-
మాకూ పీఎల్ఐ స్కీమ్ ఇవ్వండి : టోయ్స్ పరిశ్రమ
న్యూఢిల్లీ: ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని తమకూ వర్తింపచేయాలని, ప్రత్యేకంగా ఎగుమతి ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేయాలని ఆట వస్తువుల పరిశ్రమ వర్గాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఉద్యోగాల కల్పనకు, ఎగుమతులను పెంచేందుకు ఇవి దోహదపడగలవని పేర్కొన్నాయి. ఇటు దేశీయంగా తయారీకి, అటు ఎగుమతులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఉద్దేశించిన పీఎల్ఐ స్కీము ప్రస్తుతం ఫార్మా తదితర 14 రంగాలకు వర్తిస్తోంది. ఈ నేపథ్యంలో టాయ్స్ పరిశ్రమ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది. (Hero Motocorp: విడా ఈవీ: తొలి మోడల్ కమింగ్ సూన్) ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పరిశ్రమకు సహాయకరంగా ఉంటున్నప్పటికీ పీఎల్ఐ స్కీము, ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఏర్పాటు చేస్తే మరింత తోడ్పాటు లభించగలదని లిటిల్ జీనియస్ టాయ్స్ సీఈవో నరేశ్ కుమార్ గౌతమ్ చెప్పారు. అలాగే పరిశ్రమ భవిష్యత్ వృద్ధికి దిశా నిర్దేశం చేసేలా ప్రభుత్వం జాతీయ టాయ్ పాలసీ రూపొందించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన కోరారు. మరోవైపు, ప్రస్తుతం టాయ్స్ పరిశ్రమను హస్తకళలు లేదా క్రీడా వస్తువుల కింద వర్గీకరిస్తున్నారని అలా కాకుండా దీని కోసం ప్రత్యేకంగా ఎగుమతి మండలిని ఏర్పాటు చేస్తే మరింత ప్రాధాన్యం దక్కేందుకు అవకాశం ఉంటుందని నట్ఖట్ టాయ్స్ ప్రమోటర్ తరుణ్ చేత్వాని అభిప్రాయపడ్డారు. ఎగుమతులకు భారీ అవకాశాలు ఉన్నాయని, పరిశ్రమ ప్రస్తతుం తయారీపై దృష్టి పెడుతుండటంతో చైనా వంటి దేశాల నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గాయని వివరించారు. ఎగుమతులు 61 శాతం అప్.. గడిచిన మూడేళ్లలో ఆటవస్తువుల ఎగుమతులు 61 శాతం పెరిగాయని ప్లేగ్రో టాయ్స్ ఇండియా ప్రమోటర్ మను గుప్తా తెలిపారు. ఇవి 2018–19లో 202 మిలియన్ డాలర్లుగా ఉండగా 2021–22లో 326 మిలియన్ డాలర్లకు చేరాయని వివరించారు. మరోవైపు గత మూడేళ్లలో దిగుమతులు 70 శాతం తగ్గాయని, 371 మిలియన్ డాలర్ల నుంచి 110 మిలియన్ డాలర్లకు దిగి వచ్చాయని వాణిజ్య శాఖ గణాంకాలను ఉటంకిస్తూ పేర్కొన్నారు. చాలా మటుకు దిగుమతిదారులు దిగుమతులను తగ్గించుకుని, స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక చర్యలు సహాయపడుతున్నాయని చెప్పారు. -
చిట్టి మెదళ్లకు చెట్టు పాఠాలు
చల్లని గాలి కావాలంటే ఏసీ ఉంటే చాలు కదా అనుకుంటారు పిల్లలు. మంచి నీళ్లు కావాలంటే ఫ్రిజ్లోంచి వస్తాయి కదా అనుకుంటారు. పండ్లు కావాలంటే మార్కెట్ నుంచి తెచ్చుకోవచ్చు కదా అంటారు. పాలు ప్యాకెట్ల నుంచే వస్తాయని అనుకునే రేపటి తరం ‘పర్యావరణం’ అనే పెద్ద పదం గురించి అర్థం చేసుకోవాలంటే వారి బుర్రలకు మొక్కను పరిచయం చేయాల్సిందే! ‘అయితే అందుకు, ఇంట్లో పెద్దలే పూనుకోవాలి’ అంటారు హైదరాబాద్ మణికొండలో ఉంటున్న సోదరీమణులు రాజశ్రీ, నవ్యశ్రీ. చదువుకుంటూ, సొంతంగా ఫ్యాషన్ డిజైనర్స్గా రాణిస్తున్న ఈ అక్కాచెల్లెళ్లు ఈ వేసవిలో ఓ కొత్త ఆలోచన చేశారు. ఫ్యాబ్రిక్ ప్లాంట్ టాయ్స్ చేసి, చుట్టుపక్కల పిల్లలకు ఇస్తే బాగుంటుంది కదా అనుకున్నారు. అదే ఆచరణలో పెట్టారు. పిల్లలను ఆకట్టుకునేలా ఫ్యాబ్రిక్ ప్లాంట్ టాయ్స్ చేయడం మొదలుపెట్టారు. ‘కాస్త ఫ్రీ టైమ్ కేటాయించుకునే చేస్తున్నాం. కానీ, ఒక టాయ్ పూర్తవడానికి వారం రోజులైనా పడుతుంది’ అంటున్నారు. గ్యాడ్జెట్స్కు కాస్త దూరంగా! ఎండ అని పిల్లలు ఎక్కువ శాతం ఇంటి పట్టునే ఉంటున్నారు. స్కూళ్ళు లేకపోవడంతో కాస్త పెద్ద పిల్లలు కూడా ఇంటికే పరిమితం అయ్యారు. ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్ స్క్రీన్లకు తమ కళ్లను అప్పజెప్పేసి వీడియోగేమ్స్తో కుదురుగా కూర్చుంటున్నారు. ‘గ్యాడ్జెట్స్తో ఉండే పిల్లలకు పర్యావరణం గురించి క్లాసు తీసుకుమంటామంటే వింటారా. మనమే ఇప్పుడు అమ్మో, ఏం ఎండలు.. వేడికి తట్టుకోలేకపోతున్నాం..’, ‘చల్లని గాలి అన్నదే కరువైంది. అన్నీ బిల్డింగ్లే... చెట్లు ఎక్కడ ఉన్నాయి’ అంటూ అల్లాడిపోతున్నాం. మరి పిల్లలకు వాతావరణం గురించి అర్థమయ్యేదెలా..?’ అనిపించింది. మా సొంత ఊరు వరంగల్కి వెళ్లినప్పుడు ఈ భావన మరింత బలపడింది. పట్టణాలలో ఉన్న పిల్లలకు చెట్ల గురించి, వాటి పెంపకం గురించి తక్కువ తెలుసు అని. వీటిని కొంతవరకైనా అర్థమయ్యేలా ఆసక్తికరంగా చెప్పడం కోసం ఏం చెయ్యాలా అని ఆలోచించాను’ అని వివరిస్తుంది నవ్యశ్రీ. బొమ్మలతో వివరణ.. ‘పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. కానీ, వాటిలోనూ హానికారకమైనవే ఉన్నాయి. నర్సరీ పిల్లల బుర్రల్లోకి మంచి ఆలోచనలు వచ్చేవిధంగా, అలాగే వారి శరీరానికి, ఆరోగ్యానికి ఏ మాత్రం హాని చేయని బొమ్మలైతే బాగుంటుందనిపించింది. ఈ విషయంగా శోధిస్తున్నప్పుడు ఫ్యాబ్రిక్ ప్లాంట్స్ బొమ్మల ఐడియా బాగా నచ్చింది’ అంటూ తాము ఎంచుకున్న పర్యావరణ కాన్సెప్ట్ను తెలియజేసింది రాజశ్రీ. కొబ్బరి చిప్పలు, వెదురు కొమ్మలు, మట్టి కుండలలో చిన్న చిన్న మొక్కల పెంపకం తెలిసిందే. ఐదేళ్ల లోపు పిల్లల శరీరానికి, మనసుకు హత్తుకునేలా చెప్పగలిగేదే ప్లాంటేషన్. అది ఎప్పుడూ ముచ్చటైనదే. ఫ్యాబ్రిక్తో మేకింగ్.. ‘టెడ్డీబేర్ క్లాత్ను ఉపయోగించి, బొమ్మ ఆకారం వచ్చేలా చేశాను. అందులో కొంత కోకోపిట్ నింపి, తల భాగంలో హెయిర్ ఎలా అయితే ఉంటుంది, అలా గోధుమ గడ్డి పెరిగేలా ఏర్పాటు చేశాను. అక్క వాటికి కళ్లూ, ముక్కు.. వంటివి పెట్టి ఆర్టిస్టిక్గా తయారుచేసింది. బొమ్మ తలభాగంలో పైన కొన్ని నీళ్లు చల్లుతూ ఉంటే వారం రోజుల్లో మొలకలు ఏపుగా పెరిగాయి. అప్పుడు మా చుట్టుపక్కల పిల్లలను పిలిచి, చూపించాం. ఎంత ఆనందించారో మాటల్లో చెప్పలేం. రోజంతా ఈ ప్లాంట్ బొమ్మలతోనే గడిపాశారు. ఆ సమయంలో వాతావరణం గురించి, చెట్ల గురించి ఎన్నో విషయాలు మాట్లాడాం. తరవాత వాటిని వారికే ఇచ్చేశాం. వరి, ఇతర చిరుధాన్యాలతోనూ ఇలాంటి బొమ్మలను సిద్ధం చేశాం. వీలున్నప్పుడల్లా చేస్తున్నాం. పాత క్లాత్స్తో తయారు చేసిన ప్లాంట్ టాయ్స్ని పిల్లలచేతే తయారుచేయించవచ్చు. ఇందుకు ఈ వేసవి సమయం మరింత అనువైది’’ అని తమ ప్రయత్నం గురించి వివరించింది నవ్యశ్రీ. ఆడుకున్నా మేలే.. పిల్లలకు ఈ బొమ్మలు ఏ మాత్రం హానిచేయవు. పొరపాటున నోట్లో పెట్టుకున్నా ఏ హానీ కలగదు. పైగా గోధుమగడ్డి వంటివి ఆరోగ్యానికి మంచివే. వారి ముందే బొమ్మల హెయిర్(గడ్డి) కత్తిరించి జ్యూస్ చేసి, ఇవ్వచ్చు. పిల్లలు ఈ విధానాన్ని బాగా ఆనందిస్తారు. ఈ ప్లాంట్స్తో మొక్కలను ఎలా పెంచవచ్చు, చెట్లు వాతావరణానికి, ఆరోగ్యానికి చేసే మేలేమిటి.. వంటివన్నీ చెప్పవచ్చు. దీనికి పెద్దగా కష్టపడక్కర్లేదు’ కూడా అని వివరిస్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. రేపటì పర్యావరణ సమతుల్యతకు ఈ రోజే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అందుకు, పిల్లల్లో మొక్కల పెంపకం పట్ల ఆసక్తి ఎలా పెంచవచ్చో ఇంటి నుంచే మొదలుపెట్టవచ్చు. వాతావరణ కాలుష్యానికి కారకమయ్యే ప్రతీ విషయాన్ని వివరించి, మనం జాగ్రత్తపడటంతో పాటు రేపటితరాన్నీ అప్రమత్తం చేయచ్చు. – నిర్మలారెడ్డి -
‘బొమ్మ’కు బాసట
సాక్షి ప్రతినిధి విజయవాడ : కొండపల్లి బొమ్మల పరిశ్రమకు పూర్వ వైభవం తెచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బొమ్మల తయారీకి అవసరమయ్యే కలపనిచ్చే చెట్ల పెంపకానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అటవీశాఖ అధికారులు, బొమ్మల తయారీదారులతో ఇటీవల సమావేశమై పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. బొమ్మల తయారీకి అవసరమైన కలప గతంలో అందుబాటులో ఉండేదని, ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన వీరులపాడు, ఎ.కొండూరు అటవీ ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నట్టు బొమ్మల తయారీదారులు తెలిపారు. ఈ చెట్లు అంతరించిపోతున్నాయని, బొమ్మలు తయారు చేసే కళాకారుల సంఖ్యా తగ్గిపోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చెట్ల పెంపకానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించి, ఉపాధి హామీ పథకం కింద మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తెల్లపొని చెట్లతో కలప బ్యాంకు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పరిశ్రమను ప్రోత్సహించేలా యువతకు శిక్షణ సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. అలా వచ్చి.. ఇలా! కొండపల్లి ఖిల్లా రాజభవనాల నిర్మాణంలో డిజైన్లు(నక్సే) చేసేందుకు 400 ఏళ్ల కిందట రాజస్థాన్ నుంచి వచ్చిన హస్తకళాకారులు.. రాజుల కాలం అంతరించాక బొమ్మల తయారీ పరిశ్రమను జీవనోపాధిగా ఎంచుకుని ఇక్కడే స్థిరపడ్డారు. కొండపల్లి అడవుల్లో లభించే తెల్లపొని చెట్ల నుంచి లభించే చెక్కతో బొమ్మల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారి శిక్షణలో స్థానికులు సైతం పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. బొమ్మల తయారీ, ఉత్పత్తుల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన పరిశ్రమ.. నేడు కలప కొరతతో కొంత నిరాదరణకు గురైంది. గతంలో మొత్తం బొమ్మల పరిశ్రమ కుటుంబాలు 250 ఉండగా.. ప్రస్తుతం 45 కుటుంబాలు మాత్రమే బొమ్మలను తయారు చేస్తున్నాయి. మళ్లీ పూర్వ వైభవం దిశగా.. డిమాండ్ ఉన్న బొమ్మలను మనసుకు హత్తుకునేలా వివిధ ఆకృతుల్లో మలిచి రంగులద్ది.. అమ్మకాలకు ఉంచుతారు. ఎడ్లబండి, కల్లుగీత తాటిచెట్టు, దశావతారాలు, ఏనుగు అంబారీ, ఆవుదూడ, గంగిరెద్దు, అర్జునుడి రథం, తాటిచెట్టు బొమ్మలను అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దడంతో పాటు.. దేవతామూర్తుల బొమ్మలను జీవం ఉట్టిపడేలా తయారు చేస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి కుటీర పరిశ్రమలా పనిచేసి ఈ బొమ్మలను తయారు చేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మన్కీబాత్లో కొండపల్లి బొమ్మల పరిశ్రమ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని ప్రస్తావించడం, ‘ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి’ ప«థకంలో అంతర్జాతీయ ఆన్లైన్ మార్కెటింగ్కు రాష్ట్ర పరిశ్రమ శాఖ సన్నాహాలు చేస్తుండటంతో కొండపల్లి బొమ్మల పరిశ్రమకు పూర్వవైభవం వస్తుందని బొమ్మల తయారీదారులు ఆశిస్తున్నారు. మళ్లీ మంచిరోజులు.. బొమ్మల పరిశ్రమ అభివృద్ధికి వన సంరక్షణ సమితులు ద్వారా తెల్లపొని వనాలు పెంచాలి. నైపుణ్యం కోసం శిక్షణ కేంద్రాన్ని కూడా నెలకొల్పితే బాగుంటుంది. ప్రభుత్వం తెల్లపొని కలపను సబ్సిడీపై అందించడంతో పాటు.. అంతర్జాతీయ స్థాయిలో ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కలెక్టర్ తీసుకుంటున్న చొరవతో పరిశ్రమకు మంచిరోజులొస్తాయన్న నమ్మకం ఉంది. – కె.వెంకటాచారి, బొమ్మల కళాకారుడు -
కొండపల్లి బొమ్మ.. తరతరాల జ్ఞాపకం
