-
కోహ్లి కుమార్తెకు బెదిరింపులు: హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్ట్
-
కోహ్లి కుమార్తెకు బెదిరింపులు: హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్ట్
Person Arrest In Hyderabad For Threatening Virat Kohli.. విరాట్ కోహ్లీపై బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని ముంబై పోలీసులు బుధవారం హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. విషయంలోకి వెళితే.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్లో టీమిండియా ఓటమి అనంతరం.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని టార్గెట్ చేస్తూ.. కోహ్లి కూతురు వామికాను అత్యాచారం పేరుతో సోషల్ మీడియాలో కొందరు దుండగులు అసభ్యకర పోస్టులు చేశారు. చదవండి: Virat Kohli- Vamika: కోహ్లి కూతురిపై విషం చిమ్మిన నెటిజన్.. ఛీ ఇంతకు దిగజారుతారా? తాజాగా కోహ్లి కూతుర్ని అత్యాచారం పేరుతో బెదిరింపులకు పాల్పడ్డ వారిలో హైదరాబాద్కు చెందిన 23 ఏళ్ల రామ్నగేష్ ఉన్నట్లు సైబర్ క్రైమ్ గుర్తించింది. ఈ మేరకు బుధవారం ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు నగేష్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా పాక్తో మ్యాచ్ ఓడిన తర్వాత నగేష్ సోషల్ మీడియాలో కోహ్లి కూతురు గురించి అసభ్యకర మెసేజ్లు పెట్టినట్లు తేలింది. కాగా నగేష్ హైదరాబాద్లోని ఒక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. -
షూటింగ్ చేస్తుండగా చంపేస్తామని బెదిరించారు: సత్యదేవ్
సత్యదేవ్ ఈ పేరుకి తెలుగు పరిశ్రమలో పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదట్లో చిన్న పాత్రల్లో కనిపించిన ఈ నటుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడమే గాక ఇటీవలే బాలీవుడ్ లోనూ అడుగు పెట్టాడు. ప్రస్తుతం సత్యదేవ్ తీవ్రవాదం నేపథ్యంలో రూపొందుతున్న హబీబ్ అనే హిందీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. హబీబ్ చిత్రం చిత్రీకరణ సమయంలో.. తీవ్ర ఆటంకాలు, ప్రమాదాల నడుమ భయపడుతూ రూపొందించినట్లు తెలిపాడు. ఎందుకంటే గత కొంత కాలంగా ఆఫ్ఘన్ దేశాన్ని తాలిబన్లు తిరిగి దక్కించుకునేందుకు భీకరంగా పోరాటం సాగిస్తున్న క్రమంలో చిత్ర బృందం ఆ దేశానికి వెళ్లి షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఇందులో ప్రాణాలకు రిస్కీ అని తెలిసినా సత్యదేవ్ కథ కోసం షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇదిలా వుండగా షూటింగ్ జరుగుతున్న సమయంలో కొందరు కాల్ చేసి చంపేస్తామంటూ బెదిరించారని తెలిపాడు. ఆర్మీ తరహా దుస్తులు ధరించి సత్యదేవ్ పై చిత్రీకరణను చేయగా అతడి వేషధారణ కారణంగా ఒక దశలో తాలిబాన్ అని పొరపాటు పడ్డారట. స్థానిక పోలీసుల కోసం సందేహాలను నివృత్తి చేయడానికి భారత రాయబార కార్యాలయం వారి ఆధారాలను చూపించాల్సి వచ్చిందట. ప్రమాదకర ప్రాణహాని ఉన్నా సినిమా పై తనకు ఉన్న ఫ్యాషన్ని ఈ నటుడు విడవకపోవడం విశేషం. ఇటీవల సత్యదేవ్ తిమ్మరసు చిత్రంతో ప్రేక్షకుల మందుకు వచ్చిన సంగతి తెలిసిందే. -
సాస్ ఇవ్వలేదని రెస్టారెంట్ను బాంబులతో పేల్చేస్తానన్నాడు.. చివరికి
ఆహారం విషయంలో కొంతమంది భోజన ప్రియులు కచ్చితంగా ఉంటారు. అలాగే వారికి నచ్చిన ఆహారం కోసం గతంలో కొందరు వందల కిలోమీటర్లు వెళ్లిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇంత వరకు ఓకే గానీ ఏదైనా సృతి మించకూడదని అంటారు. కాగా ఓ వ్యక్తి ఆ విషయంలో చాలా దూరం వెళ్లాడు. ఎంతంటే ఏకంగా రెస్టారెంట్ను బాంబులతో పేల్చేస్తానంటూ ఆ యజమానికే కాల్ చేసి బెదిరిస్తూ రెచ్చిపోయాడు. అసలు అతనికి అంతలా ఆగ్రహానికి గల కారణం తెలిస్తే షాక్ అవుతారు. మరేమీ లేదండీ.. సాస్ ఇవ్వడం మరిచిపోయాడని అతను అంత రచ్చ చేశాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని లోవాలో నివసిస్తున్న రోబర్ట్ గాల్విట్జెర్ ఫుడ్ రెస్టారెంట్ సంస్థ మెక్ డొనాల్డ్స్కు ఫోన్ చేసి చికెన్ నగ్గెట్స్ ఆర్డర్ చేశాడు. మెక్డొనాల అంటేనే చికెన్ నగ్గెట్స్, బర్గర్స్కి ప్రత్యేకమని అందరికీ తెలిసిన విషయమే. ఇంకేముంది రుచికరమైన వంటకం వస్తోంది, ఓ పట్టు పట్టాలి అని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇంతలో అతనికి చికెన్ నగ్గెట్స్ అందాయి. కానీ, అవి డిప్ చేసి తినేందుకు అందులో సాస్ ఇవ్వడం ఆ రెస్టారెంట్ సిబ్బంది మరిచిపోయారు. అసలు సాస్ లేకుండా ఎలా డెలివరీ చేస్తారని మనోడికి కోపం వచ్చింది. వెంటనే డెలివరీ సిబ్బందిని కొట్టడమే కాకుండా, రెస్టారెంట్కు ఫోన్ చేసి.. బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు. దీంతో రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా గాల్విట్జెర్ను అరెస్టు చేశారు. చదవండి: వాంటెడ్ క్రిమినల్గా ‘మార్క్ జుకర్బర్గ్’.. పట్టిస్తే రూ.22కోట్లు -
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి: ఐఏఎస్ అధికారి
