-
బురదలోనే విద్యార్థులకు భోజనాలు
విశాఖ సిటీ: కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజులకే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ఐదేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న దుస్థితే మళ్లీ దాపురించింది. ఎన్నికల ముందు వరకు పాఠశాల భవనంలో ఫ్యాన్ల కింద మధ్యాహ్న భోజనాలు చేసిన విద్యార్థులు.. ఇప్పుడు బురదలో కూర్చొని తినాల్సిన పరిస్థితులు తలెత్తాయి. విశాఖపట్నంలోని కప్పరాడ ప్రభుత్వ పాఠశాలలో కనిపించిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం. పాఠశాల విద్యార్థులను బురదలో కూర్చోబెట్టి మధ్యాహ్న భోజనాలు పెట్టడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సర్కారు బడులను అభివృద్ధి చేసింది. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక సదుపాయాలను కన్పించింది. రోజూ నిర్దిష్ట మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించింది. అయితే కూటమి ప్రభుత్వం వ చ్చిన కొద్ది రోజులకే విద్యార్థులకు మళ్లీ ఆరుబయట ఇబ్బందులు పడాల్సిన దుస్థితి వచ్చేసింది. కప్పరాడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తరగతి గదుల్లో భోజనాలు చేయడానికి సిబ్బంది అంగీకరించలేదు. ఒకవైపు వర్షం పడి బురదమయంగా మారిన పాఠశాల ఆవరణలో ఆరుబయటే విద్యార్థులను కూర్చోబెట్టేశారు. ఆ అపరిశుభ్ర వాతావరణంలోనే మధ్యాహ్న భోజనాలు వడ్డించారు. విద్యార్థులు బతిమాలినా.. బురదగా ఉందని.. గదుల్లో కాకపోయినా కనీసం వరండాలో అయినా తింటామని విద్యార్థులు బతిమలాడినప్పటికీ అక్కడి సిబ్బంది అంగీకరించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నారులు ఆరు బయట బురదలోనే కూర్చొని భోజనాలు చేయాల్సి వచ్చింది. దీనిపై కొంత మంది స్థానికులు పాఠశాల సిబ్బందిని ప్రశ్నించారు. పిల్లలు గదులను పాడు చేసేస్తారని, అందుకే లోపల తినొద్దని చెప్పామని సిబ్బంది చెప్పడం గమనార్హం. బురదలో విద్యార్థులకు భోజనాలు పెట్టడాన్ని స్థానికులు తమ ఫోన్లతో చిత్రీకరించారు. ఈ వీడియో ప్రసుత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యాలను చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు అప్పటి, ఇప్పటి పరిస్థితులను బేరీజు వేసుకుంటూ నిట్టూరుస్తున్నారు. -
విద్యార్థులకు భారీ షాక్..
-
సారూ.. ఫీజు డబ్బులివ్వరూ..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐటీఐ నుంచి ఐఐటీ, వైద్య విద్య వరకు చదువుకునే విద్యార్థులకు చెల్లించాల్సిన విద్యా దీవెన, వసతి దీవెనపై సర్కారు స్పందన కరవైంది. గత ప్రభుత్వం ఏటా మూడు నెలల (త్రైమాసికం)కు ఒకసారి జగనన్న విద్యా దీవెన చెల్లించగా, ఆరు నెలలకు ఒకసారి జగనన్న వసతి దీవెన చెల్లించేది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ రెండో వారంలో దాదాపు 9.44 లక్షల మంది విద్యార్థులకు జనవరి– ఏప్రిల్ నెలలకు విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లు జమ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ప్రతి విద్యా సంవత్సరం జూన్లో, ఆ తర్వాత ఏప్రిల్లో రెండు వాయిదాల్లో జగనన్న వసతి దీవెన అందించేవారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర విద్యార్థులకు రూ.20 వేల చొప్పున చెల్లించేవారు. అయితే, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా, ప్రభుత్వం ఫీజులను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దీంతో కళాశాలలు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇకపై విద్యార్థులు కట్టే ఫీజులను నేరుగా కళాశాలల ఖాతాల్లోనే జమ చేస్తామని కొత్త ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ముగిసిన విద్యా సంవత్సరం ఫీజులపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం ద్వారా వాటికి మంగళం పాడినట్టేనని తెలుస్తోంది. పేద విద్యార్థుల చదువులకు బాసటగా నిలుస్తూ నూరు శాతం ఫీజు రీయింబర్స్మెంట్ అందించేందుకు గత జగన్ ప్రభుత్వం విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించింది. క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ వచ్చింది. ఈ క్రమంలో 2023 అక్టోబర్– డిసెంబర్ త్రైమాసికానికి 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ.708.68 కోట్లను మార్చి ఒకటో తేదీన విద్యార్థులు–తల్లుల ఉమ్మడి ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు జనవరి–ఏప్రిల్ మాసాలకు చెల్లించాల్సిన నిధులపై ఎలాంటి స్పందన లేదు. అలాగే దాదాపు 9.55 లక్ష మంది విద్యార్థులకు వసతి దీవెన కింద ఇవ్వాల్సిన సుమారు రూ.600 కోట్లపై ఎలాంటి నిర్ణయం ప్రకటించ లేదు. విద్యా దీవెనపై 93 శాతం మంది చదువులు రాష్ట్రంలో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల్లోని 93 శాతం మంది విద్యార్థులు ‘విద్యా దీవెన‘ ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకుంటూ చదువుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వం కాలేజీ విద్యకు ఫీజు ఎంత ఉన్నా రూ.35 వేలు మాత్రమే చెల్లించేది. ఇక వసతి దీవెన మాటే లేదు. ఫీజుల కోసం నాడు విద్యార్థుల తల్లిదండ్రులు ఇళ్లు, పొలాలు అమ్ముకునే పరిస్థితి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి అర్హత గల ప్రతి విద్యార్థికీ ఫీజు ఎంత ఉన్నా నూరు శాతం చెల్లించారు. జవాబుదారీ తనం పెంచేలా, పారదర్శకంగా తల్లి, విద్యార్థి ఉమ్మడి బ్యాంకు ఖాతాల్లో త్రైమాసికానికోసారి విద్యా దీవెనను జమ చేశారు. అనంతరం వారు ఆ ఫీజును కళాశాలకు చెల్లించే వారు. అలా ఇప్పటిదాకా 27 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.18,576 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలతో కలిపి) చెల్లించారు. ఏటా సగటున విద్యా దీవెన కింద రూ.2,835 కోట్లు, వసతి దీవెన కింద అత్యధికంగా రూ.1068.94 కోట్లు చెల్లించారు. గత టీడీపీ పాలనా పరిస్థితులే తిరిగి ఉత్పన్నం!గత టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా అమలు కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అనేక అవస్థలు పడ్డారు. ప్రభుత్వం కాలేజీలకు సకాలంలో ఫీజులు చెల్లించక పోవడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచేవి. పరీక్షలకు హాల్టికెట్లు, పాసైతే సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవి. ఫలితంగా చాలా కుటుంబాలు అప్పులు చేసి తమ పిల్లల ఫీజులు చెల్లించారు. కళాశాలల ఫీజు కంటే తక్కువ ఫీజు రీయింబర్స్ చేయడంతో పేద విద్యార్థుల కుటుంబాలపై మోయలేని ఆర్థిక భారం పడేది. మిగిలిన డబ్బు విద్యార్థులే చెల్లించాల్సిన పరిస్థితి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఫీజు ఎంతున్నా 100 శాతం రీయింబర్స్ చేయడంతో విద్యార్థులు నిశ్చింతగా చదువుకోగలిగారు. పైగా అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం 2017–19 మధ్య 16.73 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.1,778 కోట్లు సైతం జగన్ ప్రభుత్వం చెల్లించింది. ప్రభుత్వ వివరాల ప్రకారం 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద సగటున ఏడాదికి రూ.2066 కోట్లు, హాస్టల్ ఖర్చుల కింద రూ.362 కోట్లు మాత్రమే చెల్లించగా, జగన్ ప్రభుత్వం ఏడాదికి రూ.4,044 కోట్లు అందించింది. కొత్త ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెనపై ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడం ద్వారా ఇక ఇచ్చే ప్రసక్తి లేదన్న సంకేతాలు పంపుతున్నట్టు విద్యా రంగ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే విద్యార్థుల తల్లిందండ్రులు అప్పుల పాలవ్వడం ఖాయం. వసతి దీవెన సొమ్ము ఎప్పుడిస్తారో..గత రెండేళ్లుగా నాకు జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఏటా రూ.20 వేలు అందింది. ఈ విద్యా సంవత్సరం అందాల్సిన సొమ్ము కోసం ఎదురు చూస్తున్నాం. ఇంతవరకు విధివిధానాలు ఏవీలేవు. గతంలో నేరుగా మా వివరాలు గ్రామ సచివాలయానికి వచ్చేవి. నేరుగా మాకు ఉపకార వేతనాలు అందేవి. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియని పరిస్థితి. అకడమిక్ ఇయర్ ప్రారంభమైంది. పుస్తకాలు, యూనిఫాం కొనుగోలుకు డబ్బుల అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో చెప్పక పోవడం ఆందోళన కలిగిస్తోంది. – తాడ్డి వెంకటేష్, డిగ్రీ తృతీయ సంవత్సరం, లక్ష్మీపురం, రాజాం మండలం, విజయనగరం జిల్లా పిల్లల ఫీజులు కట్టేదెట్టా?