test
-
NEET(UG) రీ-టెస్ట్ ఫలితాలు విడుదల
ఢిల్లీ: నీట్ యూజీ రీ-టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు రివైజ్డ్ స్కోర్ కార్డులను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.నీట్ ఆందోళన నడుమ.. ఆపై సుప్రీంకోర్టు జోక్యంతో 1,563 మందికి గ్రేస్ మార్కుల్ని రద్దు చేసిన ఎన్టీఏ వాళ్లకు మళ్లీ పరీక్ష నిర్వహించింది. అయితే.. జూన్ 23వ తేదీన పరీక్ష నిర్వహించగా.. 813 మంది అభ్యర్థులు మాత్రం తిరిగి పరీక్ష రాశారు. వివాదాల నేపథ్యంలో ఈసారి ఫలితాల్ని పక్కాగా విడుదల చేసింది ఎన్టీఏ. పరీక్ష అనంతరం ఆన్సర్ కీ, ఓఎంఆర్ ఆన్షర్ షీట్లను పబ్లిక్ నోటీస్ ద్వారా అందుబాటులో ఉంచిన ఎన్టీఏ.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల్ని స్వీకరించింది. ఆ అభ్యంతరాలను నిపుణులు పరిశీలించిన అనంతరం.. తుది కీని విడుదల చేసింది. ఇప్పుడు ఆ అభ్యర్థుల ఫలితాల్ని వెబ్సైట్లో ఉంచింది. -
పదేళ్ల తర్వాత టెస్టు సమరం
చెన్నై: దశాబ్ద కాలం తర్వాత భారత్, దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్లు టెస్టు మ్యాచ్లో తలపడనున్నాయి. నేటి నుంచి జరిగే ఏకైక టెస్టులో సఫారీ టీమ్ను సొంతగడ్డపై భారత్ ఎదుర్కోనుంది. దక్షిణాఫ్రికాపై 3–0తో వన్డే సిరీస్ గెలిచిన భారత్ జోరు మీదుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత్ నుంచి కనీసం ఐదుగురు కొత్త ప్లేయర్లు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఉమా చెత్రి, ప్రియా పూనియా, సైకా ఇషాక్, అరుంధతి రెడ్డి, షబ్నమ్ షకీల్ తమ తొలి టెస్టు బరిలోకి దిగవచ్చని అంచనా.వన్డేలు, టి20లతో పోలిస్తే భారత మహిళల జట్టు చాలా తక్కువ సంఖ్యలో టెస్టులు ఆడుతోంది. రెండేళ్ల విరామం తర్వాత గత ఏడాది డిసెంబర్లో భారత్ టెస్టు ఆడింది. వరుసగా ఇంగ్లండ్, ఆ్రస్టేలియాలతో పోటీ పడిన మన టీమ్ రెండు మ్యాచ్లలోనూ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత జట్టు మళ్లీ బరిలోకి దిగలేదు. దక్షిణాఫ్రికాతో ఆఖరిసారిగా 2014లో మైసూరు టెస్టులో తలపడిన జట్టు 34 పరుగులతో గెలుపొందింది. కెప్టెన్ హర్మన్ప్రీత్తో పాటు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ బ్యాటింగ్లో కీలకం కానున్నారు. బౌలింగ్కు సంబంధించి పూజ వస్త్రకర్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా ప్రభావం చూపించగలరు. చెపాక్ మైదానంలో సాధారణంగా స్పిన్ను బాగా అనుకూలిస్తుంది కాబట్టి భారత్ కోణంలో ఇది సానుకూలాంశం. మరోవైపు గత రెండేళ్లలో దక్షిణాఫ్రికా కూడా ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడింది. కెపె్టన్ లారా వాల్వార్ట్, స్యూన్ లూస్, డెల్మీ టకర్, తజ్మీన్ బ్రిట్స్, అనెక్ బాష్లపై జట్టు ఆధారపడుతోంది. పిచ్ అనుకూలిస్తే స్పిన్నర్ ఎంలాబా భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలదు. -
యాంటీ రేడియేషన్ మిసైల్... ‘రుద్ర ఎమ్-2’ పరీక్ష సక్సెస్
భువనేశ్వర్: ఉపరితల యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్ర ఎమ్-2ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ టెస్ట్ సెంటర్ నుంచి బుధవారం(మే29) ఈ మిసైల్ను పరీక్షించారు.ఈ సూపర్సానిక్ మిసైల్ను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్డీవో అభివృద్ధి చేసింది. యాంటీ రేడియేషన్ మిసైల్ను భారత్ దేశీయంగా అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి. ఇది శత్రువుల నిఘా రాడార్లను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది.ప్రస్తుతం శత్రువుల నిఘా వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి భారత్ రష్యాకు చెందిన కేఎహెచ్-31 యాంటీ రేడియేషన్ మిసైళ్లను వినియోగిస్తుంది. వీటి స్థానంలో త్వరలో రుద్రను వాడనున్నారు. రుద్ర అనుకున్న లక్ష్యాల మేర పనిచేసిందని, ఈ పరీక్ష పూర్తిగా విజయవతమైందని డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపింది. రుద్ర పరీక్ష విజయవంతమైందని, దీనిని అభివృద్ధి చేసిన డీఆర్డీవోకు అభినందనలని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు. -
ఇట్లు.. ఇటలీకి!
సాక్షి, అమరావతి: అడుగు తీసి అడుగేస్తే మీడియాలో ప్రచారం కోరుకునే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గప్చుప్గా విదేశాలకు ఉడాయించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ తొలుత మీడియాకు లీకులిచ్చింది.అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్నారై విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికా రాలేదని ప్రకటించడం గమనార్హం. విదేశాల నుంచి అక్రమ నిధులను భారత్లోని షెల్ కంపెనీలకు మళ్లించిన చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు? ఏం చేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు ఏమిటన్నది సస్పెన్స్గా మారింది. అయితే తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ఇటలీలో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది.పోలింగ్ తర్వాత సైలెంట్చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం అంతా మీడియా ప్రచారంతోనే ముడిపడి ఉందన్నది బహిరంగ రహస్యమే. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన మీడియా ద్వారా విపరీతమైన ప్రచారాన్ని కోరుకుంటారు. మూడు ప్రెస్మీట్లు, ఆరు మీడియా లీకులుగా ఆయన రాజకీయం కొనసాగింది. వారానికి కనీసం రెండు సార్లు మీడియా సమావేశాలు నిర్వహిస్తుంటారు. అలాంటిది ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కనీసం ప్రెస్మీట్ పెట్టలేదు. పార్టీ నేతలతో సమావేశం నిర్వహించలేదు. తన శైలికి భిన్నంగా ఒక్కసారిగా మౌనముద్ర దాల్చారు.మరోవైపు లోకేశ్కు మాట కూడా పెగల్లేదు. చంద్రబాబు కంటే ముందే ఆయన గప్చుప్గా విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో జనసేన వర్గాలే చెప్పలేకపోతున్నాయి. రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అలికిడే లేదు. పోలింగ్ ముగిసిన తర్వాత కూటమి నోట మాటే రావడం లేదు. పోలింగ్ సరళి తమకు వ్యతిరేకంగా ఉందని చంద్రబాబు కచ్చితమైన అంచనాకు రావడంతో ఒక్కసారిగా మౌనం దాల్చినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిశ్శబ్దంగా విదేశాలకు వెళ్లడం గమనార్హం. ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడంతో..చంద్రబాబు శనివారం అర్థరాత్రి శంషాబాద్ విమా¯éశ్రయం నుంచి దుబాయ్ వెళ్లారు. ఆయన విదేశీ పర్యటనలపై అధికారికంగా వెల్లడించే టీడీపీ ఈసారి అందుకు భిన్నంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఇమ్మిగ్రేషన్ అధికారులు చంద్రబాబును కాసేపు అడ్డుకోవడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాల కేసులకు సంబంధించి చంద్రబాబుపై సీఐడీ గతంతో లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. సీఐడీ ముందస్తు అనుమతి లేకుండా ఆయన దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో చంద్రబాబును విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు సీఐడీని సంప్రదించారు. సీఐడీ ఆయనపై నాలుగు కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. సీఐడీకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లకూడదని ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేయనుంది. ఇదే విషయాన్ని సీఐడీ శంషాబాద్ ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలియచేసింది. దీంతో చంద్రబాబు విదేశీ పర్యటనపై అప్పటికప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా భావించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను వెళ్లనిచ్చారు. సాధారణంగా దుబాయ్ చేరుకుని అక్కడి నుంచి మరో విమానంలో అమెరికా లేదా ఐరోపా దేశాలకు వెళుతుంటారు. చంద్రబాబు మాత్రం దుబాయ్ నుంచి ఎక్కడికి వెళ్లారో వెల్లడించలేదు. తన పర్యటనను అంత గోప్యంగా ఎందుకు ఉంచారన్నది సందేహాస్పదంగా మారింది.