భోపాల్: మధ్యప్రదేశ్లో విధులు నిర్వహిస్తున్న యువ ఐఏఎస్ అధికారి ఒకరు తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉంది.. పోలీసు ప్రొటేక్షన్ కల్సించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సదరు ఐఏఎస్ అధికారి సిగ్నల్ యాప్ మెసేజింగ్ గ్రూప్లో రాష్ట్ర అధికారులపై అవినీతి ఆరోపణలు చేశారు. అవి కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడంతో సదరు ఐఏఎస్ అధికారికి బెదిరంపు కాల్స్ వస్తున్నాయట. ఈ క్రమంలో తనకు, తన కుటుంబానికి పోలీస్ ప్రోటెక్షన్ కల్సించాల్సిందిగా కోరుతున్నాడు. ఆ వివరాలు.. 2014 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి లోకేశ్ కుమార్ జంగిడ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ కుమార్ ఓ మేసేజింగ్ గ్రూప్లో కొందరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై అవినీతి ఆరోపణలు చేశారు. అవి కాస్త లీక్ అవ్వడంతో ఇప్పటికే ప్రభుత్వం ఆయనకు నోటీసులు జారీ చేసింది. క్రమశిక్షణారహిత్య చర్యలుగా పేర్కొంటూ.. వారం లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రాత్రి 11 గంటల సమయంలో ఓ కొత్త నంబర్నుంచి తనకు కాల్ వచ్చిందని.. ఫోన్లో సదరు వ్యక్తి తనను మీడియాతో మాట్లాడటం మానేయాలని.. ఆరు నెలల పాటు లీవ్ మీద వెళ్లాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించినట్లు లోకేశ్ కుమార్ తెలిపాడు. ఈ క్రమంలో తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని.. పోలీస్ ప్రోటెక్షన్ కల్సించాల్సిందిగా కోరుతూ లోకేశ్ కుమార్, మధ్యప్రదేశ్ డీజీపీకి వివేక్ జోహ్రికి లేఖ రాశారు. భోపాల్ పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఇక వ్యక్తిగత కారణాలను చూపుతూ లోకేశ్ తన సొంత రాష్ట్రం మహారాష్ట్రకు తనను డిప్యూటేషన్ మీద పంపించాల్సిందిగా కోరాడు. ఇక లీకైన చాట్లో లోకేశ్ తాను అవినీతిని ఏమాత్రం సహించలేనని.. అందుకే తనను తరచుగా బదిలీ చేస్తారని తెలిపారు. నాలుగేళ్ల తన సర్వీసులో ఇప్పటికే తనను 9సార్లు ట్రాన్స్ఫర్ చేశారని తెలిపాడు. చదవండి: ఐఏఎస్ భావోద్వేగం.. ఉద్యోగానికో దండం.. రాజీనామా చేస్తున్నా -
‘ఒంటిపై ఉన్న ఖాకీ చొక్కాను తొలగిస్తా జాగ్రత్త’
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న ఇన్స్పెక్టర్ను వాట్సాప్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన రౌడీషీటర్పై మొఘల్పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఒంటిపై ఉన్న ఖాకీ చొక్కాను తొలగిస్తా జాగ్రత్త... అంటూ దురుసుగా మాట్లాడటమే కాకుండా ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఆర్ఎస్ఎస్ నాయకుడిలా వ్యవహరిస్తున్న మీరు మాతో పెట్టుకుంటే తగిన మూల్యం చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడిన ఫోన్ సంభాషణ వైరలైంది. వివరాల ప్రకారం... రెయిన్బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో రౌడీషీటర్గా నమోదైన ఆసిఫ్ ఇక్బాల్ రెండు రోజుల క్రితం మొఘల్పురా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ను దూషిస్తూ హెచ్చరించారు. మొఘల్పురా పరిధిలో జరిగిన ఒక సంఘటన విషయంలో స్థానిక మజ్లిస్ పార్టీ కార్పొరేటర్తో పాటు రౌడీషీటర్ ఆసిఫ్ ఇక్బాల్ ఫోన్లో అమర్యాదగా మాట్లాడారు. పోలీసుల విచారణలో ఆసిఫ్ ఇక్బాల్గా రౌడీషీటర్ అని గుర్తించారు. ఇతనిపై ఇప్పటికే రెయిన్బజార్, చాంద్రాయణగుట్ట, మొఘల్పురా పోలీస్స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసిఫ్ ఇక్బాల్ యెమెన్ దేశంలో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ రవి కుమార్ తెలిపారు. ఇతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. చదవండి: కరోనాతో గాంధీ భవన్ అటెండర్ షబ్బీర్ మృతి నాన్నా.. ఇక రావా..? మమ్మల్ని ఎవరు చూస్తారు? -
అమిత్, యోగీలను చంపేస్తాం
సాక్షి ముంబై: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్లను చంపేస్తామని బెదిరిస్తూ సీఆర్పీఎఫ్కు కార్యాలయానికి ఒక మెయిల్ అందింది. ముంబైలోని సీఆర్పీఎఫ్ కేంద్ర కార్యాలయానికి ఇటీవల అందిన ఆ మెయిల్ విషయం మంగళవారం బయటకు పొక్కింది. షా, యోగిలతోపాటు దేశంలోని ప్రార్థనా స్థలాలు, ప్రాముఖ్యం ఉన్న ప్రాంతాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడతామనీ, ఇందుకోసం 11 మంది ఆత్మాహుతి బాంబర్లు సిద్ధంగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. మెయిల్ను సీఆర్పీఎఫ్ అధికారులు విచారణ నిమిత్తం దర్యాప్తు సంస్థలకు పంపడంతోపాటు ఆ ఇద్దరు వీవీఐపీ నేతల భద్రతను పటిష్టం చేశారు. అయితే, బీజేపీ సీనియర్ నేతలైన వీరిద్దరికీ బెదిరింపు లేఖలు గతంలోనూ వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో యోగిని చంపుతామంటూ ‘డయల్ 112’కు ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. గత ఏడాది నవంబర్లో కూడా యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామంటూ వాట్సాప్ మెసేజీ రాగా పోలీసులు విచారణ చేపట్టి ఆగ్రాకు చెందిన ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఉండగా, మావోయిస్టులపై పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. మూడు రోజుల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో మంగళవారం ఆయన బాసగూడ సీఆర్పీఎఫ్ క్యాంపును సందర్శించి, జవాన్లనుద్దేశించి మాట్లాడారు. (ఇది ఆరంభం మాత్రమే : కంగనా సంచలన వ్యాఖ్యలు) -