నాకు ఇద్దరు పిల్లలు. ఒకరికి అమ్మఒడి, ఒకరికి విద్యా దీవెన పథకాల కింద జగనన్న ప్రభుత్వంలో వారి చదువులకు ఎలాంటి భారం లేకుండా ఆర్థిక భరోసా కల్పించారు. ఈ సంవత్సరం ఇంకా లబ్ధి పడలేదు. దీంతో మా పిల్లల చదువులకు సంబంధించి ఫీజులు కట్టడం భారంగా మారింది. మేం రోజూ కూలి పనులు చేసుకుంటే కానీ జీవనం సాగించలేని పరిస్థితి. ప్రభుత్వం స్పందించి పిల్లల విద్యోన్నతి పథకాలను కొనసాగించి మాకు అండగా నిలవాలి. – స్వర్ణలత, కరకంబాడి, రేణిగుంట మండలం, తిరుపతి జిల్లా హాస్టల్ ఫీజు అడుగుతున్నారు..నేను ఎస్వీ యూనివర్సిటీలోని హాస్టల్లో ఉంటూ విదేశీ భాషా శాస్త్రం (ఎంఏ లింగ్విస్టిక్స్) పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమైనప్పటికీ ప్రభుత్వం అందిస్తున్న వసతి దీవెనతోనే ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. గతంలో వసతి దీవెన సకాలంలో అందుతుండడంతో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ ఏడాది ఇప్పటి వరకు వసతి దీవెన అందకపోవడంతో యూనివర్సిటీ వారు హాస్టల్ ఫీజు చెల్లించాలని అడుగుతున్నారు. ఇది నాలాంటి వారికి చాలా ఇబ్బంది. వెంటనే ప్రభుత్వం వసతి దీవెన చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలి. – మన్నం ప్రేమ్కుమార్, పీజీ విద్యార్థి, ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతిఫీజులు కట్టమని ఇబ్బందులు పెడుతున్నారునేను చిత్తూరు జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎస్వీసెట్ ఇంజనీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్నా. మొన్నటి వరకు సకాలంలో విద్యా దీవెన పథకం వల్ల లబ్ధి కలిగింది. ఈ ఏడాది విద్యా దీవెన నగదు ఇంకా విడుదల చేయలేదు. కళాశాలలేమో ప్రారంభం అయ్యాయి. ఫీజు చెల్లించాలంటూ యాజమాన్యం రోజూ అడుగుతూనే ఉంది. కోర్సు ఫీజు చెల్లించాలని ఇంట్లో చెప్పాను. అప్పు చేసి డబ్బులు తెచ్చి ఇవ్వడానికి అమ్మానాన్నలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి ఫీజు రీయింబర్స్మెంట్ నగదును వెంటనే విడుదల చేయాలి. – గౌతమ్, ఇంజనీరింగ్ విద్యార్థి, వావిల్తోట, పూతలపట్టు నియోజకవర్గం, చిత్తూరు జిల్లా. వసతి డబ్బులు త్వరగా ఇవ్వాలినా కుమారుడు పలమనేరు పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మూడవ సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుతున్నాడు. మా అబ్బాయికి గత రెండు సంవత్సరాలు వసతి దీవెన పథకం కింద రూ.40 వేలు ఇచ్చారు. ఆ నగదును కళాశాల వసతి ఖర్చులకు చెల్లించేవాళ్లం. కూలీ పనులు చేస్తే గాని మా పూట గడవదు.ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుండడంతో మాకు ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఎప్పుడు నగదు ఇస్తారో తెలియడం లేదు. నా బిడ్డ చదువు ఆగిపోకుండా వడ్డీకి డబ్బులు తీసుకుని ఫీజు చెల్లించాం. ప్రస్తుత పాలకులు మా బాధను అర్థం చేసుకుని త్వరగా నగదు జమ చేయాలని కోరుతున్నాం. – వరలక్ష్మి, విద్యార్థి తల్లి, ములతిమ్మేపల్లి, బైరెడ్డిపల్లి మండలం, పలమనేరు, చిత్తూరు జిల్లా. -
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్ఎస్సీ బోర్డు శుక్రవారం విడుదల చేసింది.ఈ ఫలితాల్లో 73.0శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో మార్చి 18న ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ 2తో ముగిశాయి. ఈ పరీక్షలకు 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలురు 2,57,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నారు.అయితే వార్షిక పరీక్షల్లో పెయిలైన ఫెయిలైన విద్యార్ధులకు ఎస్ఎస్ఈ బోర్డు జూన్ 03 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించగా.. తాజాగా ఆ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆ ఫలితాల్ని https://results.sakshieducation.com/ డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. -