స్కిల్ స్కామ్లోనూ దుబాయ్ బంధంచంద్రబాబు రహస్య పర్యటన నేపథ్యంలో గతంలో షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధుల మళ్లింపు వ్యవహారం తెరపైకి వచ్చింది. టీడీపీ హయాంలో యథేచ్ఛగా పాల్పడిన కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులను ఆయన అక్రమంగా విదేశాలకు తరలించి అక్కడి నుంచి భారత్లోని షెల్ కంపెనీలకు మళ్లించినట్లు సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. చంద్రబాబు 52 రోజులు రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న స్కిల్ స్కామ్లో కూడా నిధులను అక్రమంగా దుబాయ్కు చేర్చారు.ఆ కుంభకోణంలో పాత్రధారులైన ఆయన మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, కిలారి రాజేశ్ దుబాయ్ నుంచే అక్రమ నిధులను సింగపూర్ మీదుగా హైదరాబాద్లోని షెల్ కంపెనీకి తరలించారు. అనంతరం ఆ నిధులు చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. అంటే ఆయన ఆర్థిక కుంభకోణాల్లో దుబాయ్ కీలక కేంద్రంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఇటలీలో ప్రత్యక్షం..!గుట్టుగా విదేశాలకు వెళ్లిన చంద్రబాబు ఇటలీ చేరుకున్నట్లు సమాచారం. దుబాయ్ నుంచి చంద్రబాబు దంపతులు ఇటలీ వెళ్లినట్లు ఇమ్మిగ్రేషన్ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. లోకేశ్ దంపతులు కూడా అక్కడికే వెళ్లినట్లు భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్లినప్పుడు అధికారికంగా వెల్లడించారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా గోప్యత పాటించడం గమనార్హం. ఇటలీతోపాటు మరికొన్ని చిన్న చిన్న దేశాలకు వారు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ నుంచి సింగపూర్కు నిధులు మళ్లించి అనంతరం భారత్లోని షెల్ కంపెనీలకు చేరవేసే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనను పూర్తిగా గోప్యంగా ఉంచడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. -
పదేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు
బెంగళూరు: భారత్లో దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు పర్యటన ఖరారైంది. వచ్చే జూన్, జూలైలో పూర్థిసాయి ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా భారత్తో దక్షిణాఫ్రికా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్లు ఆడుతుంది. ముందుగా బెంగళూరులో జూన్ 16న వన్డే సిరీస్ మొదలవుతుంది. 19న రెండో వన్డే, 23న మూడో వన్డేతో 50 ఓవర్ల ఫార్మాట్ ముగుస్తుంది. వన్డే సిరీస్ ముగిశాక ఏకైక టెస్టు పోరు జూన్ 28 నుంచి చెన్నైలో జరుగుతుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇది కేవలం మూడో టెస్టు కానుంది. దక్షిణాఫ్రికాలోని పార్ల్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు 2002లో... భారత్లోని మైసూరు వేదికగా రెండో టెస్టు 2014లో జరిగాయి. ఆ తర్వాత ఈ రెండు జట్లు టెస్టు ఫార్మాట్లో మరో మ్యాచ్ ఆడలేదు. దక్షిణాఫ్రికాతో ఆడిన రెండు టెస్టుల్లోనూ భారతే నెగ్గింది. ఏకైక టెస్టు ముగిశాక బెంగళూరులో ఈ రెండు జట్ల మధ్య జూలై 5, 7, 9 తేదీల్లో మూడు టి20ల సిరీస్ జరుగుతుంది. -
Test embed video
Test embed video Test embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed video -
బంగ్లాదేశ్ జట్టులో షకీబ్ పునరాగమనం
రాజకీయ నాయకుడిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాక బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. శ్రీలంక జట్టుతో చట్టోగ్రామ్లో శనివారం మొదలయ్యే రెండో టెస్టులో షకీబ్ ఆడనున్నాడు. గత ఏడాది భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్కప్ మధ్యలో షకీబ్ గాయంతో వైదొలిగాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో 37 ఏళ్ల షకీబ్ అవామీ లీగ్ పార్టీ తరఫున మగురా నియోజకవర్గం నుంచి పోటీచేసి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. -
ISRO: ‘పుష్పక్’ టెస్ట్ సక్సెస్
బెంగళూరు: రీ యూజబుల్ లాంచ్ వెహికిల్(ఆర్ఎల్వీ) ‘పుష్పక్’ను శుక్రవారం(మార్చ్ 22) ఉదయం 7 గంటలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. ఈ మేరకు ఇస్రో ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టింది.కర్ణాటకలోని చాలకెరెలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్(ఏటీఆర్) నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. పుష్పక్ ఆర్ఎల్వీని తొలుత ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన హెలికాప్టర్లో 4.5 కిలోమీటర్ల ఎత్తులో వదిలేశారు. ఆ తర్వాత భూమి నుంచి ఎలాంటి నియంత్రణ లేకుండా స్వతంత్రంగా ముందు నిర్ణయించిన చాలకెరె ఏటీఆర్ రన్వేపై కచ్చితమైన ప్రదేశంలో పుష్పక్ ల్యాండ్ అయింది. అంతరిక్ష ప్రయోగాల ఖర్చు తగ్గించుకునేందుకుగాను లాంచింగ్ రాకెట్లను తిరిగి వాడుకునే క్రమంలో ఇస్రో ఆర్ఎల్వీ ప్రయోగాలను నిర్వహిస్తోంది. ‘పుష్పక్ లాంచ్ వెహికిల్ పై భాగంలో చాలా ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలుంటాయి. వీటిని సురక్షితంగా భూమిపైకి తిరిగి తీసుకురాగలిగితే మళ్లీ వాడుకునేందుకు వీలుంటుంది’అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. పుష్పక్ ఆర్ఎల్వీలో ఫ్యూసిలేజ్(బాడీ), నోస్ క్యాప్, డబుల్ డెల్టా రెక్కలు, ట్విన్ వర్టికల్ టెయిల్స్ భాగాలుంటాయి. Pushpak captured during its autonomous landing📸 pic.twitter.com/zx9JqbeslX — ISRO (@isro) March 22, 2024 ఇదీ చదవండి.. ఫ్యాక్ట్ చెక్ యూనిట్లపై సుప్రీం స్టే -
బెంట్లీ కార్లను ఎలా టెస్ట్ చేస్తారో తెలుసా..?
ప్రముఖ కార్ల తయారీ సంస్థలు వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించేందుకు వివిధ మార్గాలు, పరీక్షలు అనుసరిస్తాయి. కొన్ని కంపెనీలు ప్రత్యేకతను చాటుకునేందుకు వారి ఉత్పత్తుల్లో కొత్త ఫీచర్లు, బిల్డ్ క్వాలిటీ.. వంటివి పరిచయం చేస్తాయి. అందులో భాగంగా బెంట్లీ కార్లపై పెయింట్ వేసినా అది కారుకు అతుక్కోకుండా తయారుచేస్తున్నారు. దాన్ని వినియోగదారులకు అందించేముందు కంపెనీ పరీక్షలు నిర్వహిస్తుంది. అయితే అందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతోంది. ఈ వీడియోలో.. బెంట్లీ కారుకు పెయింట్ వేశారు. అది కారుపై అతికేలా మంటతో వేడి చేశారు. తర్వాత ఆ పెయింట్ను చిన్నక్లాత్తో శుభ్రం చేసేందుకు ప్రయత్నిస్తే కారుకు ఏమాత్రం అంటకుండా వెంటనే మొత్తం శుభ్రం అయింది. ఈ వ్యవహారాన్ని ఆ సంస్థ జీఎం టీజీ సమౌరి చూసి ఆశ్చర్యపోతున్నట్లు వీడియోలో ఉంది. Bentley staff spray paint and flame one of their cars to show how their paint protection product works pic.twitter.com/BYRIITFpEM — Historic Vids (@historyinmemes) March 13, 2024 -
ఎయిర్పోర్టుల్లో కొత్త రూల్స్.. ఆల్కహాల్ పరీక్షలు చేయించుకోవాల్సిందే!
