు సాంప్రదాయల ప్రకారం పెళ్లిళ్లు చేసుకుంటారని తెలుస్తోంది. అంగరంగ వైభవంగా ఈ పెళ్లి వేడుకలో జాకీ భగ్నాని తండ్రి వాషు భగ్నాని సన్నిహిత మిత్రుడు రాజ్కుంద్రా, ఆయన భార్య నటి శిల్పా శెట్టి ఈ వేడుకలో ప్రత్యేకంగా కనిపించనున్నారు. నటుడు వరుణ్ ధావన్, భార్య నటాషా దలాల్ ఇప్పటికే గోవాలో సందడి చేస్తున్నారు. కొన్నేళ్ల డేటింగ్ తరువాత, రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీ తమ ప్రేమ బంధాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా 2021,అక్టోబర్ అధికారంగా షేర్ చేసిన సంగతి తెలిసిందే. #WATCH The Gorgeous actress #PragyaJaiswal was snapped arriving at Goa airport to attend bestie #RakulPreetSingh & #JackkyBhagnani's wedding. She was seen posing with fans at the airport. The pair decided to skip overseas weddings and marry in a beautiful hotel in South Goa. pic.twitter.com/Sn2LxraSWh — E Global news (@eglobalnews23) February 20, 2024 -
‘కమలం’ చెంతకు కమల్నాథ్?
న్యూఢిల్లీ/భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ హస్తం పార్టీకి గుడ్బై చెప్పబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే అలాంటిదేమీ లేదని కమల్నాథ్ ఆ వార్తలను కొట్టిపారేశారు. అయితే శనివారం జరిగిన పరిణామాలు చూస్తుంటే ఆయన బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషణలు వినవచ్చాయి. అసలేం జరిగింది? కమల్నాథ్కు మాజీ మీడియా సలహాదారు, ప్రస్తుత బీజేపీ అధికార ప్రతినిధి అయిన నరేంద్ర సలూజా.. కమల్నాథ్, ఆయన కుమారుడు, ఛింద్వారా కాంగ్రెస్ ఎంపీ నకుల్నాథ్లతో దిగిన భోపాల్లో దిగిన ఒక ఫొటోను ‘ఎక్స్’లో పోస్ట్చేసి దానికి ‘జై శ్రీరామ్’ అని ట్వీట్చేశారు. దీంతో తండ్రీకొడుకులు కమలం గూటికి చేరుకుంటున్నారని వార్తలు మొదలయ్యాయి. వీటికి బలం చేకూరుస్తూ నకుల్నాథ్ తన ‘ఎక్స్(పాత ట్విట్టర్)’ ఖాతా వివరాల్లో కాంగ్రెస్ పదాన్ని తొలగించారు. ముందస్తు షెడ్యూల్ లేకుండా హడావుడిగా ఇద్దరూ ఢిల్లీకి వచ్చారు. రాగానే మీడియా కమల్ను ప్రశ్నించింది. మీరు పార్టీ మారుతున్నారా? అన్న ప్రశ్నకు ‘‘ అలాంటిదేమైనా ఉంటే ముందు మీకే చెబుతా’ అని అన్నారుగానీ పార్టీని వీడట్లేదనే సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. రాజ్యసభ సీటు ఆశించి భంగపడినందుకే కమల్నాథ్ పార్టీని వీడుతున్నారని మరో విశ్లేషణ వినిపించింది. బీజేపీలోకి వస్తామంటే ఇప్పుడే మీకు స్వాగతం పలుకుతామని మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ శుక్రవారం వ్యాఖ్యానించడం తెల్సిందే. గత ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శనకు కమల్నాథ్ బాధ్యుడని రాహుల్ భావిస్తున్నారని, అందుకే కమల్ను తప్పించి జీతూ పట్వారీకి కాంగ్రెస్ మధ్యప్రదేశ్ చీఫ్ పదవి కట్టబెట్టారని వార్తలొచ్చాయి. అన్నీ అసత్యాలు : జీతూ పట్వారీ ఇలాంటి వార్తలను కాంగ్రెస్ మధ్యప్రదేశ్ అధ్యక్షుడు జీతూ పటా్వరీ తోసిపుచ్చారు. ‘‘ కాంగ్రెస్తో కమల్నాథ్ బంధం ఈనాటిది కాదు. ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీతో కలిసి డెహ్రాడూన్ డూన్ స్కూల్లో చదివారు. ఒకానొక సమయంలో కమల్ నా మూడో కుమారుడు అంటూ స్వయంగా ఇందిరగాం«దీనే వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ను వీడుతారా?’’ అని మీడియానే పట్వారీ నిలదీశారు. ‘‘రాజ్యసభ సీటు ఇవ్వలేదన్నది అవాస్తం. నిజానికి ఆ స్థానం కోసం నామినేషన్ వేసిన పార్టీ కోశాధికారి అశోక్సింగ్ పేరును బలపరిచింది కమల్నాథే’’ అని పటా్వరీ వివరణ ఇచ్చారు. దశాబ్దాలుగా కాంగ్రెస్తో అనుబంధమున్న కమల్ ఛింద్వారా నుంచి తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచారు. 2019లో ఆ స్థానం నుంచి కమల్ కుమారుడు నకుల్ గెలిచారు. ఈ ఒక్కస్థానం తప్ప రాష్ట్రంలోని మిగతా 28 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. -
Filmfare Awards 2024: దుమ్ము రేపిన బాలీవుడ్ కపుల్, స్వీట్ కిస్, పిక్స్ వైరల్
ప్రతిష్టాత్మక 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోబాలీవుడ్ జంట రణబీర్ కపూర్-అలియాభట్ దుమ్ము రేపారు. అలియా, రణబీర్ ఇద్దరూ ఉత్తమ నటీ, ఉత్తన నటుడు అవార్డులను గెల్చుకుని రీల్ లైఫ్లో కూడా బెస్ట్ కపుల్గా నిలిచారు. రణబీర్ చిత్రం యానిమల్లోని జమాల్ కుడు అనే పాటకు ఇద్దరూ స్టెప్స్ వేయడం అక్కడున్న వారందరిన్నీ ఉత్సాహపరిచింది. ఈ డ్యాన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాదు ఆఖరులో రణ్బీర్ అలియాను ముద్దుపెట్టుకోవడం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచింది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అలియా భట్ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ మూవీకిగాను ఉత్తమ నటి అవార్డును అందుకోగా, ఆమె భర్త రణబీర్ కపూర్ యానిమల్లో తన అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' మూవీ ఏకంగా ఆరు అవార్డులను కైవసం చేసుకుంది. అంతేకాదు ఓటీటీ రికార్డుల మోత మోగించిన '12 త్ ఫెయిల్' ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా దర్శకుడు విధు వినోద్ చోప్రా ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నారు. గుజరాత్ లోని గాంధీనగర్ వేదికగా అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకలో 2023 లో విడుదలైన చిత్రాలకు సంబంధించి అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
PM Modi Lakshadweep: ప్రధాని మోదీ.. జస్ట్ వావ్