NEET-UG 2024: ఎన్టీఏకు సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి,న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీకేజీ అంశంలో గురువారం (ఏప్రిల్27) సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.నీట్ పీజీ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీకేజీ, ఇతర అక్రమాలు చోటుచేసుకోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.ఈ తరుణంలో విద్యార్ధులు, పలు ఎడ్యుకేషన్ సంస్థలు(Xylem Learning) సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఓఎంఆర్ షీట్లో మార్కుల లెక్కింపు అస్పష్టంగా ఉందని పిటిషన్లో పేర్కొన్నాయి.అయితే విద్యార్ధులు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు జస్టిస్ మనోజ్ మిశ్రా,ఎస్వీఎన్ భట్టీ బెంచ్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం.. విద్యార్ధుల పిటిషన్పై ఎన్టీఏ వివరణ ఇవ్వాలని సూచించింది. ఆ పిటిషన్ను జులై 8న విచారణ చేపడతామని, ఆ లోగా వివరణ ఇవ్వాలని పునరుద్ఘాటించింది. -
రేపే టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్ : రేపు (ఏప్రిల్ 28న) మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఎస్ఎస్సీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించారు.తెలంగాణలో మార్చి 18న ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ 2తో ముగిశాయి. ఈ పరీక్షలకు 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలురు 2,57,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నారు.ఇక ఏప్రిల్ 30న విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 91.31 ఉత్తీర్ణత శాతం నమోదైంది. బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణత, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫెయిలైన విద్యార్ధులకు ఎస్ఎస్ఈ బోర్డు జూన్ 03 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షా ఫలితాలను అధికారులు రేపు విడుదల చేయనున్నారు. ఫలితాలను వెబ్సైట్ bse.telangana.gov.in లో చూసుకోవచ్చు. -
నీట్ పేపర్ లీకేజీ.. సీబీఐ తొలి అరెస్ట్
సాక్షి,న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీకేజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గురువారం బీహార్ కేంద్రంగా నీట్ పేపర్ లీకేజీకి పాల్పడ్డ ఇద్దరు నిందితుల్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. తొలుత పాట్నాకు చెందిన మనీష్ కుమార్, అశుతోష్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి అరెస్ట్ చేసింది. వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ (యూజీ)-2024 పరీక్షలో అవకతవకలపై దూమారం చెలరేగింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తు చేపట్టాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులు లీకేజీకి ప్రధాన కేంద్రాలుగా అనుమానిస్తున్న బీహార్, గుజరాత్ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించింది. సీబీఐ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు..మనీష్ కుమార్ నీట్ ప్రశ్నా పత్రాన్ని క్వశ్చన్ పేపర్ను 12మంది విద్యార్ధులు అంతకంటే ఎక్కువ మంది ఇచ్చాడని, అనంతరం మనీష్ కుమార్ తన కారుతో స్వయంగా వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలుస్తోంది.మరో నిందితుడు అశుతోష్.. లీకైన నీట్ పేపర్ చదువుకునేందుకు వీలుగా తన ఇంటిని, నిరుపయోగంగా ఉన్న ఓ స్కూల్ను ఉపయోగించినట్లు సీబీఐ గుర్తించింది. #WATCH | NEET paper leak matter | CBI team arrives at CBI office in Patna, Bihar with accused Baldev Kumar alias Chintu and Mukesh Kumar. A Special CBI Court in Patna sent both to CBI remand, yesterday. pic.twitter.com/mvQhG2aplH— ANI (@ANI) June 27, 2024 -
10 రోజులుగా పేదపిల్లల కడుపు కాలుస్తున్నారు.. ఇలాగే దేవాన్ష్ కడుపు కాల్చి చూడండి
-
వాస్తవ చరిత్రతోనే మెరుగైన భవిత
