-
మహేష్ బాబుతో మల్టీస్టారర్.. నానితో త్రివిక్రమ్ సినిమా
-
షూటింగ్ లో బిజీ బిజీ గా మహేష్.. సంక్రాంతి బరిలోకి గుంటూరు కారం
-
సోషియో ఫ్యాంటసీ సినిమాలో అల్లు అర్జున్, చిరంజీవి!
-
గుంటూరు కారం జోరు మామూలుగా లేదుగా..!
-
గుంటూరు కారం నుంచి భయంకరమైన లీక్
-
పాన్ ఇండియా హీరోయిన్ తో అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా...
-
మాస్ అవతార్
మహేశ్బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. దసరా సందర్భంగా ‘గుంటూరు కారం’ నుంచి కొత్త పోస్టర్ను రిలీజ్ చేసి, త్వరలోనే తొలి పాటను విడుదల చేయనున్నామని, ఈ సినిమాలో అల్ట్రా మాస్ అవతార్లో మహేశ్బాబు ప్రేక్షకులను అలరిస్తారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
ఆ విషయం లో పూజ కి హాట్స్ ఆఫ్ చేయాలి..!
-
అదో చేదు అనుభవం : Jr. ఎన్టీఆర్
-
రాయలసీమ యాస మాట్లాడటం చాలా ఇష్టం..!
-
నా జీవితాన్ని తను ఊహించలేనంతగా మార్చేశాడు
-
అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో పూజ హెగ్డే ఫిక్స్ అయ్యిందా..?
-
సునీల్ రోడ్డు మధ్యలో కారుని ఆపి డాన్సులు చేసేవాడు
-
ఆ రూమర్స్పై క్లారిటీ ఇచ్చిన మహేశ్
సూపర్స్టార్ మహేశ్బాబుని స్క్రీన్పై చూసి ఏడాది దాటిపోయింది. 'సర్కారు వారి పాట' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' చేస్తున్నాడు. దీని షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయినప్పటికీ పడుతూ లేస్తూ వచ్చింది. ఒకానొక దశలో అయితే ఈ మూవీ ఉంటుందా లేదా అని కూడా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ పుకార్లపై స్వయంగా మహేశ్ స్పందించాడు. మహేశ్, హైదరాబాద్లో ఆదివారం జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే 'గుంటూరు కారం' గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిచ్చిన మహేశ్.. 'సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ హ్యాపీగా ఉంటారు' అని చెప్పుకొచ్చాడు. అయితే ఇంతకీ 'గుంటూరు కారం' రిలీజ్ విషయంలో సందేహాలు ఎందుకొచ్చాయో తెలుసా? (ఇదీ చదవండి: రజనీకాంత్ మరో రికార్డ్.. ఆ లిస్టులో ప్రభాస్తోపాటు) మహేశ్-త్రివిక్రమ్ సినిమాను దాదాపు రెండేళ్ల క్రితమే మొదలుపెట్టారు. పూజా హెగ్డే హీరోయిన్ అన్నారు. మహేశ్తో ఓ ఫైట్ సీన్ తీశారు. అంతా బాగానే ఉంది అనుకునే టైంలో చాలా మార్పులు జరిగాయి. సెకండ్ హీరోయిన్ అనుకున్న శ్రీలీల.. మెయిన్ లీడ్ అయింది. ఇప్పటివరకు జరిగిన పార్ట్ అంతా కాకుండా కొత్తగా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇవన్నీ కాదన్నట్లు ఇప్పటివరకు కేవలం లుక్స్తో పోస్టర్స్, చిన్న గ్లింప్స్ వీడియో తప్ప లిరికల్ సాంగ్స్ ఏం రాలేదు. అలానే సినిమాటోగ్రాఫర్ తప్పుకోవడం లాంటివి జరిగేసరికి సంక్రాంతి రిలీజ్ కష్టమే అని అభిమానులు కూడా అనుకున్నారు. కానీ మహేశ్ స్వయంగా జనవరి 12న పక్కా అని చెప్పడంతో అందరూ రిలాక్స్ అయిపోయారు. చూడాలి అనుకున్నట్లు ముగ్గుల పండక్కి తీసుకొస్తారో లేదో? (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీదేవి చివరి కోరిక నెరవేర్చిన భర్త) -