కవరత్తి: తన పర్యటనల్లో వైవిధ్యం.. కొత్తదనం రెండూ ఉండేలా చూసుకుంటారు ప్రధాని నరేంద్ర మోదీ. తాజాగా కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ రెండు రోజుల పర్యటనలో ‘వావ్’ అనిపించేలా ఫోజులతో ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ప్రధాని మోదీ గురువారం అడ్వెంచర్కు దిగారు. స్నార్కలింగ్ చేసినట్లు ఫొటోల్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. కళ్లజోడు తరహా ఉండి ఒక గొట్టంలాంటి భాగం(దీనిని స్నార్కల్ అంటారు)తో గాలిపీలుస్తూ నీటిలో ఈదడాన్నే స్నార్కలింగ్ అంటారు. ఆ ఫొటోలు పంచుకుంటూ.. ఉల్లాసంగా గడిపినట్లు చెప్పారాయన. అలాగే సాహసయాత్రికుల జాబితాలో లక్షద్వీప్ ఉండాల్సిందేనని సూచించారాయన. అంతకు ముందు.. And those early morning walks along the pristine beaches were also moments of pure bliss. pic.twitter.com/soQEIHBRKj — Narendra Modi (@narendramodi) January 4, 2024 ప్రకృతి అందాలతో పాటు, లక్షద్వీప్ ప్రశాంతత కూడా మంత్రముగ్దులను చేస్తుంది. 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింత కష్టపడి ఎలా పని చేయాలో ఆలోచించే అవకాశం నాకు లభించింది అంటూ సాగర తీరాన నడుస్తూ.. సేదతీరుతూ ఫొటోల్ని షేర్ చేశారు. -
టీమిండియా యువ క్రికెటర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?!
Venkatesh Iyer Engagement Pics: టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ తన అభిమానులుకు శుభవార్త చెప్పాడు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తనకు నిశ్చితార్థమైన విషయాన్ని తెలియజేస్తూ.. కాబోయే శ్రీమతితో దిగిన ఫొటోలు పంచుకున్నాడు. ఈ మేరకు.. ‘‘నా జీవితంలో తదుపరి అధ్యాయానికి నాంది’’ అంటూ మంగళవారం ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ సహా హర్ప్రీత్ బ్రార్ తదితరులు వెంకటేశ్ను విష్ చేశారు. ఫ్యాషన్ డిజైనర్! కాగా వెంకటేశ్ అయ్యర్కు కాబోయే భార్య పేరు శృతి రఘునాథన్. పీఎస్జీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో బీకామ్ చదివిన శృతి.. నిఫ్ట్(NIFT) నుంచి ఫ్యాషన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నట్లు సమాచారం. ఆమె ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. టీమిండియా తరఫున అరంగేట్రం చేసి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించిన వెంకటేశ్ అయ్యర్.. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. స్వదేశంలో 2021లో న్యూజిలాండ్తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్.. మరుసటి ఏడాది వన్డేల్లోనూ అరంగ్రేటం చేశాడు. ఇక ఐపీఎల్-2023లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిథ్యం వహించిన 28 ఏళ్ల అయ్యర్కు కొన్నాళ్లుగా భారత జట్టులో చోటు కరువైంది. కాగా తన అంతర్జాతీయ కెరీర్లో వెంకటేశ్ ఇప్పటి వరకు.. 2 వన్డే, 9 టీ20 మ్యాచ్లు ఆడి వరుసగా 24, 133 పరుగులు సాధించాడు. టీ20 ఫార్మాట్లో 5 వికెట్లు పడగొట్టాడు. చదవండి: గెలుపోటములు సహజం.. అదొక్కటే విషాదం! కోహ్లిని ఓదార్చిన సచిన్ View this post on Instagram A post shared by Venkatesh R Iyer (@venky_iyer) -
Chandrayaan 3 Success Viral Photos: నెట్టింట చంద్రయాన్-3 సక్సెస్ హల్చల్
-
తిరిగింది చాలు.. ఇక ఆటపై దృష్టి పెట్టు! అసలే వరల్డ్కప్..
Ravindra Jadeja Photos: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు. వెస్టిండీస్తో వన్డే సిరీస్ అనంతరం జడ్డూ యూఎస్ఏలో వాలిపోయాడు. విండీస్ పర్యటన తర్వాత దొరికిన విరామ సమయాన్ని తనకు నచ్చిన చోటల్లా విహరిస్తూ సెలవులను పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ఎప్పటికపుడు అప్డేట్లు అందిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ వద్ద ఉన్న ఫొటోలు పంచుకున్న జడ్డూ.. ‘‘ఈ వెలుగులు ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాయి’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. నిమిషాల్లోనే ఈ ఫొటోలకు లక్షల్లో లైకులు వచ్చాయి. అయితే, కొంతమంది నెటిజన్లు మాత్రం.. ‘‘తిరిగింది చాలు.. కాస్త ఆట మీదకు దృష్టి మళ్లించు.. ప్రాక్టీస్ మొదలుపెట్టు’’ అంటూ రవీంద్ర జడేజాను ట్రోల్ చేస్తున్నారు. బౌండరీ బాది చెన్నై సూపర్ కింగ్స్ను విజేతగా నిలిపిన మాదిరిగానే.. వరల్డ్కప్ టోర్నీలోనూ రాణించాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా ఆసియా కప్-2022 సందర్భంగా గాయపడ్డ జడ్డూ దాదాపు ఐదు నెలల తర్వాత పునరాగమనం చేశాడు. రీ ఎంట్రీలో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటూ రోజురోజుకీ అభిమానుల సంఖ్య పెంచుకుంటున్నాడీ స్పిన్ ఆల్రౌండర్. ఇక ఇటీవల వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో వరుసగా 37(నాటౌట్), 61 పరుగులు సాధించిన రవీంద్ర జడేజా.. మొత్తంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇక మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్న జడ్డూ.. మొత్తం 34 పరుగులు సాధించాడు. కాగా ఆగష్టు 30న మొదలుకానున్న ఆసియా వన్డే కప్-2023తో జడేజా మళ్లీ మైదానంలో దిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ అత్యధికంగా మూడుసార్లు రవీంద్ర జడేజా నుంచి శాంపిల్స్ సేకరించినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. జనవరి- మే మధ్య డోపింగ్ పరీక్షలు నిర్వహించినట్లు నాడా తెలిపింది. చదవండి: ఆసీస్ యువ పేసర్ సంచలనం.. 20 బంతుల్లో 1 పరుగు.. 3 వికెట్లు! వీడియో View this post on Instagram A post shared by Ravindrasinh jadeja (@royalnavghan) -
పెళ్ళికి ముందే ప్రియురాలితో చక్కర్లు కొడుతున్న బిల్ గేట్స్ - (ఫోటోలు)
-
ఆసీస్ ఆల్రౌండర్ మాక్సీ భార్య సీమంతం.. ఫొటోలు వైరల్! ఆ విషాదం తర్వాత..