దేశంలో కోట్లాది మంది విద్యార్థులు అభ్యసించే ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో మతవాద భావజాలాన్ని చొప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మతవాద భావాలు లౌకికవాద భావజాలానికి విఘాతం కలిగిస్తాయని అంబేడ్కర్ ఏనాడో అన్నారు. లౌకికవాద రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాఠ్య ప్రణాళికలు రూపొందించే విధానం చరిత్రకు నష్టం కలిగిస్తుంది. విద్యార్థి సమూహానికి దేశంలోని భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, చరిత్ర... వాస్తవంగా, ఉన్నది ఉన్నట్టుగా అర్థం కావలసి ఉంది. మతవాదాన్నే జాతీయ వాదంగా ప్రచారం చేసే ప్రయత్నాలు మంచివి కావు. భారతదేశంలో చదువుకుంటున్న విద్యార్థులు దేశ చరిత్రను శాస్త్రీయ భావాలతో, సరైన పద్ధతుల్లో అర్థం చేసుకోకపోతే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలరా?ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ఎన్సీఈఆర్టీ సిలబస్ను అభ్యసిస్తున్న విద్యార్థులు సుమారు నాలుగు కోట్ల మంది ఉన్నారు. మొదట సిలబస్ రూపకల్పనలో భారత దేశ రాజ్యాంగ స్ఫూర్తి కలిగిన, జాతీయ భావాలు కలిగిన, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో పరిశోధకులు అయిన మేధావులు ఉన్నారు. అయితే వాజ్పేయి కాలం నుంచి ఎన్సీఈఆర్టీ సిలబస్ను మార్చి మతవాద పూరితమైన భావజాలాన్ని చూపించాలనే ప్రయత్నాన్ని బీజేపీ ప్రభుత్వాలు చేస్తూ వస్తున్నాయి. భారతదేశంలో చదువుకుంటున్న విద్యార్థులు దేశ చరిత్రను శాస్త్రీయ భావాలతో, సరైన పద్ధతుల్లో అర్థం చేసుకోకపోతే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలరా? విద్యార్థి సమూహానికి దేశంలోని భౌగోళిక పరిస్థితులు, సామాజిక, లౌకికవాదాల పరిస్థితులు, చరిత్ర... వాస్తవంగా, ఉన్నది ఉన్నట్టుగా అర్థం కావలసి ఉంది. అయితే బీజేపీ ప్రభుత్వం మతవాదాన్నే జాతీయవాదంగా ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తోంది. పాఠ్య గ్రంథాలు రూపొందించినవారి అనుమతి లేకుండా తమకు అనుకూలంగా పాఠ్య గ్రంథాలను మార్చేశారు. అందుకే తమ అనుమతి లేకుండా పాఠ్య గ్రంథాలను మార్చేసి, సలహాదారుల్లో తమ పేరు ఉంచి ప్రచురిస్తే కోర్టులో కేసులు దాఖలు చేస్తామని ప్రొఫెసర్లు యోగేంద్ర యాదవ్, సుహాస్ పల్శీకర్ హెచ్చరించే దాకా పరిస్థితి వచ్చింది. ఈ మేరకు వారు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీకి లేఖ రాశారు. చరిత్రలో వాస్తవ ఘట్టాలను తొలగించి, కల్పిత కథలను చేర్చి, వాస్తవ ఆధునిక రాజకీయ చరిత్రను విద్యార్థులకు అందకుండా చేసే నైతిక హక్కు మీకు లేదని వారు వాదించారు. ముఖ్యంగా భారతదేశ ఆధునిక చరిత్రలో అద్వానీ చేసిన రథయాత్రను, హిందూమత వాదాన్ని రాజకీయాల్లో చొప్పించి భారతదేశంలో హిందువులు, హిందూయేతరులు అనే భావజాలాన్ని తీసుకొచ్చారు. అద్వానీ రథ యాత్ర దేశ రాజకీయాల్లో హిందూ భావజాలాన్ని పెంపొందించింది. అంతకు మునుపే హిందూ, ముస్లిం రాజకీయ విభేదాలను పెంచే మతవాద చరిత్రలు కొందరి చేత రాయబడి ఈ వైషమ్యాలను బాగా పెంచాయి. స్వాతంత్రోద్యమానికి ముందు నుంచి కూడా ఈ వైషమ్యాలను పెంచే భావజాల చరిత్ర రాయబడుతూ వచ్చింది. 19వ శతాబ్దంలో భారతీయ రాజకీయాల్లో మతవాదం చోటు చేసుకొనే సరికి మతాన్ని అన్వయించి రాయడం మొదలయింది. మధ్యయుగ భారత చరిత్రను మతవాదులు సుదీర్ఘమయిన హిందూ, ముస్లిం సంఘర్షణగా చూస్తూ, అనివార్యంగా అదే దృష్టిని 19, 20 శతాబ్దాలకు అన్వయిస్తూ, జాతి వివక్ష సిద్ధాంతానికి, రాజకీయాలకు ఈ ఆధునిక యుగంలో ‘న్యాయం’ చేయగలిగామనుకొంటున్నారు. మత వివక్షతా చరిత్రకారులు మధ్యయుగాల్లోని ముస్లిం పాలకుల పాలనను విదేశీయుల పాలనగా చిత్రీకరిస్తూ, భారత సమాజానికి ముస్లింలు శాశ్వతంగా విదేశీయులని చెప్పగలుగుతున్నారు. ఈ దారుణమైన భావం హిందూ, ముస్లింల వైషమ్యాలను పెంచడానికి మరింతగా తోడ్పడింది. మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడమనే ప్రక్రియ భారతదేశ చీలికకు దారితీసింది. ఈ విషయంగా మొదటి నుండి బి.ఆర్.