-
గాడిదలను అపహరించి సొమ్ము చేసుకుంటున్నారు!
తాడేపల్లిరూరల్: తమ ఇంటి మహాలక్ష్మిగా పెంచుకుంటున్న గాడిదలను కొందరు అపహరించి అమ్ముకోవడంపై వాటి యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి అమ్ముకున్న వారు నష్టపరిహారం చెల్లించడంతో వారు మొత్తబడ్డారు. కర్నూల్ పట్టణ పరిధిలో దోబీ పనిచేసి జీవనం సాగించే కొంతమంది దుస్తులు మోసేందుకు గాడిదలను పెంచుతూ వాటిని ఎంతో ఆప్యాయంగా చూస్తుంటారు. అయితే బబ్లూ, శ్రీనివాసరావు, దుర్గారావులకు చెందిన గాడిదలను బాపట్లకు చెందిన రజనీకాంత్ అనే వ్యక్తి అపహరించి వాటిని తాడేపల్లిలో అమ్మాడు. దీంతో బబ్లూ, శ్రీనివాసరావులు తమ స్నేహితులతో కలసి రాష్ట్రంలో గాడిదలను ఎక్కడెక్కడ వధించి మాంసాన్ని విక్రయిస్తారో గూగుల్లో సెర్చ్ చేసి తాడేపల్లి చేరుకున్నారు. ఒక ఇంట్లో కట్టేసి ఉన్న తమ గాడిదను బబ్లూ, శ్రీనివాసరావులు గుర్తించి తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారించగా.. కర్నూలు నుంచి అపహరించిన మూడు గాడిదల్లో రెండింటిని మాంసం కోసం విక్రయించినట్టు తెలిపారు. మిగిలిన ఆ గాడిదను బబ్లూకు అప్పగించారు. అమ్మిన రెండు గాడిదలకు వెల కట్టి రూ.1.60 లక్షలను కర్నూలు యువకులకు అందించారు. -
హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును స్వాగతిస్తున్నాం
-
Tirumala: ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే స్వామివారి దర్శనం
-
యూటర్న్ తీసుకుని బీజేపీకి ప్రేమ లేఖలా?
సాక్షి, తాడేపల్లి: టీడీపీతో పొత్తు ఉండబోదని బీజేపీ వాళ్లు బహిరంగంగా చెబుతున్నా.. సిగ్గులేకుండా చంద్రబాబు బీజేపీతో పొత్తుపై యూటర్న్ తీసుకొని .. మళ్లీ బీజేపీకి ప్రేమ లేఖలు పంపుతున్నారని పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు ఘాటుగా విమర్శించారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీని ఏమైనా బీజేపీలో విలీనం చేయాలని భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. బతికుండగానే కోడెలను వేధించిన చంద్రబాబు చనిపోయిన తరువాత పోలిట్బ్యూరోలో సంతాపాలు తెలుపడం ఏమి బాగోలేదన్నారు. టీడీపీ జన్మభూమి కమిటీలు దోచుకున్న దోపిడి, చంద్రబాబు అవినీతిపై టీడీపీ పోలిట్బ్యూరో సభ్యులు ప్రశ్నించాలన్నారు. అదేవిధంగా మంగళగిరిలో లోకేష్ ఓటమి, కోడెల అరాచకాలపై పోలిట్బ్యూరో సమావేశంలో చర్చించాలన్నారు. చంద్రబాబు రెండున్నర లక్షల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని పలాస ఎమ్మెల్యే మండిపడ్డారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 45 వేల కోట్లు బిల్లులు పెండింగ్లో పెట్టారని, అధికారంలో ఉండి గ్రాఫిక్స్ చూపించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసిన తప్పిదాల వల్లే కరెంట్ కోతలు వచ్చాయనీ.. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సకాలంలో స్పందించి కరెంట్ కోతలను తగ్గించారన్నారు. చంద్రబాబు చేసిన అవినీతి ఎక్కడ బయట పడుతుందోనని విద్యుత్ పీపీఏలను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. చంద్రబాబు గురించి గొప్పగా రాస్తేనే పత్రికా స్వేచ్ఛ ఉన్నట్టా? వ్యతిరేకంగా వార్తలు రాస్తే పత్రికా స్వేచ్ఛ లేనట్టా? అని సందేహం వ్యక్తం పరిచారు. చంద్రబాబు పాలనలో ఏనాడైనా లక్ష 34 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారా? అంటూ హేళన చేశారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 80 శాతం అమలు చేసి దేశానికి ఏపీ సీఎం జగన్ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. -
తాడేపల్లి రైతులపై పోలీసుల జులుం
-
రాజధాని రైతుల ధర్నా
తాడేపల్లి (గుంటూరు జిల్లా) : రాజధాని ప్రాంతంలో భూములను కోల్పోతున్న రైతులు అరటి పీకలతో ఆందోళనకు దిగారు. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద ప్రకాశం బ్యారేజీపై అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వరంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సహాయ కార్యదర్శి బాబురావు, స్థానిక వైఎస్సార్ సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు పంటలు పండే జరీబు భూములను సేకరించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. భూసేకరణ కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో రైతులు పెద్ద ఎత్తున బైఠాయించడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. కాగా రైతులు నిర్వహిస్తున్న ఆందోళనను అడ్డుకున్న పోలీసులు వారిని బలవంతంగా లాక్కెళ్లినట్లు సమాచారం. -
పార్లమెంట్ ముట్టడికి సిద్ధంకండి
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్), న్యూస్లైన్:షెడ్యూల్ కులాల వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని కోరుతూ డిసెంబర్ 7న పార్లమెంట్ ముట్టడికి మాదిగలు సిద్ధం కావాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ కోరారు. బుధవారం తాడేపల్లిగూడెంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక ఎన్జీవో హామ్లో నిర్వహించారు. వీరయ్య మాట్లాడుతూ వర్గీకరణను జాప్యం చేయటం వల్ల మాదిగ, మాదిగ ఉపకులాల వారు తీవ్ర అన్యాయానికి గురి అవుతున్నారని పేర్కొన్నారు. వర్గీకరణ చేయకపోతే మాదిగలకు భవిష్యత్ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగడతామన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోబిల్లు ప్రవేశపెట్టడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలో అఖిలపక్షం ఢిల్లీకి వెళ్ళాలని, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, వైసీపీ, బీజేపీ, సీపీఐ, సీసీఐఎం పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. వర్గీకరణపై ఆంటోని కమిటీకి నివేదిక అందజేస్తామని, పరిష్కారం చూపకపోతే కమిటీని ఆంధ్రా ప్రాంతానికి రానివ్వమని హెచ్చరించారు. మంగళవారం మహబూబ్నగర్లో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం రూ 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నాయకులు డిమాండ్ చేశారు. పలివెల చంటి మాదిగ, ముప్పి డి మోషే మాదిగ, పెనుమాక గాంధీ, మాండ్రు ప్రభాకర్, బైపా రాజేశ్వరరావు, లంకా మోహనబాబు, దూలపల్లి శ్రీను, రాపాక వెంకటేశ్వర్లు, డి.చిన్నజాన్, మర్రి వెంకటేశ్వరరావు, ఉండ్రాజవరపు పెంటయ్య, తొమ్మండ్రు వెంకటేశ్వరరావు, పెదమూర్తి రాజు, విద్యార్థి, యువసేన నాయకులు పాల్గొన్నారు.