ట్రెండింగ్లో మహేశ్ బాబు ఫోటో.. ఫ్యాన్స్కు గుడ్న్యూస్
టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న 'గుంటూరు కారం'లో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసిందే. దీనికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్కు నిర్మాతగా నాగవంశీ ఉన్నారు. సినిమా షూటింగ్కు బ్రేక్ ఇచ్చి ఇటీవలే వెకేషన్కు వెళ్లిన ఆయన.. మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. (ఇదీ చదవండి: పవన్తో విడాకుల టైమ్లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్ వైరల్ కామెంట్స్) తాజాగ ఆయన జిమ్లో వర్కౌట్స్ చేస్తూ కనిపించారు. ఆ ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. కొత్త సినిమా కోసమే మహేశ్ ఇదంతా చేస్తున్నారని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట ట్రెండ్ అవుతోంది. నేటి నుంచి గుంటూరు కారం సినిమా కొత్త షెడ్యూల్ మొదలు కానుందట. శుక్రవారం ఆగష్టు 18 నుంచి మహేశ్ బాబు కూడా సెట్స్లోకి రానున్నట్లు సమాచారం. అతడు, ఖలేజ' తర్వాత త్రివిక్రమ్- మహేశ్ చేస్తున్న మూడో సినిమా 'గుంటూరు కారం' కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు బర్త్డే సందర్భంగా రిలీజైన పోస్టర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. షూటింగ విషయంలో చాలా ఆలస్యం అవుతుందని ఫ్యాన్స్ నిరుత్సాహంగా ఉంటున్న సమయంలో మహేశ్ చేసిన ఈ పోస్ట్తో ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ముందుగా అనుకున్నట్లే వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
'గుంటూరు కారం' కొత్త పోస్టర్.. ఫ్యాన్స్కి నచ్చిందా?
సూపర్స్టార్ మహేశ్బాబు 'గుంటూరు కారం' అనే సినిమా చేస్తున్నాడు. బుధవారం ఇతడి పుట్టినరోజు సందర్భంగా క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో లుంగీ లుక్, నోటిలో బీడీతో మహేశ్ డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే అభిమానులు మాత్రం ఓ విషయంలో బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. ఇంతకీ ఏంటి విషయం? గందరగోళం? మహేశ్బాబు-త్రివిక్రమ్ కాంబో అంటే వేరే లెవల్ క్రేజ్. ఎందుకంటే వీళ్లిద్దరూ కలిసి 'అతడు', 'ఖలేజా' చిత్రాలు చేశారు. అవి రెండు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా.. టీవీ, యూట్యూబ్లో బ్లాక్బస్టర్ హిట్స్. వాటికి కోట్లాదిమంది ఫ్యాన్స్. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ సినిమా అనేసరికి ప్రేక్షకులు తెగ ఎగ్జైట్ అయిపోయారు. కానీ జరుగుతున్నది మాత్రం వేరు. అప్డేట్స్ సరిగా ఇవ్వట్లేదు. ఏం జరుగుతుందో ఫ్యాన్స్కి అస్సలు అర్థం కావట్లేదు. అంతా గందరగోళంగా ఉన్నట్లు కనిపిస్తుంది. (ఇదీ చదవండి: మహేశ్ - నమ్రత లవ్ మ్యారేజ్.. మొదట ప్రపోజ్ చేసింది ఎవరంటే..!) రిలీజ్ డేట్ మార్పు? మహేశ్ చేస్తున్న ఈ సినిమాకు 'గుంటూరు కారం' అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, సూపర్స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి సినిమాని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు మహేశ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రిలీజ్ తేదీ మారింది. జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. మరి ఈసారైనా చెప్పిన డేట్కి వస్తుందా లేదా అని చూడాలి. హీరోయిన్ల ఛేంజ్? దాదాపు రెండేళ్ల క్రితమే ఈ సినిమా మొదలుపెట్టారు. తొలుత పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్లు. కారణం ఏంటో తెలీదు గానీ పూజ, ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేసింది. సెకండ్ హీరోయిన్ శ్రీలీల మెయిన్ లీడ్ అయింది. హీరోయిన్ మీనాక్షి చౌదరి కొత్తగా వచ్చి చేరింది. సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ తప్పుకొన్నారని రూమర్స్ వచ్చాయి. అలానే తమన్ని కూడా తప్పించారని మాట్లాడుకున్నారు. కానీ ఇది రూమర్ మాత్రమే అనే తేలింది. మహేశ్ పుట్టినరోజున ఫస్ట్ లిరికల్ సాంగ్ వస్తుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసి, వాళ్లని డిసప్పాయింట్ చేశారు. #HBDSuperstarMahesh 🥳💥#GunturKaaram pic.twitter.com/2mf80iWpgQ — Haarika & Hassine Creations (@haarikahassine) August 8, 2023 (ఇదీ చదవండి: సౌత్ నుంచి ఒకేఒక్కడు.. ఏ హీరో టచ్ చేయలేని రికార్డ్ మహేష్ సొంతం) -
హనీట్రాప్ కలకలం.. కపిల్పై విశాఖ సీపీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో హనీట్రాప్ కేసులో చిక్కుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ సీపీ త్రివిక్రమ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై మంగళవారం సీపీ త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ.. పాకిస్తాన్కు చెందిన హనీట్రాప్ కేసులో కపిల్పై కేసు నమోదు చేశాం. కపిల్ వద్ద నుంచి మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని సైబర్ ఫోరెన్సిక్కు పంపించాము. కానిస్టేబుల్ కపిల్ను కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం ప్రశ్నిస్తున్నాయి. గుజరాత్కు చెందిన కపిల్ కుమార్ విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీలో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. తొలుత హైదరాబాద్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో విధులు నిర్వహంచి 2022 ఆగస్టు నెలలో విశాఖకు బదిలీపై వచ్చాడు. ప్రస్తుతం అతడు సీఐఎస్ఎఫ్ ఫైర్ విభాగంలో పనిచేస్తునే పేస్బుక్ ద్వారా పరిచయమైన తమీషాతో మాట్లాడుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తమీషా ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన ముఖ్య నాయకుడి వద్ద వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేస్తున్నట్లు గుర్తించడంతో కపిల్పై నిఘా పెట్టారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోన్లను స్వాధీనం చేసుకుని అందులో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్పై అంతరంగిక భద్రత చట్టం కింద కేసులు పెట్టామని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: పుంగనూరు దాడిలో చూపు కోల్పోయిన పోలీస్.. సీఎం జగన్ సాయం -
'బ్రో' ఫ్యాన్స్ అందరికీ బ్యాడ్ న్యూస్!
'ఆచార్య' తర్వాత మెగాహీరోలు చేస్తున్న మల్టీస్టారర్ 'బ్రో'. యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, పవన్ కల్యాణ్ హీరో కంటే తక్కువ-అతిథి పాత్ర కంటే ఎక్కువ ఉండే రోల్ చేశాడు. ఈ శుక్రవారం అంటే జూలై 28న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫ్యాన్స్ వరకు ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. మిగతా ప్రేక్షకులు మాత్రం 'బ్రో' మీద 50-50 నమ్మకంతో ఉన్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో హీరో సాయిధరమ్ తేజ్.. ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ చెప్పాడు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 22 సినిమాలు) 2021 డిసెంబరులో విడుదలైన సినిమా 'వినోదయ సీతం'. సముద్రఖని నటించి, దర్శకత్వం వహించిన ఈ మూవీ డైరెక్ట్గా ఓటీటీలో రిలీజైంది. 99 నిమిషాల నిడివితో ఉన్న ఈ చిత్రం.. తెలుగులోనూ డబ్ అయింది. దీన్ని తెలుగులో 'బ్రో'గా రీమేక్ చేశారు. ఇక్కడ కాస్త డ్యూరేషన్ పెంచారు. ఒరిజినల్లో ఓ పెద్దాయన పాత్ర-సముద్రఖని ఉంటారు. ఇందులో పెద్దాయన స్థానంలో సాయితేజ్, సముద్రఖని ప్లేసులో పవన్ వచ్చారు. విడుదలకి వారం ముందు కూడా 'బ్రో'పై పెద్దగా హైప్ లేదు. దీంతో పవన్ పాత పాటని మరోసారి రీ క్రియేట్ చేశారు. 42 సెకన్లున్న ఈ వీడియోని తాజాగా రిలీజ్ చేయగా, కాస్తంత హైప్ వచ్చింది. అయితే ఈ సాంగ్ సినిమాలో ఉంటుందని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. సోషల్ మీడియాలో తెగ రచ్చ చేశారు. ఇప్పుడు వాళ్లకు షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఇది జస్ట్ ప్రమోషనల్ సాంగ్ మాత్రమే. అదే విషయాన్ని సాయిధరమ్ తేజ్.. తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. దీన్నిబట్టి 'బ్రో' ఫ్యాన్స్.. ఆ పాట బిగ్ స్క్రీన్ పై కష్టమే. అంతగా చూడాలనుకుంటే యూట్యూబ్లో చూసుకోండి. Promotional song ..!#BroTheAvatar #Bro pic.twitter.com/ByoLJoXEfb — ✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ ✍️ (@Harinani_) July 26, 2023 (ఇదీ చదవండి: 'బేబీ' డైరెక్టర్కి విశ్వక్సేన్ కౌంటర్స్.. కానీ!?) -
మహేశ్-త్రివిక్రమ్ మూడు సినిమాలకు అదే ప్రాబ్లమ్!?
సూపర్స్టార్ మహేశ్బాబు 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ దీనికి దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ ఏ ముహుర్తాన మొదలైందో తెలీదు గానీ బండికి బ్రేకులేసినట్లు ఆగుతూ పోతోంది. సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యే హీరోయిన్, సినిమాటోగ్రాఫర్ తప్పుకొన్నట్లు వార్తలొచ్చాయి. దీంతో అసలేం జరుగుతుందో అర్థం కాక అభిమానులు బుర్ర గోక్కుంటున్నారు. అయితే ఈ ప్రాబ్లమ్ ఇప్పటిది కాదు. త్రివిక్రమ్ పేరు చెప్పగానే మనకు డీసెంట్ సినిమాలు, అందులోని పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. అయితే ఈ దర్శకుడు తీసిన వాటిలో 'అతడు', 'ఖలేజా' మూవీస్కి లెక్కలేనంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏం మ్యాజిక్ ఉందో తెలీదు గానీ ఈ రెండు చిత్రాలు ఎప్పుడూ చూసిన ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. మనస్ఫూర్తిగా నవ్విస్తాయి. (ఇదీ చదవండి: 63 ఏళ్ల వయసులో స్టార్ హీరో రిస్క్లు!) అయితే మహేశ్ బాబుతో త్రివిక్రమ్ చేసిన ఫస్ట్ మూవీ 'అతడు'. ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తో తీసిన ఈ సినిమా.. 2005లో విడుదలైంది. థియేటర్లలో చెప్పుకోదగ్గ సక్సెస్ కానప్పటికీ.. టీవీలో టెలికాస్ట్ అయి టీఆర్పీలో రికార్డులు సృష్టించింది. అయితే ఈ సినిమా తీయడానికి రెండేళ్లు పట్టింది. కారణాలు ఏంటో కరెక్ట్గా తెలియనప్పటికీ తీయడం మాత్రం ఆలస్యమైంది. మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'ఖలేజా' విషయంలో దాదాపు ఇలానే జరిగింది. ఈ సినిమాతో త్రివిక్రమ్ కాస్త డిఫరెంట్గా ట్రై చేశారు. కాకపోతే అప్పట్లో ప్రేక్షకులకు ఇది ఎక్కలేదు. టీవీలో ప్రసారమైతే మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా తీయడానికి ఏకంగా మూడేళ్లు పట్టింది. పైన రెండింటికి ఎలా అయితే జరిగింతో ఇప్పుడు 'గుంటూరు కారం' విషయంలోనూ సేమ్ సీన్ రిపీటవుతుంది. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో ఇది రిలీజ్ అంటున్నారు. మరి అనుకున్నట్లు జరుగుద్దో లేదంటే వాయిదా పడుతుందో వేచి చూడాలి. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?) -
'గుంటూరు కారం' నుంచి తమన్ ఔట్.. త్రివిక్రమే అసలు సమస్యా?
టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న 'గుంటూరు కారం'లో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసిందే. దీనికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్కు నిర్మాతగా నాగవంశీ ఉన్నారు. సినిమా అనౌన్స్మెంట్ చేసిన రోజు నుంచి ప్రేక్షకులల్లో మంచి బజ్ నెలకొంది. ఈ సినిమాకు కేవలం డిజిటల్ హక్కులే రూ. 80 కోట్లకు నెట్ఫ్లిక్స్ కొన్నదని ప్రచారం జరిగింది. ఇంత పాజిటివ్ ఎనర్జీతో వస్తున్న ఈ సినిమా చుట్టూ ఏదో ఒక సమస్య క్రియేట్ అవుతూనే ఉంది. దీంతో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా విషయంలో అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. (ఇదీ చదవండి: 'బేబీ' ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్) ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ తప్పుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆయన ప్లేస్లో రవి కె చంద్రన్ పేరు వినిపిస్తోంది. ఇది నిజమేనని ఇండస్ట్రీలో టాక్. తాజాగా మరో షాకింగ్ న్యూస్ అభిమానులను కలవరపెడుతోంది. గతంలో తమన్ స్థానంలో వేరే మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకుంటున్నారని వచ్చిన వార్తలపై.. అలాంటిదేమి లేదని నిర్మాత నాగవంశీతో పాటు తమన్ కూడా ఖండించారు. దీంతో ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ ఖాయం అని అంతా అనుకున్నారు. అయితే తాజాగా మళ్లీ ఇదే విషయంలో మరోసారి రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. గుంటూరు కారం పాటలకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ మహేష్ బాబుకు నచ్చలేదట. త్రివిక్రమ్ చెప్పారని మాత్రమే ఆయన్ను కొనసాగిస్తున్నారట. ఇక తప్పని పరిస్థితిలో తమన్ను పక్కన పెట్టాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. ఆయన ప్లేస్లోకి 'ఖుషి ఫేం హేశం అబ్దుల్ వహాబ్, భీమ్స్ సిసిరిలియో'లను తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇదే విషయాన్ని మహేష్ బాబు ముందు ఉంచారట మేకర్స్. ఈ ప్రపోజల్కు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఇదే నిజమైతే సినిమా పాటలు మరింత హిట్ అవుతాయని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. వీరిద్దరిలో ఒకరు మెలడీతో ప్రేక్షకులను మెప్పిస్తే.. మరోకరు మాస్ బీట్తో దంచికొడతారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫైట్ మాస్టర్స్, హీరోయిన్, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ కంపోజర్, స్క్రిప్ట్లో మార్పు.. ఇలా మూవీకి కావాల్సిన కీలకమైన వాళ్ల విషయంలోనే ఇలాంటి ప్రచారం జరుగుతుంది.. వీటిలో ఇప్పటికే కొన్ని నిజం అయ్యాయి కూడా.. ఫైనల్గా గుంటూరు కారంలో ఎక్కడ తేడా కొడుతుందో అనేది ఎవరికీ అర్థం కావడం లేదని ఇండస్ట్రీలో టాక్. సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ కూడా త్రివిక్రమ్కు చాలా క్లోజ్. వీరిద్దరూ చాలా సినిమాలే చేశారు. అలాంటిది అతనే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే అసలు సమస్య మహేష్ కాదని, త్రివిక్రమ్ ధోరణితోనే చాలా సమస్య వస్తోందని పరిశ్రమలో టాక్. ఇవన్నీ క్లియర్ కావాలంటే మహేష్బాబు వివరణ ఇస్తే కానీ క్లారిటీ రాదు. ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. -
రానా సినిమాలో త్రివిక్రమ్ ఎంట్రీ కోపంతో రగిలిపోతున్న గుణశేఖర్
-
గుంటూరు కారం కోసం మహేష్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా..!
ప్రిన్స్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా ‘గుంటూరు కారం’ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన వీడియోలు, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించనున్నారు. ముందుగా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో తీయాలనకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల దీనిని రీజనల్ మూవీగానే 2024లో సంక్రాతి కానుకగా విడుదల చేయనున్నారు. (ఇదీ చదవండి: డింపుల్ హయాతి అసహనం.. ఆయనెక్కడ అంటూ మంత్రి కేటీఆర్కే ట్వీట్) ఈ సినిమా కోసం మహేష్ రూ. 78 కోట్ల రూపాయలతో పాటు జిఎస్టిని అందుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పాన్ మన ఇండియా హీరోలు సుమారు వంద కోట్ల వరకు అందుకుంటున్నారు. కానీ మహేష్ బాబు రీజనల్ సినిమా కోసమే ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోనున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో గుంటూరు కారం సినిమాను నిర్మించనున్నారు. (ఇదీ చదవండి: వాళ్లు అన్యాయం చేస్తే.. ఎంతవరకైనా వెళ్తా: గుణశేఖర్) రీజనల్ సినిమాలకు సంబంధించి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే వారి జాబితాలో మహేష్ బాబు టాప్లో ఉంటారు. ఈ సినిమా తర్వాత SS రాజమౌళి యొక్క SSMB 29 పాన్ ఇండియా సినిమా హిట్ట్ అయితే ఆయన రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టమే. -
దేవుడు ఉన్నాడు.. దీని వెనుక ఎవరున్నా వదలను: గుణశేఖర్
రానా హీరోగా ‘హిరణ్య కశ్యప’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న ‘కామిక్ కాన్ – 2023’ వేడుకల్లో భాగంగా రానా ‘హిరణ్య కశ్యప’ను ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు రానా ఓ నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అమర్ చిత్రకథల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇక గతంలో రానాతో ‘హిరణ్య కశ్యప’ తెరకెక్కిస్తానని గుణశేఖర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాక్షస రాజు హిరణ్యకశిపుడుగా రానా నటిస్తుండగా. కథ త్రివిక్రమ్ అందిస్తుండగా డైరెక్టర్ ఎవరనేది క్లారిటీ రాలేదు. అయితే ఈ విషయం మీద పరోక్షంగా గుణశేఖర్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి కౌంటర్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: డింపుల్ హయాతి అసహనం.. ఆయనెక్కడ అంటూ మంత్రి కేటీఆర్కే ట్వీట్) ఏపీలోని ఆళ్లగడ్డకు దగ్గరలో ఉన్న 'అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి' దేవాలయానికి సంబంధించిన ఒక ఫోటోను ఆయన షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చాడు. 