భారత విమానాశ్రయాల్లో పనిచేస్తున్న వారికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) కొత్త నిబంధనలు విధించింది. జూన్ 1 నుంచి ఎయిర్ పోర్టు సిబ్బందిలో కనీసం 25 శాతం మంది ర్యాండమ్గా రోజూ ఆల్కహాల్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని డీజీసీఏ పేర్కొంది. ప్రస్తుతం ప్రతిరోజూ 10 శాతం మంది సిబ్బందికి పరీక్షలు చేస్తున్నారు. డీజీసీఏ ప్రకారం.. ఏవియేషన్ సిబ్బందిలోని ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు, ఇతర సాంకేతికంగా శిక్షణ పొందిన ఉద్యోగులు, ఇంధనం, క్యాటరింగ్ వాహనాలను నడిపే డ్రైవర్లు, పరికరాల ఆపరేటర్లు, ఏరోబ్రిడ్జ్ ఆపరేటర్లు, మార్షలర్లు, ఆప్రాన్ నియంత్రణ, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవల సిబ్బంది అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ఈ ఆల్కహాల్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో మొదటిసారి ఆల్కహాల్ తీసుకున్నట్లు నిర్ధారణ అయితే వారిని విధులకు దూరంగా ఉంచడంతోపాటు వారి లైసెన్స్ను మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తారు. ఆల్కహాల్ పరీక్షలో పాల్గొనడానికి నిరాకరించినా లేదా విమానాశ్రయం ప్రాంగణం నుండి బయటకు వెళ్లడం ద్వారా తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఇదే శిక్షను అమలు చేస్తారు. నిబంధనలను రెండవసారి ఉల్లంఘిస్తే, సంబంధిత సిబ్బందికి డీజీసీఏ జారీ చేసిన లైసెన్స్ ఒక సంవత్సరం పాటు సస్పెండ్ అవుతుందని నిబంధనలు పేర్కొన్నాయి. ఇక పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి ప్రీ-ఫ్లైట్ ఆల్కహాల్ పరీక్షలు డీజీసీఏ నియమాల మరొక సెట్ ప్రకారం సంబంధిత విమానయాన సంస్థలు నిర్వహిస్తాయి. -
వీఐపీల డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ముఖ్యమైన వ్యక్తుల (వీఐపీ) డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. చిన్నచిన్న తప్పిదాలతో వీఐపీలు ప్రాణాలు కోల్పోతున్నారని.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి ఘటన నేపథ్యంలో రవాణా శాఖ సుమోటోగా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. వీఐపీలంతా తమ డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని కోరుతూ లేఖలు రాస్తామన్నారు. ఈ జాబితాలో చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, రాజకీయ నాయకులు ఉంటారని వివరించారు. వారి డ్రైవర్లకు అన్ని జిల్లాల్లో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించేందుకు రెండు, మూడు రోజుల్లో ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ పరీక్షల అనంతరం డ్రైవర్లకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని, వారిని కొనసాగించుకోవాలా వద్దా అనేది వీఐపీల ఇష్టమని చెప్పారు. పొన్నంప్రభాకర్ శనివారం గాం«దీభవన్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగింది మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగిందని మంత్రి పొన్నం చెప్పారు. గతంలో రోజూ సగటున 45లక్షల మంది వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారని, ఇప్పుడా సంఖ్య 55–60 లక్షల వరకు ఉంటోందని తెలిపారు. మహిళలతో పాటు పురుష ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. ఆర్టీసీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా నడుస్తోందని చెప్పారు. పురుషులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే ఆలోచనేదీ లేదని, గ్రామాలకు బస్సుల కనెక్టివిటీ పెంచుతామని వెల్లడించారు. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని.. పీపీపీ పద్ధతిలో ఆర్టీసీ స్థలాల్లో ప్రాజెక్టులు చేపడతామని వివరించారు. మహాలక్ష్మి పథకం కింద అనవసరంగా జీరో టికెట్లు కొట్టే కండక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీకి మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ప్రతిమా శ్రీనివాసరావు లాంటి వారు పాత బకాయిలు చెల్లిస్తున్నారన్నారు. ఆర్టీసీలోకి కొత్తగా వెయ్యి బస్సులు తీసుకువస్తామన్నారు. ఇప్పటికే 100 వచ్చాయని, దశలుగా మిగతావి తెస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్గో ఆదాయం రూ.150 కోట్లకు చేరిందని, రూ.2 వేల కోట్ల ఆదాయార్జన ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు. బీఆర్ఎస్, బీజేపీలది డ్రామా బీఆర్ఎస్– బీజేపీ ఒకటేనని.. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కొత్త డ్రామా మొదలుపెట్టాయని పొన్నం విమర్శించారు. బీఆర్ఎస్–బీజేపీ ఒకటి కాదని చెప్పుకొనేందుకు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇస్తున్నారని.. అందుకే వాయిదాల పద్ధతుల్లో నోటీసులు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. బిహార్ మోడల్లో కులగణన త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని, ఇందుకోసం బిహార్లో అమలు చేసిన ప్రక్రియను అనుసరిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. ఈ గణన కోసం ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకుంటామన్నారు. ప్రతి ఎన్యూమరేటర్కు శిక్షణ ఇస్తామని, కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ అంశంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సూచనలు తీసుకుంటామన్నారు. కులగణన బిల్లును దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఆమోదించలేదని, అలాంటిది ఏదైనా ఉంటే బీఆర్ఎస్ నేతలు చూపాలని సవాల్ చేశారు. ఆటో కార్మి కులకు ఏటా రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చామని.. దీనిపై కేబినెట్లోనూ చర్చించామని మంత్రి తెలిపారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటోల రంగం ఇబ్బంది పడుతుందనడంలో వాస్తవం లేదని.. అందుకు ప్రతి నెలా అమ్ముడవుతున్న ప్యాసింజర్ ఆటోల గణాంకాలే నిదర్శనమని పేర్కొన్నారు. -
మే 23న ఎడ్సెట్..జూన్ 4,5 తేదీల్లో ఐసెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 4, 5 తేదీల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ను ఆదివారం విడుదల చేసింది. మార్చి 5న నోటిఫికేషన్, 7నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఆలస్య రుసుముతో మే 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని షెడ్యూల్లో పేర్కొంది. పూర్తి వివరాల కోసం https://icet. tsche. ac.in ను చూడవచ్చని తెలిపింది. మే 23న ఎడ్సెట్ రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఉమ్మడి ప్రవేశ పరీక్షను మే 23న నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది. మార్చి 4న నోటిఫికేషన్, మార్చి 6 నుంచి మే 13 వరకూ దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వెల్లడించింది. పరీక్ష మే 23న ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ, సాయంత్రం 2 నుంచి 4 గంటల వరకూ ఉంటుందని పేర్కొంది. -
నితీష్కు వ్యతిరేకంగా తేజస్వి ఇంటిలో ఏం జరుగుతోంది?