ఆస్ట్రేలియాకు గూగుల్ బెదిరింపులు
వెల్లింగ్టన్: ‘బెదిరింపులపై మేం స్పందించం. కానీ మీరు చేయగలిగే స్థాయిలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టాలు చేస్తుంది’.. ఇదీ గూగుల్ బెదిరింపులకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఇచ్చిన సమాధానం. వివరాల్లోకెల్తే.. ఆస్ట్రేలియాలోని మీడియా సంస్థలకు చెందిన వార్తలను గూగుల్ ఉపయోగించు కుంటున్నందుకుగానూ ఆయా మీడియా సంస్థలకు డబ్బు చెల్లించేలా ఆస్ట్రేలియా ఇటీవల కొత్త చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ చట్టాలపై గూగుల్ బెదిరింపు వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ల గూగుల్ డైరెక్టర్ మెల్ సిల్వా మాట్లాడుతూ.. ‘ఈ కోడ్ గనక చట్టంగా మారితే, గూగుల్ సెర్చ్ను ఆస్ట్రేలియాలో లేకుండా చేయడం తప్ప ఇంకేమీ చేయలేం. అప్పుడు మా ప్రొడక్ట్లను ఉపయోగించే దేశ ప్రజలకు అది బ్యాడ్ న్యూస్’ అంటూ ఆ దేశ సెనెటర్లకు చెప్పారు. మీడియా సంస్థలకు డబ్బు చెల్లించడానికి తాము సిద్ధమేనని, అయితే చట్టంలో ఉన్న నియమాల ప్రకారం కాదని చెప్పారు. -
‘ది కశ్మీరీ ఫైల్స్’.. బెదిరింపులకు భయపడను
వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పల్లవి జోషి నిర్మించిన చిత్రం ‘ది కశ్మీరీ ఫైల్స్’. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, ప్రకాశ్ బెల్వాడి, మృణాల్ కులకర్ణి, పునీత్ ఇస్సార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని తీసినవాళ్లను, చూసే ప్రేక్షకులను వదిలేదు లేదంటూ కశ్మీరీ మిలిటెంట్ గ్రూప్ బెదిరించినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘కశ్మీరీ హిందువులపై సాగిన మారణహోమం గురించిన నిజాలు ఇప్పటి తరంలో చాలామందికి తెలియదు. అందుకే ఈ సినిమా తీయాలనుకున్నాను. ఏప్రిల్లో సినిమా రిలీజ్ అనుకుంటున్నాం. ఈ సినిమా షూటింగ్ను జమ్మూ–కశ్మీర్లో చేసినప్పుడు ఇబ్బందులు ఎదురవలేదు. కశ్మీరీ మిలిటెంట్ గ్రూప్ నన్ను డైరెక్ట్గా బెదిరించలేదు. కానీ బెదిరిస్తున్నట్లు ముంబైలో ఉన్న నా స్నేహితులు చెప్పారు. మా సినిమా పోస్టర్, టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. అలాంటప్పుడు సినిమా ఎలా ఉంటుందో వారి కెలా తెలుస్తుంది? ప్రజలకు వాస్తవాలు చూపిస్తున్నప్పుడు భయమెందుకు? ఎవరి బెదిరింపులకూ భయపడి సినిమా రిలీజ్ ఆపం. ఈ సినిమా వెనక ఏ రాజకీయ పార్టీ ప్రోద్బలం లేదు. ఇలాంటి వాస్తవ కథలను తెరకెక్కిస్తున్నప్పుడు ప్రభుత్వాలు అండగా ఉండాలి. అప్పుడే మరిన్ని సినిమాలను ధైర్యంగా తీయగలుగుతాం. ప్రస్తుతం ‘ది కశ్మీరీ ఫైల్స్, ఏ1 ఎక్స్ప్రెస్’, ‘రాజ రాజ చోర’ చిత్రాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘కార్తికేయ 2, గూఢచారి 2, అబ్దుల్ కలాం బయోపిక్’ త్వరలో ఆరంభమవుతాయి. ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ని హిందీ–తెలుగులో నిర్మిస్తాం’’ అన్నారు. -
చంపేస్తాం! బాలీవుడ్ భామకు బెదిరింపు కాల్స్..
వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బ్యూటీ భామ దిశాపటానీ. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడే వరస సినిమాలతో బిజీ అయిపోయింది. ఎమ్ఎస్ ధోనీ, భాగీ-2,3 వంటి చిత్రాల్లో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం భాయిజాన్ సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రం వచ్చే రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఓ వైపు చేతినిండా సినిమాలతోపాటు మరోవైపు ఫోటో షూట్లతో అభిమానులను ఊర్రూతలుగిస్తోంది దిశా. ఆమె ఏ డ్రెస్ ధరించిన తన అందాలతో కుర్రకారులను మత్తెక్కిస్తుంటుంది. ఈ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో తరుచూగా పోస్టు చేస్తుంటుంది. అలా లైఫ్ను హ్యపీగా లీడ్ చేస్తున్నఈ ముద్దుగుమ్మ తాజాగా ప్రమాదంలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. చదవండి: నాలుగు నెలల్లో సలార్ పూర్తి దిశాపటానీకి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. హీరోయిన్కు ఫోన్ చేసి తనను చంపేస్తామని భయపెడుతున్నట్లు సమాచారం. అంతేగాక పోలీస్ స్టేషన్లకు కూడా కాల్స్ చేసి మీ అమ్మాయి(దిశా పటానీ) ఇంకా ఎవరూ రక్షించలేరని బెదిరిస్తున్నారట. ఈ కాల్స్ పాకిస్తాన్ నుంచి వస్తున్నట్లు, కాల్ చేసిన వ్యక్తి దిశాను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాల్స్ వల్ల దిశా ప్రాణానికి ప్రమాదం ఉన్నట్లు సమాచారం. అయితే బెదిరింపు కాల్స్పై పోలీసులు దృష్టి పెట్టినట్లు, దీని వెనుక ఉన్న సూత్రధారిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లు కూడా తెలుస్తోంది. చదవండి: మహేశ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనా.. వీడియో వైరల్ -
ఆ హీరోయిన్ నాలుక కోసేయండి : పొలిటీషియన్