RCB Star Maxwell Wife Vini RamanTamil Baby Shower: ఆస్ట్రేలియా ఆల్రౌండర్, ఆర్సీబీ స్టార్ గ్లెన్ మాక్స్వెల్ త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్నాడు. భార్య వినీ రామన్తో కలిసి ఈ ఏడాది మేలో ఈ శుభవార్తను పంచుకున్నాడు మాక్సీ. రెయిన్ బో బేబీ రాబోతుందంటూ సంతోషం వ్యక్తం చేశారీ దంపతులు. ఈ క్రమంలో మాక్సీ సతీమణి వినీ రామన్ తాజాగా తన సీమంతం ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమిళ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ‘వలైకాప్పు’ వేడుకకు సంబంధించిన దృశ్యాలను అభిమానులతో పంచుకుంది. సంప్రదాయ పద్ధతిలో ఇందులో.. నిండైన చీరకట్టులో.. చేతులకు గాజులు, మెడలో నగలు వేసుకుని.. నుదుటిన కుంకుమ బొట్టు ధరించి.. భర్తను ఆప్యాయంగా హత్తుకున్న వినీ ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. విదేశాల్లో ఉన్నా సరే మన సంస్కృతిని, సంప్రదాయాలను మర్చిపోకుండా పుట్టబోయే బిడ్డకోసం ఇంత అందమైన వేడుక చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ పలువురు వినీ మాక్స్వెల్ను అభినందిస్తున్నారు. ఆ విషాదం తర్వాత కాగా తమిళనాడు మూలాలున్న వినీ రామన్.. గ్లెన్ మాక్స్వెల్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గతేడాది మార్చి 18న వీరి పెళ్లి ఆస్ట్రేలియాలో జరిగింది. ఇక ఈ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో మాక్సీ ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. మేలో ముగిసిన తాజా ఎడిషన్లో ఈ విధ్వంసకర ఆల్రౌండర్ 14 ఇన్నింగ్స్ ఆడి 400 పరుగులు సాధించాడు. కాగా గతంలోనూ వినీ రామన్ గర్భవతి అయినప్పటికీ ఆ బిడ్డ ఈ భూమ్మీదకు రాకుండానే వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె గర్భం దాల్చడంతో రెయిన్బో బేబీ(గర్భస్రావం లేదంటే తల్లి కడుపులోనే శిశువు చనిపోయిన తర్వాత పుట్టబోయే బిడ్డ) అంటూ మాక్సీ దంపతులు గుడ్న్యూస్ షేర్ చేయడం విశేషం. చదవండి: 'మా దురదృష్టం.. అతడి లాంటి ఆటగాళ్లు జట్టుకు కావాలి! కొంచెం కూడా భయపడలేదు' -
కశ్మీర్ ట్రిప్లో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. వైరల్ ఫొటోలు
-
స్పేస్ఎక్స్లో కనిపించిన 'బుల్లి మస్క్' - ఫిదా అవుతున్న నెటిజన్లు!
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రముఖ పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటూ చాలామందికి సుపరిచయమయ్యాడు. అయితే ఇటీవల మస్క్ తన కొడుకు 'X AE A-Xii'తో స్పేస్ ఎక్స్ కార్యాలయంలో కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ట్విటర్లో తెగ వైరల్ అవుతున్నాయి. 2020 మే 04న జన్మించిన X AE A-Xii ఎలాన్ మస్క్ భార్య గ్రిమ్స్ మొదటి కొడుకు. అయితే ఈ పిల్లవాడితో కలిసి స్పేస్ ఎక్స్ కార్యాలయానికి రావడం బహుశా ఇదే మొదటి సారి అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు మస్క్ తల్లి మయే మస్క్, "లేట్ ఆన్ ఎ ఫ్రైడే నైట్ @elonmusk X @SpaceX" అనే క్యాప్షన్తో ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసింది. (ఇదీ చదవండి: రతన్ టాటా డ్రీమ్ కారుకి కొత్త హంగులు - ఈవీ విభాగంలో దూసుకెళ్తుందా?) Late on a Friday night @elonmusk X @SpaceX ❤️❤️❤️ pic.twitter.com/dhpJqUsflo — Maye Musk (@mayemusk) July 16, 2023 ఈ ఫోటోలు ఇప్పటి వరకు 40 వేల కంటే ఎక్కువ లైకులు పొందాయి. చాలా మంది బిలినీయర్లు పార్టీలు చేసుకుని సరదాగా గడుపుతారు. మస్క్ మాత్రం తన కొడుకుతో ఆఫీసులో గడుపుతున్నాడు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేసాడు. ఈ పిల్లవాడు అసాధ్యాలను సుసాధ్యం చేసే అనుభవాలను తప్పకుండా పొందుతాడు అంటూ మరో వ్యక్తి.. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు కామెంట్స్ చేస్తున్నారు. -
పారిస్లో ప్రపంచ కుబేరుల లంచ్ మీట్: ఫోటోలు వైరల్