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ ఎమ్యెల్యేలంతా ఆ పార్టీ నేత తేజస్వి నివాసంలో గృహనిర్బంధంలో ఉన్నారు. వారంతా తమకు కావాల్సిన దుప్పట్లు, మందులను శనివారం సాయంత్రమే తెప్పించుకున్నారు. ఈరోజు (ఆదివారం) ఉదయం తేజస్వి నివాసం బయట సందడి నెలకొంది. ఆర్జేడీ ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు తేజస్వీ యాదవ్ స్వయంగా సన్నాహాలు చేస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు ఎమ్మెల్యేలంతా తేజస్వి నివాసంలోనే ఉండాలని పార్టీ ఆదేశించినట్లు ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి. అంటే సోమవారం అసెంబ్లీలో జరిగే నితీష్ బలపరీక్షకు వీరంతా నేరుగా హాజరుకానున్నారు. తేజస్వి నివాసంతో 76 మంది ఎమ్మెల్యేలున్నారని, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రాలేదని సమాచారం. #WATCH | Bihar: RJD MLAs and MLAs of Mahagathbandhan at the residence of former Deputy CM and RJD leader Tejashwi Yadav in Patna ahead of the Floor Test scheduled to take place tomorrow. pic.twitter.com/5FXnvGH8Gp — ANI (@ANI) February 11, 2024 -
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆల్రౌండర్కు గాయం
సెంచూరియన్: తొలి టెస్టులో ఓడిన భారత్కు మరో దెబ్బ! బౌలింగ్ ఆల్రౌండర్గా సెంచూరియన్ టెస్టు ఆడిన శార్దుల్ ఠాకూర్ గాయపడ్డాడు. అయితే ఇది మ్యాచ్ సమయంలో కాదు! నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని ఎడమ భుజానికి గాయమైంది. వెంటనే జట్టు ఫిజియో ఐస్ ప్యాక్తో ఉపశమన సపర్యలు చేశాడు. అనంతరం మళీ ప్రాక్టీస్కు దిగలేదు. దీంతో అతను కేప్టౌన్లో జనవరి 3 నుంచి జరిగే ఆఖరి టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు శార్దుల్ భుజానికి స్కానింగ్ తీయాల్సి ఉంది. దీన్నిబట్టే అతను అందుబాటులో ఉంటాడ లేదా అనే విషయంపై స్పష్టత వస్తుంది. సఫారీ బౌలర్ కొయెట్జీ అవుట్ దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీ రెండో టెస్టుకు దూరమయ్యాడు. 23 ఏళ్ల బౌలర్ పొత్తికడుపు నొప్పితో సతమతమవుతున్నాడు. ఈ నొప్పితోనే తొలిటెస్టు ఆడటంతో వాపు మొదలైందని జట్టు వర్గాలు తెలిపాయి. దీంతో కొయెట్జీ కేప్టౌన్ టెస్టుకు అందుబాటులో లేడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. ఇదివరకే రెగ్యులర్ కెపె్టన్ బవుమా కూడా గాయంతో రెండో టెస్టుకు గైర్హాజరు కానున్నాడు. కొయెట్జీ స్థానాన్ని ఎన్గిడి, ముల్డర్లలో ఒకరితో భర్తీ చేసే అవకాశముంది. -
మన బ్యాటర్లూ అదరగొట్టారు
ముంబై: ఆ్రస్టేలియాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల హవా రెండో రోజూ కొనసాగింది. వాంఖెడే మైదానంలో తొలి రోజు పదునైన బౌలింగ్తో ఆసీస్ మహిళలను కట్టడి చేసిన మన జట్టు శుక్రవారం బ్యాటింగ్లోనూ చెలరేగి భారీ ఆధిక్యాన్ని అందుకుంది. మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 119 ఓవర్లలో 7 వికెట్లకు 376 పరుగులు చేసింది. దాంతో ప్రస్తుతానికి భారత్కు 157 పరుగుల ఆధిక్యం లభించింది. స్మృతి మంధాన (106 బంతుల్లో 74; 12 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (121 బంతుల్లో 73; 9 ఫోర్లు), దీప్తి శర్మ (147 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు), రిచా ఘోష్ (104 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఆసీస్ బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ యాష్లీ గార్డ్నర్ 4 వికెట్లు పడగొట్టింది. ప్రస్తుతం క్రీజ్లో దీప్తితో పాటు పూజ వస్త్రకర్ (115 బంతుల్లో 33 బ్యాటింగ్; 4 ఫోర్లు) ఉంది. వీరిద్దరు ఇప్పటికే ఎనిమిదో వికెట్కు అభేద్యంగా 102 పరుగులు జోడించడం విశేషం. శుక్రవారం ఆట మొత్తం 100 ఓవర్ల పాటు సాగగా, గార్డ్నర్ ఒక్కతే 36 ఓవర్లు వేసింది. స్మృతి రనౌట్... ఓవర్నైట్ స్కోరు 98/1తో భారత్ రెండో రోజు ఆట కొనసాగించింది. స్నేహ్ రాణా (9) ఎక్కువ సేపు నిలవలేకపోగా, 68 బంతుల్లో స్మృతి అర్ధ సెంచరీ పూర్తయింది. ఆపై కొన్ని చక్కటి షాట్లు ఆడిన స్మృతి స్వయంకృతంతో వెనుదిరిగింది. గార్డ్నర్ బౌలింగ్లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడి సింగిల్కు ప్రయత్నించింది. అయిుతే రిచాతో సమన్వయలోపంతో పరుగు ఆలస్యం కావడంతో నాన్స్ట్రయికింగ్ ఎండ్లో రనౌటైంది. అనంతరం రిచా, జెమీమా భాగస్వామ్యం భారత్ను మెరుగైన స్థితికి చేర్చింది. తొలి సెషన్లో భారత్ 2 వికెట్లు కోల్పోయి 95 పరుగులు జోడించింది. భారీ భాగస్వామ్యాలు... లంచ్ తర్వాత ఇన్నింగ్స్ 63వ ఓవర్లో గార్డ్నర్ బౌలింగ్లో రిచా కొట్టిన ఫోర్తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. జెమీమా 86 బంతుల్లో, కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న రిచా 98 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే రిచాను గార్త్ అవుట్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. జెమీమా, రిచా నాలుగో వికెట్కు 113 పరుగులు జత చేశారు. అనంతరం చెలరేగిన గార్డ్నర్ తన వరుస ఓవర్లలో హర్మన్ప్రీత్ (0), యస్తిక (1)లను పెవిలియన్ను పంపడంతో పాటు కొద్ది సేపటికే జెమీమాకు కూడా అవుట్ చేసింది. 14 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోవడంతో 274/7 వద్ద భారత్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపు పట్టదనిపించింది. అయితే దీప్తి, పూజ భిన్నంగా ఆలోచించారు. చివరి సెషన్లో పట్టుదలగా నిలబడి పరుగులు సాధిస్తూ ఆసీస్ బౌలర్లను చికాకు పెట్టారు. దీప్తి తన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శించగా... బౌలింగ్లో చెలరేగిన పూజ బ్యాటింగ్లోనూ మంచి డిఫెన్స్తో దీప్తికి అండగా నిలిచింది. ఈ క్రమంలో 115 బంతుల్లో దీప్తి హాఫ్ సెంచరీని అందుకుంది. కెరీర్లో నాలుగో టెస్టు ఆడుతున్న దీప్తి ప్రతీ టెస్టులోనూ అర్ధసెంచరీ చేయడం విశేషం. ఈ జోడీని విడదీసేందుకు ఆసీస్ ఎనిమిది బౌలర్లతో ఎంతగా శ్రమించినా లాభం లేకపోయింది. 38 ఓవర్ల సెషన్లో భారత్ 100 పరుగులు సాధించగా, ఆసీస్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 219; భారత్ తొలి ఇన్నింగ్స్: షఫాలీ (ఎల్బీ) (బి) జొనాసెన్ 40; స్మృతి (రనౌట్) 74; స్నేహ్ రాణా (బి) గార్డ్నర్ 9; రిచా (సి) గార్డ్నర్ (బి) గార్త్ 52; జెమీమా (సి) సదర్లాండ్ (బి) గార్డ్నర్ 73; హర్మన్ప్రీత్ (ఎల్బీ) (బి) గార్డ్నర్ 0; యస్తిక (ఎల్బీ) (బి) గార్డ్నర్ 1; దీప్తి శర్మ (బ్యాటింగ్) 70; పూజ (బ్యాటింగ్) 33; ఎక్స్ట్రాలు 24; మొత్తం (119 ఓవర్లలో 7 వికెట్లకు) 376. వికెట్ల పతనం: 1–90, 2–140, 3–147, 4–260, 5–261, 6–265, 7–274. బౌలింగ్: లౌరెన్ 9–3–23–0, గార్త్ 10–1–49–1, పెరీ 4–0–31–0, గార్డ్నర్ 41–7–100–4, జొనాసెన్ 18–4–42–1, సదర్లాండ్ 8–2–20–0, అలానా 19–1–69–0, తహీలా 10–2–22–0. -
ఆసీస్ను పడగొట్టిన పూజ
ముంబై: ఆ్రస్టేలియాతో ప్రారంభమైన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు తొలి రోజు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ముందుగా చక్కటి బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేసిన మన బృందం ఆ తర్వాత బ్యాటింగ్లోనూ మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా మహిళల జట్టు భారత బౌలర్ల ధాటికి తమ తొలి ఇన్నింగ్స్లో 219 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టుపై టెస్టుల్లో ఆసీస్ జట్టుకిదే అత్యల్ప స్కోరు. తహీలా మెక్గ్రాత్ (56 బంతుల్లో 50; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... బెత్ మూనీ (40), కెప్టెన్ అలీసా హీలీ (38), కిమ్ గార్త్ (28 నాటౌట్) కీలక పరుగులు సాధించారు. పేసర్ పూజ వస్త్రకర్ (4/53) నాలుగు కీలక వికెట్లు పడగొట్టగా... స్పిన్నర్లు స్నేహ్ రాణా 3, దీప్తి శర్మ 2 వికెట్లు తీశారు. తొలి ఓవర్లోనే లిచ్ఫీల్డ్ (0) రనౌట్ కాగా, అద్భుత బంతితో ఎలీస్ పెరీ (4)ని పూజ బౌల్డ్ చేయడంతో ఆసీస్ కష్టాల్లో పడగా... మెక్గ్రాత్, మూనీ మూడో వికెట్కు 80 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 19 ఓవర్లలోనే 98 పరుగులు చేసింది. స్మృతి మంధాన (49 బంతుల్లో 43 బ్యాటింగ్; 8 ఫోర్లు), షఫాలీ వర్మ (59 బంతుల్లో 40; 8 ఫోర్లు) ఆరంభం నుంచే దూకుడుగా ఆడి తొలి వికెట్కు 100 బంతుల్లోనే 90 పరుగులు జత చేశారు. ప్రస్తుతం భారత్ మరో 121 పరుగులు వెనుకబడి ఉంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: మూనీ (సి) స్నేహ్ రాణా (బి) పూజ 40; లిచ్ఫీల్డ్ (రనౌట్) 0; ఎలీస్ పెరీ (బి) పూజ 4; తహీలా (సి) రాజేశ్వరి (బి) స్నేహ్ రాణా 50; హీలీ (బి) దీప్తి 38; అనాబెల్ (ఎల్బీ) (బి) పూజ 16; యాష్లీ (సి) యస్తిక (బి) పూజ 11; జెస్ (ఎల్బీ) (బి) దీప్తి 19; అలానా కింగ్ (సి) యస్తిక (బి) స్నేహ్ రాణా 5; గార్త్ (నాటౌట్) 28; లౌరెన్ (సి) స్మృతి (బి) స్నేహ్ రాణా 6; ఎక్స్ట్రాలు 2; మొత్తం (77.4 ఓవర్లలో ఆలౌట్) 219. వికెట్ల పతనం: 1–2, 2–7, 3–87, 4–103, 5–143, 6–159, 7–160, 8–168, 9–198, 10–219. బౌలింగ్: రేణుక 7–0–35–0, పూజ వస్త్రకర్ 16–2–53–4, స్నేహ్ రాణా 22.4–4–56–3, రాజేశ్వరి 13–4–29–0, దీప్తి శర్మ 19–3–45–2. భారత్ తొలి ఇన్నింగ్స్: షఫాలీ (ఎల్బీ) (బి) జెస్ 40; స్మృతి (బ్యాటింగ్) 43; స్నేహ్ రాణా (బ్యాటింగ్) 4; ఎక్స్ట్రాలు 11; మొత్తం (19 ఓవర్లలో వికెట్ నష్టానికి) 98. వికెట్ల పతనం: 1–90. బౌలింగ్: లౌరెన్ 4–2–12–0, కిమ్ గార్త్ 4–0–34–0, పెరీ 4–0–31–0, యాష్లీ 5–3–8–0, జెస్ జొనాసెన్ 2–1–4–1. -
తొలి విజయం లక్ష్యంగా...
ముంబై: ఇంగ్లండ్ జట్టుపై సాధించిన ఘనవిజయం స్ఫూర్తితో... నేటి నుంచి ఆ్రస్టేలియాతో జరిగే నాలుగు రోజుల ఏకైక టెస్ట్లో గెలుపే లక్ష్యంగా భారత మహిళల జట్టు బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా 347 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఆ్రస్టేలియా జట్టుపై భారత రికార్డు అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో జరిగిన 10 టెస్టుల్లో భారత్ ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. నాలుగు టెస్టుల్లో ఓడిన భారత జట్టు... ఆరు టెస్టులను డ్రా చేసుకుంది. 1984 తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టుతో భారత్ టెస్టు ఆడనుండటం గమనార్హం. ఆసీస్పై భారత్ తొలి గెలుపు సాధించాలంటే సమష్టి ప్రదర్శన తప్పనిసరి. బ్యాటింగ్లో స్మృతి మంధాన, షపాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్, యస్తిక భాటియా భారీ స్కోర్లు చేయాలి. ఆల్రౌండర్లు దీప్తి శర్మ, స్నేహ్ రాణా, పూజా వస్త్రకర్ కూడా తమవంతు పాత్రను పోషించారు. బౌలర్ రేణుక సింగ్ తన స్వింగ్ బౌలింగ్ పేస్తో ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయాలి. మరోవైపు అలీసా హీలీ నాయకత్వంలో ఆ్రస్టేలియా జట్టు కూడా పటిష్టంగా ఉంది. బెత్ మూనీ, యాష్లే గార్డ్నర్, తాలియా మెక్గ్రాత్, ఎలీసా పెర్రీ, అనాబెల్ సదర్లాండ్ ప్రదర్శనపై ఆ్రస్టేలియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. -
దీప్తి ధమాకా
ముంబై: ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో భారత మహిళల జట్టు విజయంపై కన్నేసింది. భారత బౌలర్ల జోరుతో రెండో రోజే మ్యాచ్పై జట్టు పూర్తిగా పట్టు బిగించింది. స్పిన్నర్ల హవా సాగిన శుక్రవారం రెండు జట్లలో కలిపి 19 వికెట్లు నేలకూలగా... అందులో 15 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టారు. భారత ఆఫ్స్పిన్నర్ దీప్తి శర్మ (5/7) కేవలం 7 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. దీప్తి ధాటికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 35.3 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. నాట్ సివర్ బ్రంట్ (70 బంతుల్లో 59; 10 ఫోర్లు) మాత్రమే పోరాడి అర్ధ సెంచరీ సాధించగా, ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. మరో ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాకు 2 వికెట్లు దక్కాయి. ఫలితంగా భారత్కు తొలి ఇన్నింగ్స్లో 292 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే ఇంగ్లండ్కు ఫాలోఆన్ ఇవ్వకుండా భారత్ మళ్లీ బ్యాటింగ్కు దిగింది. ఆరంభం నుంచే బ్యాటర్లంతా దూకుడుగా ఆడటంతో జట్టు ఆధిక్యం మరింత పెరిగింది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు సాధించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (67 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) రాణించగా... షఫాలీ వర్మ (33), జెమీమా (27), స్మృతి మంధాన (26) కీలక పరుగులు సాధించారు. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు చార్లీ డీన్ 4, ఎకెల్స్టోన్ 2 వికెట్లతో భారత్ను దెబ్బ తీశారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ టాప్ స్కోరర్గా నిలిచిన శుభ సతీశ్ ఎడమ చేతికి ఫ్రాక్చర్ కావడంతో బ్యాటింగ్కు దిగలేదు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 410/7తో శుక్రవారం ఉదయం ఆట కొనసాగించిన భారత్ మరో 18 పరుగులు జోడించి 428 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఏకంగా 478 పరుగుల ఓవరాల్ ఆధిక్యంతో భారత్ ఇప్పటికే అసాధ్యమైన లక్ష్యం విధించే దిశగా సాగుతోంది. మ్యాచ్లో మరో రెండు రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో ఇంగ్లండ్ ఓటమి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యమే. -
మహిళల ‘టెస్టు’కు సిద్ధం
ముంబై: రెండేళ్ల విరామం తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు టెస్టు మ్యాచ్ బరిలోకి దిగుతోంది. టి20 సిరీస్ తర్వాత ఇంగ్లండ్తో నేటినుంచి జరిగే ఏకైక టెస్టు (నాలుగు రోజుల మ్యాచ్)లో భారత్ తలపడుతుంది. వన్డేలు, టి20లను పక్కన పెడితే టెస్టుల్లో భారత జట్టు ప్రత్యర్థి తో పోలిస్తే అనుభవం, ఫలితాలపరంగా చాలా వెనుకబడి ఉంది. మన అమ్మాయిలకు ఎప్పుడో గానీ టెస్టులు ఆడే అవకాశం రాదు. ఓవరాల్గా భారత్ ఇప్పటి వరకు 38 టెస్టులు మాత్రమే ఆడగా...99 మ్యాచ్లు ఆడిన ఇంగ్లండ్ ఇప్పుడు 100వ మ్యాచ్కు సిద్ధమైంది. 2014 తర్వాత భారత్లో మహిళల టెస్టు జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. భారత మహిళల క్రికెట్ దిగ్గజాలు మిథాలీరాజ్, జులన్ గోస్వామిల రిటైర్మెంట్ తర్వాత జట్టు ఆడుతున్న మొదటి టెస్టు ఇదే కానుంది. ఈ నేపథ్యంలో టెస్టు అనుభవంపై ఇంగ్లండ్ ఆధారపడుతుండగా... సొంతగడ్డపై ఆడుతున్న అనుకూలతను హర్మన్ సేన నమ్ముకుంది. 2021 సెపె్టంబర్లో ఆఖరి సారిగా టెస్టు ఆడిన భారత్ ఆసీస్తో జరిగిన ఆ మ్యాచ్ను ‘డ్రా’గా ముగించగలిగింది. ఇంగ్లండ్ సమష్టిగా... దేశవాళీలో నాలుగు రోజుల మ్యాచ్లు ఎక్కువగా ఆడటం పాటు ‘యాషెస్’ కార ణంగా కూడా ఇంగ్లండ్ టీమ్ తరచుగా టెస్టు మ్యాచ్ల బరిలోకి దిగుతూ వస్తోంది. ఇప్పు డు కూడా ఆ జట్టు ఈ ఫార్మాట్లో తమ బలాన్నే నమ్మకుంది. జట్టులో ఎక్కువ మంది సభ్యులకు టెస్టు అనుభవం ఉంది. కెప్టెన్ హీతర్ నైట్తో పాటు బీమాంట్, సివర్ బ్రంట్ కీలక బ్యాటర్లు కాగా...మిడిలార్డర్లో క్యాప్సీ, డాని వాట్ ప్రభావం చూపించగలరు. బీమాంట్తో పాటు రెండో ఓపెనర్గా డంక్లీ బరిలోకి దిగవచ్చు. కీపర్ ఎమీ జోన్స్ ధాటిగా ఆడగలదు. స్పిన్నర్ సోఫీ ఎకెల్స్టోన్ ఇంగ్లండ్కు బౌలింగ్లో ప్రధాన బలం. ఇతర బౌలర్లు క్రాస్, బెల్, డీన్ భారత పిచ్పై ఏమాత్రం ప్రభావం చూపించగలరో చెప్పలేం. ఇంగ్లండ్ జట్టు భారత గడ్డపై 2005 తర్వాత టెస్టు మ్యాచ్ ఆడటం ఇదే మొదటిసారి. వారిద్దరే కీలకం... భారత జట్టులో భారత కెప్టెన్ కు 3 టెస్టుల, స్టార్ బ్యాటర్ స్మృతి మంధానకు 4 టెస్టుల అనుభవం మాత్రమే ఉండగా...మిగతా జట్టు సభ్యులకు ఆమాత్రం అనుభవం కూడా లేదు. వన్డేలు, టి20లతో పోలిస్తే క్రీజ్లో నిలవడంలో వీరు ఏమాత్రం పట్టుదల కనబరుస్తారనేది ఆసక్తికరం. అందుకే జట్టు విజయావకాశాలు ప్రధానంగా హర్మన్, స్మృతిలపైనే ఆధారపడి ఉన్నాయి. షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ తమ బ్యాటింగ్ బలాన్ని ప్రదర్శించాల్సి ఉంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో దూకుడుకు మారుపేరైన షఫాలీ ఇక్కడ కాస్త ఓపికను చూపించి ఆడితే భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. రోడ్రిగ్స్ కూడా టెస్టుకు తగినట్లుగా తన ఆటతీరును మార్చుకోగలదని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. అనుభవజు్ఞలైన స్పిన్నర్లు స్నేహ్ రాణా, రాజేశ్వరి గైక్వాడ్ టెస్టులో ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది చూడాలి. వీరితో పాటు దీప్తి శర్మ కూడా స్పిన్తో రాణించగలదు. భారత్ ఆడిన గత రెండు టెస్టులు కూడా విదేశీ గడ్డపైనే జరిగాయి. ఆ రెండు మ్యాచ్లలో జట్టు ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగింది. అలా చూస్తే రేణుకా సింగ్, మేఘనా సింగ్లతో పాటు పూజ వస్త్రకర్కు అవకాశం ఉంటుంది. ఇద్దరు పేసర్లకే పరిమితమైతే మాత్రం పూజను పక్కన పెట్టి అదనపు బ్యాటర్గా రిచా ఘోష్ను తీసుకోవచ్చు. -
సరదాగా డీఎన్ఏ టెస్టు... షాకిచ్చిన రిపోర్టు!
ఒక యూరోపియన్ మహిళ తన సోదరీమణులతో కలిసి సరదాగా ఇంట్లోనే డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలనుకుంది. అయితే వాటి ఫలితాలు తన జీవితంలో ఎంతటి దారుణమైన పరిణామాలకు దారితీస్తాయో ఆమె గ్రహించలేకపోయింది. తన తల్లిదండ్రులు ఇన్నాళ్లూ ఇంత పెద్ద రహస్యాన్ని దాచిపెట్టారని ఆమె ఊహించలేకపోయింది. ఈ మహిళ తన గుర్తింపును వెల్లడించకుండా సోషల్ మీడియా సైట్ రెడ్డిట్లో ఒక వివరణాత్మక పోస్ట్ పెట్టింది. దానిలో ఆమె.. ‘నేను, నా సిస్టర్స్ సరదాగా డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలనుకున్నాం. ఒక కిట్ సాయంతో డిఎన్ఏ టెస్టు చేయించుకున్నాం. ఆ పరీక్ష ఫలితాలు రాగానే గుండె బద్ధలయ్యే నిజం వెలుగు చూసింది. డీఎన్ఏ పరీక్ష ఫలితాలలో తన అన్నలు, అక్కాచెల్లెళ్లకు పూర్తి బంధుత్వం ఉందని, తానుమాత్రం ఒంటరినని తేలిందని ఆ మహిళ చెప్పింది. కాగా ఆమె సోదరి తమ తల్లిదండ్రులతో ఈ విషయమై మాట్లాడాలని నిర్ణయించుకుంది. అయితే తల్లిదండ్రులు ఆ డిఎన్ఏ ఫలితాలు నిజం కాదని అన్నారు. అయితే ఆమె తండ్రి ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయాలని కోరాడు. తల్లి ఈ విషయంలో తనకేమీ పట్టనట్టు వ్యవహరించింది. అయితే ఎట్టకేలకు తండ్రి నిజాన్ని చెప్పాడు. అయితే ఆమె ఎప్పటికీ తన కుమార్తెనేనని అన్నాడు. ఇంతకాలం తన తల్లిదండ్రులు ఈ విషయాన్ని దాచిపెట్టడంపై ఆ మహిళ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తనను తల్లిదండ్రులు పెంచిన విధానంలో ఏదో తేడా కనిపించడంతో తనకు వేరే తండ్రి ఉన్నడని అనుకునేదానినని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆమె తల్లితో నాటి పరిస్థితిని చర్చించాలనుకుంటోంది. అయితే తల్లి తనకు ఏమీ తెలియదని అంటోంది. కాగా ఆ మహిళ తన జీవసంబంధమైన తండ్రిని గుర్తించగలిగింది. అయితే ఇప్పుడు తాను ఏమి చేయాలంటూ ఆమె రెడ్డిట్ యూజర్స్ను కోరింది. ఇది కూడా చదవండి: పాక్పై ప్రాణాంతక అమీబా దాడి.. 11 మంది మృతి! -
సర్వం సిద్ధం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) శనివారం ఉదయం మొట్టమొదటగా ప్రయోగించనున్న గగన్యాన్ టెస్ట్ వెహికల్ (టీవీ–డీ1) ప్రయోగానికి శుక్రవారం సాయంత్రం 7.30 గంటలకు కౌంట్డౌన్ మొదలైంది. 12.30 గంటల కౌంట్డౌన్ అనంతరం శనివారం ఉదయం 8 గంటలకు ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్దం చేశారు. షార్లోని మొదటి ప్రయోగవేదిక నుంచి సింగిల్ స్టేజీతో (ఒకే దశతో) ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. 531.8 సెకన్లకు ప్రయోగాన్ని పూర్తి చేయనున్నారు. టీవీ–డీ1ను 17 కిలోమీటర్లు ఎత్తుకు తీసుకెళ్లి రాకెట్ శిఖరభాగాన అమర్చిన క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టంను మళ్లీ కిందకు తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టడం ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. రాకెట్ శిఖరభాగంలో అమర్చిన క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం భూమికి 17 కిలోమీటర్లు దూరంలో అంతరిక్షంలో వదిలిపెట్టిన తరువాత దానికి పైభాగంలో అమర్చిన 10 ప్యారాచూట్ల సాయంతో బంగాళాఖాతంలో దించి సురక్షితంగా తీసుకువచ్చే ప్రక్రియను చేపడుతున్నారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కోస్టల్ నేవీ సిబ్బంది ఒక ప్రత్యేక బోట్లో వేచి ఉండి సముద్రంలో క్రూమాడ్యూల్ పడిన తరువాత దాన్ని సురక్షితంగా తీసుకొస్తారు. భవిష్యత్తులో వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి క్షేమంగా తీసుకువచ్చే ప్రక్రియను పరిశీలించే ప్రయోగం ఇదే కావడం విశేషం. -
విషయ పరిజ్ఞానమే కొలమానం
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో విద్యార్థి వికాస చదువులకు రాష్ట్రంలో ప్రాధాన్యం పెరిగింది. పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా రాణించేలా పరీక్షల్లోను, ప్రశ్నల తీరులోను మార్పులు తీసుకొచ్చారు. అకడమిక్ మార్కులు కంటే.. విద్యార్థి మానసిక వికాసం, విశ్లేషణ సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టారు. అందుకు అనుగుణంగా విషయ పరిజ్ఞానం అంచనా వేసేలా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా పరీక్షల్లో సంప్రదాయ ప్రశ్నల శైలి.. మార్కుల సాధనకే పరిమితమైంది. పిల్లల్లో వికాసం, విశ్లేషణ సామర్థ్యాలను అంచనా వేసే విధానం కరువైంది. దీంతో గత ఏడాది నుంచి రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరీక్ష నిర్వహణ, ప్రశ్నల శైలిలో మార్పులు తీసుకొచ్చింది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యాస్థాయిని అంచనా వేసేందుకు, అభ్యసన లోపాలను గుర్తించేందుకు వివిధ రకాల సర్వేలు చేస్తోంది. వీటిలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎఫ్ఎల్ఎస్), నేషనల్ అచీవ్మెంట్ సర్వే ముఖ్యమైనవి. వీటిద్వారా వివిధ రాష్ట్రాల్లో విద్యార్థుల సామర్థ్యాలను, ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను అంచనా వేసి రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇస్తోంది. విద్యా సంవత్సరంలో నిర్వహించే ఫార్మెటెవ్, సమ్మెటివ్ అసెస్మెంట్లలో 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు సిలబస్ ప్రకారం విశ్లేషణాత్మక ప్రశ్నలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్ఏఎస్ సర్వేకు అనుగుణంగా పరీక్షలు దేశవ్యాప్తంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ అచీవ్మెంట్ టెస్ట్ (ఎన్ఏఎస్), ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నేషనల్ అచీవ్మెంట్ సర్వేను ఏటా చేపడుతుంది. 2021లో కేంద్రం ఎన్ఏస్, 2022లో ఎఫ్ఎల్ఎస్ నిర్వహించింది. కరోనా అనంతరం నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా అభ్యసన లోపాలు ఉన్నట్టు గుర్తించి, వాటిని అధిగమించేందుకు పలు సంస్కరణలను చేపట్టి నూతన విద్యా విధానానికి అనుగుణంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఏ తరహా పరీక్షలు, ప్రశ్నలు ఉంటాయో అదే విధానాన్ని ప్రభుత్వం పాఠశాల విద్యలో గత ఏడాది నుంచి అనుసరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 3న జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గత నెలలో అండమాన్–నికోబార్లో వివిధ రాష్ట్రాల అసెస్మెంట్ సభ్యులకు శిక్షణ ఇచ్చింది. అందులో రాష్ట్రాలు విద్యా ప్రమాణాలు పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు, అసెస్మెంట్లో అనుసరించాల్సిన విధానాలను విడుదల చేసింది. దీనికి అనుగుణంగా సిద్ధమవ్వాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్ర స్థాయిలో అసెస్మెంట్ సెల్ ఏర్పాటు ప్రస్తుతం రాష్ట్రంలో ఈ తరహా పరీక్ష విధానాన్ని 2022–23 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టారు. కేంద్రం నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే, ఎఫ్ఎల్ఎస్ పరీక్షల తరహాలోనే రాష్ట్రంలో పరీక్ష పత్రాలను రూపొందిస్తున్నారు. ఇందుకోసం 15 మంది నిపుణులైన ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ప్రత్యేక అసెస్మెంట్ సెల్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు సాధించిన ఫలితాల ఆధారంగా బోధనలో సైతం మార్పులు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతినెలా సబ్జెక్టు టీచర్లకు స్కూల్ కాంప్లెక్స్ శిక్షణ సైతం ఇస్తున్నారు. విద్యార్థి సామర్థ్యం అంచనాకు విశ్లేషణాత్మక ప్రశ్నలు ఒక విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ నాలుగు ఫార్మెటివ్, రెండు సమ్మెటివ్ (ఆరు) అసెస్మెంట్లు నిర్వహిస్తోంది. వీటిలో రెండు ఫార్మెటివ్, ఒక సమ్మెటివ్ అసెస్మెంట్లకు ‘ఓఎంఆర్’ విధానం అనుసరిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఎఫ్ఏ–1 ఓఎంఆర్ విధానంలో పూర్తిచేయగా, ఎఫ్ఏ–2ను పాత విధానంలో మంగళవారం నుంచి నిర్వహించనున్నారు. ఈ విధానాన్ని 1 నుంచి 8వ తరగతి వరకు అనుసరిస్తోంది. పదో తరగతిలో బోర్డు పరీక్షలకు ఇబ్బంది లేకుండా 9, 10 తరగతులకు పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎఫ్ఏలో మొత్తం 20 మార్కులకు 15 ప్రశ్నలు ఉంటాయి, ఇందులో 10 ప్రశ్నలకు ఓఎంఆర్ విధానంలో జవాబులు గుర్తించాలి. మరో ప్రశ్నలకు 5 డిస్క్రిప్టివ్ విధానంలో సమాధానాలు రాయాలి. ఈ ప్రశ్నలన్నీ విద్యార్థి మానసిక సామర్థ్యం, ప్రశ్నలు అర్థం చేçసుకునే విధానాన్ని పరీక్షించేలా ఉంటాయి. -
షాకింగ్.. బ్రేకింగ్! ఇదేం ఐఫోన్ భయ్యా.. వైరల్ వీడియో
ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న స్మార్ట్ఫోన్లు యాపిల్ (Apple) ఐఫోన్లు. చాలా మంది ఎప్పటి నుంచో ఎదురు చేస్తున్న ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్ను యాపిల్ ఇటీవల విడుదల చేసింది. అయితే ఈ ఐఫోన్లు మార్కెట్లోకి వచ్చినప్పుటి నుంచి రోజుకో కంప్లైంట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max)పై జెర్రీరిగ్ఎవెరీథింగ్ (JerryRigEverything) అనే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన నాణ్యత పరీక్షకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ నాణ్యతపై రకరకాల పరీక్షలు చేశారు. దీంట్లో ప్రధానంగా కేవలం చేతి వేళ్లలో వంచగానే ఫోన్ వెనుకవైపున్న గ్లాస్ చిట్లిపోయింది. Oh man team no case on iPhone 15 Pro Max going to be interesting… pic.twitter.com/X9yng11umf — Miguel Lozada (@MLozada) September 23, 2023 ‘ఐఫోన్15 ప్రో మ్యాక్స్ను అత్యంత దృఢమైన గ్రేడ్ 5 టైటానియంతో తయారు చేసినట్లు యాపిల్ ప్రకటించినప్పుడు తాను ఆశ్చర్యపోయాను. కానీ టైటానియం ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వెనుక గ్లాస్ ప్రైమ్ టైమ్ కోసం సిద్ధంగా లేదని తేలింది. యాపిల్స్ కొత్త ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్లో ఏదో తప్పు జరిగింది’ అని వీడియో డిస్క్రిప్షన్లో ఆ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ పేర్కొన్నారు. యూట్యూబ్లో సెప్టెంబర్ 23న పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకూ 8.5 మిలియన్లకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. 2.6 లక్షలకుపైగా లైక్లు రాగా వేలాది మంది కామెంట్లు చేశారు. "నేను షాక్ అయ్యాను. ప్రో మాక్స్ అంత తేలిగ్గా బ్రేక్ అవుతుందని ఊహించలేదు.. ఆ బ్రేక్ షాకింగ్ గా ఉంది" అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ను కొంతమంది ‘ఎక్స్’ (ట్విటర్)లోనూ షేర్ చేశారు. -
‘గగన్యాన్’లో మరో కీలక పరీక్ష విజయవంతం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ ప్రయోగానికి సంబంధించి మరో కీలక పరీక్ష విజయవంతమైంది. ఈ నెల 8వ తేదీన డ్రోగ్ ప్యారాచూట్లకు ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో శుక్రవారం తన వెబ్సైట్లో పేర్కొంది. గగన్యాన్ మిషన్లో వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి సురక్షితంగా భూమికి చేరుకునేందుకు డ్రోగ్ ప్యారాచూట్ విస్తరణ పరీక్షల అవసరం ఉందని తెలిపింది. క్రూ మాడ్యూల్ను స్థిరీకరించడానికి, రీ–ఎంట్రీ సమయంలో దాని వేగాన్ని తగ్గించి సురక్షితంగా తీసుకురావడానికి ఈ ప్యారాచూట్ కీలకపాత్ర పోషిస్తుందని వెల్లడించింది. గగన్యాన్ క్రూ మాడ్యూల్ మందగింపు వ్యవస్థ కోసం సంక్లిష్టమైన ప్యారాచూట్ స్వీకెన్స్లో మొత్తం 10 వరకు ఉంటాయని పేర్కొంది. గగన్యాన్ ప్రయోగంలో క్రూ మాడ్యూల్ను అంతరిక్షంలోకి పంపించి, దానిని మళ్లీ భూమి మీదకు తీసుకువచ్చేందుకు, సురక్షితంగా ల్యాండింగ్ చేసేందుకు ఈ ప్యారాచూట్లు కీలక పాత్ర పోషిస్తాయని, అందుకు వీటి పనితనాన్ని పరీక్షించుకుని నిర్ధారించుకుంటున్నామని ఇస్రో వివరించింది. -
ఏమో! కారు ఎగరావచ్చు.. కానీ!