బాలీవుడ్ నటి రీచా చద్దా మెయిన్లీడ్గా నటిస్తోన్న చిత్రం 'మేడమ్ చీఫ్ మినిస్టర్' విడుదలకు ముందే వివాదాస్పదం అవుతోంది. తాజాగా రిలీజైన ఈ సినిమా పోస్టర్ దళితులను అవమానించేలా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంటరానివారు అనే పదాన్ని ఈ చిత్రంలో ఉపయోగించారని, మెయిన్లీడ్ పోషించిన రీచా చీపురు పట్టుకున్నట్లు చూపించడం కూడా అభ్యంతరకంగా ఉందని, దీన్ని చిత్రం నుంచి తీసేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే తనకు వందల సంఖ్యలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నటి రీచా పేర్కొన్నారు. ఆమె నాలుకను కోసేయండంటూ ఓ రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్పింగ్ను షేర్ చేస్తూ..మేం ఎవరికీ భయపడం అంటూ రీచా ట్వీట్ చేశారు. (నటిపై ఆరోపణలు; రూ. కోటి పరువు నష్టం దావా) View this post on Instagram A post shared by Richa Chadha (@therichachadha) మరోవైపు నటి స్వర భాస్కర్ సహా పలువురు రీచాకు మద్దతు తెలుపుతున్నారు. సినిమా పరంగా విమర్శించే హక్కు ఉంటుంది కానీ ఇలా హింసకు ప్రేరేపించడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఇలాంటి నేరపూరిత బెదిరింపులకు వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరూ నిలబడాలని తెలుపుతూ నాట్ ఓకే (not ok)అనే హ్యాష్ ట్యాగ్ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఓ సాధారణ మహిళ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగిందనే కథాంశంతో పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇందులో హీరోయిన్గా నటించిన రీచా చద్దా పాత్ర మాయావతిలా కనిపిస్తుండం ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఈనెల 22న విడుదల కానున్న ఈ చిత్రంలో సౌరభ్ శుక్లా, మనావ్ కౌల్, అక్షయ్ఒబేరాయ్ ముఖ్యపాత్రలు పోషించారు. (ఆ రెండింటి విషయంలో కంట్రోల్గా ఉండలేను) -
అత్యాచారం చేసి చంపేసేవాడు: అమీషా పటేల్
ముంబై: బిహార్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తనకు భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయని.. ఒకానొక సమయంలో తనపై అత్యాచారం చేసి చంపేస్తారేమో అని భయపడ్డానని తెలిపారు బాలీవుడ్ నటి అమీషా పటేల్. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లోక్ జన్శక్తి పార్టీ అభ్యర్థి ప్రకాశ్ చంద్ర తరఫున బిహార్లోని దౌద్నగర్లో ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని తెలిపారు. ప్రాణాలు కాపాడుకోవటానికి.. క్షేమంగా బయటపడటానికి వారు చెప్పినట్లు ఆడాల్సి వచ్చింది అన్నారు. ఈ మేరకు ఓ ఆడియో క్లిప్ని విడుదల చేశారు. తనకు ఎదురయిన భయానక అనుభావాలను ఓ పీడకలగా వర్ణించారు అమీషా పటేల్. (చదవండి: ఆయనే సంపన్న అభ్యర్థి.. ఆస్తి ఎంతంటే!) ఈ సందర్భంగా అమీషా మాట్లాడుతూ.. ‘దౌద్ నగర్లో ప్రకాశ్ చంద్ర కోసం ప్రచారం చేస్తున్నప్పుడు అతడు నన్ను బెదిరించాడు.. బ్లాక్ మెయిల్ చేశాడు. నిన్న సాయంత్రం ముంబై వచ్చాక కూడా అతడు బెదిరింపు కాల్స్ చేయడం, సందేశాలు పంపడం చేశాడు. తన గురించి గొప్పగా మాట్లాడాలని కోరాడు. అతని వల్ల నిన్న సాయంత్రం నాకు ఫ్టైట్ మిస్ అయ్యింది. దాంతో అతడు నన్ను ఓ గ్రామంలో ఉంచాడు. తను చెప్పినట్లు వినకపోతే అక్కడే వదిలేసి వెళ్తానని బెదిరించాడు. ఆ సమయంలో అతడు చెప్పినట్లు వినకపోతే నాపై అత్యాచారం చేసేవాడు.. చంపేసేవాడు. నా కారును అతడి మద్దతుదారులు అడ్డగించేవారు. అతడి మాట వినేంతవరకు నా కారును కదలనిచ్చేవారు కాదు. అతడు నన్ను ట్రాప్ చేసి నా జీవితాన్ని ప్రమాదంలో పెట్టాడు ఇది అతడి ఆపరేటింగ్ సిస్టం’ అంటూ అమీషా ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: మేనిఫెస్టోలు–‘ఉచితా’నుచితాలు) అయితే ఈ వ్యాఖ్యలను ఎల్జేపీ అభ్యర్థి ప్రకాశ్ చంద్ర ఖండించారు. ఆమె కార్ షో కోసం అన్ని రకాల భద్రతా నిబంధనలు చేసినట్లు తెలిపారు. ప్రజల మద్దతుతో నేను గెలవాలనుకున్నాను. కానీ నా బంధువుల్లో ఒకరు ఒబ్రాలో అమీషా పటేల్ ర్యాలీ నిర్వహించారు. దౌద్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అమీషా పటేల్ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆమె ఆరోపించిన సంఘటనలు ఏవి జరగలేదు. బిహార్లో ఆర్టిస్టులు లేరా.. సోనాక్షి సిన్హా కూడా ఇక్కడి నుంచే ఉన్నారు. అమీషా విమానాశ్రయంలో పప్పు యాదవ్ను కలిశారు. వారు 15 లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నారు” అని తెలిపాడు. అంతేకాక తనకు అనుకూలంగా వీడియో చేయడానికి అమీషా పటేల్ ఎక్కువ డబ్బు కోరినట్లు ప్రకాశ్ చంద్ర పేర్కొన్నారు. ‘నా డ్రైవర్ ఈ రోజు అమీషా పటేల్ పీఏతో మాట్లాడాడు. ఆమె నాకు అనుకూలంగా మరో వీడియో చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. దాని కోసం ఆమె 10 లక్షలు రూపాయలు డిమాండ్ చేశారు. నేను చదువుకున్న వ్యక్తిని, చదువుకున్న సంస్థ నుంచి వచ్చాను. ఆమెకు ఇక్కడ పూర్తి రక్షణ లభించింది. అమీషా ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి’ అన్నారాయన. -
ఆ హీరో ఫ్యాన్స్తో నాకు ప్రమాదం..
