-
విజయ్,త్రిష రిలేషన్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సుచిత్ర
కోలీవుడ్ టాప్ హీరో విజయ్, హీరోయిన్ త్రిష మధ్య ఉన్న అనుబంధం గురించి గాయని సుచిత్ర సెన్సేషనల్ కామెంట్లు చేసింది. గత కొన్నిరోజుల క్రితం వారిద్దరి మధ్య పలు రూమర్స్ రావడంతో కోలీవుడ్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తరుచూ వారిద్దరూ విదేశాలకు ట్రిప్స్ వేస్తున్నారంటూ కొన్ని ఫోటోలను కూడా నెట్టింట షేర్ చేశారు. కానీ, విజయ్ ఫ్యాన్స్ వాటిని తిప్పికొట్టారు. విజయ్ రాజకీయాల్లోకి రావడం వల్లే ఇలాంటి రూమర్స్ చేస్తున్నారని వారు కౌంటర్ ఇచ్చారు.విజయ్, త్రిష బంధం గురించి తాజాగా సుచిత్ర ఇలా చెప్పుకొచ్చింది. విజయ్ ఆయన సతీమణి సంగీత తిరిగి ఎప్పుడో కలవాలి. అహంభావంతో చిన్నపాటి గొడవలతో వారి కుటుంబం చితికిపోయింది. ఇలాంటి సమయంలో త్రిష లాంటి పరాన్నజీవులు ఇతరుల జీవితాల్లోకి ప్రవేశిస్తారు. లిఫ్ట్లో సీక్రెట్గా తీసిన ఫోటోను ఆమె పోస్ట్ చేసినప్పటి నుంచి వారి గురించి చర్చ ఎక్కువ నడుస్తుంది. త్రిషకు కావాల్సింది కూడా ఇదే. విజయ్కు ఆమె దగ్గరగా ఉండాలని చూస్తుంది. అందుకే చాలా మంది ఎం.జి.ఆర్. - జయలలితను వారిద్దరితో పోలుస్తున్నారు.ఎంజీఆర్కు జయలలిత పరాన్నజీవి. ఎంజీఆర్ నుంచి రాజకీయాలపై పట్టు సాధించిన ఆమె ఆ తర్వాత ఎంజీఆర్ను విస్మరించారు. ఈ విషయంలో కరుణానిధి తాత కూడా ఈ పశ్చాత్తాపాన్ని అనుభవించారు. తన స్నేహితుడైన ఎంజీఆర్ను ఇలా నాశనం చేయడం వల్లే కరుణానిధికి జయలలిత నచ్చలేదు.ఎంజీఆర్ మరణానంతరం జయలలిత రాజకీయాల్లో మాత్రం బాగానే చేశారు. ప్రజలకు మంచి పాలనే అందించారు. రాజకీయంగా తమిళనాటలో ఎన్నటికీ చెరిగిపోని ముద్ర ఆమె వేశారు. అయితే, ఇప్పుడు అలాగే విజయ్ను త్రిష ఫాలో కావాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఆయన గెలిచే అవకాశమే లేదు. ఇంకా ఎన్నికల్లో పాల్గొనని రాజకీయ పార్టీకి ఎలాంటి బాధ్యత ఉండదు. రాజకీయాల్లో ఉండాలనే సలహాలు విజయ్కు ఎవరు ఇస్తున్నారో తెలియదు. ఇవన్నీ చాలా తప్పుడు సలహాలు. అని సుచిత్ర తన వీడియోలో మాట్లాడింది. అయితే, విజయ్, త్రిషలను ఎంజీఆర్-జయలలితతో పోల్చడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి తెలివి లేకుండా చనిపోయిన ఇద్దరు దిగ్గజాల గురించి నోటికొచ్చింది మాట్లాడటం ఏంటి అంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆమెను పిచ్చి ఆసుపత్రిలో చేరిపించాలని కొందరు సలహాలు ఇస్తున్నారు. విజయ్, ఆయన భార్య సంగీత ఫోటోలు బయటకు వస్తేనే ఇలాంటి వివాదాలకు తెరపడుతుందని నెటిజన్లు అంటున్నారు. విజయ్, త్రిషల మధ్య మంచి స్నేహ బంధం ఉంటే రాజకీయంగా దెబ్బతీసేందుకే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. -
లీకైన ఫోటోలు.. దుమారం రేపుతున్న త్రిష, విజయ్ వ్యవహారం
కోలీవుడ్లో హిట్ పెయిర్గా విజయ్, త్రిష పేరు గడించారు. ఈ జంట ఇప్పటి వరకు నాలుగు చిత్రాలలో కలిసి నటించారు. వాటిలో గిల్లీ (ఒక్కడు రీమేక్) చిత్రం ఘన విజయం సాధించింది. రీసెంట్గా లియో ద్వారా భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే, రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ త్వరలో సినిమాలకు గుడ్బై చెప్పనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తన చివరి సినిమాలో కూడా త్రిషనే హీరోయిన్గా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. కానీ, అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.కొద్దిరోజుల క్రితం విజయ్ తన 50వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ క్రమంలో త్రిష ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ వారిద్దరూ లిఫ్ట్లో ఉన్న ఒక ఫోటోను పంచుకుంది. ఆపై 'నీ థాన్ ఎన్ కాదల్.. టిల్ డెత్ నీ థన్ ఎన్ కాదల్' అంటూ ఓ ఆంగ్ల పాటను కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతుంది.ఈ ఫోటో వైరల్ అవుతున్న సమయంలో త్రిష, విజయ్ కలిసి ఉన్న ఫోటోలు అంటూ నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. చాలా సందర్భాల్లో వీరిద్దరూ కలిసే విదేశాలకు వెళ్లారంటూ వారు తెలుపుతున్నారు. అందుకు రుజువుగా ఒక పాత ఫోటోను వారు వైరల్ చేస్తున్నారు. అందులో విజయ్ ఒంటరిగా నడుస్తున్న ఫోటో ఒకటి ఉంది. మరో ఫోటోలో త్రిష పక్కన ఒక కాలుతో ఉన్న ఫోటో ఉంది. ఈ రెండూ కలిపి ఇప్పుడు కొందరు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటోలలో విజయ్ ధరించిన షూ ఏదైతే ఉందో అదే త్రిష కూర్చున్న పక్కనే కనిపిస్తుంది. దీంతో విజయ్, త్రిష తరచూ విదేశాలకు వెళ్లారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వారిద్దరి మధ్య రహస్య స్నేహం నడుస్తుందా..? అంటూ కోలీవుడ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విజయ్ ఇదివరకే సంగీతను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అయితే, గత కొన్నేళ్లుగా వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారు అని వార్తలు వచ్చాయి. వారు విడాకులు తీసుకోనున్నారు అనే రూమర్స్ కూడా వచ్చాయి. త్రిష విషయానికొస్తే 41 ఏళ్ల వయసులో కూడా తన గ్లామర్తో మళ్లీ సినిమాల్లో బిజీగా ఉంది. చాలా కాలం క్రితం వరుణ్మణియన్ అనే నిర్మాత, వ్యాపారవేత్తతో వివాహ నిశ్చితార్థం జరిగి పెళ్లి అంచులు వరకు వెళ్లి సడెన్గా బ్రేక్ పడింది. ఆ తరువాత నటిగానూ కొన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొన్న త్రిష ఇటీవల వెండితెరపై తన సత్తా చాటుతుంది. సౌత్ ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకే హీరోయిన్గా ప్రస్తుతం రికార్డ్ క్రియేట్ చేసింది. త్రిష, విజయ్ ఫోటోలను కోలీవుడ్లో కొందరు వైరల్ చేస్తూ.. వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ అనుమానాలకు అవకాశం ఇచ్చేలా కొన్ని ఫోటోలు షేర్ చేస్తున్నారు. విజయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి కొందరు కావాలనే ఇలాంటి పని చేస్తున్నారని ఆయన అభిమానులు తెలుపుతున్నారు. అలాంటి ఏదైనా విషయం ఉంటే ఆయన డైరెక్ట్గానే చెబుతారని వారు క్లారిటీ ఇస్తున్నారు. ఈ విషయం గురించి త్రిష, విజయ్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. -
రాజమౌళి సినిమాను త్రిష తిరస్కరించిందా.. కారణం ఆ హీరోనేనా..?
సౌత్ ఇండియాలో 25 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ గుర్తింపును త్రిష కొనసాగిస్తుంది. మోడలింగ్ నుంచి హీరోయిన్గా 'జోడి' (తమిళ్) సినిమాతో 1999లో ఎంట్రీ ఇచ్చింది. అందులో హీరోయిన్ సిమ్రన్కు స్నేహితురాలిగా మెప్పించింది. ఈ సినిమాతో కోలీవుడ్, టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షించింది. 'నీ మనసు నాకు తెలుసు' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆమె దగ్గరైంది. తెలుగులో స్టార్ హీరోలతో నటించిన త్రిషకు కొన్నేళ్ల తర్వాత అవకాశాలు తగ్గాయి. మళ్లీ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చి భారీ అవకాశాలను దక్కించుకుంటుంది.డైరెక్టర్ రాజమౌళి సినిమాను త్రిష కాదన్నట్లు కోలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. వరుస హిట్లతో టాప్ డైరెక్టర్గా కొనసాగుతున్న రాజమౌళి.. 2009లో 'మగధీర' చిత్రం తర్వాత 'మర్యాద రామన్న' తెరకెక్కించారు. 2010లో విడుదలైన ఈ చిత్రంలో సునీల్ ప్రధాన పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించే ఛాన్స్ను మొదట త్రిషకు రాజమౌళి ఆఫర్ చేశారట. అప్పటికే త్రిష స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. దీంతో కమెడియన్గా కొనసాగిన సునీల్తో నటించడం వల్ల తన మార్కెట్ పడిపోతుందని సున్నితంగా తిరస్కరించిందట. అయితే, ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన సలోని పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. దీంతో వచ్చిన అవకాశాన్ని కాదని పెద్ద తప్పు చేశానే అని ఆలోచనలో త్రిష పడిపోయిందట. ఇదే విషయం ఇప్పుడు కోలీవుడ్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. -
ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?
హీరోయిన్ త్రిష వయసు 41 ఏళ్లు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్ హీరోయిన్గా తన హవా చూపిస్తోంది. రీసెంట్ టైంలో పాన్ ఇండియా మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. 40 దాటిపోయినా సరే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది. త్రిషపై వదంతులు చాలానే ఉన్నాయి. అలానే గతంలో ఓసారి నిశ్చితార్థం వరకు వెళ్లి పెళ్లి ఆగిపోయింది. ఇదంతా పక్కనబెడితే ఓ హీరో పెళ్లికి.. త్రిష అడ్డుపడిందని మీకు తెలుసా?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!)'ఒకరికి ఒకరు' సినిమాతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అలియా శ్రీరామ్.. త్రిషతో 'మనసెల్లామ్' అనే మూవీ చేశాడు. అలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. 2007లో శ్రీకాంత్, వందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే వందనకు త్రిష అంతకు ముందే తెలుసు. దీంతో పెళ్లికి ముందు వందనతో నువ్వు శ్రీకాంత్ని పెళ్లి చేసుకోవద్దని, అతడు మంచివాడు కాదని, ఇంగ్లీష్ మాట్లాడటం రాదని త్రిష చెప్పింది. ఇదే విషయాన్ని వందన, శ్రీకాంత్ దగ్గర చెప్పింది.ఎందుకలా చెప్పావ్ అని త్రిషని శ్రీకాంత్ అడగ్గా.. నువ్వు నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకోబోతున్నావ్ కదా, అందుకే ప్రాంక్ చేశానని త్రిష చెప్పుకొచ్చింది. తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇదిలా ఉండగా 1999లో 'జోడీ' మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన త్రిష.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూవీస్ చేసింది. మధ్యలో కొన్నాళ్లు గ్యాప్ వచ్చింది. కానీ '96'తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. 'పొన్నియన్ సెల్వన్' లాంటి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి 'విశ్వంభర'లో నటిస్తోంది.(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ అమలాపాల్.. వీడియో వైరల్!) -
థగ్లైఫ్ షూటింగ్లో ప్రమాదం
సినీ నటులకు సుఖాలే కాదు, కష్టాలు ఎదురవుతుంటాయి. పలువురు నటీనటులు షూటింగ్లో ప్రమాదాలకు గురైన సంఘటలను ఉన్నాయి. కాగా తాజాగా కమల్హాసన్ చిత్రం థగ్లైఫ్ షూటింగ్లో ప్రమాదం జరిగింది. నటుడు కమలహాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం థగ్లైఫ్. నటుడు శింబు, త్రిష, మలయాళ నటుడు జోజూ జార్జ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుటికే రాజస్థాన్, ఢిల్లీ, కేరళ తదితర ప్రాంతాల్లో జరుపుకుని, 60 శాతం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పాండిచ్చేరిలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ నటుడు కమలహాసన్ ప్రతినాయకులతో పోరాడే సన్నివేశాలను దర్శకుడు మణిరత్నం చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ సందర్భంగా హెలికాప్టర్ నుంచి మలయాళ నటుడు జోజూ జార్జ్ కిందికి దూకుతుండగా ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయన కాలి ఎముఖ విరిగిందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. దీంతో ఆయన్ని కేరళ రాష్ట్రంలోని కొచ్చికి పంపించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా థగ్లైఫ్ చిత్రం తదుపరి షూటింగ్ కోసం చిత్ర యూనిట్ ఐరోపాకు బయలుదేరనున్నట్లు వెల్లడించాయి. -
'అమ్మోరు తల్లి'గా వచ్చేస్తున్న త్రిష
నయనతార 'అమ్మోరు తల్లి'గా ప్రేక్షకులను మెప్పించింది. ఆర్.జె.బాలాజీ, శరవణన్ డైరక్టర్స్గా తొలి సినిమాగా 'అమ్మోరు తల్లి'ని తెరకెక్కించారు. తమిళంలో 'మూకుత్తి అమ్మన్'గా తెరకెక్కిన సినిమాకు ఇది డబ్బింగ్. 2020లో డిస్నీ+హాట్స్టార్లో డైరెక్ట్గా విడుదల అయింది. ఆ సమయంలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ సినిమాకు మరో సీక్వెల్ తీయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.భక్తి పేరుతో దొంగ బాబాలు చేస్తున్న మోసాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో రూపొందిన చిత్రమే అమ్మోరు తల్లి. ఇందులో ముక్కుపుడక అమ్మోరుగా నయన్ మెప్పించింది. అయితే, సీక్వెల్గా తెరకెక్కబోతున్న చిత్రంలో త్రిషకు ఆ ఛాన్స్ దక్కినట్లు కోలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ పాత్రలో త్రిష అభినయం అయితే బాగుంటుందని చిత్ర వర్గాలు ఇప్పటికే పరోక్షంగా చెబుతున్నాయి. త్రిష ఈ పాత్ర ఒప్పుకుంటే మాత్రం ఆమెకు ఇలాంటి సినిమా ఇదే మొదటిది అవుతుంది. ప్రస్తుతం త్రిష వరుస సినిమాలతో బిజీగా ఉంది. విశ్వంభర,థగ్లైఫ్, రామ్ వంటి చిత్రాల షూటింగ్ పనుల్లో ఆమె ఉంది. -
నయనతార ప్లేస్లో త్రిష?