ప్రపంచ కుబేరులు ఒకేవేదికపై దర్శనమివ్వడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచంలోనే ఇద్దరు అత్యంత ధనవంతులు, ఎలోన్ మస్క్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ వారి కుటుంబ సభ్యులతో కలిసి పారిస్లో కలిశారు. జూన్ 14 నుండి జూన్ 17 వరకు ఫ్రాన్స్లోని పెయిర్స్లో జరిగిన వివా టెక్నాలజీ సదస్సు 7వ ఎడిషన్కు వీరు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు శుక్రవారం లంచ్ కోసం కలుసుకున్నారు. తల్లి మేయే మస్క్తో కలిసి టెస్లా సీఈవో మస్క్ హాజరు కాగా, ఎల్ఎఈఎంహెచ్ ఛైర్మన్, సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ అతని ఇద్దరు కుమారులు - ఆంటోయిన్ , అలెగ్జాండ్రే ఆర్నాల్ట్తో వచ్చారు. ఆంటోయిన్ ఆర్నాల్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. మరోవైపు "కలిసి పని చేద్దాం! అంటూ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మస్క్తో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు. NEW: Elon Musk expresses his support for free speech at the Viva Technology event in Paris, France. It's crazy that this is a controversial take in 2023. "We should have free speech as much as possible... We want to allow the people to express themselves." "Free speech matters… pic.twitter.com/PGZrdmNSML — Collin Rugg (@CollinRugg) June 16, 2023 కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో యూరోప్ అతిపెద్ద స్టార్టప్ అండ్ టెక్ ఈవెంట్ జరుగుతోంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా టెక్ లీడర్లు, స్టార్టప్లు, ప్రధాన కార్పొరేషన్లు, పెట్టుబడిదారులను కనెక్ట్ చేయాలనేది ప్లాన్. ఈ ఈవెంట్లో ట్విటర్ బాస్ మస్క్, అతిపెద్ద ఫ్యాషన్ ప్రపంచం అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రధాన వక్తలుగా ఉన్నాయి. వీరితోపాటు ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, సేల్స్ఫోర్స్ కో-ఫౌండర్ మార్క్ బెనియోఫ్, మెటా యాన్ లెకున్లోని వైస్ప్రెసిడెంట్, ఏఏ చీఫ్ ఏసైంటిస్ట్ కూడా ప్రసంగించారు. (హైదరాబాద్లో 38 శాతం ఇళ్లు అమ్ముడు పోవడం లేదట!ఎందుకో తెలుసా?) కాగా ఫోర్బ్స్ ప్రకారం, మస్క్ నికర విలువ 236.9 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తి కాగా, బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం 233.4 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) -
డిస్నీ క్యారెక్టర్లుగా హాలీవుడ్ సెలబ్రిటీస్ వైరల్ ఫొటోస్
-
యుగాంతం వస్తే .. భూమ్మీద నిలిచే సజీవ సాక్ష్యాలివే
-
పెళ్లికొడుకు లుక్లో జబర్దస్త్గా..మస్క్: ఫోటోలు వైరల్
న్యూఢిల్లీ: ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ కొత్త పెళ్లి కొడుకు ఫోజులో మెరిసిపోతున్నాడు. షేర్వాణీలో, గుర్రపు స్వారీ చేస్తూ, అతిథులతో డ్యాన్స్ చేస్తున్న మస్క్ డిఫరెంట్ లుక్లో అదిరిపోతున్న ఫోటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఆగండి ఆగండి ..మస్క్ మళ్లీ పెళ్లి అంటూ ఏవేవో ఊహించేసుకోకండి.. ఇదంతా ఏఐ ఆర్ట్మాయ. రోలింగ్ కాన్వాస్ ప్రెజెంటేషన్స్ అనే హ్యాండిల్ తన ఇన్స్టాగ్రామ్లో మస్క్ పోటోలను షేర్ చేసింది. అలాగే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్, ఏఐ ఆర్టిస్ట్ కూడా నాలుగు రోజులు క్రితం ట్విటర్లో పోస్ట్ చేసిన ఈ పిక్స్ చివరికి మస్క్ దాకా చేరాయి. దీంతో ఐ లవ్ ఇట్ అంటూ మస్క్ మురిసిపోవడం విశేషం. (యావద్దేశం మూగగా..ఫెయిల్-సేఫ్ మెకానిజంపై ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలు) A midjourney art of Elon Musk in an Indian attire is going viral in India. 🇮🇳 pic.twitter.com/LD1KuIAHET — DogeDesigner (@cb_doge) June 3, 2023 కాగా ప్రపంచకుబేరుడు టైటిల్ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మళ్లీ దక్కించుకున్నాడు. ఎలోన్ మస్క్ ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తి టైటిల్ను తిరిగి పొందాడు. ప్యారిస్ ట్రేడింగ్లో ఆర్నాల్ట్ షేర్ల 2.6 శాతం పతనం కావడంతో లగ్జరీ టైకూన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ను అధిగమించిన మస్క్ టాప్లో నిలిచిన సంగతి తెలిసిందే. (వారెవ్వా ఓనరు..ఫిదా చేశావ్ గురూ! ఏం చేశాడో తెలిస్తే!) -
ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ‘గార్బేజ్ క్వీన్స్’ : వైరల్ ఫోటోలు
సాక్షి,ముంబై: ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆర్ట్ ఇంటర్నెట్ను కుదిపేస్తోంది. ఎస్కే ఎండీ అబు సాహిద్ అనే అర్టిస్ట్ మిడ్జర్నీ ఏఐ టూల్తో సృజనాత్మక చిత్రాలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా గార్బేజ్ క్వీన్స్ పేరుతో కొన్ని అద్భుతమైన చిత్రాలను ఇన్స్టాలో షేర్ చేశారు.భయంకరమైన చెత్తలో అందమైన మోడల్స్ను సృష్టించిడం ఈ సిరీస్ ప్రత్యేకత. (సింపుల్ వన్: లాంగెస్ట్ రేంజ్ స్కూటర్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా?) కాగా ఏఐ ఆర్ట్తో సునామీ సృష్టిస్తున్న సాహిద్ ఇప్పటికే పలు పిక్స్తో ఆకట్టుకున్నారు. ప్రముఖ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ వృద్ధాప్యంలో, స్థూలకాయులుగా మారిపోతే ఎలాంటి ఉంటారనే చిత్రాలను పోస్ట్ చేశారు. అలాగే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ముసలివాళ్లుగా ఎలా ఉంటారు? బిజినెస్ టైకూన్స్ జిమ్లో ఎలా ఉంటారనే ఊహకు ప్రాణం పోస్తూ మరికొన్ని పిక్స్ను షేర్ చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే ఇలాంటి ఆసక్తికరమైన, ఊహాజనిత చిత్రాలు చాలానే చూడొచ్చు సాహిద్ ఇన్స్టాలో. ఇదీ చదవండి: వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్ View this post on Instagram A post shared by SAHID (@sahixd) -
వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్
సాక్షి,ముంబై: ఏఐ ఆర్టిస్ట్ సాహిద్ మరోసారి బాలీవుడ్ సూపర్ స్టార్లను వెరైటీగా చూపించారు. బాలీవుడ్ నటులు మహిళలుగా చాలా అందమైన ఏఐ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశాడు. పెదవులపై లిప్స్టిక్, కొన్ని అందమైన ఆభరణాలతో ఈ సూపర్స్టార్లంతా మహిళలుగా గుర్తించలేని విధంగా మారిపోయారు. (Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్ఫ్రెండ్తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్) అంతేకాదు వారి పేర్లను కూడా మార్చేశాడు. అమితాబ్ బచ్చన్ కాస్తా అమితా బచ్చన్ అయ్యారు. షారూఖ్ ఖాన్ షాజాదీ ఖాన్గా, వరుణ్ ధావన్ వర్షా ధావన్గా, రాజ్పాల్ యాదవ్ రాజ్రాణి యాదవ్గా, అమీర్ ఖాన్ అమీరా ఖాన్, టైగర్ ష్రాఫ్ ఫిమేల్ వెర్షన్ టైగ్రెస్ ష్రాఫ్, సల్మాన్ ఖాన్ సల్మా ఖాన్, అక్షయ్ కుమార్ అక్షయ కుమారి, పంకజ్ త్రిపాఠి, షాహిద్ కపూర్ షాహిదా కపూర్ అయిపోవడం విశేషంగా నిలిచింది. (ఫేస్బుక్ మెటాకు భారీ షాక్: ఏకంగా 10వేల కోట్ల జరిమానా) దీంతో ఫ్యాన్స్ పలు కమెంట్లతో సందడి చేశారు. అమితాబ్ బచ్చన్ అచ్చం రేఖలా ఉన్నారని ఒకరు, సల్మాన్ ఖాన్ అయితే చిత్రాంగద సింగ్ లా కనిపిస్తున్నాడని మరొకరు కమెంట్ చేశారు. ఇక షారూక్ ఖాన్ అయితే అచ్చం ఆయన భార్యలా కనిపిస్తున్నారని మరో యూజర్ వ్యాఖ్యానించారు. ఏఐ కళాకారుడు సాహిద్ మిడ్జర్నీ అనే ఏఐ టూల్ ద్వారా విభిన్న కళారూపాలను రూపొందించి సోషల్మీడియా యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. (రిలయన్స్ షాక్: ఉద్యోగాలు ఫట్; రానున్న కాలంలో వేలాది కోతలు!) View this post on Instagram A post shared by SAHID (@sahixd) -
ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్
ఆర్టిఫిషియల్ ఇమేజెస్ హవా మామూలుగా లేదు. ఏఐ ద్వారా ఇప్పటికే సినిమా, క్రీడారంగానికి చెందిన సెలబ్రిటీల ఫోటోలను వివిధ రకాలుగా చిత్రించిన ఏఐ ఆర్టిస్ట్ తాజాగా మరికొన్నింటిని సృష్టించారు. మిడ్ జర్నీని టూల్తో ఏఐ ఆర్టిస్ట్ SK MD అబూ సాహిద్ అందమైన స్టార్లను వృద్ధులుగా మార్చేసారు. ఐశ్వర్యా రాయ్, ప్రియాంక చోప్రా తదితర విమెన్ యాక్టర్స్ సీనియర్ సిటిజెన్స్ అయితే ఎలా ఉంటారో అన్న ఊహ వీటికి ప్రాణమిచ్చింది. అంతేకాదు శ్రద్ధాకపూర్, దీపికా పదుకోన్, కత్రినా కైఫ్, అలియా భట్, కృతి సనన్, అనుష్క శర్మ లాంటి ఫోటోలను కూడా మార్చివేయడంతో ఇవి వైరల్గా మారాయి. అవేంటో మీరూ ఒకసారి చూసేయండి . ఇదీ చదవండి: టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు ముడతలు పడిన చర్మం, నల్లటి వలయాలతో భయంకరంగా కనిపిస్తున్నారంటూ ఫ్యాన్స్ గుండెలు బాదుకుంటున్నారు. "బాప్ రే కృతి సనన్ నా బామ్మగా కనిపిస్తుంది." ఒకరు ఆందోళన వ్యక్తం చేయగా, "శారీరక సౌందర్యం తాత్కాలికం, కానీ అంతర్గత సౌందర్యం శాశ్వతమైనది" ఇలా ఒక్కో పిక్పై ఒక్కో రకంగా హిల్లేరియస్ కమెంట్స్తో యూజర్లు సందడి చేస్తున్నారు. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) కాగా 23 వేల ఇన్స్టా ఫాలోయర్లతో ఏఐఆర్టిస్ట్ సాహిద్ సోషల్ మీడియాలో ఏఐ పిక్స్తో బాగా పాపులర్ అవుతున్నాడు. క్రికెటర్లను ముసలివాళ్లుగా, స్థూల కాయులుగా, ఫుట్బాల్ క్రీడాకారులుగా, బిలియనీర్లను బిచ్చగాళ్ళుగా, షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జీలను శిశువులుగా, మెట్ గాలాలో సందడి చేసిన బిలియనీర్లు, డిస్నీ సినిమాల్లో బాలీవుడ్ నటులు ఇలా ఆయన పోస్ట్ చేసిన వెంటనే ఏఐ పిక్స్ వైరల్ కావడం కామన్గా మారిపోయింది. (Dr.Vandana Lal Success Story: రూ. 3వేల కోట్ల నికర విలువతో రిచెస్ట్ విమెన్: ఆసక్తికర విషయాలు) View this post on Instagram A post shared by SAHID (@sahixd) -
మెట్గాలాలో బిలియనీర్లు అంబానీ, మస్క్, రతన్ టాటా, ఆనంద్ మహీంద్ర: ఫోటోలు వైరల్