చెన్నై: ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తలపెట్టిన బయోపిక్ 800 తమిళనాట పెను వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. సామాన్యులు మొదలు ప్రముఖ దర్శకుడు భారతీ రాజా వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక విజయ్ సేతుపతిని ఈ సినిమాలో నటించవద్దని కోరారు. చివరకు మురళీధరన్ కూడా తన బయోపిక్ కోసం కెరీర్ని నాశనం చేసుకోవద్దంటూ విజయ్ని కోరడంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఆ తర్వాత కూడా విజయ్ కుమార్తెకి అత్యాచార బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ దర్శకుడు ఆర్ సీను రామసామి తాను కూడా బెదిరింపులు ఎదుర్కొంటున్నాను. జీవితం ప్రమాదంలో పడింది సాయం చేయండి అంటూ ముఖ్యమంత్రి పళని స్వామిని కోరుతున్నారు. సినిమా నుంచి తప్పుకోవాల్సిందిగా విజయ్ సేతుపతిని కోరిన తర్వాత తనకు బెదిరింపు కాల్స్, మెసేజ్లు రావడం ప్రారంభం అయ్యిందని తెలిపారు. ఈ సందర్భంగా రామసామి మాట్లాడుతూ.. ‘చాలా మందిలాగే నేను కూడా విజయ్ సేతుపతిని 800 సినిమా నుంచి వైదొలగాలని కోరాను. ఆ తర్వాత కొద్ది రోజులకు విజయ్ కుమార్తె లాగే నాకు బెదిరింపు సందేశాలు వచ్చాయి. నోటితో పలకలేని పదాలను ఉపయోగించారు. వాట్సాప్ ఒపెన్ చేయాలంటేనే ఒణుకుపుడుతుంది’ అన్నారు. అలానే ఈ బెదిరింపుల వెనక విజయ్ ఫ్యాన్స్ ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే తమ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బెదిరింపుల నేపథ్యంలో రోడ్డు మీద నడవాలన్న భయంగా ఉందన్నారు. దీనిపై ఓ సీనియర్ పోలీసు అధికారి స్పందిస్తూ.. దర్యాప్తు చేస్తున్నాం అన్నారు. (విమర్శలకు చెక్: విజయ్ అనూహ్య నిర్ణయం) ఇక 800 చిత్రం ప్రకటించిన నాటి నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. తమిళ ద్రోహి చిత్రంలో ఎలా నటిస్తారంటూ విజయ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటించవద్దంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమలోని ప్రముఖలు సైతం విజయ్కు సూచించారు. శ్రీలంకలో తమిళులను ఊచకోతకోసిన 2009 ఏడాది తనక అత్యంత సంతోషకరమైనది వ్యాఖ్యానించిన తమిళుల వ్యతిరేకి చిత్రంలో నటించవద్దని నిరసన వ్యక్తం చేశాయి. విజయ్ సేతుపతి ఈ చిత్రాన్ని తిరస్కరించినట్లయితే, అతను తమిళ చరిత్రలో గౌరవప్రదమైన స్థానం పొందుతాడు లేదని ధిక్కరిస్తే, ద్రోహుల చరిత్రలో నిలిచిపోతారాంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే బయోపిక్కు వ్యతిరేకంగా వస్తున్న వార్తలపై మురళీధరన్ ఓ లేఖ విడుదల చేశారు. తమిళుల తీరును తప్పుబడ్డారు. దీంతో వివాదం కాస్తా పెద్దదిగా మారడంతో 800 బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్ సేతుపతి ప్రకటించారు. -
హత్రాస్ ఉదంతం: పోలీసుల ఎదుటే బెదిరింపులు
లక్నో: హత్రాస్ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాధితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మీడియాలో ఒక వీడియో తెగ వైరలవుతోంది. ఠాకూర్ల సామాజిక వర్గానికి చెందిన కొందరు ఎలాంటి భయం లేకుండా.. పోలీసుల ఎదుటే భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ను బెదిరించారు. ఇక యోగి ప్రభుత్వం మృతురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చే వారికి అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. 144 సెక్షన్ విధించారు. గుంపులు గుంపులుగా చేరడాన్ని నిషేధించారు. చివరకు రాహుల్ గాంధీ, ప్రియాంకలను కూడా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శిండానికి వెళ్లిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్తో పాటు మరో 400 మందిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కానీ దారుణానికి పాల్పడిన నిందుతులకు మద్దతుగా 500 వ్యక్తులు చేరడమే కాక ఆజాద్ను బహిరంగంగా హెచ్చరించారు. అయితే పోలీసులు వీరి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. (చదవండి: బాధిత కుటుంబంపై కేసు పెట్టాలి) దీనిపై ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిందితులకు మద్దతుగా ఎలాంటి సమావేశాలు జరిపినా చర్యలు ఉండవు. బాధితురాలి కుటుంబం ప్రమాదంలో ఉంది. వారికి ప్రత్యేక భద్రత కల్పించండి’ అని డిమాండ్ చేశారు. ఇక గ్రామంలోని ఉన్నత కులస్తులు రాష్ట్రీయ సావర్న్ పరిషత్ అధ్వర్యంలో సమావేశం అయ్యారు. బాధితురాలి కుటుంబం సదరు వ్యక్తుల మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. యోగి ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. కానీ వారు మాత్రం నమ్మడం లేదు. రాజకీయాలు చేయడానికి ఇక్కడకు వచ్చారంటూ చంద్రశేఖర్ ఆజాద్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఓ వ్యక్తి ‘దెబ్బలను తట్టుకునేందుకు ఠాకూర్లు పుట్టారు.. బయటకు రండి మీ పెద్ద సోదరులు మిమ్మల్ని కలవడానికి ఇక్కడ ఉన్నారు రండి’ అంటూ భీమ్ ఆర్మీ నాయకుడిని ఆహ్వానించారు. -
‘ఈ వీడియో చూపిస్తే కేసు క్లోజ్ అవుతుంది’
లక్నో: హత్రాస్లో దళిత యువతిపై అత్యాచారం ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ దారుణం పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది అంటూ యూపీ పోలీసు ఉన్నతాధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం బాధితురాలి కుటుంబాన్ని బెదిరింపులకు గురి చేస్తోన్న వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిలో డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ బాధితురాలి కుటుంబాన్ని బెదిరించడం చూడవచ్చు. జిల్లా మేజిస్ట్రేట్ ఒకరు ‘మీ విశ్వసనీయతను పూర్తి చేయవద్దు. ఈ మీడియా వాళ్లు ఈ రోజు ఉంటారు.. రేపు వెళ్తారు. మేము మాత్రం ఇక్కడే ఉంటాం. స్టేట్మెంట్ను మార్చడం.. మార్చకపోవడం మీ ఇష్టం. కానీ మేం మార్చగలం’ అన్నారు. ఇంతలో బాధితురాలి బంధువు ఒకరు కెమరా వైపు చూసి ఏడుస్తూ.. ‘వారు మాపై ఒత్తిడి తెస్తున్నారు. మీ కుమార్తె కరోనాతో చనిపోయి ఉంటే కనీసం పరిహారం అయినా దక్కేది అంటున్నారు. మా తండ్రిని, మమ్మల్ని బెదిరిస్తున్నారు’ అంటూ వాపోయింది. (చదవండి: అమ్మను బాధపడవద్దని చెప్పండి..) అంతేకాక వారు ‘మా తల్లి వీడియోలు తయారు చేశారు. వీటిని చూపిస్తే.. కేసు క్లోజ్ అవుతుంది అంటున్నారు. వారు మమ్మల్ని ఇక్కడ బతకనివ్వరు. డీఎం మమ్మల్ని మోసగించడానికి ప్రయత్నిస్తున్నారు. మాపై ఒత్తిడి తెస్తున్నారు.. బలవంతం చేస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఎన్డీ టీవీలో ప్రసారం చేశారు. ఇక హత్రాస్కు చెందిన 20 ఏళ్ల దళిత యువతి పొలంలో పని చేసుకుంటూ ఉండగా.. నలుగురు వ్యక్తులు ఆమెను లాక్కెళ్లి దారుణంగా హింసించారు. బాధితురాలు రెండు వారాల పాటు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడి మంగళవారం కన్ను మూసింది. -