‘కొండపల్లి కొయ్యబొమ్మ... కోటగట్టి కూచుందమ్మ...’ అని పాడుకోవడానికే కాదు.. కొండపల్లి బొమ్మ పాటకు తగ్గట్టే తరతరాలకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది కూడా. అమ్మకు చిన్నప్పుడు తిరునాళ్లలో తాతయ్య కొనిచ్చిన ‘అమ్మాయి– అబ్బాయి’ బొమ్మ ఉంటుంది. అన్నయ్య కొనిపించుకున్న ఎడ్లబండి అదే షెల్ఫ్లో చోటు చేసుకుంటుంది. నానమ్మ ముచ్చటపడి తెచ్చుకున్న దశావతారాల బొమ్మ ఉండనే ఉంటుంది. కొండపల్లి బొమ్మ ఒకసారి ఇంట్లో షోకేస్లోకి వచ్చిందంటే ఇక తరాలు మారినా ఆ బొమ్మ చెక్కు చెదరదు. బొమ్మ చెక్కు చెదరదు... కానీ ఇటీవల బొమ్మలు చేసే వాళ్లు కనుమరుగైపోతున్నారు. వందలాది కుటుంబాలు ఈ కళను కొనసాగించలేక ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయాయి. ఈ దశలో కళను బతికించుకోవడానికి, కళతోనే తమ బతుకును నిర్మించుకోవడానికి ముందుకు వచ్చారు మహిళలు. బావుదరి పట్టారు! నలభై ఏళ్ల కిందట కొండపల్లి కళాకారుల చేతిలో 84 రకాల కళాఖండాలు రూపుదిద్దుకునేవి. ఇప్పుడా సంఖ్య ఐదారుకు మించడం లేదు. ఈ కళ మీద ఆధారపడి ఉపాధి పొందే పరిస్థితులు సన్నగిల్లడంతో ఈ తరం యువకులు ఎవరూ ముందుకు రావడం లేదు. కళ అంతరించిపోవడానికి ఎంతోకాలం పట్టదనే పరిస్థితి పదేళ్ల కిందటే మొదలైంది. ఈ దశలో మహిళలు ముందుకు వచ్చారు. ఇంతవరకు మగవాళ్లు బొమ్మలు చేస్తుంటే, మహిళలు ఆ బొమ్మలకు రంగులు వేయడం, ప్యాకింగ్ వంటి సహాయక బాధ్యతలకే పరిమితమయ్యారు. ఇప్పుడు మహిళలే కలప కొట్టడం, రంపంతో కోసి చిన్న దిమ్మలు చేయడం, ఆ దిమ్మలను కుంపటి మీద ఆరబెట్టడం నుంచి బొమ్మను చెక్కి రంగులు వేయడం వరకు అన్ని పనులూ చేస్తున్నారు. ‘ఈ బొమ్మల తయారీలో ఉపయోగించే మెటీరియల్ మొత్తం సహజమైనదే. చెట్ల బెరళ్లు, కాయల పై తొక్కలు, గింజల పొడులతో రంగులు తయారు చేస్తారు. ఈ కలప మెత్తగా ఉంటుంది. కాబట్టి పిల్లలు నోట్లో పెట్టుకున్నా, ఒకరి మీద ఒకరు విసురుకున్నా అంతగా దెబ్బ తగలదు. కాబట్టి స్కూల్ కిట్ల కోసం ప్రైవేట్ స్కూళ్ల నుంచి కూడా మంచి డిమాండ్ రావచ్చ’ని ఆశాభావం వ్యక్తం చేశారు అభిహార స్వచ్ఛంద సంస్థ నిర్వహకురాలు సుధారాణి. అంతర్జాతీయ వేదికల మీద మన కొండపల్లి బొమ్మలు కనిపించాలనేది ఆమె ఆకాంక్ష. ఇన్నాళ్లూ బావుదరికి దూరంగా ఉన్న మహిళలు ఇప్పుడు తమ కెరీర్ని స్వయంగా చెక్కుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ల దృష్టి కార్లలో వేళ్లాడే నారింజ రంగు హనుమాన్ బొమ్మ మీద పడింది. కొండపల్లి హనుమాన్ రూపకల్పనలో మునిగిపోయారు. కార్లలో షోపీస్లుగా కొండపల్లి బొమ్మలు కనిపించే రోజు ఎంతో దూరం ఉండకపోవచ్చు. ఇప్పుడు మేమే చెక్కుతున్నాం! నేను ముప్పై ఏళ్లుగా ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు అన్ని పనులూ నేర్చుకున్నాను. కలపను ముక్కలు చేయడం, ఆరబెట్టడం వంటివి పది బొమ్మలకు సరిపడిన మెటీరియల్ ఒకేసారి సిద్ధం చేసుకుంటాం. ఆకారాలు చెక్కడం రెండు రోజుల్లో పూర్తవుతుంది. ఈ బొమ్మల్లో మనిషి దేహం చెక్కేటప్పుడు పాదాల నుంచి తల వరకు ఒకే ముక్కలో చెక్కుతాం. చేతులను విడిగా చెక్కి అతికిస్తాం. ఆ తర్వాత తల మీద కిరీటం వంటి అలంకరణ చేసి రంగులు వేస్తాం. అడుగు ఎత్తున్న బొమ్మల జత ధర నాలుగు నుంచి ఆరువేలవుతుంది. మొదట్లో మేము లేపాక్షి హస్తకళల ఎంపోరియమ్కి ఇచ్చేవాళ్లం. ఇప్పుడు అభిహార సంస్థ వాళ్లు మాకు మరికొన్ని కొత్త వస్తువులు చేయడంలో కూడా శిక్షణ ఇస్తున్నారు. మేము చేసిన బొమ్మలను మార్కెట్ చేయడానికి వాళ్లకే ఇస్తున్నాం. ఇప్పుడు రోజూ పని ఉంటోంది. కొండపల్లి బొమ్మ చేయడానికి తెల్ల పొణికి చెక్క వాడతాం. ఎన్నేళ్లయినా ఈ చెక్కలో పగుళ్లు రావు. అందుకే బొమ్మలు కలకాలం అంత అందంగా ఉంటాయి. – చందూరి స్వరాజ్యం, కొండపల్లి బొమ్మల కళాకారిణి ‘చెక్క’ని విప్లవం కొండపల్లి బొమ్మల తయారీలో మహిళల శ్రమ చిన్నది కాదు. కానీ ఆ శ్రమ ప్రధాన బొమ్మ తయారీ కాకపోవడంతో వాళ్లకు ఆర్టిజాన్ గుర్తింపు కార్డు వచ్చేది కాదు. నాలుగు నెలల శిక్షణలో ఇప్పుడు మహిళలు ఎవరి సహాయమూ లేకుండా స్వయంగా బొమ్మ చేయగలుగుతున్నారు. ఇప్పుడు మహిళలు కూడా హక్కుగా ఆర్టిజాన్ కార్డు పొందవచ్చు. ఇప్పటి వరకు మహిళలకు కళాకారులుగా గుర్తింపు లేకపోవడంతో కళాఖండాల ప్రదర్శన, కళాకారుల అవార్డుల విషయంలో మహిళలు కనిపించేవాళ్లు కాదు. ఇప్పుడు ఈ మహిళలు ఆ పరిధిని చెరిపివేశారు. – సుధారాణి, అభిహార సంస్థ నిర్వహకురాలు బొమ్మల బడి! కొండపల్లి బొమ్మలు చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఈ కళాకారుల చేతిలో చెక్క చక్కని బొమ్మగా ఎంత లాలిత్యంగా రూపుదిద్దుకుంటుందో వర్ణించడం సాధ్యం కాదు. ఇంత గొప్ప కళ అంతరించిపోతుంటే చూస్తూ ఊరుకోకూడదు. ఆ కళ తరతరాలకు అందాలి, ఈ కళాకారులు సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో జీవించాలి. అందుకే మాకు వచ్చిన ఆలోచనలను ఆచరణలో పెడుతున్నాం. స్కూల్ కిట్కు ఐడియా ఇచ్చాం. ఆ కిట్లో తెలుగు, ఇంగ్లిష్ అక్షరమాల ఉంటాయి. అలాగే పిల్లలు లాయర్, టీచర్, డాక్టర్, రైతు, జాలరి వంటి వృత్తులను తెలుసుకోవడానికి వీలుగా ఆ బొమ్మలు చేయించాం. ఆఫీస్లో ఉపయోగించే ట్రే, పెన్ స్టాండ్, ఇళ్లలో ఉపయోగించే వస్తువులను కూడా ఈ మెటీరియల్తో చేయవచ్చు. ఇలాంటి మార్పును స్వాగతిస్తే కళాకారులకు చేతినిండా పని ఉంటుంది. ఈ కళాకారుల కోసం బీటూబీ మీటింగ్ వంటి మార్కెట్ వేదికల గురించి ఆలోచిస్తున్నాం. – విజయశారదారెడ్డి, వైస్ చైర్పర్సన్, ఏపీఎస్ఈఆర్ఎమ్సీ కొండపల్లి కృష్ణుడు నేను చేసిన తొలి బొమ్మ గోపికల మధ్య కృష్ణుడు. బావుదరి మీద పట్టు రావడానికి నెల రోజులు పట్టింది. అది వస్తే ఇక బొమ్మలు చేయడం ఏ మాత్రం కష్టం కాదు. మా బ్యాచ్ ట్రైనింగ్ పూర్తి కావస్తోంది. తర్వాత బ్యాచ్కి మరో పది మంది సిద్ధంగా ఉన్నారు. – పద్మావతి వెన్నవల్లి, శిక్షణలో ఉన్న విద్యార్థి – వాకా మంజులారెడ్డి ఫొటోలు : ఎ. బాబు, సాక్షి, ఇబ్రహీంపట్నం -
అంతరాలు దాటిన కల్లాకపటంలేని ప్రేమ
కొన్ని విషయాలు పిల్లల చూసి నేర్చుకునేలా ఉంటాయి. వాళ్ల పసిమనసు, నిష్కల్మషమైన హృదయం, అమాయకత్వంతో చేసే పనులు చాలా గొప్పగా అనిపిస్తాయి. మనకే అనిపిస్తుంది వాళ్లలా మనమెందుకు అంత స్వచ్ఛంగా లేం అని. బహుశా అందువల్లనే ఏమో చిన్నపిల్లలను దేవుడుతో సమానం అంటారు. పైగా వారి అల్లరిని చూస్తే చాలు అప్పటి వరకు ఉన్న టెన్షన్లు చికాకులు అన్ని ఎగిరిపోతాయి. ఒక్కసారిగా చాలా రిలీఫ్గా ఫీలవుతాం కూడా. ఇక్కడొక సన్నివేశం కూడా అచ్చం అలానే చాలా సంతోషాన్ని ఇవ్వడమే కాక మనసును కదిలించేలా చేస్తోంది. (చదవండి: కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ... మోతాదుకు మించి తాగితే కారు స్టార్ట్ అవ్వదు!!) అసలు విషయంలోకెళ్లితే...కియాన్ష్ దేటే అనే బాలుడు బొమ్మలు అమ్ముకునే మహిళ కొడుకు ముందు నిలబడి ఉత్సహంగా డ్యాన్స్ చేస్తాడు. పైగా ఆ బాలుడిని కూడా డ్యాన్స్ చేయమంటూ కియాన్ష్ ప్రోత్సహిస్తాడు. అయితే ఆ మహిళ కొడుకు కియాన్ష్ దగ్గరకు వచ్చి ప్రేమగా హగ్ చేసుకుంటాడు. ఒక్కసారిగా కియాన్ష్ డ్యాన్స్ చేయడం ఆపి అలా చూస్తాడు. కాసేపటికీ కియాన్ష్ కూడా ఆ మహిళ కొడుకుని ప్రేమగా ఆలింగనం చేసుకుంటాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కియాన్ష్ తల్లి అశ్విని నికమ్ దేటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా ఈ వీడియోకి మిలియన్లకు పైగా వ్యూస్, లైక్లు వచ్చాయి. (చదవండి: 48 గదులతో కూడిన తొలి పాడ్ వెయిటింగ్ రూమ్!) View this post on Instagram A post shared by Kiansh Dete & Ayansh Dete (@kiansh_ayansh) -
స్మార్ట్గా నేర్చుకున్నారు
నీటి కొలనులో నుంచి పైకి ఉద్భవిస్తున్నట్లున్న నిండు చంద్రుడి పెయింటింగ్ పౌర్ణమిని డ్రాయింగ్ రూమ్లోకి తెచ్చినట్లుంది. ఒకరినొకరు తదేకంగా చూసుకుంటున్న రాధాకృష్ణుల చిత్రం... ఎన్నెన్నో ప్రశ్నలతో మనసును ఊపిరాడనివ్వదు. జుట్టు ముడిచుట్టిన ఆదివాసీ మహిళ చిత్రం... ఆధునికత ఫ్యాషన్ రీతులను ప్రశ్నిస్తున్నట్లు ఉంటుంది. వీటితోపాటు సూర్యోదయం, సూర్యాస్తమయాలు ఆ ఇంటి గోడల మీద వచ్చి వాలాయి. అడవిలో ఎగురుతున్న జింక ఈ ఇంట్లోకి తొంగి చూడడానికి వచ్చినట్లుంది ఓ చిత్రం. వీటి పక్కనే ఒక హృదయాకారంలో ‘ఐ లవ్ యూ అమ్మా’ అనే అక్షరాలు ఆ పెయింటింగ్ని మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తున్నాయి. హైదరాబాద్, ఈసీఐఎల్ సమీపంలోని సాయినాథపురంలోని ప్రశంస, అభిజ్ఞల ఇల్లు ఇది. ఈ బొమ్మలు వేసిన పిల్లలు అచ్చంగా పిల్లల్లాగా, స్వచ్ఛతకు ప్రతీకల్లా ఉన్నారు. ప్రశంస తొమ్మిదవ తరగతి, అభిజ్ఞ ఏడవ తరగతి. వీళ్లకు బొమ్మలు వేయడం నేర్పిన గురువు టెక్నాలజీ. నిజమే! ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. కరోనా కారణంగా లాక్డౌన్ ప్రపంచాన్ని స్తంభింపచేస్తే ఈ పిల్లలిద్దరూ ఆ విరామాన్ని పెయింటింగ్ శిక్షణకు ఉపయోగించుకున్నారు. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లడానికి భయపడే కోవిడ్ కాలంలో వాళ్లకు బొమ్మలు వేయడం నేర్పించడానికి ఏ గురువు కూడా ఇంటికి వచ్చే సాహసం చేయలేరు. ఏ గురువు కూడా తమ ఇంటికి శిష్యులను స్వాగతించే పరిస్థితి కూడా కాదు. అలాంటప్పుడు యూ ట్యూబ్ చూస్తూ పెయింటింగ్ వేయడం నేర్చుకున్నారు. రోజుకొక పెయింటింగ్ వీడియో చూస్తూ సొంతంగా ప్రాక్టీస్ చేస్తూ పూర్తి స్థాయి చిత్రకారులైపోయారు. ఏ చిత్రానికి ఏ తరహా రంగులు వాడాలో, ఎంత మోతాదులో మిశ్రమాలను కలుపుకోవాలో కూడా నేర్చుకున్నారు. లాక్డౌన్ కాలం పిల్లల బాల్యాన్ని హరించిందని, స్తబ్దుగా మార్చేసిందని ఆందోళన పడుతుంటాం. కానీ కాలం అందరికీ సమానమే. ఎవరికైనా రోజుకు ఉన్నది ఇరవై నాలుగ్గంటలే. ఆ ఇరవై నాలుగ్గంటలను ఉపయోగపెట్టుకునే వాళ్లు, నిరర్ధకంగా గడిపేసే వాళ్లూ ఉన్నట్లే... ఈ అక్కాచెల్లెళ్లు లాక్డౌన్ కాలంలో చిత్రకారిణులుగా నైపుణ్యం సాధించారు. తోటి పిల్లలకు మార్గదర్శనంగా నిలుస్తున్నారు. పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ప్రశంస, అభిజ్ఞ ఫోన్ చేతికి వచ్చింది! ‘‘నేను పదవ సంవత్సరం నుంచి బొమ్మలేస్తున్నాను. స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్లలో పాల్గొన్నాను కూడా. లాక్డౌన్లో రోజంతా ఇంట్లోనే ఉండేవాళ్లం. బోర్ కొట్టేది. ఆన్లైన్ క్లాసుల కోసమని అమ్మానాన్న వాళ్ల స్మార్ట్ ఫోన్లు నాకు చెల్లికి ఇచ్చేశారు. క్లాస్లు అయిపోయిన తర్వాత నేను యూ ట్యూబ్ సెర్చ్ చేస్తూంటే పెయింటింగ్ క్లాసుల వీడియోలు కనిపించాయి. అప్పటి నుంచి రోజూ వీడియోలు చూస్తూ నోట్స్ రాసుకునేదాన్ని. అక్రిలిక్ కలర్స్, వాటర్ కలర్స్, ఆయిల్ పెయింటింగ్స్లో ఏ పెయింటింగ్కి ఏది వాడాలో వచ్చేసింది. ఈ ఏడాది కాలంగా నేను వందకు పైగా బొమ్మలు వేశాను. మధుబని, రంగోలి ఆర్ట్లు, రవీంద్రనాథ్ టాగూర్, స్వామి వివేకానంద పోట్రయిట్లు వేశాను. పెద్ద ఆర్టిస్ట్ను కావాలనేది నా లక్ష్యం. టెన్త్ క్లాస్ తర్వాత పెయింటింగ్ కోసం ఎక్కువ టైమ్ ప్రాక్టీస్ చేస్తాను’’. -
Vidyun Goel: ఈ లైబ్రరీలో పుస్తకాలుండవ్! ఆడుకునే బొమ్మలు మాత్రమే..