సాక్షి,ముంబై: మెట్గాలాలో బిలియనీర్లు, ప్రముఖ వ్యాపారవేత్తలు సందడి చేశారు. అదేంటి ఫ్యాషన్ ఈవెంట్లో వ్యాపారవేత్తలకు ఏం పని అనుకుంటున్నారా? ఇదంతా ఏఐ ఆర్ట్ మహిమ. ఏఐ ఆర్టిస్ట్ అబూ సాహిద్ బుర్రలో వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే ఈ చిత్రాలు. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఇంట్రస్టింగ్ ఫోటోలతో ఇన్స్టాలో పాపులర్ అవుతున్నారు. (Nokia C22: నోకియా సీ22 స్మార్ట్ఫోన్ వచ్చేసింది: అదిరే ఫీచర్లు, అతి తక్కువ ధర) రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, ఎంఅండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర, ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా, ట్విటర్ అధినేత, ఎలాన్ మస్క్, మెటా సీఈవో మార్క్జుకర్ బర్గ్ మెట్ గాలాకు హాజరవుతున్నట్లు ఊహించి ఈ ఫోటోలను సృష్టించారు. మిడ్ జర్నీ సాయంతోరూపుదిద్దిన ఈ ఫోటోల్లోబాబా రాందేవ్, అజీం ప్రేమ్జీతో పాటు, బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ లాంటి దిగ్గజాల ఫోటోలు కూడా ఉండటం విశేషం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటి మెట్గాలా. ఈ ఐకానిక్ ఫ్యాషన్ ఈవెంట్ను న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ప్రతీ ఏడాది నిర్వహిస్తుంటారు. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) కాగా కృత్రిమ మేధస్సుతో (ఏఐ) రూపొందించిన చిత్రాలు ఇంటర్నెట్లో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లు , డిజిటల్ ఆర్టిస్టులు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రూపొందించిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇండియన్ డిజిటల్ ఆర్టిస్ అబూ సాహిత్ ప్రముఖంగా నిలుస్తున్నారు. ఇన్స్టాలో ఆయనకు 21.6వేల గ్రామ్ ఫాలోవర్లున్నారు. ఆయన పేజీ నిండా ఇలాంటి ఫోటోలు చాలానే ఉన్నాయి. View this post on Instagram A post shared by SK MD ABU SAHID (@sahixd) -
Serena Williams: రెండోసారి తల్లికాబోతున్న సెరీనా.. రెడ్ కార్పెట్పై బేబీ బంప్తో..
Serena Williams Reveals Second Pregnancy: అమెరికా టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ మరోసారి తల్లికాబోతోంది. తన చిన్నారి కూతురు ఒలింపియా కోరినట్లుగానే తోబుట్టువును బహుమతిగా ఇవ్వబోతోంది. మెట్ గాలా-2023 ఈవెంట్ వేదికగా తాను మరోసారి గర్భవతినన్న విషయాన్ని వెల్లడించింది సెరీనా. బేబీ బంప్ ప్రదర్శిస్తూ భర్త అలెక్సిస్ ఒహనియన్తో కలిసి సెరీనా ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో సందడి చేసింది. నల్లటి గౌన్కు తెలుపు రంగు స్కర్ట్ జతచేసిన ఈ అమెరికా నల్లకలువ.. ముత్యాల హారం ధరించి మెరిసిపోయింది. నిండైన అవుట్ఫిట్లో రెడ్కార్పెట్పై బేబీ బంప్ను ప్రదర్శిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. మేము ముగ్గురం ఇక సెరీనా భర్త బ్లాక్ కలర్ టక్సిడో ధరించి ఆమెను మ్యాచ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసి మురిసిపోయింది సెరీనా. ‘‘మా ముగ్గురికీ మెట్ గాలాలో పాల్గొనే అవకాశం వచ్చిందని తెలియగానే ఎంతో సంతోషించాం’’ అంటూ పుట్టబోయే బిడ్డ గురించి హింట్ ఇస్తూ ఆనందం వ్యక్తం చేసింది. చాంపియన్గా సత్తా చాటి కాగా అమెరికాకు చెందిన సెరీనా.. టెన్నిస్ స్టార్గా వెలుగొందింది. 1995లో ప్రొఫెషనల్ ప్లేయర్గా బరిలోకి దిగిన ఆమె.. ఏకంగా 23 సింగిల్ గ్రాండ్స్లామ్ టైటిళ్లు గెలిచింది. 2017లో ఆస్ట్రేలియా ఓపెన్ ఆడుతున్న సమయంలో రెండు నెలల గర్భంతో ఉన్న సెరీనా చాంపియన్గా నిలిచింది. కూతురికి జన్మనిచ్చిన తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం ఆటకు దూరమైన ఆమె.. కొన్నాళ్ల తర్వాత తిరిగివచ్చినా గాయం కారణంగా 2022లో ఆస్ట్రేలియన్ ఓపెన్కు దూరమైంది. ఈ క్రమంలో గతేడాది ఆగష్టు 9న ప్రొఫెషనల్ టెన్నిస్కు వీడ్కోలు పలికిన ఆమె.. తాను రిటైర్ అవ్వలేదంటూ అక్టోబరులో సంకేతాలు ఇచ్చింది. కానీ మళ్లీ ఇంతవరకు కోర్టులో దిగలేదు. రోజర్ ఫెదరర్ సైతం ఇక ఇప్పుడు తన కుటుంబం పెద్దది కాబోతోందంటూ అభిమానులకు శుభవార్త చెప్పింది. కాగా స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ సైతం ఈ ఈవెంట్లో సందడి చేయడం విశేషం. చదవండి: ఎదుటివాళ్లకు ఇచ్చినపుడు.. నువ్వు కూడా తీసుకోవాలి.. లేదంటే: కోహ్లి కామెంట్స్ వైరల్ IPL 2023: ఈ సాలా కప్ నమదే, రాసి పెట్టుకోండి.. లక్కీ మ్యాన్ మాతోనే ఉన్నాడు..! View this post on Instagram A post shared by Serena Williams (@serenawilliams) -
తిలక్ ఇంట్లో సచిన్, రోహిత్, సూర్య సందడి.. ఫొటోలు వైరల్! ఎన్నటికీ మరువం!