'షమీ భార్యకు భద్రత కల్పించండి'
కోల్కత : టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ నుంచి విడిపోయి కూతురుతో కలిసి వేరుగా ఉంటున్న హసీన్ జహాన్కు భద్రత కల్పించాలంటూ కలకత్తా హైకోర్టు సిటీ పోలీసులను ఆదేశించింది. ఇటీవలే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఇటీవల రామ్ మందిర్ నిర్మాణానికి భూమి పూజ జరగ్గా.. హిందువులకి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ వివాదం రేపింది. దీనిపై సోషల్ మీడియా కొందరి నుంచి తనకు వేధింపులు వస్తున్నాయని.. తన కూతురుకు,తనకు ప్రాణహాని ఉందని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో తనకు భద్రత కల్పించాలంటూ కలకత్తా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. (చదవండి : చిట్టితల్లి నిన్ను చాలా మిస్సవుతున్నా) తాజాగా కలకత్తా హైకోర్టు మంగళవారం హసీన్ పిటీషన్ను పరీశీలించింది. హసీన్ తరపు లాయర్ ఆశిష్ చక్రవర్తి.. ఆమెకు సోషల్మీడియాలో వచ్చిన బెదిరింపులతో పాటు పోలీసులకు అందించిన ఫిర్యాదును రిపోర్టు రూపంలో కోర్టుకు సమర్పించారు. హసీన్ తనకు బెదిరింపులు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉద్దేశపూర్వకంగానే పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. కాగా సీనియర్ న్యాయవాది అమితేష్ బెనర్జీ చక్రవర్తి వాదనలను తోసిపుచ్చుతూ.. హసీన్ జహాన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉందని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ దేబాంగ్సు బసక్.. హసీన్ జహాన్ ఆస్తికి, ఆమె జీవితానికి ఎటువంటి హాని జరగకుండా రక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందంటూ మంగళవారం తెలిపారు. అంతేగాక హసీన్ ఫిర్యాదుతో తీసుకున్న చర్యలను రిపోర్టు రూపంలో కోర్టుకు అందించాలంటూ పోలీసులను ఆదేశించింది. కాగా కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు అనంతరం జస్టిస్ పేర్కొన్నారు. కాగా రెండేళ్ల క్రితం షమీపై గృహ హింస కేసు పెట్టిన హసీన్.. అతను అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడని మీడియా ముందు చెప్పడమే కాకుండా మ్యాచ్ ఫిక్సింగ్కి పాల్పడుతున్నాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించింది. దాంతో.. షమీపై విచారణ జరిపించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతడ్ని నిర్దోషిగా తేల్చగా.. ప్రస్తుతం ఈ ఇద్దరూ విడిగా ఉంటున్నారు. షమీ ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్ ఆడేందుకు దుబాయ్లో ఉన్నాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరపున షమీ మ్యాచ్లు ఆడుతున్నాడు. (చదవండి : మాకు రక్షణ కల్పించండి: షమీ భార్య) -
డబ్బులిస్తావా.. మ్యారేజ్ హాల్ తగలబెట్టనా?
సాక్షి, న్యూఢిల్లీ: ఓ వ్యాపారవేత్తను బెదిరించి, లక్షల్లో డబ్బు వసూలకు ప్రయత్నించిన కేసులో ఐదేళ్లుగా తప్పించుకు తిరుగుతోన్న వ్యక్తిని ఎట్టకేలకు అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు శనివారం వెల్లడించారు. నిందితుడు 2015లో తనకు 15 లక్షల రూపాయలు ఇవ్వకుంటే కళ్యాణ మండపాన్ని పేల్చేస్తానని ఓ వ్యాపారవేత్తను బెదిరించాడు. వివరాలు.. ఉత్తర్ ప్రదేశ్లోని రామ్పూర్ జిల్లాకు చెందిన విష్ణు (36) ఢిల్లీ వ్యాపారవేత్త ప్రణబ్ సేథ్ నుంచి డబ్బులు వసూలుచేయడానికి పథకం వేశాడు. తనకు 15 లక్షల రూపాయలు ఇవ్వకుంటే రూప్ నగర్లో ఉన్న ప్రణబ్ కళ్యాణ మండపాన్ని పేల్చివేస్తానని బెదిరించాడు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోర్టులో నేరం రుజువయ్యింది. దీనిపై 2015లో తీర్పు వెలువరించిన ఢిల్లీ కోర్టు విష్ణుని దోషిగా నిర్ధారించింది. (చదవండి: కారుతో గుద్దింది గాక పోలీసులకే కట్టుకథ) దాంతో అప్పటి నుంచి విష్ణు పరారీలో ఉన్నాడు. తాజాగా, నిందితుడిని రామ్పూర్ జిల్లాలోని అతడి స్వగ్రామంలో అరెస్ట్ చేశారు. మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నేరస్థుడు తన స్వగ్రామంలో ఉన్నట్టు గుర్తించామని, సెప్టెంబరు 4న అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు విష్ణుపై రాజౌరీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 384, 506 కింద కేసులు నమోదుచేశారు. -
భవ్య రామాలయం: పూజారికి బెదిరింపులు
అయోధ్య : భవ్య రామ మందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేసిన పూజారికి బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా మారింది. వివరాల ప్రకారం కర్ణాటకకు చెందిన 75 ఏళ్ల పూజారి ఎన్ఆర్ విజయేంద్ర శర్మ ఆగస్టు 5న జరుగనున్న రామ మందిర నిర్మాణం భూమిపూజకు ముహార్తాన్ని నిర్ణయించారు. బెళగావిలో ఉండే విజయేంద్ర శర్మ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు స్వామి గోవింద్ దేవ్ గిరిజకి సన్నిహతులు. విజయేంద్రకు గత మూడు, నాలుగు రోజులుగా తనకు దాదాపు 60 బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తనకు కాల్స్ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. (150 నదుల జలాలతో అయోధ్యకు..) దీంతో విజయేంద్ర శర్మ ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతను మోహరించారు. గతంలో మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయిలకు, పీవీ నరసింహరావులకు శర్మ సలహాదారునిగా వ్యవహరించారు. అంతేకాకుండా వాజ్పేయి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంలోనూ శర్మనే ముహూర్తం పెట్టారు. ఇక బుధవారం నాడు జరగనున్న భూమి పూజ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో పాటు మరికొంత మంది ప్రముఖులు హాజరు కానున్నారు. కాగా, ఏప్రిల్లోనే రామాలయ నిర్మాణ వేడుకలు జరగాల్సి ఉండగా లాక్డౌన్ కారణంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. (అయోధ్య భూమి పూజకు మోదీ, షెడ్యూల్ ఇదే!) -
చస్తావా? లేదా చంపమంటావా?