తమిళ ఫ్యాంటసీ కామెడీ డ్రామా ‘మూకుత్తి అమ్మన్’కు సీక్వెల్గా ‘మూకుత్తి అమ్మన్ 2’ సెట్స్పైకి వెళ్లేలా సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ‘మూకుత్తి అమ్మన్’ చిత్రంలో నయనతార టైటిల్ రోల్ చేయగా, ఆర్జే బాలాజీ మరో లీడ్లో నటించారు. ఎన్జే శరవణన్తో కలిసి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020లో డైరెక్ట్గా ఓటీటీలో విడుదలైంది.వీక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ‘మూకుత్తి అమ్మన్ 2’ పనులను మొదలు పెట్టారట ఆర్జే బాలాజీ. అయితే సీక్వెల్లో నయనతార కాకుండా త్రిష నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఈసారి ఆర్జే బాలజీయే పూర్తి స్థాయిలో దర్శకత్వ బాధ్యతలు తీసుకోనున్నారట. మరి.. సీక్వెల్లో త్రిష నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
మగాడిలా మారిపోవాలని ఉంది.. త్రిష
కోరికలే గుర్రాలైతే ఎలా ఉంటుంది? కుడి ఎడమైతే ఎలా ఉంటుంది? చాలా తమాషాగా ఉంటుంది కదూ. చైన్నె బ్యూటీ త్రిష కోరిక కూడా అలాంటి విచిత్రమైనదే. నటిగా రెండు దశాబ్దాల అనుభవం. మధ్యలో ఎత్తుపల్లాలు ఎదురైనా, నేటికీ ఎవర్గ్రీన్ హీరోయినే. ఇప్పపటీకి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలరే. ఇదీ త్రిష రికార్డ్. గ్లామర్ పాత్రలకై నా, ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రలకై నా, ఏ భాషలోనైనా రెడీ అంటూ తన సత్తాను చాటుతున్న ఈ సంచలన బహుభాషా నటి త్రిష.ప్రస్తుతం తమిళంలోనే అజిత్ సరసన విడాముయర్చి, కమలహాసన్తో కలిసి థగ్లైఫ్ చిత్రాల్లో నటిస్తున్న ఈమె మలయాళంలో మోహన్లాల్ సరసన రామ్, టోవినో థామస్కు జంటగా ఐడెంటిటి, తెలుగులో చిరంజీవికి జంటగా విశ్వంభర చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలా ఏక కాలంలో ఐదు భారీ చిత్రాల్లో నటిస్తున్న ఏకై క నటి త్రిషనే అయ్యుంటారు. ఈమె ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.అందులో తనకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉందన్నారు. అదేమిటంటే తాను ఒక్క రోజు పురుషుడిగా ఉండాలన్నారు. ఒక కుర్రాడిలా ఉండడం ఎలా ఉంటుంది. అతని శరీర రూపకల్పన, అతని మానసిక స్థితి గురించి తెలుసుకోవాలని ఆశగా ఉంటుందన్నారు. ఈ విషయం గురించి తన తల్లితో పదే పదే చెబుతుంటానని అన్నారు. ఆమె కోరిక నిజంగా విచిత్రంగానూ, విడ్డూరంగానూ ఉంది కదూ! -
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన త్రిష కనిపంచనుంది. వీరిద్దరు గతంలో స్టాలిన్ చిత్రంలో జంటగా నటించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీలో మరో సీనియర్ నటిని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం.విశ్వంభరలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి కోసం దర్శకుడు వశిష్ట సంప్రదించినట్లు సమాచారం. ఈ పాత్ర కోసం ముందుగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతిని సంప్రదించారట. కానీ ఆమె నో చెప్పినట్లు టాక్. అయితే అదే పాత్ర కోసం మరో సీనియర్ నటి ఖుష్బూని సంపద్రించగా కథ నచ్చడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో స్టాలిన్ చిత్రంలో కూడా ఖుష్బు నటించారు. మరోవైపు ఈ చిత్రంలో త్రిష ద్విపాత్రాభినయం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ చిత్రంలో త్రిషతో పాటు సురభి, ఇషా చావ్లా కూడా నటిస్తున్నారు. వచ్చే సంక్రాతి పండుగ కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్పై దాదాపు రూ.200కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇదే నిజమైతే చిరంజీవి కెరీర్లో ఇది భారీ బడ్జెట్ చిత్రంగా నిలుస్తుంది. ఇందులో త్రిషతో పాటు సురభి, ఇషా చావ్లా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే సంక్రాతి పండుగ కానుకగా జనవరి 10న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు. -
సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
సుచి లీక్స్ గొడవ మళ్లీ మొదలైంది. 2017లో కోలీవుడ్ను ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశం సుచీ లీక్స్. ప్రముఖ సింగర్ సుచిత్ర… సుచీ లీక్స్ పేరిట తన ఫేస్బుక్ ఖాతాలో ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి ఇలా పలువురికి సంబంధించిన వ్యక్తిగత ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిప్గా మారింది.సుచీ లీక్స్ తర్వాత సుచిత్ర జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఒకానొక సమయంలో సుచిత్ర మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. తర్వాత భర్త కార్తీక్ కుమార్ ఆమెకు విడాకులు ఇచ్చి విడిపోయాడు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన సుచిత్ర కొన్నాళ్లు మౌనంగా ఉండిపోయింది. తదనంతరం, ఆమె బిగ్ బాస్ నాలుగో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా పాల్గొంది. చాలారోజుల తర్వాత ఇప్పుడు ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు షాకింగ్ విషయాలను ఆమె పంచుకుంది. ముఖ్యంగా ధనుష్-ఐశ్వర్య విడాకులు, సుచీ లీక్స్ ఇష్యూ తదితర విషయాలపై సుచిత్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.ముఖ్యంగా సుచీ లీక్స్ పేరుతో విడుదల చేసిన ఫోటోలన్నీ త్రిషనే ఇచ్చిందని ఆమె చెప్పడంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు దుమారం రేగుతున్నాయి. 'సుచీ లీక్స్ పేరుతో వచ్చిన అన్ని ఫోటోలు త్రిష ఇచ్చినవే. కానీ, ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాక ‘నేను హర్ట్ అయ్యాను’ అంటూ త్రిషనే జనాలకు ట్వీట్ చేసేది. త్రిష ఒక బిచ్.' అని సింగర్ సుచిత్ర సెన్సేషనల్ కామెంట్ చేసింది.సుచీ లీక్స్లో భాగంగా త్రిష, అమలాపాల్ వంటి హీరోయిన్లతో ధనుష్ ప్రైవేట్ ఫోటోలు లీకయ్యాయి. ఆ సమయం నుంచే ఐశ్వర్య, ధనుష్ మధ్య విభేదాలు వచ్చాయని, చివరకు చేసేదేమిలేక వారు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తమిళ సినీ వర్గాలు ఇప్పటికీ చెబుతుంటాయి. Trisha oruthi @trishtrashers bitch 🤣👀 https://t.co/9crRLcEUzE pic.twitter.com/kGaRJ8z16M— Nayanthara FC (@AjithTharan) May 14, 2024 -
అజిత్ కి షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
స్టార్ హీరోయిన్ త్రిష.. కెరీర్లో ఎన్నడూ లేనంత బిజీగా ఉన్నారు. 40 ఏళ్ల వయసులోనూ ఈమె నటిస్తున్న సినిమాలన్నీ సూపర్ స్టార్స్తోనే కావడం శేషం. అన్ని భాషల్లోనూ ఏక కాలంలో నటించేస్తున్నారు. ప్రస్తుతం అజిత్ 'విడామయూర్చి', కమల్ హాసన్ 'థగ్ లైఫ్', చిరంజీవి 'విశ్వంభర', మోహన్ లాల్ 'రామ్' చిత్రాల్లో త్రిషనే హీరోయిన్.(ఇదీ చదవండి: నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్కు, నా భర్తకు ఆల్రెడీ బ్రేకప్!)కాగా అజిత్ 'విడా మయూర్చి' షూటింగ్ లేట్ అవుతూ వస్తోంది. దీంతో ఈ సినిమాకు కేటాయించిన డేట్స్ని విశ్వంభర, థగ్ లైఫ్ చిత్రాలకు ఉపయోగించేస్తోంది. దీంతో 'విడామయర్చి' చిత్రానికి షాక్ తగిలినట్లయింది. అయితే ఇదంతా దర్శకుడు మణిరత్నం చేసిన పని అనుకోవచ్చు.. ఎందుకంటే 'పొన్నియన్ సెల్వన్'లో కుందవై పాత్ర ఇచ్చి త్రిషకి మళ్లీ లైఫ్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు ఈమె ఊపిరిసలపనంత బిజీగా మారిపోయింది. టైమ్ అంటే ఇదే మరి.(ఇదీ చదవండి: నా మాజీ భర్త గే.. అతడి గదిలో రాత్రి ధనుష్కు ఏం పని? సుచిత్ర సంచలన వ్యాఖ్యలు) -
ఆడపిల్లనే...ఐతే ఏంటంట
హీరోలకు ప్రేమ కబుర్లు చెప్పే పాత్రలే ఎక్కువగా చేసే హీరోయిన్లు ఫర్ ఎ చేంజ్ నేరస్తులకు బుద్ధి చెప్పే పనిలో పడ్డారు. న్యాయ పోరాటం కోసం ఏం చేయడానికి అయినా వెనకాడని పోలీసాఫీసర్లుగా బెల్టు బిగించారు... తుపాకీ గురి పెట్టారు.. లాఠీకి పని చెప్పారు. ‘ఆడపిల్లనే... ఐతే ఏంటంట’ అంటూ ఓ హీరోయిన్ పోలీస్ పాత్రలో రెచ్చిపోయారు. మిగతా కథానాయికలు కూడా దాదాపు అలానే అంటూ పోలీసు పాత్రల్లో విజృంభించారు. ఆ పోలీసాఫీసర్ల గురించి తెలుసుకుందాం. సత్యభామ సాహసంహైదరాబాద్ సిటీ ఏసీపీ కె. సత్యభామగా చార్జ్ తీసుకున్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఓ అమ్మాయి కేసు విషయంలో సత్యభామ పోలీసాఫీసర్గా ఆల్మోస్ట్ సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితి. మరి.. సత్యభామ ఈ కేసును ఎలా సాల్వ్ చేసింది? ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్నది ‘సత్యభామ’ సినిమాలో చూడాలి. సత్యభామగా కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పణలో తక్కలపల్లి శ్రీనివాసరావు, బాబీ తిక్క నిర్మించారు. ఓ అమ్మాయి హత్యాచారం నేపథ్యంలో ‘సత్యభామ’ సినిమా కథ ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం.ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో డీజీపీ నారాయణదాస్ పాత్రలో ప్రకాశ్రాజ్, అమరేందర్ అనే పాత్రలో నవీన్ చంద్ర లీడ్ రోల్స్లో నటించారు. నాగినీడు, హర్షవర్థన్, రవివర్మ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సంగతి ఇలా ఉంచితే... పోలీసాఫీసర్గా కాజల్ అగర్వాల్ నటించడం ఇది తొలిసారి కాదు. 2014లో తమిళ హీరో విజయ్ నటించిన ‘జిల్లా’, గత ఏడాది విడుదలైన తమిళ చిత్రం ‘ఘోస్టీ’లో కాజల్ పోలీసాఫీసర్గా నటించారు. ఆ రెండు చిత్రాల్లోనూ పవర్ఫుల్ పోలీస్గా ఒదిగిపోయారు కాజల్. తాజాగా ‘సత్యభామ’లో కూడా పవర్ఫుల్ ఆఫీసర్గా విజృంభించారని యూనిట్ పేర్కొంది.పాయల్ రక్షణహీరోయిన్ పాయల్ రాజ్పుత్ తొలిసారి ‘రక్షణ’ కోసం ఖాకీ డ్రెస్ ధరించి, లాఠీ పట్టారు. పాయల్ రాజ్పుత్ ఫస్ట్ టైమ్ పోలీసాఫీసర్గా నటించిన చిత్రం ఇది. ప్రణదీప్ ఠాకోర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఓ పోలీసాఫీసర్ జీవితంలోని ఓ ఘటనను ఆధారంగా చేసుకుని, ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ను తెరకెక్కించినట్లుగా యూనిట్ పేర్కొంది. రోషన్ , మానస్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ స్వరకర్త.అగ్ని నక్షత్రంమంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి లీడ్ రోల్స్లో నటిస్తున్న మర్డర్ మిస్టరీ చిత్రం ‘అగ్ని నక్షత్రం’. ఈ చిత్రంలో మంచు లక్ష్మి ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె దీక్ష అనే పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఎమ్. వంశీకృష్ణ దర్శకత్వంలో మంచు లక్ష్మి, మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మర్డర్ మిస్టరీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందుతోంది. మలయాళీ నటుడు సిద్ధిఖ్, సముద్రఖని, విశ్వంత్, చైత్ర శుక్లా ఈ సినిమాలో ఇతర కీ రోల్స్లో కనిపిస్తారు. ఈ చిత్రం విడుదలపై స్పష్టత రావాల్సి ఉంది.