టాయ్ బ్యాంక్, ఇది పిల్లలు డబ్బులు దాచుకునే కిడ్డీ బ్యాంకు కాదు. పిల్లలు ఆడుకునే బొమ్మల బ్యాంకు. పుస్తకాలు చదువుకోవాలనే ఆసక్తి ఉన్న పెద్దవాళ్లు లైబ్రరీకి వెళ్లి తమకు నచ్చిన పుస్తకాన్ని చదువుకున్నట్లే ఇది కూడా. అందరూ అన్ని పుస్తకాలనూ కొనుక్కోవడం సాధ్యమయ్యే పని కాదు, కాబట్టి లైబ్రరీ అనే ఒక అందమైన ప్రదేశం ఆవిష్కృతమైంది. మరి, బొమ్మలతో ఆడుకునే బాల్యాన్ని హక్కుగా కలిగిన పిల్లల గురించి ఎవరైనా ఆలోచించారా? విద్యున్ గోయెల్ ఆలోచించారు. ఆమె టాయ్ బ్యాంకు పేరుతో ఒక బొమ్మల నిలయానికి రూపకల్పన చేశారు. నాలుగేళ్ల కిందట ఆమె ప్రారంభించిన టాయ్ బ్యాంకు బొమ్మలతో ఇప్పటికి ఐదు లక్షల మంది పిల్లలు ఆడుకున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. విద్యున్ గోయెల్ బాల్యం దాటి కాలేజ్ చదువుకు వచ్చిన సమయం అది. పైగా వాళ్ల నాన్నకు ఉద్యోగ రీత్యా బదిలీ కూడా. ఇంట్లో ఉన్న బొమ్మలన్నింటినీ ఒక చోట జమ చేస్తే ఓ గది నిండేలా ఉంది. వాటన్నింటినీ ఏం చేయాలనే ప్రశ్న అందరిలో. పారేయడానికి మనసు ఒప్పుకోదు. తమతో తీసుకువెళ్లడమూ కుదిరే పని కాదు. అప్పుడు వాళ్ల నాన్న ‘ఈ బొమ్మలన్నింటినీ వెనుక ఉన్న కాలనీలో పిల్లలకు ఇస్తే, వాళ్లు సంతోషంగా ఆడుకుంటారు’ అని సలహా ఇచ్చారు. అంతే... తన బొమ్మలతోపాటు తన స్నేహితుల ఇళ్లలో అటక మీద ఉన్న బొమ్మలను కూడా జత చేసి పంచేసింది విద్యున్ గోయెల్. అలా మొదలైన బొమ్మల పంపకాన్ని ఆమె పెద్దయిన తర్వాత కూడా కొనసాగించింది. టాయ్ బ్యాంకు పేరుతో బొమ్మలను సేకరించడం మొదలుపెట్టింది. చదవండి: Viral Video: బాబోయ్..! చావును ముద్దాడాడు.. దాదాపుగా ప్రతి ఇంట్లో పిల్లలుంటారు. వాళ్లు పెద్దయిన తర్వాత ఆ బొమ్మలు అటకెక్కుతుంటాయి. అలా తెలిసిన వాళ్లందరి నుంచి సేకరించిన బొమ్మలను ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు, అంగన్వాడీ కేంద్రాలకు, షెల్టర్ హోమ్స్లో ఉన్న పిల్లలకు, పిల్లల హాస్పిటళ్లు, అల్పాదాయ వర్గాల కాలనీలకు వెళ్లి పంపిణీ చేయడం మొదలు పెట్టింది. ఆమె టాయ్ బ్యాంకు సర్వీస్ ఏ ఒక్క నగరానికో, పట్టణానికో పరిమితం కాలేదు. ఆమె మొదలు పెట్టిన ఈ కాన్సెప్ట్ను దేశవ్యాప్తంగా ఎంతోమంది అందుకున్నారు. ఇప్పటి వరకు టాయ్ బ్యాంకు బొమ్మలతో ఆడుకున్న పిల్లలు ఐదు లక్షలకు చేరి ఉంటుందని అంచనా. మనం కూడా మనవంతుగా టాయ్బ్యాంకు వితరణలో పాల్గొందాం. ఇంట్లో ఉన్న బొమ్మలను మన ఊళ్లోని అంగన్వాడీ కేంద్రానికి విరాళంగా ఇద్దాం. మన పిల్లలకు వాళ్ల జ్ఞాపకంగా ఒకట్రెండు బొమ్మలను ఉంచి మిగిలిన వాటిని బొమ్మలతో ఆడుకునే వయసు పిల్లలకు ఇద్దాం. ఇచ్చేసే బొమ్మలు కూడా ఓ జ్ఞాపకంగా ఉండాలనుకుంటే మన పిల్లల చేతనే ఇప్పిస్తూ చక్కటి ఫొటో తీసుకుంటే... పెద్దయ్యాక ఆ ఫొటోలు చూసుకుని సంతోషిస్తారు. ఆ బొమ్మలతో ఆడుకునే పిల్లలు బొమ్మల లోకంలో ఆనందంగా విహరిస్తారు. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! -
ఇదంతా నీ కోసమే రా....ఇవన్నీ నీవే
పసిహృదయాల మనస్సులు ఎంతో నిర్మలంగా, అమాయకంగా ఉంటాయి. అంతేకాదు వాళ్లు తమ స్నేహితులు బాధపడుతుంటే పెద్దవాళ్ల కంటే వాళ్లే ఎక్కువగా చొరవ తీసుకుని భలే ఊరడిస్తారు. వాళ్లు ఒకరికొకరు వారికి తోచిన రీతిలో గిఫ్ట్లు ఇచ్చుకుంటూ భలే సరదాగా గడుపుతుంటారు. అచ్చం అలాగే ఇక్కడోక విద్యార్థి విషయంలో జరిగింది. అసలు ఎక్కడ ఏం జరిగిందో చూద్దాం రండి. (చదవండి: చూడ్డానికి పిల్ల...కానీ చెరుకు గడలను ఎలా లాగించేస్తుందో!) అసలు విషయంలోకెళ్లితే.....తమ స్నేహితుడి ఇల్లు అనుకోని ప్రమాదంలో కాలిపోతుంది. దీంతో అతని తోటి స్నేహితులు అతని బాధను మర్చిపోయాలా అతని మంచి సర్ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. అంతే తమ స్నేహితుడు క్లాస్రూంలోకి రాగానే వారంతా కొత్త కొత్త బొమ్మలను గిఫ్ట్గా ఇస్తారు. అంతేకాదు "ఇదంతా నీకోమే రా", "ఇవన్నీ నీకే" అంటూ అందరూ రకరకలా బొమ్మలతో క్లాస్ రూమ్ని నింపేస్తారు. దీంతో ఆ విద్యార్థి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి 'వావ్' అని గట్టిగా అరిచి ఆనందంగా వారిని కౌగిలించుకోవటానికీ రెండు చాతులు చాపుతాడు. దీంతో అతని స్నేహితులంతా ఒకేసారి అతన్ని కౌగిలించుకోవటానికి ఎగబడతారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను స్కూల్ డిస్ట్రిక్ట్ ఫిలడెల్ఫియా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మేరకు నెటిజన్లు ఈ వీడియో చూస్తే ఎవరి హృదయం అయినా ద్రవించిపోతుంది అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: వాట్ ఏ ఎక్స్ప్రెషన్స్...ఎవ్వరికైనా నవ్వు రావల్సిందే....) View this post on Instagram A post shared by Jay Shetty (@jayshetty) -
చైనా బొమ్మలతో డేంజర్!
Dangerous Chemicals In China Toys: మేడ్ ఇన్ చైనా బొమ్మలకు అమెరికా చెక్ పోస్ట్ వేసింది. చైనా నుంచి నౌకల్లో చేరిన బొమ్మలను దేశంలోకి రాకుండా అడ్డుకుంది. తాజాగా పోర్ట్లోనే సుమారు ఏడు బాక్స్ల బొమ్మలను అధికారులు సీజ్ చేయడం విశేషం. ఇందుకు కారణం.. బొమ్మల్లో ప్రమాదకరమైన కెమికల్స్ను గుర్తించడం!. చైనా నుంచి వచ్చిన బొమ్మల్లో ప్రమాదకరమైన రసాయనాల ఆనవాళ్లను అమెరికా అధికారులు గుర్తించారు. ఈ మేరకు షిప్లో వచ్చిన మేడ్ ఇన్ చైనా బొమ్మల్ని అమెరికా కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. భారత్లో బాగా ఫేమస్ అయిన లగోరి(స్వీట్, పల్లీ.. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు) తరహా చైనా మేడ్ బొమ్మలూ ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. జులై 16న చేపట్టిన కన్జూమర్ ప్రొడక్ట్స్ సేఫ్టీ కమిషన్(CPSC), సీబీపీ అధికారులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీలలో ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్న బొమ్మల్ని గుర్తించారు. కొన్ని బొమ్మలకు సీసం, కాడ్మియం, బేరియం పూత పూస్తున్నారని, దానివల్ల పిల్లల ప్రాణాలకు ముప్పుపొంచి ఉందని పేర్కొంటున్నారు వైద్యులు. అంతేకాదు ఆగష్టు 24న చైనా నుంచి షిప్ ద్వారా వచ్చిన కొన్ని బొమ్మల్లోనూ ఈ కెమికల్స్ ఆనవాళ్లను నిర్ధారించారు. ఈ తరుణంలో అక్టోబర్ 4న అమెరికాకు చేరుకున్న చైనా బొమ్మల్ని సీజ్ చేయడం విశేషం. మరోవైపు హాలీడే షాపింగ్ సీజన్ నేపథ్యంలో యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్(సీపీబీ) అప్రమత్తమైంది. అంతేకాదు ఆన్లైన్ షాపింగ్ చేసేప్పుడు పిల్లల బొమ్మల విషయాల్లో జాగ్రత్తగా ఎంచుకోవాలని ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఈ ఎఫెక్ట్తో చైనా బొమ్మల వర్తకంపై భారీ ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. చదవండి: చైనాలో భారీ కార్పొరేట్ పతనం తప్పదా? -
భళా వెంకటవర్షిత్: కాగితంతో బొమ్మలు తయారీ
చెన్నూర్: చిన్నారి కళా..భళాగా ఉంది. ఖాళీగా ఉంటే చాలు వివిధ రకాల కళాకృతులు తయారు చేస్తాడు. న్యూస్ పేపర్లు ఉంటే చాలు వాటితో ఏదైనా ఇట్టే తయారు చేయడంలో దిట్టా. న్యూస్ పేపర్లలో వివిధ రకాలు వాహనాలు, సెట్టింగ్లను తయారు చేసి అందరితో శేభాష్ అనిపించుకుంటున్నాడు. చెన్నూర్ పట్టణానికి చెందిన రెడ్డి మహేశ్, దీప్తి దంపతుల ప్రథమ కుమారుడు వెంకటవర్షిత్ కోటపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి కొత్త ఆలోచనలతో వివిధ రకాల వస్తువులను తయారు చేయడంపై మక్కువ పెంచుకున్నాడు. కుమారుడిలోని సృజనాత్మకతను గమనించిన తండ్రి మహేశ్ ప్రొత్సహించాడు. తండ్రి ప్రొత్సహంతో వెంకటవర్షిత్ ముందుకు సాగుతున్నాడు. ఖాళీ సమయం సద్వినియోగం కరోనాతో ఏడాదిన్నర కాలంగా పాఠశాలలో ప్రతేక్ష బోధన నిలిచిపోయింది. దీంతో ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఖాళీ సమయంలో పనికి రాని న్యూస్ పేపర్లు, రంగుపేపర్లతో వివిధ రకాల బొమ్మలను తయారు చేయడం ప్రారంభించాడు వెంకటవర్షిత్. చిన్న చిన్న బొమ్మలను తయారు చేసిన చిన్నారి ఏకంగా వివిధ మోడళ్లలో వచ్చి మోటార్ సైకిళ్లతో పాటు వివిధ రకాల సెట్టింగ్లను తయారు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. రానున్న రోజుల్లో మరిన్ని రకాలు.. న్యూస్ పేపర్లతో ప్రస్తుతానికి మోటార్ సైకిళ్లలో పాటు వివిధ రకాల వస్తువులను తయారు చేశా. కరోనా సమయంలో ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న. ఎన్నో రకాల బొమ్మలను తయారు చేశా. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త వాహనాలతో పాటు దేవుని, జాతీయ నాయకులు బొమ్మలను తయారు చేస్తానని వెంకటవర్షిత్ తెలిపారు. పాఠశాలలు ప్రారంభమయ్యాయి. సెలవు రోజుల్లో పెద్ద వాహనాల బొమ్మలను తయారు చేస్తా. న్యూస్ పేపర్లతో బొమ్మల తయారీలో రికార్డు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న. –రెడ్డి వెంకటవర్షిత్, విద్యార్థి, చెన్నూర్ -
దిల్లీ... మా చల్లని తల్లీ!