IPL 2023- SRH Vs MI: హైదరాబాదీ బ్యాటర్, ముంబై ఇండియన్స్ స్టార్ తిలక్ వర్మ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్, భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ సహా ఎంఐ కుటుంబం మొత్తం తిలక్ ఇంటికి కదిలివచ్చింది. ఈ అతిరథ మహారథులందరికీ తిలక్ వర్మ ఫ్యామిలీ రుచికరమైన భోజనం వడ్డించి మురిసిపోయింది. ఇందుకు సంబంధిన ఫొటోలను తిలక్ సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్గా మారాయి. కాగా ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్ మంగళవారం సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. డెవాల్డ్ బ్రెవిస్తో తిలక్ కుటుంబం ఈ రోజును ఎన్నటికీ మరువం హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముంబై జట్టు నగరానికి చేరుకుంది. ఈ క్రమంలో తిలక్ వర్మ సహచర ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ను తన ఇంటికి డిన్నర్కు ఆహ్వానించాడు. తమ జట్టులోని యువ సంచలనం కోరిక మేరకు ముంబై ఇండియన్స్ జట్టు మొత్తం అతడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఖుషీ చేసింది. సచిన్ , రోహిత్ సహా సూర్య తిలక్ ఫ్యామిలీతో కలిసి ఫొటోలు దిగారు. ఈ నేపథ్యంలో.. ‘‘నా ఎంఐ పల్టన్ ఫ్యామిలీకి మా ఇంట్లో డిన్నర్ పార్టీ. ఈ అద్భుతమైన రోజును నేను, నా కుటుంబం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. మా ఇంటికి వచ్చినందుకు ధన్యవాదాలు’’ అంటూ కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. సత్తా చాటుతున్న తెలుగు తేజం గత సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్(ఇషాన్ కిషన్- 418 తర్వాతి స్థానం)గా తిలక్ వర్మ నిలిచాడు. తన అరంగేట్ర ఎడిషన్లోనే 14 ఇన్నింగ్స్లో 397 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్లలో ఈ తెలుగు తేజం 177 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 84 నాటౌట్. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్లో పరుగుల జాబితాలో ముంబై టాప్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. చదవండి: Virat Kohli: దూకుడు ఎక్కువైంది.. కోహ్లికి ఊహించని షాకిచ్చిన బీసీసీఐ! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
MS Dhoni: ధోనిని ముద్దాడి మురిసిపోయిన ‘అత్తయ్య’.. ఖుష్బూ ట్వీట్ వైరల్
MS Dhoni Met Khushbu Mother in Law: మహేంద్ర సింగ్ ధోని.. అభిమానులను ఖుషీ చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడు. అందుకే తొమ్మిదేళ్ల వయసు పిల్లల నుంచి తొంభై ఏళ్ల వృద్ధుల వరకు ధోని ఫ్యాన్స్ జాబితాలో ఉంటారు. అలా కేవలం ఆటలోనే కాదు మనసులను గెలవడంలోనూ తాను రారాజే అనిపించుకుంటున్నాడు మిస్టర్ కూల్. తాజాగా ఈ విషయాన్ని తలైవా మరోసారి నిరూపించాడంటున్నారు సీనియర్ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్. టీమిండియా కెప్టెన్గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ధోని.. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా తమిళ ప్రజల మనసు దోచుకుంటున్నాడు. 88 ఏళ్ల వీరాభిమాని తలా అంటూ ముద్దుగా పిలుచుకునే ధోనికి ఉన్న అభిమానగణంలో ఖుష్బూ వాళ్ల అత్తయ్య కూడా ఒకరు. ఆమె ధోనికి వీరాభిమాని. ఒక్కసారైనా ‘తలా’ను చూడాలని ఆమె తపించిపోయేవారట. మరి అభిమానులంటే ప్రాణమిచ్చే ధోని.. వారి కోరికను నెరవేర్చకుండా ఉంటాడా?! అందుకే తన ‘సీనియర్ మోస్ట్ ఫ్యాన్’ను కలిసేందుకు స్వయంగా తనే చొరవ తీసుకున్నాడు. ఆమెను ఆత్మీయంగా పలకరించి.. కాసేపు సమయాన్ని గడిపాడు. ధోనిని చూసి మురిసిపోయిన ఆ పెద్దావిడ.. తనను ముద్దాడి ఆశీర్వాదాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఖుష్బూ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. నిజమైన హీరోలు.. ‘‘హీరోలను ఎవరూ తయారు చేయరు.. వాళ్లు పుట్టుకతోనే అలా ఉంటారంతే! ఈ విషయాన్ని ధోని నిరూపిస్తూనే ఉన్నాడు. మా సీఎస్కే సారథి.. తలా ఎంఎస్ ధోని పంచిన ఆత్మీయత, ఇచ్చిన ఆతిథ్యాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు. మా అత్తమ్మ 88 ఏళ్ల వయసులో తలాను కలవగలిగారు. ధోని అంటే ఆమెకు ప్రాణం. మహీ.. నీ ఆత్మీయ పలకరింపుతో ఆమె మరికొన్నేళ్ల పాటు మరింత ఆరోగ్యంగా.. సంతోషంగా ఉండగలుగుతారు’’ అని ఖుష్బూ భావోద్వేగ నోట్ షేర్ చేశారు. తన అత్తయ్యను కలిసినందుకు ధోనికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎస్కే విజయవంతమైన సారథిగా చెన్నైని నాలుగుసార్లు చాంపియన్గా నిలిపిన ఘనత ధోనిది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా మహీ భాయ్ కొనసాగుతున్నాడు. ఇక ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడిన సీఎస్కే రెండింట గెలిచి పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. ఏప్రిల్ 17న బెంగళూరులో ఆర్సీబీతో తమ తదుపరి మ్యాచ్లో చెన్నై తలపడనుంది. చదవండి: షారుక్ ఖాన్.. పంజాబ్ కింగ్స్కు దొరికిన వరం గంగూలీవైపు కోపంగా.. కనీసం షేక్హ్యాండ్ ఇవ్వలేదు! Heroes are not made, they are born. Dhoni proves that. I am at loss for words for our CSK #Thala @msdhoni at his warmth & hospitality. He met my ma in law, who at 88, hero worships Dhoni & cannot see beyond him. Mahi, you have added many years of good health & happiness to her… pic.twitter.com/darszdzb62 — KhushbuSundar (@khushsundar) April 14, 2023 -