ఐతే ఏంటంట?‘కలర్ ఫొటో’, ‘గామి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు నటిగా మరింత దగ్గరయ్యారు హీరోయిన్ చాందినీ చౌదరి. ఈ బ్యూటీ ఇటీవల పోలీసాఫీసర్గా డ్యూటీ చేశారు. ఈ డ్యూటీ ‘యేవమ్’ సినిమా కోసం. ఈ సినిమాలో చాందినీ చౌదరితో పాటు వశిష్ట సింహా, జై భారత్, అషు రెడ్డి లీడ్ రోల్స్లో నటించారు. ప్రకాశ్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు నిర్మించారు. మహిళా సాధికారిత నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఎస్ఐ సౌమ్య పాత్రలో కనిపిస్తారు చాందినీ చౌదరి.ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్పై ‘ఆడపిల్లనే!.. ఐతే ఏంటంట?’ అనే క్యాప్షన్ ఉంది. దీన్నిబట్టి ఈ సినిమాలో చాందిని పాత్ర చాలా స్ట్రాంగ్గా ఉంటుందని ఊహించవచ్చు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా పోలీసాఫీసర్లుగా కనిపించనున్న దక్షిణాది హీరోయిన్లు మరికొంతమంది ఉన్నారు.హీరోయిన్ త్రిష నటించిన తొలి వెబ్ సిరీస్ ‘బృందా’. త్రిష టైటిల్ రోల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. ఇందులో త్రిష పోలీసాఫీసర్ పాత్ర చేశారు. సూర్య వంగల దర్శకత్వం వహించిన ఈ తెలుగు వెబ్ సిరీస్ చిత్రీకరణ పూర్తయింది. స్ట్రీమింగ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. పవర్ఫుల్ పోలీసాఫీసర్ క్యారెక్టర్ కావడంవల్లే త్రిష ఈ వెబ్ సిరీస్ చేశారని కోలీవుడ్ టాక్. -
15 ఏళ్ల తర్వాత మళ్లీ అక్కడ అడుగుపెడుతున్న త్రిష
సౌత్ ఇండియాలో ప్రస్తుతం అగ్ర కథానాయకిగా రాణిస్తున్న త్రిష. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం అంటూ ఏక కాలంలో పలు ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది. అయితే, తాజాగా మరోసారి బాలీవుడ్లో రీఎంట్రీకి సిద్ధ అయినట్లు తెలుస్తోంది. త్రిష 2010లో కట్టా మీఠా అనే చిత్రం ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్కుమార్కు జంటగా త్రిష నటించింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో త్రిష కూడా ఇక అటు వైపు దృష్టి సారించలేదు. అలాంటిది సుమారు 15 ఏళ్ల తరువాత మరోసారి ఈ భామకు బాలీవుడ్ అవకాశం తలుపు తట్టినట్లు తెలుస్తోంది. ఇందులో నటుడు సల్మాన్ఖాన్ సరసన న టించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. కాగా 40 ఏళ్లను పూర్తి చేసుకుని 41వ సంతంలోకి అడుగు పెట్టిన త్రిష ఇప్పటికీ అవివాహితే. కాగా ఇటీవల ఈమె ఆధ్యాత్మికంపై దృష్టి మళ్లించినట్లు స్పష్టం అవుతోంది. ఇందుకు కారణం గత ఏడాది త్రిష తన పుట్టిన రోజును షిరిడీలో జరుపుకున్నా రు. కాగా ఈ ఏడాది నటుడు విజయ్ చెన్నైలో నిర్మించిన సాయిబాబా మందిరంలో చేసుకున్నారు. ఆ ఫొటోలను ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాగా త్రిష సాయిబాబా భక్తురాలిగా మారినట్లు తెలుస్తోంది. ఇకపోతే తనకు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఎక్స్ మీడియా ద్వారా ఆమె ధన్యవాదాలు తెలిపారు. -
నిమిషానికి రూ.1 కోటి సంపాదిస్తున్న బ్యూటీ.. త్రిష, నయనతార కాదండోయ్ (ఫోటోలు)
-
కమల్ హాసన్- మణిరత్నం కాంబో.. ఆ హీరోలు మళ్లీ..!
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో దాదాపు 34 ఏళ్ల ముందు రూపొందిన చిత్రం నాయకన్. ఆ చిత్రం అప్పట్లో సాధించిన సంచలన విజయం సాధించింది. కాగా అదే కాంబినేషన్లో మళ్లీ ఇప్పుడు రూపొందుతున్న భారీ చిత్రం థగ్ లైఫ్. దీనిని మణిరత్నానికి చెందిన మెడ్రాస్ టాకీస్, కమలహాసన్కు చెందిన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ని ర్మిస్తున్నాయి. ఇందులో కమలహాసన్ సరసన నటి త్రిష నటిస్తుండగా నటుడు జయం రవి, దుల్కర్ సల్మాన్, సిద్ధార్థ్ ముఖ్య పాత్రలో పోషిస్తున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చైన్నెలో ప్రారంభమై ఆ తరువాత విదేశాల్లో చిత్రీకరణకు సినీ వర్గాలు వెళ్లాయి. అయితే అలాంటి సమయంలో తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగడంతో నటుడు కమలహాసన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చైన్నెకి తిరిగి వచ్చారు. దీంతో థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్ర షెడ్యూల్ వాయిదా పడడంతో నటుడు జయం రవి ఆ తరువాత దుల్కర్ సల్మాన్ ఇటీవల సిద్ధార్థ్ కూడా థగ్స్ లైఫ్ నుంచి వైదొలగినట్లు ప్రచారం జోరుగా సాగింది. అలాగఇందులో నటుడు శింబును ఒక ముఖ్యపాత్రకు ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ముందుగా ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు ప్రచారం జరిగిన జయంరవి, దుల్కర్ సల్మాన్లు మళ్లీ ఈ చిత్రంలో నటించడానికి తిరిగి వస్తున్నట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా పార్లమెంటు ఎన్నికల ముగిసిన వెంటనే కమలహాసన్ థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్లో పాల్గొంటారన్నది తాజా సమాచారం. -
లేడీ సూపర్స్టార్కు గట్టి పోటీ.. ఆమె దెబ్బకు మాలీవుడ్కు!