'దేవుడిని మీ కథకు కేంద్ర ఇతివృత్తంగా చేస్తున్నప్పుడు, దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అనైతిక చర్యలకు నైతిక మార్గాల ద్వారా సమాధానం ఇవ్వబడుతుంది. అని ఆయన కామెంట్ చేశాడు. 'హిరణ్యకశిప' ప్రాజెక్టు అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే గుణశేఖర్ చేయడంతో ఈ కామెంట్ 'రానా' మూవీ గురించే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. గతంలో గుణశేఖర్ ఏమన్నారంటే సమంత-గుణశేఖర్ కాంబోలో వచ్చిన 'శాకుంతలం' ప్రమోషన్స్ కార్యక్రమంలో హిరణ్యకశిప ప్రాజెక్టుపై గుణశేఖర్ పలు వ్యాఖ్యలు ఇలా చేశారు. 'నేను హిరణ్యకశిప ప్రాజెక్టు మీ దగ్గరికి తీసుకు వచ్చినప్పుడు చేస్తే మీరు చేయాలి లేదంటే తప్పుకోవాలి కానీ అదే ప్రాజెక్టును వేరే వాళ్లతో సెట్స్పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి. ఈ విషయంలో నాకు అన్యాయం జరిగితే ఎవరినీ వదలను, అలాంటి వారిపై ఎంతవరకైనా వెళ్తాను. ఆ ప్లేస్లో ఎవరున్నా సరే నేను వెనక్కు తగ్గను.' అంటూ గతంలో ఆయన కామెంట్లు చేశారు. అవి ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే హిరణ్యకశిప మూవీకి డైరెక్టర్ ఎవరనేది ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్లో గుణశేఖర్ లేకపోవడంతో ఇలా ముందే హెచ్చరిస్తున్నాడని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Gunasekhar (@gunasekhar1) (ఇదీ చదవండి: నేడు సితార పుట్టినరోజు.. ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గుంటూరు కారంలో ఒక్కడు... రాజమౌళితో మహేష్ మార్షల్ ఆర్ట్స్
-
'గుంటూరు కారం'లో హాట్ బ్యూటీ.. బిగ్ అప్డేట్ రివీల్ చేసేసింది
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా ‘గుంటూరు కారం’ . ఇందులో పూజా హెగ్డే , శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారని చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ నుంచి పూజా తప్పుకుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ను లీక్ చేసింది. (ఇదీ దచవండి: బిగ్బాస్లోకి ఈ జంట ఎంట్రీ ఖాయం.. వాళ్లకు బిగ్ సపోర్ట్ ఎవరో తెలిస్తే) గుంటూరు కారం సినిమాలో తను నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజాగా విజయ్ ఆంటోనీ సరసన హత్య అనే సినిమాలో హీరోయిన్గా నటించిన మీనాక్షి.. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో గుంటూరు కారం సినిమా గురించి ఇలా మాట్లాడింది. 'నేను మహేష్ బాబు గారికి పెద్ద అభిమానిని. గుంటూరు కారం సినిమాలో నాకు అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మహేష్-త్రివిక్రమ్లది హిట్ పెయిర్. వారితో కలిసి నటించాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూట్ కూడా పూర్తి అయింది. మహేష్ గారి పక్కన మొదటి షాట్ చిత్రీకరణ ఎప్పటికీ మర్చిపోలేను.' అని మీనాక్షి తెలిపింది. (ఇదీ చదవండి: ఆ లీడర్లను నమ్మొద్దు.. ఏపీ పాలిటిక్స్పై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్) ఈ ప్రాజెక్ట్ నుంచి పూజ హెగ్డే తప్పుకోవడంతో ఆ స్థానంలోకి శ్రీలీలను తీసుకొని మరొక హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. హర్యానాకు చెందిన మినాక్షి చౌదరి 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినా రవితేజ ఖిలాడీ, హిట్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.