రిషబ్ పంత్ వచ్చేశాడు.. ఫోటోలు వైరల్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. హోంగ్రౌండ్ అయిన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడుతున్న మ్యాచ్కు రిషబ్ పంత్ హాజరయ్యాడు. ఫిజియో సాయంతో మ్యాచ్కు హాజరైన పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ డ్రెస్సింగ్ రూమ్ బయట కూర్చొని మ్యాచ్ వీక్షించాడు. పంత్ను చూసిన అభిమానులు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. మిస్ యూ పంత్.. RP 17 అంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. షార్ట్. వైట్ టీషర్ట్ వేసుకున్న పంత్ కర్ర సాయంతోనే మ్యాచ్కు వచ్చాడు. అభిమానులకు అభివాదం చేసిన పంత్ ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్ వైపు చిరునవ్వుతో ఇచ్చిన లుక్స్ ఆకట్టుకున్నాయి. పంత్ రాకను మానిటర్లో గమనించిన సౌరవ్ గంగూలీ, హెడ్కోచ్ పాంటింగ్ సహా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గతేడాది డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్ ఐపీఎల్కు దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్న పంత్ను ఢిల్లీ క్యాపిటల్స్ మిస్ అవుతున్నట్లు ఇప్పటికే చాలాసార్లు పేర్కొంది. సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన తొలి మ్యాచ్కు డగౌట్లో పంత్ జెర్సీని డగౌట్లో ప్రదర్శించింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఇలా చేయడంపై బీసీసీఐ సీరియస్ అయింది. భౌతికంగా దూరమైనవారికే మాత్రమే అలాంటి గౌరవం ఇస్తారని.. పంత్ మనతోనే ఉన్నాడని.. ఇలాంటివి రిపీట్ చేయొద్దని హెచ్చరించింది. బీసీసీఐకి క్షమాపణ చెప్పిన ఢిల్లీ ఫ్రాంచైజీ ముందునుంచి చెప్పినట్లుగా పంత్ను స్టేడియానికి తీసుకొచ్చింది. మ్యాచ్లు ఆడకపోయినా పంత్ తమతో ఉంటే మాకు ధైరంగా ఉంటుందని పాంటింగ్ కూడా తెలిపాడు. Rishabh Pant acknowledges the crowd👋 #IPL2023 #DCvsGT #RishabhPant pic.twitter.com/YPsylllWN5 — CricTelegraph (@CricTelegraph) April 4, 2023 -
Virat Kohli: భార్య అనుష్కతో కోహ్లి సందడి.. ఫొటోలు వైరల్! ఇంకా భయంగానే..
Virat Kohli- Anushka Sharma: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మతో కలిసి ముంబై ఈవెంట్లో సందడి చేశాడు. ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ అవార్డ్స్-2023 ఫంక్షన్లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్లో పలువురు క్రీడా ప్రముఖులు సహా బాలీవుడ్ తారలు తళుక్కుమన్నారు. ఇక అందరిలో స్టార్ కపుల్ విరుష్క జోడీ హైలైట్గా నిలిచింది. విరాట్- అనుష్క కలిసి రెడ్ కార్పెట్పై ఫొటోలకు ఫోజులిచ్చారు. కోహ్లి బ్లాక్ సూట్లో స్టైలిష్ లుక్లో కనిపించగా.. అనుష్క పర్పుల్ కలర్ హాఫ్ షోల్డర్ డ్రెస్లో అందంగా ముస్తాబైంది. ముంబైలో జరిగిన గురువారం నాటి ఈ ఈవెంట్కు సంబంధించిన ఫొటోలను విరాట్ కోహ్లి తన ఇన్స్టాగ్రామ్లో పంచుకోగా వైరల్ అవుతున్నాయి. (PC: Virat Kohli Instagram) ఇంకా భయంగానే కోహ్లి! ‘‘అందమైన జంట.. ఎప్పుడూ ఇలాగే ఉండాలి. పెళ్లై ఇన్నేళ్లు అయినా.. విరాట్ భయ్యా నువ్వు ఇంకా వదినమ్మకు భయపడుతున్నట్లే కనిపిస్తున్నావు’’ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కోహ్లి పంచుకున్న విషయాలను గుర్తు చేస్తూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ ఈవెంట్లో విరుష్క జోడీకి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. (PC: Virat Kohli Instagram) యాడ్ కలిపింది ఇద్దరినీ కమర్షియల్ యాడ్ సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్కను తొలిసారి కలిసినపుడు నెర్వస్గా ఫీలయ్యానంటూ కోహ్లి పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఆమెతో మాటలు కలిపిన ఈ టీమిండియా స్టార్.. స్నేహాన్ని ప్రేమగా మార్చుకుని.. ఆమెతో ఏడడుగులు వేసినట్లు తెలిపాడు. 2017 డిసెంబరు 11న ఇటలీలో విరాట్- అనుష్కల డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. వీరికి 2021 జనవరిలో కుమార్తె వామిక జన్మించింది. (చదవండి: Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి!) ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ అవార్డులు? వివిధ క్రీడల్లో రాణించిన భారత క్రీడాకారులను సత్కరించేందుకు గానూ 2017 నుంచి ఇండియన్ స్పోర్ట్స్ అవార్డులు అందజేస్తున్నారు. 2019లో సెకండ్ ఎడిషన్ జరుగగా.. కోవిడ్ కారణంగా 2021లో ఆన్లైన్లో మూడో ఎడిషన్ నిర్వహించారు. ఈసారి ముంబైలోని జుహులో గల జేడబ్ల్యూ మారియట్లో ఫంక్షన్ జరిగింది. ఇందుకు సంబంధించిన కార్యక్రమం మార్చి 26న ప్రసారం కానుంది. కాగా ఇండియన్ బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్, ఒలంపిక్ గోల్డ్మెడలిస్ట్ అభినవ్ బింద్రా, ఒలంపిక్ మెడల్ విన్నర్ విజేందర్ సింగ్, పరుగుల రాణి పీటీ ఉష, మాజీ షూటర్ అంజలీ భగవత్, డిస్నీ+హాట్స్టార్ స్పోర్ట్స్ హెడ్ సంజోగ్ గుప్తా జ్యూరీ సభ్యులుగా ఉన్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan)