రాజధాని రైతుల ధర్నా Farmers stage dharna against Land Acquisition | Sakshi
Sakshi News home page

రాజధాని రైతుల ధర్నా

Published Sun, Aug 23 2015 10:32 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Farmers stage dharna against Land Acquisition

తాడేపల్లి (గుంటూరు జిల్లా) : రాజధాని ప్రాంతంలో భూములను కోల్పోతున్న రైతులు అరటి పీకలతో ఆందోళనకు దిగారు. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద ప్రకాశం బ్యారేజీపై అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వరంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సహాయ కార్యదర్శి బాబురావు, స్థానిక వైఎస్సార్ సీపీ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు పంటలు పండే జరీబు భూములను సేకరించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. భూసేకరణ కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో రైతులు పెద్ద ఎత్తున బైఠాయించడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. కాగా రైతులు నిర్వహిస్తున్న ఆందోళనను అడ్డుకున్న పోలీసులు వారిని బలవంతంగా లాక్కెళ్లినట్లు సమాచారం.
 

Advertisement
 
Advertisement
 
Advertisement