తాలిబన్ల భయంతో ఆ దేశం నుంచి పారిపోవడానికి సాధారణ ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయి. చాప కింద నీరులా విస్తరిస్తున్న తాలిబన్ల ప్రాబల్యాన్ని కొన్ని సంవత్సరాల క్రితమే కొందరు మహిళలు పసిగట్టారు. వారికి భవిష్యత్ చిత్రపటం కనిపించింది. ఆ చిత్రంలో ఆయుధాలు, అణిచివేత తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించలేదు. అందుకే ప్రమాదాన్ని ఊహించి దిల్లీకి వచ్చేశారు. దిల్లీ వారి కన్నీళ్లను తుడిచి, వారికో దారి చూపిన తల్లి అయింది. 24 సంవత్సరాల మోష్గన్ మాతృభూమి అఫ్ఘాన్ను వదిలి వస్తున్నప్పుడు ఏంచేసి బతకాలో తెలియదు. బతకాలంటే అఫ్ఘాన్ను వదిలివెళ్లాలనేది మాత్రమే తెలుసు. దిల్లీకి వచ్చిన తరువాత నిస్సహాయంగా దిక్కులు చూడాల్సిన దీనస్థితి రాలేదు. దిల్లీ కేంద్రంగా పనిచేసే ‘సీలైవాలి’ అనే సామాజిక స్వచ్ఛంద సంస్థ మోష్గన్ను ఆదుకుంది. బతకడానికి ఒక దారి చూపింది. ‘సీలైవాలి’ కేంద్రంలో ఆటబొమ్మలు, గృహఅలంకరణ వస్తువులు తయారుచేస్తుంటుంది మోష్గన్. ‘పరిస్థితిని ముందే ఊహించి ఇక్కడ భద్రంగా ఉన్నందుకు సంతోషించాలో, తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు ప్రమాదం అంచున ఉన్నందుకు బాధపడాలో తెలియడం లేదు. ఈ దేశం మమ్మల్ని కన్నతల్లిలా ఆదుకొని ఆదరిస్తోంది’ అంటుంది మోష్గన్. 45 సంవత్సరాల రజియా, 23 సంవత్సరాల షబానా... మోష్గన్లా భవిష్యత్ను పసిగట్టి దిల్లీకి వచ్చినవారే. వీరు కూడా ‘సీలైవాలి’లో పనిచేస్తున్నారు. బొమ్మలు తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ‘మనసులో భయం తప్ప, చేతిలో తెలిసిన విద్య అంటూ ప్రత్యేకంగా లేదు. అలాంటి నేను శిక్షణలో బొమ్మలు, ఇతర వస్తువుల తయారీ నేర్చుకున్నాను. నాకు పరాయి దేశంలో ఉన్నట్లుగా లేదు. మాతృభూమిలోనే ఉన్నట్లుగా ఉంది’ అంటుంది రజియా. ‘దిల్లీకి వచ్చే ముందు చాలామంది వారించారు. చావోబతుకో ఇక్కడే అన్నారు. ఎవరూ పరిచయం లేని, ఎప్పుడూ చూడని దేశంలో ఇబ్బందులు పడతావు అని హెచ్చరించారు. అయినా మొండిధైర్యంతో వచ్చాను. ఎలాంటి ఇబ్బందులు పడలేదు. విశాల ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. మరోవైపు అక్కడ మా వాళ్ల పరిస్థితి చూస్తే బాధగా ఉంది’ అంటుంది షబాన. మోష్గన్, రజియా, షబానా... ఇంకా చాలామంది ఆఫ్గాన్ మహిళలకు ‘దిల్లీ’ అనేది దేశరాజధాని కాదు వారి చల్లనితల్లి. -
మట్టి కాని గట్టి బొమ్మలు
బంక మట్టితో చేసిన బొమ్మలు ఎక్కువసేపు నిలబడవు. ఎండిపోగానే పగుళ్లు వచ్చేస్తాయి. అందుకే పిల్లలు రసాయనాలతో తయారైన మట్టితో బొమ్మలు చేస్తూ ఆడుకుంటారు. ఆ మట్టిలో ప్రమాదకరమైన కిరసనాయిల్, బొరాక్స్ వంటివి ఉంటాయి. అవి పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. తన యేడాది వయసున్న కొడుకు మట్టితో ఆడుతుంటే దీప్తికి భయంగా ఉండేది. పిల్లవాడి ఆరోగ్యం కోసం రసాయనాలు లేని బొమ్మలు తయారు చేయాలనుకుంది దీప్తి. ఆ ఆలోచన నుంచి వచ్చినదే పర్యావరణ హితమైన మట్టి. పిల్లల కోసం బెంగళూరుకు చెందిన దీప్తి భండారీ హాని కలిగించని కృత్రిమ మట్టిని తయారు చేయడం ద్వారా ఆ మట్టితో ఆడుకునే పిల్లలకు ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నారు.. తాను ఆర్థికంగా ఎదుగుతున్నారు దీప్తి. బయో కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన దీప్తి.. టీచింగ్ మీద ఆసక్తి పెంచుకున్నారు దీప్తి. బంధువుల పిల్లలకు పాఠాలు చెబుతూ టీచింగ్ లో అనుభవం సంపాదించారు. ఆ అనుభవంతో పిల్లల కోసం ‘మిల్క్ టీత్ యాక్టివిటీ సెంటర్’ను బెంగళూరులోని చామరాజ్పేట్లో ప్రారంభించారు. పిల్లలకు పాఠాలు చెబుతూ, వృత్తి మీద ప్రేమ పెంచుకున్నారు. ఆ సమయంలోనే ఒక తల్లి పిల్లల్ని ఎలా పెంచాలనే విషయం మీద అవగాహన ఏర్పడింది దీప్తికి. పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటూ, వాళ్లకి ఏ విధంగా చెబితే అర్థమవుతుందో తెలుసుకున్నారు దీప్తి. ‘‘పసి వయసులో నేర్చుకున్న విద్య జీవితాంతం గుర్తుండిపోతుంది. అందులో నైపుణ్యం కూడా వస్తుంది’’ అంటారు దీప్తి. ఆటల్లోనే అన్నీ... పిల్లలకు బొమ్మలతో ఆటలు నేర్పుతూ, రంగులు, ఆకారాలు, పరిమాణాల గురించి కూడా నేర్పించటం దీప్తి ప్రత్యేకత. ‘‘మా అబ్బాయి చేతి రాత బాగుండేది కాదు. కాని మట్టితో బొమ్మలు చేయడం ద్వారా అందమైన రాత అలవాటయ్యింది. అంతకుముందు పెన్సిల్ సరిగ్గా పట్టుకోలేకపోయేవాడు. ఇలా మట్టితో ఆటలు మొదలుపెట్టాక, చేతి వేళ్లు, కండరాలు బలంగా తయారు కావడంతో పెన్సిల్ చక్కగా పట్టుకోగలిగాడు. చక్కగా రాయగలుగు తున్నాడు. టీచర్గా నాకున్న అనుభవం మా అబ్బాయిని పెంచుకోవటానికి ఉపయోగపడింది’’ అంటారు దీప్తి. అందరూ ఆసక్తి చూపించారు ‘‘నేను పిల్లల కోసం టాడ్లర్ క్లాసులు ప్రారంభించాను. ఆ క్లాసులో పిల్లలంతా మట్టితో బొమ్మలు తయారు చేస్తారు. పిల్లలు చేసిన బొమ్మలు చూసిన తల్లిదండ్రులు ఆ మట్టి గురించి సమాచారం అడిగారు’’ అంటూ ఆనందంగా చెబుతారు దీప్తి. సాధారణంగా మార్కెట్ లో దొరికే మట్టితో చేసిన బొమ్మలు చాలా త్వర గా ఎండిపోతాయి. ఆ మట్టి ని మళ్లీ ఇంక ఉపయోగించలేం. కాని దీప్తి.. ఉప్పు, పిండి, నూనె, ఫుడ్ గ్రేడ్ కలర్స్, నీళ్లు కలిపి తయారు చేసిన మట్టి ఆరునెలల వరకు గట్టి పడకుండా ఉంటుంది. ‘‘నేను చేసిన మట్టి చూసి తల్లిదండ్రులంతా చాలా సంతోషించారు. వాళ్లకి కూడా ఈ మట్టి కావాలి అని అడిగి కొని తీసుకు వెళ్తున్నారు’’అంటున్న దీప్తి 20 వేల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు నెలకు 35 వేలు సంపాదిస్తున్నారు. పిల్లలకు ఆరోగ్యంతోపాటు, తనకు ఆదాయం వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటారు దీప్తి భండారీ. -
ఇక్కడి బొమ్మలే కొందాం
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయులు స్థానిక బొమ్మలపై మక్కువ పెంచుకోవాలని, ఈ రంగంలోని వారంతా దేశీయ బొమ్మలకు ‘గొంతుక’ కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్లో వినియోగిస్తున్న బొమ్మల్లో దాదాపు 80 శాతం బొమ్మలను దిగుమతి చేసుకుంటున్నామని, వీటినే కొనడంతో వేలకోట్ల ధనం విదేశాలకు తరలిపోతోందని ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు. రూ.7.5 లక్షల కోట్ల విలువైన ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారత్ వాటా కేవలం రూ.11 వేల కోట్లమేరకే ఉందని ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం వర్చువల్ వేదికగా జరిగిన టాయ్కాథాన్–2021లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని ప్రసంగించారు. బొమ్మల ఆర్థిక వ్యవస్థ(టాయ్ ఎకానమీ–టాయ్కానమీ)లో భారత స్థానం మరింతగా మెరుగుపడాలని ఆయన అభిలషించారు. ఆట వస్తువుల తయారీ, గేమింగ్ పరిశ్రమల్లో ప్రపంచ విపణిలో భారత్ మరింత పురోగతి సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ‘ఈ పరిశ్రమ దేశీయంగా వృద్ధిచెందితే సమాజంలో ఈ రంగంపై ఆధారపడ్డ వర్గాలకు మేలు జరుగుతుంది. గ్రామీణులు, దళితులు, పేద ప్రజలు, గిరిజనుల భాగస్వామ్యంతో దేశీయంగా చిన్నతరహా ఆట వస్తువుల పరిశ్రమ కొనసాగుతోంది. ఈ రంగంలో మహిళల పాత్ర ఎంతో ఉంది. వీరందరి జీవితాలు మరింతగా వృద్ధిలోకిరావాలంటే మనందరం స్థానిక బొమ్మలనే కొందాం’అని మోదీ పిలుపునిచ్చారు. చదవండి: Narendra Modi: సహకారంతోనే సంస్కరణలు రేషన్ కార్డు దారులకు కేంద్రం శుభవార్త! -
నైకీ, హెచ్అండ్ఎం బ్రాండ్స్కు చైనా షాక్
బీజింగ్: వీగర్ ముస్లింల అణిచివేత అంశంలో చైనా వైఖరిని వ్యతిరేకిస్తున్న విదేశీ కంపెనీలను కట్టడి చేయడంపై డ్రాగన్ దేశం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో హెచ్అండ్ఎం, నైకీ, జారా తదితర విదేశీ బ్రాండ్స్ .. పిల్లలకు హానికరమైన బొమ్మలు, దుస్తులు మొదలైనవి దేశంలోకి దిగుమతి చేస్తున్నాయంటూ ఆరోపించింది. ఈ వారంలో అంతర్జాతీయ బాల కార్మికుల దినోత్సవం సందర్భంగా ఇలాంటి 16 కంపెనీలకు చెందిన టీ-షర్టులు, బొమ్మలు, టూత్బ్రష్షులు మొదలైన వాటిని ‘‘నాణ్యత, భద్రత పరీక్షలో అర్హత పొందని’’ ఉత్పత్తులుగా చైనా కస్టమ్స్ ఏజెన్సీ ఒక జాబితా తయారు చేసింది. వీటిని ధ్వంసం చేయడం లేదా వాపసు పంపడం చేస్తామని పేర్కొంది. అయితే, వివాదాస్పదమైన షాంజియాంగ్ ప్రావిన్స్ పరిణామాల గురించి గానీ, విదేశీ కంపెనీల విమర్శలను గానీ ఈ సందర్భంగా ప్రస్తావించలేదు. దుస్తులు, బొమ్మల్లో హానికారకమైన అద్దకాలు, ఇతర రసాయనాలు ఉన్నాయని మాత్రమే తెలిపింది. షాంజియాంగ్ ప్రావిన్స్లో వీగర్ ముస్లింలను అణిచివేస్తూ, వెట్టిచాకిరీ చేయిస్తోందంటూ చైనా ఆరోపణలు ఎదుర్కొంటోంది. అక్కడి ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల తమపైనా విమర్శలు వస్తుండటంతో హెచ్అండ్ఎం ఇకపై షాంజియాంగ్ ప్రావిన్స్లో ఉత్పత్తయ్యే పత్తిని తమ ఉత్పత్తుల్లో వినియోగించబోమంటూ ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రకటనతో ఆగ్రహించిన చైనా ఈ-కామర్స్ కంపెనీలు తమ ప్లాట్ఫామ్స్ నుంచి హెచ్అండ్ఎం ఉత్పత్తులను తొలగించాయి. ఆ కంపెనీతో పాటు నైకీ, అడిడాస్ వంటి ఇతర విదేశీ బ్రాండ్స్కి సంబంధించిన యాప్స్ను కూడా యాప్ స్టోర్స్ తొలగించాయి. అయితే తాజా పరిణామంపై నైక్, జారా, హెచ్ అండ్ ఎం ఇంకా స్పందించలేదు. -
Plastic Toys: అమ్మో ‘ప్లాస్టిక్ బొమ్మ’..