అంబేడ్కర్ ఆందోళన చెందారు. భారతదేశంలో మతవాద భావాలు లౌకికవాద భావజాలానికి విఘాతం కలిగిస్తాయనీ, రాజ్యాంగంలో పేర్కొన్న సౌభ్రాతృత్వం, సామాజిక సమతుల్యత భావాలు దెబ్బతింటాయనీ అన్నారు. ఇప్పుడు చరిత్రలో వీరు తొలగించిన పాఠ్యాంశాల్లో ఎంతో రాజకీయ చరిత్ర దాగి వుంది. ‘బాబ్రి మసీదు’ కూల్చివేత చిన్న విషయం కాదు. ఆ కూల్చివేత వెనుక ‘హిందూ రాజ్య’ నిర్మాణ భావన ఉంది. లౌకికవాద భావజాలానికి ఆ చర్య గొడ్డలి పెట్టు. బాబ్రీ మసీదు కూల్చివేత ముస్లింలకు అభద్రత తీసుకొచ్చింది. నిజానికి చరిత్ర అనేది వాస్తవ ఘటనల సముచ్ఛయంగా ఉండాలి. కొత్తగా సిద్ధం చేసిన పాఠ్యపుస్తకాలలో బాబ్రీ మసీదు విధ్వంసానికి ముందు జరిగిన అద్వానీ రథయాత్ర, ఆ తరువాత జరిగిన పరిణామాలను తొలగించేశారు. వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మించడానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి మాత్రం విస్తారంగా ప్రస్తావించారు. అయోధ్య గురించి మునుపటి పుస్తకాలలో నాలుగు పేజీలు ఉంటే ఇప్పుడు రెండు పేజీలకు కుదించారు. వాస్తవ ఘటనలను తొలగిస్తే, ‘బాబ్రీ మసీదు’ కూల్చివేతను గురించిన మూలాలు, ‘రామ మందిరం’ నిర్మాణం దృక్పథం తెలియకుండా పోతాయి.పాఠ్యపుస్తకాలను కాషాయీకరించాలన్న ప్రస్తుత పాలకుల ధోరణికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడాన్ని లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, సామ్యవాదులు, చరిత్ర రచనా ప్రవీణులు నిరసిస్తున్నారు. దేశంలో అంబేడ్కర్ కృషి వలన లౌకికభావ స్ఫూర్తి బలంగా ఉంది. దేశ చరిత్ర ఎప్పుడూ కూడా మతవాదంతో సాగదు. అది ఉత్పత్తి శక్తుల వల్లే ముందుకు సాగుతుంది. ఈనాటి పాఠ్య ప్రణాళిక భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే ముందుకు నడవవలసి ఉంది. భారతదేశ సంస్కృతిలో, ప్రజల్లో మొదటి నుండి కూడా పోరాట పటిమ ఉంది. ఇంగ్లీషువాళ్ళు అనేక రూపాల్లో మన సంపదను దోచుకుని, సుఖాలు పొందుతున్న విషయాలను ప్రజలు అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా రైతులు, కార్మికులు, పేద ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో పన్నుల చేత వేధించబడ్డారు. అందుకే భారతదేశంలో అన్ని వర్గాల ప్రజల్లో పోరాట పటిమ పెరిగింది. ‘రూపాయి సమస్య’ అనే గ్రంథంలో బ్రిటిష్ వాళ్ళ ఆర్థిక దోపిడీని గురించి అంబేడ్కర్ స్పష్టంగా నివేదించారు.ఇకపోతే రాబోయే చరిత్రలో మోదీ పాలనలోని ఎన్నో దాడులు, అణచివేతలు చరిత్రకు సాక్ష్యాలు. ఒకసారి మనం అవలోకిస్తే ఎన్నో దారుణమైన ఘట్టాలు మనముందు వచ్చి నిలబడతాయి. ప్రజల జీవనోపాధిపై దాడి, నోట్ల రద్దు వల్ల ఏర్పడిన సంక్షోభం, గో రక్షణ పేరుతో జరిగిన దాడులు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణతో పాటు వాటి విక్రయాలు... ఇలా ఎన్నో. కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక సుదీర్ఘ కాలంగా ఉనికిలో ఉండటమేగాక, ఆయా సంఘాలు దశాబ్దాలుగా నయా ఉదారవాద విధానాలను ఎదుర్కోవడంలో ప్రధానపాత్ర పోషించాయి. వారి అనుభవం కూడా రైతు ఉద్యమానికి లాభించింది. 2018 మార్చిలో నాసిక్ నుండి ముంబై వరకు సుదీర్ఘంగా సాగిన కిసాన్ లాంగ్ మార్చ్ రైతుల డిమాండ్లను నొక్కిచెప్పింది. ఈ లాంగ్ మార్చ్ బీజేపీని ఓడించటం సాధ్యమేనని... బీజేపీ అజేయశక్తి అనే అభిప్రాయం కేవలం కార్పొరేట్ మీడియా ప్రచార సృష్టి మాత్రమేనని స్పష్టమైన సందేశాన్ని పంపింది. 2019 సంవత్సరంలో జరిగిన పుల్వామా ఘటన, ప్రతిగా జరిగిన బాలాకోట్ వైమానిక దాడి, ఆ తరువాత తీవ్ర జాతీయవాద ప్రచార నేపథ్యంలో బీజేపీ విజయం సాధించినప్పటికీ... 2024 కల్లా 240 సీట్లకు ఎందుకు పడిపోయిందో ప్రజలకు, విద్యార్థులకు తెలియాల్సిన అవసరం ఉంది.దేశంలో లౌకికవాదం, రాజ్యాంగ స్ఫూర్తి పెరుగుతున్నాయి. ఈ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాఠ్య ప్రణాళికలు రూపొందించే విధానం చరిత్రకు నష్టం కలిగిస్తుంది. రాబోయే తరాలు లౌకికవాదానికీ, మతవాదానికీ జరిగిన సమరాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు భారతీయులే అనేది ముందు గుర్తించాలి. భారతీయులందరికీ వాస్తవమైన చరిత్రను అందించినప్పుడే భారతదేశ పరిణామం త్వరితం అవుతుంది. డీడీ కోశాంబీ, రొమిల్లా థాపర్, బిపిన్ చంద్ర, అంబేడ్కర్ రచనలు భారతదేశ చరిత్ర నిర్మాణానికి దిశా నిర్దేశం చేస్తున్నాయి. ఆ వైపు నడుద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
నీట్ పేపర్ లీకేజీ.. ఎన్టీఏ ప్రైవేట్ సంస్థనా?!