ప్రస్తుతం నయనతార మాలీవుడ్ వైపు మళ్లుతున్నారా? పరిస్థితి చూస్తే అలానే అనిపిస్తోంది. లేడీ సూపర్స్టార్గా వెలుగుతున్న నయనతారకు ఇప్పుడిప్పుడే ఆ పేరు దూరం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే చైన్నె సుందరి త్రిష నుంటి గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో త్రిష కోలీవుడ్లో సూపర్ స్టార్ హోదాను కైవసం చేసుకోనుందా? ప్రస్తుతం కోలీవుడ్లో గత కొద్దికాలంగా హాట్ టాపిక్ ఇదే. నయనతార గతేడాది జవాన్ చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు ఆ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అయితే బాలీవుడ్లో మరో అవకాశం రాలేదు. ఇక తమిళంలో ఇటీవల ఈమె నటించిన ఇరైవన్, అన్నపూరణి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచాయి. ప్రస్తుతం నవ దర్శకుడు టూయుటూ విక్కీ దర్శకత్వం వహిస్తున్న మన్నాగట్టి, సెంథిల్కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం, మాధవన్తో కలిసి టెస్ట్ అనే మరో చిత్రంలో నటిస్తున్నారు. నయనతారకు వీటిలో ఏదో ఒకటి హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో విషయం ఏమిటంటే కోలీవుడ్లో స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు నయన్కు ఇప్పుడిప్పుడే దూరమవుతున్నాయి. నటి త్రిష వైపు వెళుతున్నాయని చెప్పక తప్పడం లేదు. ఆ తరువాత తెలుగులోనూ స్టార్ హీరోలైన చిరంజీవి, అల్లుఅర్జున్లతో కలిసి నటించే అవకాశాలను దక్కించుకున్నారు. అంతేకాకుండా మలయాళంలోనూ నటిస్తున్నారు. దీంతో నయనతార కూడా మలయాళ చిత్ర పరిశ్రమపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. తన మాతృభాష అయిన ఈ చిత్ర పరిశ్రమలో నయనతారకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంతకుముందే మమ్ముట్టి, నివిన్బాలీ వంటి స్టార్ హీరోలతో జతకట్టారు. అలా ఈమె మలయాళంలో నటించిన చివరి చిత్రం గోల్డ్. అల్పోన్స్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం 2022లో విడుదలై పెద్దగా ఆడలేదు. దీంతో కొంతకాలం మాలీవుడ్కు దూరంగా ఉంటూ వచ్చిన నయనతార తాజాగా మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి డియర్ స్టూడెంట్ అనే టైటిల్ను నిర్ణయించారు. ఇందులో నయనతార టీచర్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం గురించి తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో నటుడు నివిన్ బాలి హీరోగా నటిస్తున్నారు. -
అల్లు అర్జున్కి జోడీగా..?
‘పుష్ప: ది రైజ్’ వంటి బ్లాక్బస్టర్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన ‘పుష్ప: ది రూల్’ సినిమా చేస్తున్నారు. ఆ చిత్రం పూర్తయిన తర్వాత తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అందులో భాగంగానే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ఫైనల్ చేసే పనిలో పడ్డారట అట్లీ. కాగా ఈ మూవీలో అల్లు అర్జున్కి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో సమంత, త్రిష పేర్లు వినిపిస్తున్నాయి. తొలుత త్రిష పేరు తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్కి ఆమె జోడీగా నటించనున్నారనే వార్తలు కోలీవుడ్లో హల్చల్ చేశాయి. అయితే తాజాగా సమంత పేరు వినిపిస్తోంది. అట్లీ దర్శకత్వం వహించిన ‘తేరి’ సినిమాలో విజయ్కి జోడీగా నటించారు సమంత. అలాగే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో అల్లు అర్జున్తో జతకట్టారీ బ్యూటీ. అలాగే ‘పుష్ప: ది రైజ్’ మూవీలో ‘ఊ అంటావా...’ అంటూ ప్రత్యేక పాట చేశారు. తాజాగా వీరి జోడీ రిపీట్ కానుందనే వార్తలు నెట్టింట వైరల్గా మారాయి. మరి అల్లు అర్జున్ సరసన నటించేది సమంతా? త్రిషా? లేకుంటే ఇద్దరూ నటిస్తారా? ఈ ఇద్దరూ కాకుండా వేరే కథానాయిక నటిస్తారా? అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఈ అక్టోబర్లో అల్లు అర్జున్–అట్లీ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్. -
రెమ్యునరేషన్ పెంచేసిన త్రిష.. నయనతార కంటే ఎక్కువే!
తమిళసినిమా: నటి త్రిష తన స్నేహితురాలు, లేడీ సూపర్స్టార్ నయనతారను దాటేసి నంబర్వన్ స్థానానికి చేరుకున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇంతకుముందు వరకూ దక్షిణాదిలోనే నంబర్వన్ కథానాయకిగా నయనతార వెలుగొందారు. ఇప్పుటికీ ఆమె ఏ మాత్రం తగ్గలేదు. అయితే నటి త్రిష క్రేజ్ మాత్రమే బాగా పెరిగింది. అంతా దర్శకుడు మణిరత్నం పుణ్యమే అని చెప్పకతప్పదు. నటి త్రిష కెరీర్ పొన్నియిన్సెల్వన్ చిత్రానికి ముందు, ఆ తరువాత అని చెప్పాలి. ఈమె నటించిన హీరోయిన్ ఓరియన్టెడ్ కథా చిత్రాలు వరుసగా అపజయం కావడంతో గ్రాఫ్ పడిపోయింది. ఒక టైమ్లో చేతిలో చిత్రాలే లేకుండా పోయాయి. అలాంటి సమయంలో మణిరత్నం కరుణించడంతో పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కందవై పాత్రలో నటించే అవకాశం వరించింది. అందులో నటి ఐశ్వర్యరాయ్ కూడా నటించారు. నిజం చెప్పాలంటే ఆమెను త్రిష డామినేట్ చేశారు. రాజసం ఒలకబోసిన త్రిష నటన అందరిని ఆకట్టుకుంది. ఆ చిత్రం సూపర్హిట్ అయ్యింది. అంతే త్రిష సెకండ్ ఇన్నింగ్కు ఆ చిత్రంతోనే బీజం పడింది. ఆ తరువాత విజయ్కు జంటగా లియో చిత్రంలో నటించారు. ప్రస్తుతం అజిత్కు జంటగా విడాముయర్చి, కమలహాసన్ సరసన థగ్స్ లైఫ్, తెలుగులో చిరంజీవికి జంటగా విశ్వంభర, మలయాళంలో మోహన్లాల్కు జంటగా రామ్, నివిన్బాలీ సరసన ఐడెంటిట్టీ అంటూ స్టార్స్ సరసన భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గోట్లో కూడా ఒక ప్రత్యేక పాట, కొన్ని కీలక సన్నివేశాల్లో నటిస్తున్నారు. కాగా లియో చిత్రంలో నటించడానికి రూ.6 కోట్లు పారితోషికం పుచ్చుకున్న త్రిష, ఇప్పుడు కమలహాసన్ సరసన నటిస్తున్న థగ్స్ లైఫ్ చిత్రం కోసం ఏకంగా రూ.12 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఇంత మొత్తంలో పారితోషికాన్ని నయనతార కూడా ఇప్పటి వరకూ పొందలేదు. దీంతో ఆమెను అధిగమించిన త్రిష ఇప్పుడు నంబర్వన్ స్థానానికి ఎగబాకారన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
బాలీవుడ్ వైపు మళ్లీ ఎందుకు వెళ్లలేదంటే..: త్రిష