సాక్షి, న్యూఢిల్లీ: మీ చిన్నారులు ఎక్కువ సమయం బొమ్మలతో ఆడుకుంటున్నారా..? ఆటల్లో భాగంగా బొమ్మలను నోట్లో పెట్టుకోవడం వంటివి చేస్తున్నారా...? అయితే మీరు ఇప్పటికైనా పిల్లల అలవాట్లను మార్చాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే కరోనా కారణంగా ఏడాదిగా స్కూళ్ళకు తాళం పడడంతో, చదువులంతా ఆన్లైన్లో అయిపోయేసరికి రోజంతా చిన్నారులు ఇంట్లోనే ఉంటున్నారు. అయితే ఆన్లైన్ క్లాసులు అయిపోయిన తరువాత ఖాళీ సమయం టీవీ చూడడం, బొమ్మలు వారికి వినోదంగా మారాయి. అయితే చిన్నారులు ఎక్కువగా రోజంతా తమతో పాటే ఉంచుకొనే బొమ్మల విషయంలో ఇప్పుడు ప్రతీ ఒక్కరు జాగ్రత్త పడాల్సిందేనని నిపుణులు అంటున్నారు. అంతేగాక శిశువుల చేతికి ప్లాస్టిక్ బొమ్మలను అందించే మీ అలవాటును మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఆడుకొనే బొమ్మల విషయంలో నాణ్యతా ప్రమాణాలు ఏమేరకు ఉన్నాయనే విషయంలో ఆందోళన వ్యక్తమౌతూనే ఉంది. ఇదేమీ కేవలం మన దేశంలోని సమస్య మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు ఆడుకొనే ప్లాస్టిక్ బొమ్మలు, సాఫ్ట్ టాయ్స్ ఏ మేరకు సురక్షితం అనే విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక అంతర్జాతీయ అధ్యయనంలో, బొమ్మల తయారీలో వాడే రసాయనాల్లో సుమారు 100కు పైగా ప్రాణాంతకమైన రసాయనాలను వినియోగిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. హార్డ్, సాఫ్ట్, ఫోం బేస్డ్ ప్లాస్టిక్తో తయారుచేసిన బొమ్మల్లో సుమారు 419 రసాయనాలు లభించాయని డెన్మార్క్ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు పీటర్ తెలిపారు. వీటిలోని 126 రసాయనాల కారణంగా చిన్నారుల్లో క్యాన్సర్ వంటి అనేక వ్యాధులు వచ్చేందుకు కారణమయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. పిల్లలు ఉపయోగించే బొమ్మల్లో ఉండే ప్రాణాంతకమైన ఫ్లేమ్ రిటార్డెంట్ రసాయనంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు గతంలో ప్రకటించారు. ఈ ప్రమాదం చిన్నారులు ఇటీవల ఎక్కువగా ఆడుకొనే పాలిస్టర్ టన్నెల్తో కూడా ఉందని అధ్యయనం గుర్తించింది. పాలిస్టర్ టన్నెల్ తయారీలో వినియోగించిన మెటీరియల్లో ఫ్లేమ్ రిటార్డెంట్ రసాయనం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. వాణిజ్య, వినియోగదారు ఉత్పత్తులలో ఫ్లేమ్ రిటార్డెంట్ రసాయన వాడకం 1970 లో ఫ్లేమ్ ఎబిలిటీ స్టాండర్డ్తో ప్రారంభమైంది. అయితే మార్కెట్లో లభించే ఫ్లేమ్ రిటార్డెంట్ రసాయనంతో తయారైన అన్ని ఉత్పత్తులతో ఆరోగ్యపరంగా ప్రమాదం ఉండదని, ఈ రసాయనంతో క్లోరిన్, బ్రోమైడ్ , భాస్వరం రసాయనాలు కలిసి ఉన్న త్పత్తులతో ప్రమాదం ఉందని గుర్తించారు. ఫర్నిచర్, పిల్లల ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, భవన నిర్మాణ సామగ్రి, దుస్తులు, కారు సీట్లు , వాహనాల లోపలి భాగాల తయారీలో ఫ్లేమ్ రిటార్డెంట్ ఉంటుంది. ఈ ఉత్పత్తుల్లో ఉన్న రసాయనం నేరుగా చర్మంలోకి వెళ్ళే అవకాశం ఉండడంతో పాటు, దుమ్ములో పేరుకుపోవచ్చని తెలిపారు. ఒక పరిశోధనలో ఫ్లేమ్ రిటార్డెంట్ అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని పరిశోధకులు వెల్లడించారు. అంతేగాక బ్రోమినేటెడ్ రసాయనంతో క్యాన్సర్, హార్మోన్ల్లో తేడాలు, పునరుత్పత్తి వ్యవస్థలపై ప్రభావంతో పాటు న్యూరో డెవలప్మెంట్ సమస్యలు కూడా వస్తాయని పేర్కొన్నారు. కొద్దిమంది చిన్నారులపై నిర్వహించిన పరిశోధనలో ఈ రసాయనం కారణంగా పిల్లల్లో ఐక్యూ లెవల్స్ తగ్గుతాయని, పిల్లల ప్రవర్తన, వ్యవహార శైలిలో మార్పు వస్తుందని గుర్తించారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఒక పరిశోధనలో చిన్నారుల్లో ఐక్యూ నష్టానికి బ్రోమినేటెడ్ ఫ్లేమ్ అతిపెద్ద కారణమని తేలింది. అంతేగాక ఇది పిల్లల్లో మేధో వైకల్యాన్ని ప్రోత్సహిస్తుందని పరిశోధకులు గుర్తించారు. అంతేగాక ఇటీవల శిశువుల ఉత్పత్తులు, కౌచ్ల్లో క్లోరినేట్ ట్రీ రసాయనం ఉన్నట్లు కనుగొన్నారు. 40 ఏళ్ళ క్రితం మాన్యుఫాక్చరర్లు ఈ రసాయనాన్ని వాడటం మానేసినప్పటికీ, తరువాత దీనిని మళ్లీ ఉపయోగించడం ప్రారంభించినట్లు తాజా పరిశోధనల్లో తేలింది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యూసిఐ) 2019 లో దిగుమతి చేసుకున్న కొన్ని బొమ్మలను పరీక్షించింది. 121 రకాల బొమ్మలను పరీక్ష కోసం ల్యాబ్కు పంపగా, అందులో 66.90% బొమ్మలు పరీక్షల్లో ఫెయిల్కాగా, 33.1% బొమ్మలు మాత్రమే నాణ్యతా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాయి. పరీక్షలు జరిపిన బొమ్మలలో 30% ప్లాస్టిక్ బొమ్మలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని, వీటిలో సీసం వంటి హెవీ మెటల్ కంటెంట్ ఉందని గుర్తించారు. 80% ప్లాస్టిక్ బొమ్మలు మెకానికల్, ఫిజికల్ భద్రతా ప్రమాణాల విషయంలో విఫలమయ్యాయి. అంతేగాక రీసైకిల్ ప్లాస్టిక్తో చేసిన అన్ని బొమ్మలలో చిన్నారుల ఆరోగ్యానికి ప్రమాదకరమైన డయాక్సిన్ రసాయనం చాలా ఎక్కువగా ఉందని గుర్తించారు. బొమ్మలలో ఇది 690 ప్రతి గ్రాము టిఎఫ్క్యూ (టాక్సిక్ ఈక్వివలెంట్ కోషెంట్) ఉందని తేలింది. పిల్లలు తీవ్రమైన వ్యాధుల బారిన పడేందుకు కారణమైన బ్రోమినేటెడ్ డయాక్సిన్ రసాయనం సైతం ఈ బొమ్మల్లో ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. పిల్లలను ఎలా రక్షించాలి? ఈ రసాయనాల నుంచి పిల్లలను రక్షించేందుకు ప్లాస్టిక్ బొమ్మలు కొనడం తగ్గించడం తో పాటు, వారిని ప్లాస్టిక్ బొమ్మలకు దూరం గా ఉంచడమే సులభమైన మార్గం. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, విదేశాలలో ఉన్న పిల్ల లు ప్రతి సంవత్సరం సగటున 18.3 కిలోగ్రాముల ప్లాస్టిక్ బొమ్మలను కొనుగోలు చేయ డం కానీ జమ చేయడం కానీ చేస్తారు. అవస రాని కంటే ఎక్కువ బొమ్మలు కలిగి ఉన్న పిల్లలతో పోలిస్తే, తక్కువ బొమ్మలు ఉన్న పిల్లల్లో ఏకాగ్రత, సృజనాత్మకతలు గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. -
‘టాయ్బాక్స్ 3డీ ప్రింటర్’ అంటే ఏంటో తెలుసా?
‘దాదీ... నాకు బొమ్మ తేవాలి’ అని మన ముద్దుల పిల్లాడు అడిగాడే అనుకుందాం. ‘ఇప్పుడెక్కడ తేగలం’ అని రకరకాల సాకులు వెదుక్కుంటాం. ఇక ముందు అలాంటి పరిస్థితి రాదు. ఇంట్లోనే టీ, కాఫీలు చేసి ఇచ్చినట్లే బుజ్జి బుజ్జి బొమ్మలు తయారుచేసి పిల్లలకు ఇవ్వవచ్చు. ‘టాయ్బాక్స్ 3డీ ప్రింటర్’తో ఇది సాధ్యమవుతుంది. ఈ ప్రింటర్తో పాటు కేటలాగ్ కూడా ఇస్తారు. దీనిలో మనకు ఇష్టమైన బొమ్మలను, ఇష్టమైన రంగులతో టకటకా తయారుచేసుకోవచ్చు. దీనితోపాటు సొంతంగా డిజైన్లను రూపొందించుకొని వాటికొక రూపం కూడా ఇవ్వవచ్చు. ఈ బయోడిగ్రేడబుల్ ప్రింటర్ బరువు 3 కేజీలు, మన సంతోషం బరువు వంద కేజీలు! -
9 ఏళ్లకే మిలియన్ డాలర్ల సంపాదన
న్యూయార్క్ : తొమ్మిదేళ్ల వయసులో మనందరం ఏం చేస్తాం.. మహా అయితే స్కూల్కి వెళ్లడం.. ఇంటికి వచ్చాక స్నేహితులతో ఆడుకోవడం చేస్తుంటాం. కానీ అమెరికాకు చెందిన 9 ఏళ్ల ర్యాన్ కాజీ మాత్రం చిన్న వయసులోనే మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. వినడానికి ఆశ్యర్యకరంగా ఉన్నా ఇది మాత్రం నిజం. అసలు విషయంలోకి వెళితే.. ర్యాన్ కాజీ ..' ర్యాన్స్ వరల్డ్’ అనే పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. ఇందులో అతడు వివిధ బొమ్మలతో ఆడుకుంటూనే వాటిపై సమీక్ష నిర్వహిస్తాడు. అలా అతని చానల్కు 27 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అతడి సంపాదన చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. 2018లో అతడు యూట్యూబ్ ద్వారా 17 మిలియన్లు సంపాదించగా.. 2019లో అది 26 మిలియన్లకు చేరుకుంది. (చదవండి : ఇలా ప్రపోజ్ చేస్తే ఎవరైనా పడిపోవాల్సిందే) ఈ ఏడాది ఏకంగా 30 మిలియన్లు సంపాదించిన ర్యాన్ కాజీ వరుసగా మూడేళ్లలో అత్యధికంగా డబ్బులు పొందిన యూట్యూబర్గా నిలిచాడు . ఇటీవలే మిలియన్ డాలర్ల విలువైన నికెలోడియన్లో ఒక టీవీ సిరీస్ కోసం ర్యాన్కాజీ ఒక ఒప్పందంపై సంతకం చేయడం విశేషం. అంతేకాదు.. ర్యాన్ కాజీకి, అతడి తల్లిదండ్రులకు కలిపి మొత్తం తొమ్మిది యూట్యూబ్ చానల్స్ ఉండగా.. అన్నింటికీ మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ర్యాన్ కాజీ అమెరికాలో సెన్సేషనల్ స్టార్గా మారిపోయాడు. ఈ బుడ్డోడు నిజంగా జీనియస్ అంటూ అతనిపై ప్రశంసలు వస్తున్నాయి. -
బొమ్మల షాపులో మహిళపై దారుణం