ఢిల్లీ, సాక్షి : వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్- యూజీ ప్రవేశపరీక్ష 2024’లో పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుండగా.. ఆ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)పై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.నీట్ పేపర్ లీకేజీతో అప్రమత్తమైన కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. లీకేజీకి పాల్పడిన నిందితుల్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆదేశాలు జారీ చేసింది. అలా ఇప్పటి వరకు మధ్యవర్తులు, విద్యార్థులు సహా 14 మందిని బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు.అదే సమయంలో ఎన్టీఏ చీఫ్ను తొలగించింది. పరీక్షల నిర్వహణపై ఇస్రో మాజీ చైర్మన్ కే రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏడుగురు కమిటీ సభ్యుల్ని నియమించింది. లీకేజీపై రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.అయినప్పటికీ దేశ వ్యాప్తంగా విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు నీట్ పేపర్ లీకేజీపై తమ ఆందోళనల్ని తెలుపుతూ వస్తున్నారు.ఈ తరుణంలో ఎన్టీఏ ప్రైవేట్ సంస్థ అని,ఎన్టీఏ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద రిజిస్టర్ అయ్యిందని పలువురు ప్రచారం చేస్తున్నారు. ‘సమాచార హక్కు చట్టం’ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరి అందులో నిజమెంత? అనేది తెలియాల్సి ఉంది.సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 అంటేసొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 అనేది బ్రిటీష్ ఇండియాలో ఒక చట్టం. ఇది సాధారణంగా సమాజ శ్రేయస్సు కోరేలా విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాలకు సంబంధించిన సంస్థల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. -
చదువుల మోత!
విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే పాఠశాలల్లో బోధన ఊపందుకుంటోంది.ఈనేపథ్యాన విద్యార్థులకు కావాల్సిన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగ్లు, హాస్టళ్లకు వెళ్తున్న వారి కోసం పరుపులు, పెట్టెలు ఇతర సామగ్రి కొనుగోళ్లలో తల్లిదండ్రులు నిమగ్నమయ్యారు. దీంతో జిల్లా కేంద్రంలోని బుక్స్టాళ్లు, ఇతర దుకాణాలు వారం ఇలా రద్దీగా కనిపించాయి. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
పరీక్షలు నీటుగా నిర్వహించాలంటే...
ఏ పరీక్ష అయినా వందలాది మంది వ్యక్తులు నిజాయితీగా ఉన్నప్పుడే లీకులు లేకుండా నిర్వహించడం సాధ్యమవుతుంది. వచ్చే ఆర్థిక లాభం ముందు తీసుకునే రిస్క్ తక్కువనిపించినప్పుడు, లీకులకు అవకాశం మరీ ఎక్కువ. పైగా ఏదోలా అడ్మిషన్ పొందితే కోర్సు దానికదే పూర్తవుతుంది అనే ధోరణి ఉన్నప్పుడు అడ్డదారులు తొక్కడం ఇంకా పెరుగుతుంది. అందుకే ‘నీట్’ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో అసలు దేశంలో పరీక్షల నిర్వహణ తీరును మార్చడమే దీనికి పరిష్కారం. దేశంలో ప్రస్తుతం కాగితం, పెన్నులతో నిర్వహిస్తున్న అన్ని పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్షలుగా మార్చడంతో పాటు, ప్రశ్నపత్రాల కూర్పు తీరు కూడా మారాలి.