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో ఎందరో సెలబ్రిటీలు ముఖ్యంగా ఖాన్, కపూర్ కుటుంబాలపై అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ బాధితుల లిస్టులో ఇప్పుడు రియా చక్రవర్తి కూడా చేరిపోయారు. ఈమె సుశాంత్ మాజీ గర్ల్ఫ్రెండ్గా ప్రచారంలో ఉంది. ఆమె సుశాంత్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రెండు రోజుల క్రితం ఎమోషనల్ పోస్ట్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'నువ్వు దూరమై నెలరోజులవుతోంది. అయినా నిన్ను నేను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను' అని రాసుకొచ్చారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం సుశాంత్ చావుకు రియా కూడా కారణమంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఆమెను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. (అయితే వారిద్దరి ప్రేమాయణం నిజమా..?!) "నిన్ను కచ్చితంగా అత్యాచారం చేసి చంపేస్తాం. కాబట్టి నీ అంతట నీవుగా ఆత్మహత్య చేసుకోవడం మంచిది. లేకపోతే మేమే నిన్ను చంపేస్తాం" అంటూ బెదిరిస్తూ మెసేజ్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్షాట్ను రియా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. "నన్ను గోల్డ్ డిగ్గర్ అన్నారు, సహించాను.. హంతకురాలని నిందించారు.. భరించాను, సిగ్గు లేదని మొహం మీదే తిట్టిపోశారు.. మౌనంగా ఊరుకుండిపోయాను.. కానీ నేను ఆత్మహత్య చేసుకోవాలని, లేకపోతే అత్యాచారం చేసి చంపేస్తానని బెదిరించే హక్కు మీకెక్కడిది? అది ఎంత పెద్ద నేరమో మీకైనా అర్థమవుతోందా? ఇలాంటి దుర్మార్గమైన బెదిరింపులకు ఎవరూ పాల్పడవద్దు. ఇలాంటివి పునరావృతం కాకూడదు. ఇక జరిగింది చాలు.. ఆపేయండి" అని పోస్ట్ చేశారు. తనపై బెదిరింపు వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోండంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ట్యాగ్ చేశారు. (జీవితాంతం ప్రేమిస్తూ ఉంటాను: సుశాంత్ గర్ల్ఫ్రెండ్) View this post on Instagram I was called a gold digger ..I kept quiet I was called a murderer ....I kept quiet I was slut shamed ....I kept quiet But how does my silence give you the right to tell me that you will get me RAPED and MURDERED if I don’t commit suicide @mannu_raaut ? Do you realize the seriousness of what you have said? These are crimes, and by law no one, I repeat NO ONE should be subjected to this kind of toxicity and harassment . I request @cyber_crime_helpline @cybercrimeindia to please take necessary action . ENOUGH IS ENOUGH A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on Jul 15, 2020 at 11:20pm PDT -
‘నిన్ను చంపేస్తాం.. అత్యాచారం చేస్తాం’
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో బంధుప్రీతి మీద విపరీతమైన చర్చ జరిగింది. ముఖ్యంగా ఖాన్లు, కపూర్ల కుటుంబాలతో పాటు కరణ్ జోహర్ మీద కూడా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. వీరి వల్ల టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు రాక.. ఎందరో కుంగి పోతున్నారని.. కొందరు సుశాంత్ లాగా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని నెటిజనులు ఆరోపించారు. బాలీవుడ్లో ఓ పెద్ద మాఫియా ఉందని దాని వలనే సుశాంత్ మరణించాడంటూ కంగనాతో పాటు పలువురు.. ఇండస్ట్రీలోని పెద్దలపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఇన్ని రోజులు మహేష్ భట్, ఆలియా భట్లపై విమర్శలు చేసిన వారు తాజాగా ఆమె సోదరి షాహీన్ భట్ను వేధిస్తున్నారట. (నేను రోబో కాదు) ఆమెను చంపేస్తామని.. అత్యాచారం చేస్తామని బెదిరిస్తూ మెసేజ్ చేస్తున్నారట. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు షాహీన్. ఇవి తనను ఎలాంటి ఆశ్చర్యానికి గురి చేయడం లేదన్నారు. అంతేకాక ఈ తరహా విద్వేష పూరిత బెదిరింపుల్ని సీరియస్గా తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. గుర్తు తెలియని సైట్ల నుంచి ఇలాంటి బెదిరింపులు పాల్పడే వారిని ఐపీ అడ్రెస్లతో గుర్తించడం ఖాయమని అంటున్నారు షాహీన్.(కనీసం ఒక్క ఛాన్స్ ఇవ్వండి: నటి) -
ఇంకోసారి కనిపిస్తే, దాని పీడ వదిలించుకుంటా