ముంబై : షాపులో బొమ్మలు కొందామని వచ్చిన మహిళను దారుణంగా చంపడమే గాక అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలోని నలాసోపారాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. 32 ఏళ్ల మహిళ తన భర్త, పిల్లలతో కలిసి నలాసోపారాలో నివసిస్తుంది. ఆమె భర్త పాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కాగా జూన్ 26న పిల్లలకు బొమ్మలు కొందామని వెళ్లిన సదరు మహిళ తిరిగిరాలేదు. దీంతో ఆమె భర్త తులింగ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు వివరాలు సేకరించి మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.( పరారీలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర!) అయితే జూన్ 28న నలాపోపారాలోని చందన్నకా రోడ్ వెంబడి పార్క్ చేసి ఉన్న కారులో అనుమానాస్పద స్థితిలో ఒక మహిళ మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తన భార్య కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసిన మహిళ భర్తను వెంటబెట్టుకొని పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ వ్యక్తి మృతదేహాన్ని పరిశీలించి చూడగా ఆ మృతదేహం తన భార్యదేనని పేర్కొన్నాడు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించగా సదరు మహిళ హత్యకు గురవ్వడమే గాక అత్యాచారం చేయబడిందని రిపోర్టులో తేలింది. దీంతో కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు పాల్గర్ సీడీఐ సహాయంతో విచారణ ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా ఆ వాహనం అక్కడే పార్క్ చేసి ఉంటుందని అక్కడి స్థానికులు విచారణలో పేర్కొన్నారు. పక్కనే ఉన్న సీసీటీవీ ఫుటేజీ సహాయంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.(రోజు కూలీపై ఆస్పత్రి యాజమాన్యం దాడి) జూన్ 26 న ఆ వ్యాన్ పార్క్ చేసిన ప్రదేశంలో పక్కనే ఉన్న ఒక టాల్స్టాయ్ షాపుకు మహిళ వెళ్లినట్లు సీసీటీవీలో కనిపించింది. ఆ తర్వాత ఆమె ఆచూకి లభించకపోవడంతో పోలీసుల అనుమానం బలపడి షాపు యజమానిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో షాపు యజమాని ఆ మహిళను హత్య చేసింది తానేనని ఒప్పుకున్నాడు.' జూన్ 26న సదరు మహిళ తన షాపుకు వచ్చింది. బొమ్మలు కొనే విషయంలో వాగ్వాదం తలెత్తడంతో క్షణికావేశంతో ఆమె జుట్టు పట్టుకొని గదిలోకి ఈడ్చుకుపోయి మెడమీద చేతులు పెట్టి చంపేశాను. అనంతరం ఆమెను శారీరకంగా అనుభవించాను. ఒక రాత్రంతా మహిళ శవంతోనే గడిపి తర్వాత ఆమె మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి పక్కనే పార్క్ చేసి ఉన్న వాహనంలోకి విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయాను.' అంటూ పేర్కొన్నాడు. కాగా నిందితునిపై లైంగిక దాడి కేసుతో పాటు మర్డర్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
బతుకు.. బొమ్మలాట
జీవకళ తొణికిసలాడే మట్టి బొమ్మలవి. ఇంటికి అందాన్నిచ్చే ఆకృతులవి. కళాకారుల కుటుంబాల ఆకలి తీర్చే కళారూపాలవి. వాటిని నమ్ముకున్న బతుకులకు కరోనా దెబ్బ కొట్టింది. రాష్ట్రాలు దాటి వచ్చిన రాజస్థానీ కళాకారుల్ని పస్తులుంచుతోంది. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి బొమ్మల వ్యాపారం మూతపడింది. ఒక్కటంటే.. ఒక్కటి కొనేవారు లేక.. ఆదాయం రాక.. ఆకలి తీరక అవస్థలు పడుతున్న రాజస్థానీ కళాకారుల దీనగాథ ఇది. రామభద్రపురం: రాజస్థాన్కు చెందిన చున్నీలాల్ కుటుంబ సభ్యులు పది మంది, బచనారామ్ కుటుంబ సభ్యులు ఆరుగురు రెండేళ్ల క్రితం రామభద్రపురం మండల కేంద్రానికి వలస వచ్చారు. స్థానిక ప్రభుత్వ పశువైద్యశాల వెనుకనున్న ఓ ప్రైవేట్ ఖాళీ స్థలంలో చున్నీలాల్ కుటుంబం, బైపాస్లోని విశాఖ డెయిరీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో బచనారామ్ కుటుంబ సభ్యులు గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా ఆకర్షణీయమైన బొమ్మలు చేసి, విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. లాక్డౌన్కు ముందు రోజూ రూ.2వేల వరకూ వ్యాపారం సాగింది. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత వీరి వ్యాపారం పూర్తిగా పడిపోయింది. ఒక్కటంటే ఒక్క బొమ్మను అమ్ముకోలేకపోయారు. తయారు చేసిన బొమ్మలన్నీ అలాగే ఉండిపోయాయి. సాధారణంగా వీటిని దిగుమతి చేసుకునేందుకు అప్పు చేస్తుంటారు. బొమ్మల తయారీకి అనంతపురం, బళ్లారి, బెంగుళూరుకు వెళ్లి అవసరమైన ముడిసరుకును తెచ్చుకుంటారు. ప్రస్తుతం విక్రయాలు నిలిచిపోవడంతో ఆర్థికంగా వీరంతా చితికిపోయారు. కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు నెలలుగా వ్యాపారాలు లేకపోవడంతో తినడానికి తిండిలేక నానా అవస్థలు పడుతున్నారు. రామభద్రపురం విశాఖ డెయిరీ ఎదురుగా ఉన్న గుడారంలో ఖాళీగా బచనారామ్ కుటుంబం దాతల కోసం ఎదురుచూపు చున్నీలాల్కు ఎనిమిది మంది పిల్లలు ఉండగా వారిలో ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల లాక్డౌన్ సమయంలో ఒక కుమారుడికి పచ్చకామెర్లు సోకింది. వైద్యం కోసం చుట్టుపక్కల ఉన్న దాతలు కొంతమంది డబ్బులు సేకరించి ఇచ్చి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి్పంచి వైద్యం అందించినా ఫలితం లేక మృతి చెందాడు. మిగిలిన పిల్లలంతా ఇక్కడ బతకలేక వేరే ప్రాంతానికి వలస వెళ్లిపోయారు. ఇక్కడ చున్నీలాల్ అతని భార్య, ఒక కుమారుడు ఉన్నారు. వారికి ఒక్క పూట కూడా తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. దాతలు సహాయం చేసి ఆదుకోమని వేడుకుంటున్నారు. దాతల సాయం కోసం నిరీక్షణ లాక్డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలను పలు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు, అధికారులు ఆదుకున్నారు. ఈ క్రమంలోనే రాజస్థానీయులకూ సరుకులు అందజేశారు. వారు నివాసం ఉన్న ప్రాంతంలో ఉన్న వారు కూడా ఎంతో కొంత డబ్బులు సేకరించి ఇచ్చి ఆదుకున్నారు. ఇప్పుడు నిత్యం సరుకుల పంపిణీ లేక, దాతలు ఆదుకోక, వ్యాపారాలు సాగక రెండు రాజస్థానీ కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పస్తులుంటున్నాం లాక్డౌన్ కారణంగా నాలుగు నెలలుగా వ్యాపారాలు జరగడం లేదు. చేతిలో డబ్బు లేదు. కుటుంబ పోషణ తీవ్ర ఇబ్బందిగా మారింది. లాక్డౌన్ కాలంలో అధికారులు సరుకులను ఇచ్చారు. ఇప్పుడు తిండి లేక పస్తులతో పడుకుంటున్నాం. – చున్నీలాల్, రాజస్థానీ కళాకారుడు, రామభద్రపురం వ్యాపారం పడిపోయింది తయారు చేసిన బొమ్మలు చుట్టుపక్కల పల్లెలకు తీసుకెళ్లి అమ్ముకొని వచ్చేవాళ్లం. ప్రస్తుతం కరోనా కారణంగా ఊళ్లలోకి కొత్తవాళ్లని రానివ్వకపోవడంతో పాటు బొమ్మలు ఎవరూ కొనుగోలు చేయడం లేదు. దీంతో వ్యాపారం పూర్తిగా నిలిచిపోయి, కుటుంబ పోషణ భారమైంది. ఇప్పటికి రూ.20 వేలు అప్పు చేశాం. ఇంకా ఎవరూ అప్పులు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా ఉంది. – బచనారామ్, రాజస్థానీ, రామభద్రపురం -
వినోదం.. విజ్ఞానం.. విలువైన పాఠం
సాక్షి, బేస్తవారిపేట : పురాణేతిహాసాలు.. పర్యావకరణ పరిరక్షణ.. వివిధ రాష్ట్రాల ఆచారాలు.. వేషభాషలు.. పండుగుల ప్రాధాన్యత.. ఇలా సమస్త విషయాలను ఒక గదిలో కళ్లకు కట్టినట్లు చూపే ఘట్టాలు బొమ్మల కొలువులో మాత్రమే ఆవిష్కృతమవుతాయి. దసరా పండుగ వైశిష్ట్యాన్ని ఘనంగా చాటే ఈ వేడుకను జిల్లాలోని పలు చోట్ల భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. విజ్ఞాన వినోదాలను సమపాళ్లలో అందించే బొమ్మల కొలువు సంప్రదాయాన్ని నియమనిష్టలతో పాటిస్తున్న వారందరూ ఇప్పటి తరం వారికి మన సంస్కృతిని మరచిపోకుండా కాపాడుకుంటూ రెండు తరాల వారధిగా నిలుస్తున్నారు. కొలువు.. సులువు కాదు ఒకప్పుడు దసరా వస్తోందంటే ఇంటింటా అందమైన బొమ్మలు కొలువుదీరేవి. వినోదంతోపాటు విజ్ఞానాన్ని పంచేవి. బొమ్మల కొలువును తీర్చిదిద్దడం అంత సులువైన పని కాదనేది అందరూ ఒప్పుకునే సత్యం. ఎక్కువ మొత్తంలో కొనుక్కోవడం, వాటిని జాగ్రత్తగా పదిలపరచడం అవసరం. భవిష్యత్తు తరాల వారికి పాత సంప్రదాయాలను అందించాలన్న ఉద్దేశంతో పాతతరం వారు బొమ్మల కొలువును ఇప్పటికీ అందంగా అందిస్తున్నారు. కొన్ని చోట్ల దసరా పండుగను కలిసికట్టుగా ఆనందోత్సాహాల మధ్య నిర్వహిస్తూ మళ్లీ పాత వైభవాన్ని గుర్తు చేసుకుంటున్నారు. బొమ్మల కొలువు సంప్రదాయం అనాదిగా వస్తున్న బొమ్మల కొలువు సంప్రదాయం వెనుక అనేక కారణాలున్నాయి. పూర్వం లలితకళల్లో ప్రధానమైన శిల్పకళను ప్రోత్సహించడానికి, జీవకళతో ఉట్టిపడే కళారూపాలను తయారు చేసే కళాకారులను బతికించడానికి అందరి చేత బొమ్మలు కొనిపించేవారు. సినిమాలు, టీవీలు లేని రోజుల్లో బొమ్మల కొలువు ద్వారా పురాణాల్లోని కథలను, విజ్ఞాన విషయాలను చిన్నారులను దగ్గర కూర్చోబెట్టుకుని పదిరోజులపాటు వీలు దొరికినప్పుడల్లా తెలియజేసేవారు. ఇవన్నీ ఇలా ఉంటే ముత్తయిదువులు, చిన్నారులకు బొమ్మలకొలువు ముందు నిత్యం తాంబూలాలు ఇవ్వాలనే సంప్రదాయం కూడా బాంధవ్యాలను మరింత దగ్గర చేసేది. కాలక్రమంలో బొమ్మల కొలువులు పెట్టే వారు తగ్గిపోయారు. -
మొక్కజొన్న బాల్యం
ఆ ఇంటి పై కప్పు నుంచి వెలువడిన చిక్కటి పొగ ఆకాశంలో దట్టమైన మేఘాలను సృష్టిస్తోంది. అప్పటికే అలుముకున్న చిక్కటి మంచు దుప్పటిని చీల్చుకుంటూ ప్రయాణిస్తోంది పొగ. ఇంట్లో ఎంత భారీ వంటలు వండితే ఇంత చిక్కటి పొగ ఇంత సేపు వస్తుంది? ఎంతమందికి వండుతున్నారు? పెళ్లి వంటి వేడుక ఉందేమో, విందు కోసం పెద్ద ఎత్తున వంటలు చేస్తున్నారేమో అనిపిస్తుంది ఆ పొగను చూస్తుంటే. మణిపూర్లోని సాంగ్సాంగ్ గ్రామస్థులకు అది రోజూ అలవాటైన దృశ్యమే. ఆ ఇల్లు నెలీ చాచియాది. బొమ్మల ‘కర్మాగారం’ ఆ పొగ వస్తున్న ఇల్లు నెలీ చాచియా బొమ్మలిల్లు. నిజమే. బొమ్మరిల్లు కాదు బొమ్మలిల్లే. ఆ ఇంట్లో నెలీ చాచియా బొమ్మలు తయారు చేస్తుంది. దాదాపుగా అన్నీ చేతిలో పూలబుట్ట పట్టుకున్న మోడరన్ యువతి బొమ్మలే. ఆ బొమ్మలకు ముడిసరుకు మొక్కజొన్న పంట వ్యర్థాలే. అది ఆమె బొమ్మల కార్ఖానా. నెలీ ఆడుతూపాడుతూ బొమ్మలు చేస్తుంది. ఆ బొమ్మలను పిల్లల కోసం అమ్ముతుంది. నెలకు కనీసంగా 45 వేలు సంపాదిస్తోంది. రోజంతా వర్క్ స్టేషన్లో గడిపితే పన్నెండు బొమ్మలు చేస్తుందామె. బొమ్మ డిజైన్ను బట్టి మార్కెట్లో రెండు నుంచి ఐదు వందల ధర పలుకుతుంది. ఉద్యోగాలు దొరకట్లేదని, ఉపాధికి మార్గాల్లేవని నిరాశ పడకూడదంటారు నెలీ. ‘ప్రకృతిలో ప్రతిదీ అవసరమైన వస్తువే, ప్రతి వస్తువూ అందమైనదే. మన దృష్టి కోణం సృజనాత్మకమైనదైతే ఆ వస్తువులో సౌందర్యాన్ని చూడగలుగుతాం. మనసు పెట్టి పని చేస్తే... ఆ పనే మనకు ఆలంబన’ అంటారామె. డబ్బుంటే అబ్బేది కాదేమో నెలీ చాచియా బొమ్మలు తయారు చేయడాన్ని వృత్తిగా మలుచుకోవడానికి బీజం పడిన చిన్నప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ‘‘నా చిన్నప్పుడు