గత రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయకిగా బహుభాషల్లో రాణిస్తున్న నటి త్రిష. నాలుగు పదుల వయసులోనూ క్రేజీ కథానాయకిగా వెలుగొందడం సాధారణ విషయం కాదు. ఒక దశలో ఈమె నటించిన హీరోయిన్ ఓరియన్టెడ్ కథా చిత్రాలు నిరాశపరచడంతో త్రిష పని అయ్యిపోయింది. తట్టా బుట్టా సర్దుకోవాల్సిసిందే అనే కామెంట్స్ వచ్చాయి. అయితే పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో త్రిష సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారు. ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో,అదీ అగ్రహీరోల సరసన నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా కొందరు ప్రముఖ హీరోయిన్ల మాదిరిగానే త్రిష కూడా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. అక్కడ 'కట్టా మిఠా' అనే చిత్రంలో నటించారు. అయితే అదే ఆమె నటించిన తొలి, చివరి చిత్రంగా మారింది. ఇటీవల ఒక భేటీలో తొలి హిందీ చిత్రం ప్లాప్ కావడంతో బాలీవుడ్లో అవకాశాలు రాలేదా? అన్న ప్రశ్నకు త్రిష బదులిస్తూ తాను 2010లో కట్టా మిఠా చిత్రంతో బాలీవుడ్లోకి ఎంటర్ అయ్యానన్నారు. అక్షయ్కుమార్ హీరోగా నటించిన ఆ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకుడని చెప్పారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందన్నారు. దీంతో బాలీవుడ్లో నటించిన తొలి చిత్రం ప్లాప్ కావడంతో అవకాశాలు రాలేదని, తాను బాలీవుడ్ నుంచి వైదొలగినట్లు ప్రచారం జరిగిందన్నారు. వాస్తవానికి తాను తన కుటుంబాన్ని ముంబాయికి మార్చడానికి సిద్ధంగా లేనన్నారు. బాలీవుడ్కు వెళ్లాలంటే దక్షిణాదిలో చాలా మందిని వదులుకోవాలన్నారు. అలాగే బాలీవుడ్లో తన కెరీర్ను మళ్లీ కొత్తగా మొదలెట్టాల్సి ఉంటుందన్నారు. అంత ఆసక్తి తనకు అప్పట్లో లేదన్నారు. అందుకే హిందీ చిత్రాల్లో కంటిన్యూగా నటించలేదని త్రిష స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ అజిత్ సరసన విడాముయర్చి, కమలహాసన్కు జంటగా థగ్ లైఫ్ చిత్రాలతో పాటు తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. -
భాగ్యనగరంలో ‘విశ్వంభర’ పూర్తి
చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ‘బింబిసార’ చిత్రంతో బ్లాక్బస్టర్ అందుకున్న వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘స్టాలిన్’ (2006) వంటి హిట్ మూవీలో జోడీగా నటించిన చిరంజీవి–త్రిష ‘విశ్వంభర’ మూవీ కోసం రెండోసారి కలిశారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల హైదరాబాద్లో మొదలైన ‘విశ్వంభర’ షెడ్యూల్ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. చిరంజీవి, త్రిషతో పాటు ప్రధాన తారాగణం పాల్గొన్న ఈ షెడ్యూల్లో కొంత టాకీ పార్ట్, ఓ పాట, యాక్షన్ బ్లాక్ని చిత్రీకరించినట్లు యూనిట్ పేర్కొంది. ‘‘ఫ్యాంటసీ అడ్వెంచర్గా రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ మూవీ ఉంటుంది. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే.. చిరంజీవి నివాసంలో చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో సహా యూనిట్తో దిగిన ఫొటోలను త్రిష సోషల్ మీడియాలో షేర్ చేసి, ‘ఇదొక లెజెండరీ, అద్భుతమైన రోజు! విశ్వంభర’ అని పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె. నాయుడు, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: కార్తీక్ శబరీష్, లైన్ప్రోడ్యూసర్: రామిరెడ్డి శ్రీధర్ రెడ్డి. -
స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. మళ్లీ ఆమెనా?
లియో కాంబో మళ్లీ రిపీట్ కాబోతోందా? అంటే దీనికి కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమధానమే వినిపిస్తోంది. నటుడు విజయ్, నటి త్రిష సూపర్ హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఈ జంట ఇప్పుటికే ఆది, గిల్లీ, తిరుపాచ్చి, కురువి, లియోతో పాటు దాదాపు ఐదు చిత్రాల్లో జంటగా నటించారు. ఇందులో గిల్లీ, తిరుపాచ్చి, లియో చిత్రాలు మంచి విజయా న్ని సాధించాయి. కాగా తాజాగా మరోసారి ముచ్చటగా రెండో హ్యాట్రిక్కు సిద్ధం అవుతున్నారన్నమాట. కాగా.. విజయ్ ప్రస్తుతం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్) చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వెంకట్ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. యువన్ శంకర్రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముమ్మరంగా జరుగుతోంది. ఈ సినిమాలో నటి మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఇందులో విజయ్ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలోనే విజయ్తో నటి త్రిష మరోసారి జత కడుతున్నట్లు తాజా సమాచారం. ఇందు తండ్రి పాత్రలో నటిస్తున్న విజయ్ సరసన త్రిష నటించనున్నారు. అయితే ఇది ప్రత్యేక పాత్రేనని సమాచారం. కాగా ముందు ఈ పాత్రకు నటి అనుష్కను నటింపజేసే ప్రయత్నం చేసినట్లు.. ఆమె తిరస్కరించడంతో ఈ అవకాశం నటి త్రిషకు వచ్చినట్లు టాక్. కాగా.. గోట్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చైన్నెలో జరుగుతోంది. కాగా ప్రస్తుతం త్రిష నటుడు కమలహాసన్కు జంటగా థగ్స్ లైఫ్, అజిత్ సరసన విడాముయర్చి చిత్రాలతో పాటు, ఓ మలయాళ, తెలుగు చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
Ajith Kumar: ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడీయాలో తెగ వైరలవతున్నాయి. ఇంతకీ తమ స్టార్ హీరోకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అజిత్ కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవుతారని సన్నిహత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన విడాయమర్చి చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కోసం ఆయన త్వరలోనే విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అందుకే రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం వెళ్లారని అజిత్ సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి రూమర్స్ అభిమానులు నమ్మవద్దని కోరుతున్నారు. త్వరలోనే బయటికి వస్తారని వెల్లడించారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తోన్న విడాయమర్చి చిత్రానికి మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అజిత్కు జోడీగా త్రిష హీరోయిన్గా నటిస్తోంది. గతంలో అజిత్, త్రిష కలిసి 2015లో ఎన్నై అరిందాళ్ అనే సినిమా చేశారు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ జతకట్టారు. AK Sir Visited To Apollo Hospital For Regular Health Check-up... #AjithKumar #VidaaMuyarchi pic.twitter.com/4Pbht78oqU — Ajith Seenu 2 👑 DARK DEVIL... தல..தாய்..தாரம்.. (@ajith_seenu) March 7, 2024 AK has admitted to Apollo hospital just for a regular checkup 👍#VidaaMuyarchi .. #AjithKumar pic.twitter.com/RPZFZGG1K7 — 𒆜Harry Billa𒆜 (@Billa2Harry) March 7, 2024 -