నగరాల్లో విపరీతమైన వాహనాల రద్దీ, అధ్వాన్నమైన రహదారుల వల్ల సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రయాణికులు విసుగెత్తిపోతుంటారు. ట్రాఫిక్ జంఝాటం లేకుండా హాయిగా ఆకాశంలో విహరిస్తూ వేగంగా దూసుకెళ్తే బాగుంటుందని అనుకోనివారు ఉండరు. అలాంటివారి కోసం అమెరికాలోని కాలిఫోరి్నయాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ సంస్థ ఎగిరే కారును(ఫ్లైయింగ్ కారు) అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. 2015లో మొదలైన ఈ ఆలోచనకు పదునుపెట్టిన అలెఫ్ కంపెనీ 2019 నాటికి ఎగిరే కారును తయారు చేసింది. మోడల్–ఎ ఫ్లైయింగ్ కారును ఆవిష్కరించింది. కొన్ని రకాల పరీక్షల తర్వాత ఈ ఏడాది జూన్ 12న అమెరికా ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్(ఎఫ్ఏఏ) ఈ కారుకు స్పెషల్ ఎయిర్వర్తీనెస్ సర్టిఫికెట్ అందజేసింది. అంటే పరిమిత ప్రాంతాల్లో ఫ్లైయింగ్ కారును ప్రదర్శించడానికి, దీనిపై పరిశోధన–అభివృద్ధి వంటి కార్యకలాపాల కోసం అనుమతి మంజూరు చేసింది. ఇదొక టరి్నంగ్ పాయింట్ అని చెప్పాలి. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఎగిరే కారు ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి రావడానికి సాంకేతికపరమైన, చట్టపరమైన ఎన్నో అవరోధాలు, సవాళ్లు ఉన్నాయి. వాటిని అధిగమిస్తేనే కారులో ఆకాశంలో స్వేచ్ఛగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. విడిభాగాల లభ్యత ఎలా ఎక్కువ సంఖ్యలో ఎగిరే కార్లను తయారు చేయడానికి కొన్ని విడిభాగాలు విస్తృతంగా అందుబాటులో లేవని అలెఫ్ ఏరోనాటిక్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జిమ్ డుఖోవ్నీ చెప్పారు. వాటిని సమకూర్చుకోవడం చాలా కష్టమని అన్నారు. ఉదాహరణకు ఫ్లైయింగ్ కారుకు ప్రయాణంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడానికి హైలీ స్పెషలైజ్డ్ ప్రొపెల్లర్ మోటార్ సిస్టమ్స్ అవసరమని, అలాంటివి తయారు చేసుకోవడం శ్రమ, ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని తెలిపారు. ఎగిరే కారు ఎంత త్వరగా క్షేత్రస్థాయిలోకి వస్తుందన్నది దాని పరిమాణం, బరువు, ధర, అది ఎంతవరకు సురక్షితం అనేదానిపైనా ఆధారపడి ఉంటుందన్నారు. సేఫ్టీ ఫీచర్ల మాటేమిటి అలెఫ్ కంపెనీ మోడల్–ఎ కార్ల విక్రయాల కోసం ఇప్పటికే ప్రి–ఆర్డర్లను స్వీకరిస్తోంది. ఒక్కో కారు ధరను 3 లక్షల డాలర్లుగా (రూ.2.46 కోట్లు) నిర్ధారించింది. మోడల్–ఎ అనేది అ్రల్టాలైట్, లో స్పీడ్ వెహికల్. చట్టప్రకారం ఈ మోడల్ కారు గోల్ఫ్ కార్ట్లు, చిన్నపాటి విద్యుత్ వాహనాల విభాగంలోకి వస్తుంది. ఫ్లైయింగ్ కారు కేవలం గాల్లో ఎగరడమే కాదు, రోడ్లపై కూడా సాధారణ వాహనాల్లాగే ప్రయాణిస్తుంది. దానికి అనుమతి రావాలంటే ‘నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్’ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అంటే సాధారణ కార్లలో ఉండే సేఫ్టీ ఫీచర్లన్నీ ఉండాలి. అలెఫ్ సంస్థ అభివృద్ధి చేసిన మోడల్–ఎ కారు రోడ్లపై ప్రయాణానికి అంతగా సురక్షితం కాదన్న వాదన వినిపిస్తోంది. భారీ శబ్ధాలు, కాలుష్యం ఫ్లైయింగ్ కార్లు పరిమితమైన ఎత్తులోనే ఎగురుతాయి. భారీ శబ్ధాలు, కాలుష్యం ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల కొత్త సమస్యలు తప్పవు. ప్రజల్లో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. ఏమాత్రం శబ్ధం వెలువడని ఫ్లైయింగ్ కార్లు డిజైన్ చేయడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అంటున్నారు. రోడ్లపై వాహనాలు ఢీకొంటున్నట్లుగానే గగనతలంలో వేగంగా దూసుకెళ్లే ఫ్లైయింగ్ కార్లు పరస్పరం ఢీకొనే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఎగిరే కార్లు భవనాలను ఢీకొని నేలకూలడానికి ఆస్కారం ఉంది. అదే జరిగితే నష్టం భారీగానే ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఆకాశంలో ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తరహాలో ఎగిరే కార్ల రాకపోకల కోసం శాస్త్రీయమైన మార్గసూచిని రూపొందించాలి. ధనవంతులకే సాధ్యమా? ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే ఎగరే కార్ల ధరలను సంపన్నులే భరించగలరు. కోట్లాది రూపాయలు వెచ్చించి ఇలాంటివి కొనేసే స్తోమత కొందరికే ఉంటుంది. నిర్వహణ ఖర్చులు, లైసెన్స్ ఫీజులు కూడా తక్కువేమీ కాదు. విమాన ప్రయాణం ప్రారంభమైన తొలి రోజుల్లో ధనవంతులకే పరిమితం అన్నట్లుగా ఉండేది. కానీ, ఇప్పుడు దిగువ మధ్యతరగతి ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఫ్లైయింగ్ కార్ల విషయంలోనూ అలాంటి పరిణామం సాధ్యపడొచ్చు. ప్రభుత్వాలే ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా ఈ కార్లను ప్రవేశపెడితే సామాన్య ప్రజలు సైతం ఆకాశయానం చేయొచ్చు. నడపడానికి లైసెన్స్ ఎవరిస్తారు? కార్లు నడపాలన్నా, విమానాలు నడపాలన్నా కచ్చితంగా లైసెన్స్ ఉండాల్సిందే. ఫ్లైయింగ్ కార్లు నడపడానికి కూడా లైసెన్స్ అవసరం. డ్రైవింగ్ శిక్షణ ఎవరిస్తారు? లైసెన్స్లు ఎవరు జారీ చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వాలదే తుది నిర్ణయం. నేలపై, గాలిలో నడపడానికి డ్రైవర్లు శిక్షణ తీసుకోవాలి. ఫ్లైయింగ్ కార్ల డ్రైవింగ్ లైసెన్స్లు జారీ చేయడానికి రవాణా , పౌర విమానయాన శాఖ సమన్వయంతో పని చేయాల్సి రావొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్