తోటి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లినప్పుడు అందరి దగ్గరా బొమ్మలుండేవి. అందరూ ఆటలకు తమ బొమ్మలు తెచ్చేవాళ్లు. ఆ బొమ్మలన్నీ ఒక చోట చేర్చి ఆడుకునే వాళ్లం. నాకు బొమ్మలు కొనడానికి అమ్మ దగ్గర డబ్బులుండేవి కాదు. అందరి దగ్గరా బొమ్మలున్నాయని, నాకూ కొనివ్వమని బాగా మారాం చేసి ఏడ్చాను. అప్పుడు మా అమ్మ... మొక్కజొన్న కండెలు, పొట్టు, ఆకులతో బొమ్మ చేసిచ్చింది. బొమ్మ ఎలా చేయాలో నేర్పించి, ఎన్ని రకాల బొమ్మలు కావాలో అన్నీ చేసుకోమన్నది. అప్పటి నుంచి రకరకాలుగా బొమ్మలు చేసుకుని ఆటలకు తీసుకెళ్లేదాన్ని. నా బొమ్మలకు క్రేజ్ కూడా పెరిగింది. పెద్దయిన తర్వాత నా చేతిలో ఉన్న కళనే ఉపాధిగా మార్చుకుంటే బాగుంటుందనిపించింది. అలా 2000వ సంవత్సరంలో బొమ్మల తయారీ యూనిట్ ప్రారంభించాను. తర్వాత కొన్నేళ్లకు పిల్లలకు, మహిళలకు బొమ్మల తయారీలో శిక్షణ ఇవ్వడం కూడా మొదలుపెట్టాను. ‘ఇలా అందరికీ నేర్పిస్తూ పోతే నీ పరిశ్రమ నడిచేదెలాగ’ అన్నారు స్నేహితులు. నేర్పించడంలో నా ఉద్దేశం... ప్రతి ఒక్కరిలో ‘మన ఎదుట ఉన్న ఎందుకూ పనికిరావనుకున్న వస్తువులతో అందమైన రూపాన్ని తయారు చేయవచ్చ’నే ఊహకు జీవం పోయడమన్నమాట. నా దగ్గర నేర్చుకున వాళ్లు... నేను నేర్పిన మెళకువలకు తమ క్రియేటివిటీని జోడించి, వాళ్లకు అందుబాటులో ఉన్న మెటీరియల్తో మరింత ఆకర్షణీయమైన బొమ్మలు చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్లో అంతర్లీనంగా ఉన్న కళ బయటికొస్తుంది. నా బొమ్మలన్నీ పర్యావరణానికి ఏ మాత్రం హాని కలిగించని ఎకో ఫ్రెండ్లీ బొమ్మలే. పర్యావరణానికి హాని కారకమైన వస్తువుల వినియోగంలో తొలి వరుసలో ఉన్నది పిల్లల ఆట బొమ్మలే. వాటి స్థానాన్ని ఎకో ఫ్రెండ్లీ బొమ్మలతో భర్తీ చేయాలనేది నా కోరిక’’ అంటారు నెలీ చాచియా. మణిపూర్ రాజధాని నగరంలో ఇంఫాల్లో ఒక స్టోర్ తెరిచారామె. తాను మాత్రం ఎక్కువ రోజులు సొంతూరు సాంగ్సాంగ్ లోని బొమ్మల పరిశ్రమలోనే పని చేస్తారు. బొమ్మల పరిశ్రమకే కాదు ఏ పరిశ్రమ అయినా మణిపూర్ బొమ్మ ‘‘ఇండియన్ ఫ్లవర్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్లు సంయుక్తంగా 2007లో న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఇంటర్నేషనల్ ఫ్లోరా ఎక్స్´ ో నిర్వహించాయి. ఆ ఎక్స్పోలో పాల్గొనడం నాకు పెద్ద టర్నింగ్ పాయింట్. అప్పటినుంచి నెలీ చాచియా మణిపూర్ దాటి బయటి ప్రపంచానికి తెలిసింది. నా మొక్కజొన్న బొమ్మల స్టాల్ కోసం అనేక ఎగ్జిబిషన్ల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయి. విదేశాల్లో కూడా మన మొక్కజొన్న బొమ్మలకు మంచి ఆదరణ లభిస్తోంది’’.– నెలీ చాచియా, ఎకో ఫ్రెండ్లీ బొమ్మల పరిశ్రమ నిర్వహకురాలు మొక్కజొన్న మెరుపుతీగలు మొక్కజొన్న కంకిని కప్పి ఉంచే ఆకులు, ఆకులకు గింజలకు మధ్య ఉండే పట్టులాంటి మృదువైన దారాలు, గింజలు ఒలిచిన కండెలు, గింజలను మర పట్టినప్పుడు వచ్చే పొట్టు ఆమె బొమ్మలకు ముడిసరుకులు. పొట్టును తడిపి బొమ్మ తల, దేహం ఆకారాల్లో మలిచి ఆరబెట్టాలి. మొక్కజొన్న ఆకులను బొమ్మలకు దుస్తుల్లా కట్టాలి. మృదువైన దారాలను తల మీద అమరిస్తే చక్కటి హెయిర్స్టయిల్తో మోడరన్ యువతి బొమ్మ రెడీ. నెలీ ఫ్లోరిస్ట్ కూడా కావడంతో ఆమె బొమ్మల్లో డ్రై ఫ్లవర్స్ పూలబుట్టలు కూడా ప్రధానంగా కనిపిస్తాయి. సరే... యజమాని వర్క్స్టేషన్ను వదిలి షో రూమ్లో కూర్చోవడం మొదలు పెడితే ఇక అప్పట్నుంచి పరిశ్రమ తిరోగమనం మొదలైనట్లే అంటారామె. – మంజీర -
బార్బీకి పోటీగా ఫియర్లెస్ గర్ల్
బార్బీ ప్లేస్లోకి ‘ఫియర్లెస్ గర్ల్’ అనే కొత్త బొమ్మ రాబోతోందా! బార్బీ నాజూకుగా ఉంటుంది. ‘ఫియర్లెస్ గర్ల్’ స్ట్రాంగ్గా ఉంటుంది. అమ్మాయిలు స్ట్రాంగ్గా ఉండడం ఇప్పడు ‘కొత్త నాజూకు’ కాబట్టి.. రాబోయే రోజుల్లో ఫియర్లెస్ గర్ల్నే అంతా ఇష్టపడబోతున్నారా? మరేం పర్వాలేదు. పాత బొమ్మ ప్లేస్లోకి కొత్త బొమ్మ వచ్చినా కొత్తగా మారబోయేదేం ఉండదు. బార్బీలో ఇన్బిల్ట్గా ఫియర్లెస్నెస్ ఉంటుంది కనుక రెండు బొమ్మలూ ఒకటే. రెండు బొమ్మలూ ఇచ్చే ఇన్స్పిరేషన్ ఒక్కటే. చాయిస్ మాత్రం మీ అమ్మాయిదే. రెండూ కావాలి అంటే రెండూ కొనివ్వొచ్చు. మార్చి 7. మార్చి 8. మార్చి 9. చరిత్రలో ఈ మూడూ మూడు ముఖ్యమైన రోజులు. మూడూ మూడు మహిళా దినోత్సవాలు. మూడూ ఈ మధ్యనే వచ్చి వెళ్లిపోయాయి. మార్చి ఎనిమిది.. తెలిసిందే. హిస్టారిక్ డే. అండ్.. హిస్టారికల్ డే కూడా. మార్చి ఏడు, మార్చి తొమ్మిది కూడా అలాంటివే. అయితే అవి పెద్దగా సెలబ్రేట్ అవలేదు. మార్చి ఏడైతే అసలు వచ్చి వెళ్లినట్లే ఎవరికీ తెలీదు. ఏంటి మార్చి 7కు ఉన్న ప్రత్యేకత? ‘ఫియర్లెస్ గర్ల్’ పుట్టిన రోజు. అవును. భయమన్నదే లేని పిల్ల బర్త్డే ఆ రోజు. ఆరో ఏడో ఏళ్లుంటాయి. పొట్టి గౌన్లో ఉంటుంది. కాళ్లకు బూట్లు ఉంటాయి. జుట్టు రబ్బరు బ్యాండుతో ముడివేసి ఉంటుంది. నడుం మీద చేతులు పెట్టుకుని నిలబడి, తల కాస్త పైకి ఎత్తి చూస్తుంటుంది. సర్దార్ పాపారాయుడు (1980) సినిమాలో ఎన్టీఆర్లో కనిపించే ‘ఫియర్లెస్నెస్’ లాంటి ఫియర్లెస్నెస్ ఆ గర్ల్లో కనిపిస్తుంటుంది.స్త్రీ శక్తిని తక్కువగా అంచనా వేస్తాం మనం. మనలాంటివాడే.. ‘సర్దార్ పాపారాయుడు’లో మోహన్ బాబు. పాపారాయుడు శక్తిని తక్కువగా అంచనా వేస్తాడు. పాపారాయుణ్ణి ఎంత తేలిగ్గా షూట్ చేసి, డెడ్బాడీ తేవచ్చో డీటెయిల్డ్గా చెప్తాడు. మోహన్బాబు బ్రిటిష్ దొరబాబు. ఎన్టీఆర్ అతడి టార్గెట్.‘‘వాణ్ణి కాల్చడం అంత సులభం కాదు సర్’ అని ఇండియన్ ఏజెంట్ ఒకడు అంటే.. ‘‘ఇన్సల్ట్’’ అని పెద్దగా అరుస్తాడు ఆ ఏజెంట్ మీద మోహన్బాబు.‘‘ఏమీ.. వాడేమి అల్లూరి సీతారామా రాజా, ఆజాద్ చంద్రశేఖరా, భగత్సింగా, సుభాస్ చంద్రబోసా.. ఆఫ్ట్రాల్ పప్పారాయుడు. చెట్టు పక్కన నక్కి పిట్టను కొట్టినట్టు కొట్టేయండి. తుపాకీ చేత్తో పట్టుకోండి. వేలు నొక్కండి. గుండు బయటికొస్తుంది. గుండెల్లోనుంచి దూసుకుపోతుంది. దట్సాల్. గిలగిలా తన్నుకు ఛస్తాడు. అండర్స్టాండ్? శవాన్ని నా దగ్గరకు తీసుకురండి. గెట్టావుట్’’ అంటాడు. అంతా వెళ్లిపోతారు. మోహన్బాబు ఒక్కడే బంగళాలో మిగిలిపోతాడు. అప్పుడొస్తాడు పాపారాయుడు అదే బంగళాలోని పై ఫ్లోర్లోంచి.. కిందికి ఒక్కో మెట్టూ దిగుతూ! ఉలిక్కిపడతాడు మోహన్బాబు.. ఒక్కో మెట్టూ వెనక్కు దిగుతూ. అంతకు ముందెప్పుడూ పాపారాయుడిని చూసి ఉండడు అతడు. ‘‘హు ఆర్ యు.. నీవెవరు? నీ పేరేమి? వాటీజ్ యువర్ నేమ్’’ అంటాడు. చెప్తాడు ఎన్టీఆర్. ‘‘ఓహ్.. పప్పారాయుడు’’ అని బెదిరిపోతాడు మోహన్బాబు. తన స్టెయిల్లో నవ్వుతాడు ఎన్టీఆర్. ‘‘ఏ! పేరు వినగానే పిస్తోలు జారిపోయిందా? ఊ. తీసుకో. వేలుతో నొక్కు. హె. గుండు బయటికొస్తుంది. గుండెల్లోనుంచి దూసుకుపోతుంది. ఊ.. తీసుకో. తీసుకో’’ అంటాడు ఎన్టీఆర్. ‘‘ఎ.. నువ్వెందుకొచ్చావిక్కడికి?’’ అంటాడు.‘‘నువ్వు చచ్చేముందు పాపారావు ఎలా ఉంటాడో చూచి తరిస్తావని’’ అంటాడు ఎన్టీఆర్.‘‘ఓ.. గుడ్ పర్సనాలిటీ. ఓ.. బెస్టాఫ్ లక్. గో.. గో.. ప్లీజ్ గో.. వెళ్లూ..’ అంటాడు.‘‘పిరికిపంద. కుక్కను కాల్చినట్టు కాల్చి శవాన్ని తీసుకు రమ్మన్నావ్. నీ కళ్ల ముందుకు వచ్చినవాణ్ణి పొమ్మంటున్నావ్. ఏ.. భయమా?’’ అంటాడు ఎన్టీఆర్.‘‘నీ చెవులు వైర్లెస్. నీ చూపులు కేర్లెస్. నీ మాటలు ఫియర్లెస్’’ అంటాడు మోహన్బాబు. పాపారాయుడులోని సేమ్ ఆ కేర్లెస్నెస్, ఫియర్లెస్నెస్ ఈ పాప.. ‘ఫియర్లెస్ గర్ల్’లో కనిపిస్తుంటాయి. న్యూయార్క్లోని ‘బౌలింగ్ గ్రీన్’ పబ్లిక్ పార్క్లో అలా నిలబడి ఉంటుంది. పాప ఎదురుగా వాల్స్ట్రీట్ బుల్ (ఎద్దు) ఉంటుంది. ‘చూసుకుందాం రా..’ అని ఆ బుల్ని సవాల్ చేస్తున్నట్లుగా ఉంటుంది. ఆమె కాళ్ల దగ్గర చిన్న గుండ్రటి పళ్లెం లాంటి శిలాఫలకం ఉంటుంది. ‘నో ద పవర్ ఆఫ్ ఉమెన్ ఇన్ లీడర్షిప్. షి మేక్స్ ఎ డిఫరెన్స్’ అని ఆ ఫలకంపై రాసి ఉంటుంది. ‘మహిళా నాయకత్వ శక్తి గురించి తెలుసుకోండి. తన సత్తా ఏమిటో చూపిస్తుంది’.. అని. 50 అంగుళాల పొడవు, 110 కిలోల బరువు ఉన్న ఈ ‘ఫియర్లెస్ గర్ల్’ కంచు విగ్రహాన్ని ‘స్టేట్ స్ట్రీట్ గ్లోబల్ అడ్వైజర్’ (ఎసెస్జీఏ) అనే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ తయారు చేయించి అక్కడ పెట్టించింది. ఆస్తుల విలువను అంచనా వెయ్యడంలో ఎసెస్జీఏ ఎక్స్పర్ట్. మహిళలు లీడ్ చేసే కంపెనీల ఆస్తుల విలువ త్వరగా, స్థిరంగా పెరగడం ఆ కంపెనీ గమనించింది. అయితే ఎలా ఆ విషయాన్ని ఇండికేట్ చెయ్యడం? మామూలు విలువను గ్రాఫ్లో చూపించవచ్చు. మరి మహిళా శక్తిని? స్టాచ్యూలో చూపించారు. ఆ స్టాచ్యూనే ‘ఫియర్లెస్ గర్ల్’. 