లండన్: మనుషులకే ఓ చోట కాలు నిలవదు. అలాంటిది జంతువులకు ఉన్నచోటే ఉండాలంటే సాధ్యమవుతుందా? అందులోనూ 'కాలు కాలిన పిల్లి' అని మార్జాలం స్వభావం గురించి ఓ సామెత కూడా ఉంది. అయితే సౌత్వేల్కు చెందిన క్రిస్, అతని గర్ల్ఫ్రెండ్ గండాల్ఫ్ అనే పిల్లిని పెంచుకుంటున్నారు. దాన్ని గారాబం చేస్తూ బాగానే చూసుకుంటున్నారు. కానీ పక్కింటి పుల్లకూర రుచి అన్న చందంగా అది ఎప్పుడూ పక్కింట్లోకి వెళ్లేది. అక్కడున్న ఆహారాన్ని సుష్టుగా లాగించేసి యమ దర్జాగా బయటకొచ్చేది. దీని చేష్టలకు చిరాకొచ్చిన సదరు కుటుంబం ఈసారి పిల్లి ఇంట్లోకి వచ్చినప్పుడు దాని మెడకు వార్నిగ్ లెటర్ను వేలాడదీశారు. ఎప్పటిలాగే ఆ నాలుగేళ్ల పిల్లి తన కడుపు నింపుకున్న తర్వాత తన ఇంటికి వచ్చింది. అయితే దాని మెడలో వేలాడుతున్న లేఖను యజమాని తీసి చదవగా.. (ఇందులో పిల్లి ఎక్కడుందిరా బాబూ?) "దయచేసి మీ పిల్లిని మీ ఇంట్లోనే ఉంచండి. అది ఎప్పుడూ మా ఇంటి చుట్టే తిరుగుతోంది. ఇంట్లో ఆహారాన్ని తింటూ, సోఫాను గీరుతూ నాశనం చేస్తోంది. రాత్రిళ్లు కూడా వంటగదిని విడిచిపెట్టకుండా అక్కడే పడుకుంటోంది. మీరు దానికి తిండి పెడితే మంచిదనుకుంటా! ఈ పిల్లి గోల నా వల్ల కావడం లేదు, నేను విసిగిపోయాను. ఇంకోసారి మీ పిల్లి నా ఇంట్లో కనిపిస్తే దాన్ని ఎక్కడ విడిచిపెట్టి వస్తానో నాకే తెలీదు" అని హెచ్చరించి ఉంది. అంతేకాదు.. 'పిల్లికి తిండి కూడా పెట్టకండి' అని దాని మెడకు వేలాడదీసిన దానిపై రాసి ఉంది. అయితే తన పిల్లి గురించి ఇంతవరకెన్నడూ ఇలాంటి ఫిర్యాదులు అందలేదని దాని యజమాని క్రిస్ వాపోయాడు. అది అందరితో బాగా కలిసిపోయేదని, మిగతావారికి కూడా ఇదంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. (ఆ కారణానికి కూడా విడాకులు ఇచ్చేస్తారా?) -
బాంబు పెట్టి చంపేస్తానంటూ ఎమ్పీకి బెదిరింపు
లక్నో: ఉన్నావో పార్లమెంటు సభ్యుడు సాక్షి మహారాజ్ను బాంబు పెట్టి చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని బిజ్నోర్ జిల్లాకు చెందిన గఫర్గా గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు మాట్లాడుతూ.. గఫర్ కువైట్లో ఉండగా సాక్షి మహారాజ్కు ఫోన్ చేసి బాంబు పెట్టి ఆయనను చంపేస్తానని బెదిరించాడు. ఎమ్పీ పిర్యాదుతో గఫర్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి మీద సెక్షన్ 504 (శాంతిని ఉల్లంఘించే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం), సెక్షన్ 507 (క్రిమినల్ బెదిరింపు), ఐపీసీసెక్షన్ 66, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు. గఫర్ వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్, పాస్పోర్ట్, ఆధార్ కార్డు, సివిల్ ఐడి కార్డు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
కుమారుడి హత్య.. తండ్రి ఆత్మహత్య
జైపూర్: కుమారుడిని చంపేశారు.. న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించడంతో మిగతా కుటుంబ సభ్యులను కూడా చంపేస్తామని బెదిరించారు. నిందితుల బెదిరింపులకు భయపడి కళ్లు లేని ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం రాజస్తాన్లో చోటు చేసుకుంది. వివరాలు.. రత్తిరన్ జాతవ్ అనే వ్యక్తి అంధుడు. అతడికి ఇద్దరు కుమారులున్నారు. వీరిలో పెద్ద కుమారుడు హరీశ్ జాతవ్ గత నెలలో ఓ యాక్సిడెంట్ చేశాడు. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. దాంతో సదరు మహిళ బంధువులు హరీశ్ మీద దాడి చేసి చంపేశారు. దీని గురించి అతడి తండ్రి రత్తిరన్ పోలీసుకుల ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో హరీశ్పై దాడి చేసి, అతని చావుకు కారణమయిన వ్యక్తులు కేసు వాపసు తీసుకోవాలని.. లేదంటే రత్తిరన్ కుటంబ సభ్యుల్లో ఎవ్వరిని వదలమని బెదిరించారు. ఈ బెదిరింపులకు భయపడిన రత్తిరన్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం గురించి హరీశ్ సోదరుడు మాట్లాడుతూ.. ‘న్యాయం చేయాలంటూ మా నాన్న పోలీసులను ఎంతో వేడుకున్నాడు. కానీ వారు కనికరించలేదు. మమ్మల్ని చంపుతామంటూ బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ వారు మా మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ వారు ముందుగానే స్పందించి ఉంటే.. ఈ రోజు మా నాన్న మరణించేవారు కాదు. మాకు న్యాయం జరగదనే భయంతోనే మా నాన్న విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు’ అని వాపోయారు. -
ప్రభుత్వ ఆఫీసులు, ఈవీఎంలు పేల్చేస్తామంటూ..
సాక్షి, విశాఖపట్నం : బ్యాంకును పేల్చేస్తామంటూ మేనేజర్ను బెదిరింపులకు గురిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బెదిరింపులకు పాల్పడింది అనకాపల్లి మండలం వెలుగు కమ్యూనిటీలో క్లస్టర్ ఏజెంట్గా పనిచేస్తున్న రాచేపల్లి వీర శివరంజనిగా గుర్తించారు. వివరాలు.. అనకాపల్లి విశాఖ గ్రామీణ బ్యాంకును పేల్చేస్తామంటూ.. ఆ బ్యాంకు మేనేజర్కు మెసేజ్ వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, ఈవీఎంలే టార్గెట్గా పేలుళ్లకు పాల్పడతామంటూ మెసేజ్లో పేర్కొనడంతో సదరు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి తిగిన పోలీసులు శివరంజనిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకు మేనేజర్తో సహా మరో 16మందిని కూడా ఇదే విధంగా బెదిరిస్తూ మెసేజ్లు పెట్టినట్లు గుర్తించారు. -
టీడీపీకే ఓటేయాలంటూ పింఛన్ల పేరుతో బెదిరింపు