విజయ్పై త్రిష ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తమిళసినిమా: నాలుగు పదుల వయసులోనూ ప్రేక్షకులను అలరిస్తుస్తూ కథానాయిక రాణిస్తున్నారు నటి త్రిష. అంతే కాకుండా ఇప్పుటికీ పలు భాషల్లో అగ్ర కథా నాయకుల సరసన నటిస్తూ బిజీగా ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈమె. అన్నీ కుదిరితే 10 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుని పిల్లలు, భర్త అంటూ సంసార జీవితంలో మునిగిపోయేవారు. ఇక నిర్మాత, వ్యాపారవేత్త అయిన అరుణ్ మణియన్తో నిశ్చితార్థం, పెళ్లి పీటల వరకూ వెళ్లి ఆగిపోయింది. ఆ తరువాత పెళ్లి మాట ఎత్తని త్రిష నటనపైనే దృష్టి సారించారు. అలా మధ్యలో నటిగా వెనుకబడినా, చిన్న గ్యాప్ తరువాత గోడకు కొట్టిన బంతిలా తిరిగి ఫుల్ఫామ్లోకి వచ్చారు. అందుకు కారణం దర్శకుడు మణిరత్నం అని చెప్పకతప్పదు. పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో ఆయన ఓ అవకాశం ఇచ్చి నటిగా త్రిషకు పునర్జన్మనే ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఈ చైన్నె చిన్నది కూడా సద్వినియోగం చేసుకున్నారు. యువరాణి కుందవైగా రాజఠీవీని ప్రదర్శించి ఆ పాత్రకు వన్నె తెచ్చారు. ఆ తరువాత విజయ్కు జంటగా లియో చిత్రంలో నటించి తన పూర్వ వైభవాన్ని చాటుకున్నారు. ఈమె ఇంతకు ముందు విజయ్ సరనన గిల్లీ, ఆదీ, తిరుపాచ్చి, కురువి చిత్రాల్లో నటించారు. మళ్లీ 14 ఏళ్ల తరువాత లియో చిత్రం ఈ జంట కలిసి నటించారు. దీంతో వీరిద్దరి గురించి వదంతులు దొర్లుతున్నాయి. అయితే వాటిలో నిజమెంత అన్నది తెలియదు కానీ, ఇటీవల ఒక భేటీలో విజయ్ గురించి నటి త్రిష మాట్లాడుతూ విజయ్ తానూ పలు చిత్రాల్లో కలిసి నటించినట్లు చెప్పారు. అయితే గిల్లీ చిత్రానికి ముందు వరకూ అందరూ చెప్పుకుంటున్నట్లు కాదన్నారు. విజయ్ చాలా నెమ్మదస్తుడని పేర్కొన్నారు. గిల్లీ చిత్రం తరువాత తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యామని చెప్పారు. కాగా ఈ చైన్నె బ్యూటీ ప్రస్తుతం అజిత్కు జంటగా విడాముయర్చి, కమలహాసన్ సరసన థగ్ లైఫ్ చిత్రాలతో 40 ఏళ్ల వయసులోనూ బిజీబీజీగా ఉన్నారు. -
త్రిష,చిరంజీవి కేసు విషయంలో మన్సూర్ అలీఖాన్కు ఊరట
కోలీవుడ్ నటుడు,రాజకీయ నాయకుడు మన్సూర్ అలీఖాన్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. కొన్ని రోజుల క్రితం నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమె తీవ్రంగా ఖండించారు. అయితే నటి త్రిషకు మహిళా కమిషన్ సభ్యులు అండగా నిలిచి, చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నటుడు మన్సూర్ అలీఖాన్పై ఫిర్యాదు చేశారు. అలాగే త్రిషకు టాలీవుడ్ నటుడు చిరంజీవి మద్దతు పలికారు. వారిద్దరూ మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దీంతో తన వ్యాఖ్యలను పూర్తిగా వినకుండా తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా నటి త్రిష, కుష్బూ, చిరంజీవి ప్రవర్తించారంటూ నటుడు మన్సూర్ అలీఖాన్ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈయన పిటిషన్ విచారించిన న్యాయస్థానం నిజానికి నటి త్రిషనే మీపై పిటీషన్ దాఖలు చేయాలని మందలించడంతోపాటు కోర్టు సమయాన్ని వృథా చేసినందుకుగాను నటుడు మన్సూర్ అలీఖాన్కు రూ.లక్ష జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని చైన్నె, అడయార్ క్యాన్సర్ ఆస్పత్రికి అందించాలని ఆదేశించింది. అయితే తనపై విధించిన జరిమానాలు రద్దు చేయాలంటూ నటుడు మన్సూర్ చైన్నె హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఆయనపై విధించిన రూ.లక్ష జరిమానాను రద్దు చేస్తూ, ఈ కేసును కూడా కొట్టివేయాలని సింగిల్ బెంచ్ను ఆదేశించింది. -
ఆ ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు: త్రిష
త్రిష జీవితంలో సమస్యలు అనేవి కొత్తేమీ కాదు. ఈమె ఒక్కో స్టేజ్లో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. వాటిని ఎదురొడ్డి ముందుకు సాగుతున్నారు. ఆ మధ్య వరుస ఫ్లాప్లతో కెరీర్ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ చైన్నె సుందరి ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించారు. ఆ తరువాత లియో చిత్రంలో విజయ్తో జతకట్టి కమర్షియల్ హిట్ను అందుకున్నారు. ప్రస్తుతం అజిత్ సరసన విడాముయర్చి చిత్రం, కమలహాసన్కు జంటగా థగ్స్ లైఫ్ వంటి భారీ క్రేజీ చిత్రాల్లో నటిస్తూ అగ్రకథానాయకిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. (ఇదీ చదవండి: జయలలిత ఆస్తుల వేలం.. కోర్టుకు చెల్లించాల్సిన డబ్బు ఎంత..?) తాజాగా టాలీవుడ్లోనూ రీఎంట్రీ ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో వ్యక్తి గత ఆరోపణలకు గురవుతున్నారు. అన్నాడీఎంకే బహిష్కరణ కార్యనిర్వాహకుడు ఏవీ రాజు త్రిషను అప్రతిష్ట పాలు చేసే విధంగా ఆమె పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది త్రిషను మానసిక క్షోభకు గురి చేసిన విషయం తెలిసిందే. కూవత్తూర్ సంఘటన సమయంలో నటుడు, రాజకీయ నాయకుడు కరుణాస్, నటి త్రిషతో పాటు మరికొందరిని గెస్ట్ హౌస్కి పంపారన్నదే ఏవీ.రాజు వేసిన నింద. దీన్ని తీవ్రంగా ఖండించిన త్రిష అతనిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులు త్రిషకు అండగా నిలిచారు. ముఖ్యంగా దర్శకుడు చేరన్, సముద్రఖని, నాజర్ త్రిషపై ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. దీనికి స్పందించిన త్రిష తనకు సపోర్ట్గా నిలిచిన ఆ ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు అంటూ ఆమె పేర్కొన్నారు.