2017 మార్చి 7న స్టాచ్యూని ప్రతిష్టించారు. వందేళ్ల నాటి మహిళా పోరాటాల్లోంచి వచ్చిన మార్చి 8 ఎక్కడ? రెండేళ్ల క్రితమే పుట్టిన ఈ ఫియర్లెస్ పాపాయి ఎక్కడ? ఆ ప్రశ్నే అక్కర్లేదు. మార్చి ఎనిమిది అనే రోజును విగ్రహంలా చెక్కితే.. ‘ఫియర్లెస్ గర్ల్’ రూపమే వస్తుంది. మహిళలు నిర్భయంగా చేసిన పోరాటాలు, లేవదీసిన ఉద్యమాలు, నడిపించిన విప్లవాలు.. వీటన్నిటికీ సరిగ్గా సరిపోయే సింబాలిక్ వర్చ్యూ, స్టాచ్యూ.. ఫియర్లెస్ గర్ల్. ఇప్పుడీ గర్ల్ పవర్ ఎలా విస్తరించబోతోందో చూడండి. ఆడపిల్లలు ఉన్న ఇళ్లల్లో బార్బీడాల్ ప్లేస్లోకి ఫియర్లెస్ గర్ల్ డాల్స్ రాబోతున్నాయి. అయితే డాల్స్లా కాదు. చిట్టిపొట్టి స్టాచ్యూల్లా! కోర్టులో కేసు నడుస్తోంది. అది క్లియర్ అయితే హైదరాబాద్కి, ఆంధ్రా కేపిటల్కీ వచ్చేస్తుంది ఫియర్లెస్ గర్ల్. మనమూ ఒకటి కొనొచ్చు. మన అమ్మాయి బర్త్డేకి గిఫ్ట్గా ఇవ్వొచ్చు. ఫియర్లెస్ గర్ల్ స్టాచ్యూని చేయించింది ఎసెస్జీఏ అయితే, చేసింది క్రిస్టన్ విస్బెల్ అనే అమెరికన్ మహిళ. ఫియర్లెస్ గర్ల్ నమూనాలను ఇప్పటికే ఆమె ఇద్దరు ముగ్గురికి కానుకగా ఇచ్చారు. అయితే ‘మీకా హక్కులేదు’ లేదని ఎసెస్జీఎ కేసు వేసింది. ‘ఫియర్లెస్సెన్ మనిషి జన్మహక్కు. ఎవరి దగ్గరైనా ఆ స్టాచ్యూ ఉండొచ్చు’ అని విస్బెల్ వాదన. అయితే మనిషి జన్మహక్కు కాదు. స్త్రీ జన్మహక్కు. మరి మగవాడికి? స్త్రీని భయపెట్టడం తన జన్మహక్కు అనుకుంటుంది కదా పురుష ప్రపంచం? ఆ ప్రపంచాన్ని హద్దుల్లో ఉంచడానికే ఫియర్లెస్ గర్ల్ స్టాచ్యూ. మార్చి 8 ఉమెన్స్ డే. మార్చి 7 ఫియర్లెస్ గర్ల్ బర్త్ డే. మరి మార్చి 9? బార్బీడాల్ పుట్టినరోజు. బార్బీకి అరవై ఏళ్లొచ్చాయి మొన్న తొమ్మిదికి. మొదట్లో బార్బీ వట్టి మమ్మీ డాల్. మన చిన్నప్పుడు ఆడపిల్లలు ఆడుకునేవాళ్లు కదా.. చిన్న పాపాయిని చంకలో ఎత్తుకుని ఉన్న చిన్నారి బొమ్మతో. అలాంటి బొమ్మ.. బార్బీ డాల్. అయితే ఇండిపెండెంట్ బొమ్మ. చేతిలో పాపాయి ఉండదు. అలాగని తను పాపాయీ కాదు. ఉమన్. ఆ ఉమన్ అరవై ఏళ్లుగా ఆడపిల్లల చేతిలో పాపాయి అయింది. ఫస్ట్ ఫస్ట్ బార్బీ క్యూట్ ఉమన్, స్వీట్ ఉమన్, స్విమ్ సూట్ ఉమన్. స్త్రీని ఇలాగేనా చూపించడం అని మధ్యలో ఎవరో క్వశ్చన్ చేశారు. పాయింటే. వెంటనే ఫ్యాషన్ మోడల్గా ఉన్న బార్బీ రోల్ మోడల్ అయింది. సెలబ్రిటీ అయింది. ఆస్ట్రోనాట్ అయింది. సి.ఇ.వో. అయింది. జర్నలిస్ట్ అయింది. ఇంజినీర్ అయింది. ఎయర్హోస్టెస్ అయింది. లోకంలో ఎన్ని టఫ్ ప్రొఫెషన్స్ ఉంటాయో అన్నీ అయింది. ఆఖరికి అమెరికన్ ప్రెసిడెంట్ కూడా. అంతేనా, పవర్ఫుల్ గర్ల్గా టైమ్ మేగజీన్ కవర్ పేజీ కూడా అయింది! సాదాసీదాగా ఉన్న బార్బీనీ, స్ట్రాంగ్ బార్బీని చెయ్యడానికి చాలానే ఉద్యమాలు నడిచాయి. ‘‘బార్బీని నెలువెత్తు బొమ్మగా ‘స్కేల్ అప్’ చేసి చూస్తే 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు ఉంటుంది. 55–60 కేజీల మధ్య బరువు ఉంటుంది. 36–18–33 ఆకృతిలో ఉంటుంది. లక్ష మందిలో ఒకరికి మాత్రమే ఉండే ఇలాంటి బాడీ షేప్, ఎత్తుకు సరిపడా లేని బార్బీ బరువు.. ఆడపిల్లల మనసు పాడుచేసి, వారిని ‘బార్బీ సిండ్రోమ్’కు గురిచేస్తోందని జూలీ బిండెల్ అనే స్త్రీవాద రచయిత్రి పదేళ్ల క్రితమే ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఈ భూమ్మీద బార్బీ ఉన్నంత కాలం ఆడపిల్లలకు మనశ్శాంతి ఉండదు’’ అని యాగ్నెస్ నైర్న్ అనే విద్యావేత్త కలవరపడ్డారు. వాళ్ల ఒపీనియన్కి గౌరవం లభించింది. బార్బీ ఇప్పుడు అందమైన పిల్లే కాదు. స్ట్రాంగ్ గర్ల్ కూడా. మరేమిటి? బార్బీ ప్లేస్లో ఫియర్లెస్ గర్ల్ వచ్చేస్తుందా? ఇంకో రెండు మూడేళ్లలో వచ్చేస్తుందనే అంటున్నారు. వచ్చినా, రాకున్నా.. ప్రతి బార్బీలోనూ ఇన్బిల్ట్గా ఓ ఫియర్లెస్ గర్ల్ ఉంటుంది. అందుకే కదా.. కదా ప్రపంచాన్ని అరవై ఏళ్లుగా శాసిస్తూ వస్తోంది. ఫియర్లెస్ గర్ల్కి ఉన్నట్లే బార్బీ డాల్ కీ ఒక జన్మ వృత్తాతం ఉంది. బార్బీని సృష్టించింది రూత్హ్యాండ్లర్ అనే మహిళ. అమెకో కొడుకు. కూతురు. కొడుక్కి ఆడుకోడానికి చాలా బొమ్మలు ఉండేవి. కార్లు, ఏరోప్లేన్లు, గన్లు. కూతురికి ఒకే బొమ్మ ఉండేది. కేరింగ్ డాల్. పాపాయిని ఎత్తుకున్న పాపాయి బొమ్మ. ‘కేరింగ్ గానే కాదు, డేరింగ్గానూ ఉండాలి నా కూతురు’ అనుకున్నారు రూత్. తనే స్వయంగా కూతురి కోసం బార్బీ డాల్ని తయారు చేశారు. ఆమె కూతురి పేరు బార్బారా. ఆ పేరే బొమ్మకు పెట్టారు బార్బీ అని. -
అమ్మానాన్న.. వందల ప్రేమలేఖలు!
వకుళానాయక్ చిత్రకారిణి. అందమైన భావం ఆమె కుంచె నుంచి అద్భుతంగా ఆవిష్కారమవుతుంది. వాస్తవికతకు గీతల్లో రూపమిస్తుంది. ‘ఇది చిత్రకారులందరూ చేసే పనే కదా! కొత్తగా ఏదైనా చేయాలి’ అని వకుళానాయక్ అనుకుంటుండగా.. ఆ అన్వేషణలో యాదృచ్ఛికంగా జరిగిందో సంఘటన. వాళ్ల నాన్నగారు, వాళ్ల అమ్మకు రాసిన ప్రేమలేఖలు వకుళానాయక్ కంటపడ్డాయి. ఆయన ఉత్తరాల్లోని భావుకత, అక్షరాల్లో ఒలికించిన ప్రేమ భావం గొప్పగా ఉన్నాయి. ప్రతి ఉత్తరాన్ని క్షుణ్నంగా చదివారామె. ఆ ఉత్తరంలో వ్యక్తమైన భావానికి రూపమిచ్చారు. అలా ఆమె వేసిన బొమ్మలతో బెంగుళూరులో ప్రదర్శన కూడా పెట్టారామె. భావాల బొమ్మలు నీటి ఉపరితలం మీద పడవ ప్రయాణిస్తుంటుంది. రెండు చేపలు నీటి లోపల ఈదుతూ ఒకదానికొకటి ఎదురుపడతాయి. ఆరాధనాభావంతో చూసుకుంటూ ఉంటాయి. పడవలో నుంచి ఒక ఎర చేపల మధ్య వేళ్లాడుతూ ఉంటుంది. ఆ ఎరకు కొసన ప్రేమచిహ్నం ఉంటుంది. మరో చిత్రంలో ఒక రాకెట్ ఆకాశం నుంచి నేల వైపు పయనిస్తుంటుంది. అందులో ఉన్న వ్యక్తి చేతిలో ఒక జెండా. ఆ జెండా మీద ప్రేమ చిహ్నంగా ఎర్రటి హృదయం బొమ్మ. మరో చిత్రంలో ప్రేమగా ముక్కులు రాసుకుంటున్న రెండు రామచిలుకలు. ఇంకో చిత్రంలో రెండు గోరువంకల మధ్య ఫోన్ రిసీవర్ వేళ్లాడుతూ ఉంటుంది. రెండు ప్రేమ పక్షులు చెరొక కాఫీ కప్పులో కూర్చుని ఒకదానిని మరొకటి చూసుకుంటుంటాయి. రోజుకో ప్రేమలేఖ! ‘‘మా అమ్మానాన్న ఉద్యోగరీత్యా చాలా కాలం దూరంగా ఉండాల్సి వచ్చింది. ఎప్పుడో ముఖ్యమైన సందర్భాల్లో తప్ప తరచూ కలుసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. ఆ రోజుల్లో ఆయన మా అమ్మకు తరచూ ఉత్తరాలు రాసేవాడు. కొన్ని ఉత్తరాల మీద తేదీలను చూస్తే రోజుకొక ఉత్తరం రాసిన రోజులూ ఉన్నాయి వాళ్ల జీవితంలో. ఇప్పటిలా ఫోన్లు ఉన్న రోజులు కావవి. టెలిఫోన్ ఉన్నా కూడా అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ‘ఫలానా రోజు ఫోన్ చేస్తాను’ అనే సంగతి కూడా ఉత్తరంలో సమాచారం ఇచ్చుకోవాల్సిన రోజులవి. అప్పుడు వారి మధ్య దూరాన్ని తగ్గించిన నేస్తాలా ఉత్తరాలు. అందులో ఆయన రాసిన విషయాలకు నేను బొమ్మలు వేశాను. నాన్న పోయాక ఆయన వస్తువులు చూస్తున్నప్పుడు ఈ ఉత్తరాలు దొరికాయి’’ అని వివరించారు వకుళా నాయక్. ఉత్తరాలే కాదు ఏ రకమైన పాత కాగితం కనిపించినా దానికి నప్పే బొమ్మ వేసి ఆ బొమ్మలో ఈ కాగితాన్ని ఇమడ్చడం ఆమె ప్రత్యేకత. పాత దస్తావేజులు, సరుకులు కొన్న చీటీలు, సంగీతం నోట్స్... ఏదైనా సరే... ఆ కాన్సెప్ట్కు తగినట్లు బొమ్మ వేసి ఒక డెకరేటివ్ పీస్గా మారుస్తారు వకుళ. ఈ ఆర్ట్ను వింటేజ్ లవ్ లెటర్స్ ఎగ్జిబిషన్ అంటారు. – మంజీర -
అనగనగా ఓ ఊరు
జపాన్లోని షికోకు అనే ద్వీపం.. అక్కడ కొండకోనల్లో నగోరో అనే చిన్న పల్లె.. అక్కడ అందరూ కష్టజీవులే అనుకుంటా.. ఎందుకంటే.. ఈ గ్రామానికి వెళ్లి చూస్తే.. రోడ్డు పనులు చేస్తూ కొందరు.. పొలాల్లో మరికొందరు.. చేపలు పడుతూ ఇంకొందరు.. ఇలా ఎక్కడ చూసినా జనం పనిచేస్తూ కనిపిస్తారు.. కనిపించడమే గానీ.. ఒక్కమాటా వినిపించదు.. దీంతో మాట్లాడదామని దగ్గరకు వెళ్తే గానీ.. మనకు అసలు విషయం బోధపడదు.. వాళ్లు మనుషులు కాదు.. బొమ్మలని..! ఆ పల్లె జనాభా 40 లోపే.. బొమ్మల జనాభా దాదాపు 350! ఇంతకీ ఏమిటీ బొమ్మల కథ.. కొంచెం తేడాగా ఇది ప్రతి పల్లె కథ.. పని కోసం ఆ పల్లె కూడా నడిచింది పట్నపు దారుల వెంట.. చదువుల కోసం, ఉద్యోగాల కోసం జనం ఊరును విడిచారు.. ఊరును మరిచారు. టకుమి అయానో తప్ప.. ఆమె చిన్నప్పుడే వాళ్ల కుటుంబం ఊరు విడిచి వెళ్లిపోయింది. అయితే, 2000 సంవత్పరంలో టకుమి తిరిగి వచ్చింది. తన తండ్రి బాగోగులు చూడటం కోసం.. జనం లేక ఊరు వల్లకాడులా కనిపించింది. దీంతో పల్లెకు మళ్లీ ప్రాణం పోయాలనుకుంది. వినూత్నంగా తన నిరసనను తెలుపుతూ.. ఊరును మళ్లీ ‘జనం’తో నింపాలనుకుంది. అలా మొదలైంది.. ఈ బొమ్మల కథ.. ఆ ఊరులో చనిపోయినవారు లేదా ఆ ఊరు విడిచిపోయినవారి పేరిట బొమ్మలను తయారుచేయడం ప్రారంభించింది. బెస్తవారైతే ఆ లెక్కన.. వ్యవసాయదారుడైతే ఆ తరహాలో.. బొమ్మలను రూపొందించింది. అంటే.. ఆ ఊరిలో చనిపోయిన లేదా విడిచివెళ్లిన ప్రతి ఒక్కరి పేరు మీద బొమ్మలున్నాయన్నమాట. వారు విడిచివెళ్లిన ఇళ్ల వద్ద వారు ఉన్నట్లుగానే భ్రమింపజేసేలా ఆ బొమ్మలను తయారుచేసి.. అక్కడే పెట్టింది. అంటే ఆ ఊరి వారు ఇంకా అక్కడే ఉన్నట్లుగా.. జనం లేక వల్లకాడులాగ మారుతున్న పల్లెల సమస్యను తెలియజేయడానికి తానిలా చేస్తున్నట్లు టకుమి తెలిపారు. పైగా.. దీని వల్ల పదిమందితో కలిసి ఉంటున్నామన్న భావన కూడా కలుగుతుందని చెప్పారు. ఇది పదిమందిని ఆకర్షించింది. ఆ ఊరు చిన్నసైజు పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. జపాన్లో దాదాపు 10 వేల ఊళ్లు ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయట. ఇప్పుడిప్పుడే వేరే గ్రామాల్లోనూ ఇలాంటి బొమ్మల నిరసన మొదలవుతోందట. -
అయస్కాంతాలతో అనారోగ్యం పాలయ్యాడు!
ఉటా : పిల్లలు బొమ్మలతో ఆడుకోవడమంటే చాలా ఇష్టపడుతారు. అందులో వైవిధ్యమైన బొమ్మలంటే వారికి మరింత సంతోషం. వాటి కోసం కొట్లాడుతారు. మారం చేస్తారు. చివరకు కావాల్సిన బొమ్మలను కొనిపించుకుంటారు. అయితే కొన్నిసార్లు అవే బొమ్మలు వారి అనారోగ్యానికి కారణం అవుతాయి. ఈ బొమ్మల విషయంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఒక్కోసారి ఏదో తీట పనిచేసి ఇబ్బందులు తెస్తుంటారు. ఇలానే అమెరికా, ఉటాలోని సాండీకి చెందిన మికా అర్విడ్సన్ అనే ఆరేళ్ల కుర్రాడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. తన సోదరుడి బొమ్మను నోట్లో దాచుకునే ప్రయత్నం చేసి తెలియకుండానే మింగేశాడు. దీంతో అనారోగ్యానికి గురైన అతను వాంతులు చేసుకున్నాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అత్యవసర శస్త్ర చికిత్స చేసిన వైద్యులు మికా కడుపులో బొమ్మకు సంబంధించిన 14 చిన్న అయస్కాంతాలను గుర్తించి బయటకు తీశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇంకా మికా ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదని అతని తల్లిదండ్రులు తెలిపారు.