భారతదేశంలో ఐఐటీలు లేదా ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాలల్లో ప్రవేశించడం, వాటి కోర్సులు పూర్తి చేయడం కంటే కష్టం. నాతోపాటు ఐఐటీ మద్రాస్లో చేరిన 200 మందిలో నాలుగేళ్ల కోర్సు పూర్తిచేయనివాళ్లు దాదాపుగా లేరు. అందుకే ప్రవేశ పరీక్ష పాసయ్యేందుకు అవసరమైతే అడ్డదారులు తొక్కేందుకూ వెనుకాడరు. అర్హత లేని వారు ఒకవేళ అడ్మిషన్ పొందినప్పటికీ సకాలంలో కోర్సు పూర్తి చేయడం అసాధ్యంగా మారేలా ఉంటే... వాళ్లు ప్రవేశ పరీక్ష గట్టెక్కితే అదే పదివేలనుకునే పరిస్థితి తప్పుతుంది.కాగితం, పెన్ను ఆధారంగా పరీక్షలు జరిగినప్పుడు కూడా పేపర్లు లీక్చేసే గ్యాంగ్లు ఉండేవి. అప్పటికి అత్యాధునిక టెక్నాలజీలతో వాళ్లు ప్రశ్న పత్రాల లీక్ చేసే వాళ్లు. అవసరమైన వాళ్లకు చేరవేసే వాళ్లు కూడా. పరీక్ష కేంద్రాల్లో లేదా ప్రశ్న పత్రాల ప్రింటింగ్ కేంద్రాల్లో కొందరితో కుమ్మక్కైతే చాలు. ఏ పరీక్ష అయినాసరే... లీకుల్లేకుండా నిర్వహించడం అనేది వందలాది మంది వ్యక్తులు నిజాయితీగా ఉన్నప్పుడు, అది కూడా భారీ మొత్తాలు ఆశచూపినా తట్టుకునే సామర్థ్యం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అందుకే కాగితం పెన్నుతోనైనా సరే... లీకుల్లేకుండా ఐఐటీ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలను నిర్వహించడం అసాధ్యమే. వచ్చే ఆర్థిక లాభం ముందు తీసుకునే రిస్క్ తక్కువనిపిస్తుంది. మరి ఏమిటి చేయడం? దానికోసం నాలుగు సూచనలు:1. దేశంలో ప్రస్తుతం కాగితం, పెన్నులతో నిర్వహిస్తున్న అన్ని పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్షలుగా మార్చాలి. జేఈఈ (మెయిన్స్), ఇంకా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మూల్యాంకన పరీక్షలు ఇలాగే జరుగుతున్నాయి. హ్యాకర్లు కంప్యూటర్ ఆధారిత పరీక్షలపై దాడి చేసే అవకాశం ఉంది. అందుకని కంప్యూటర్లలో అనధికార సాఫ్ట్వేర్లను నియంత్రించాలి. ఎన్ క్రిప్షన్తో కూడిన ప్రశ్న పత్రాన్ని డౌన్ లోడ్ చేసుకునేందుకు తొలి పది నిమిషాలు, పరీక్ష పూర్తయిన తరువాత సమాధానాలను సింక్ చేసేందుకు మరో పది నిమిషాలు మాత్రమే ఇంటర్నెట్ ఇవ్వాలి. రోజురోజుకూ మెరుగవుతున్న కృత్రిమ మేధ సాయంతోనూ హ్యాకింగ్ సమస్యను అధిగమించే అవకాశముంది. 2. ప్రవేశ పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు ప్రశ్న పత్రాలను నాణ్యంగా కూర్చడమూ ఎంతో కీలకం. ఎక్కువమందికి టాప్ స్కోర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మోసం చేసినా పాసవలేమన్న స్థాయిలో ప్రశ్న పత్రాలు ఉండాలి. భారత్లోని యూజీసీ లాంటి అత్యున్నత విద్యా వ్యవస్థల నాయకులతో సహా చాలామంది, పరీక్ష కఠినమైతే కోచింగ్ వంటివి మరింత విçస్తృత స్థాయికి చేరుకుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూంటారు. పరీక్ష ఎంత కఠినమైనా... ఐఐటీ, ఎంబీబీఎస్ వంటి వాటికి కోచింగ్ ఎప్పటికప్పుడు పెరిగేదే కానీ తగ్గదు. ప్రశ్న పత్రాలను తేలికగా కూర్చడం లేదా తక్కువ పరిమితి ఉన్న సిలబస్ ఆధారంగా సిద్ధం చేయడం వల్ల మాత్రమే కోచింగ్కు తక్కువ ప్రాధాన్యం ఏర్పడుతుంది. కానీ అప్పుడు నాణ్యత తగ్గిపోతుంది. పరీక్ష స్థాయి ఆధారంగా ప్రశ్న పత్రం కఠినత్వం ఉండాలి. బోర్డు పరీక్షలైతే సగటు విద్యార్థులను వేరు చేయడమన్నది 50 పర్సంటైల్ వద్ద ఉండటం మంచిది. నీట్, జేఈఈ వంటి పరీక్షలైతే ఈ పర్సంటైల్ 90 – 95 మధ్య ఉంటే మంచిది. ఇందుకు పరీక్ష కఠినంగా ఉండటం అవసరం. అదే సమయంలో ప్రతిభావంతుడైన ఒక విద్యార్థి, ఆయా బోధనాంశాల్లో నైపుణ్యమున్నవారు ఇద్దరూ సరిగ్గా సమాధానాలు చెప్పేలా ఉండాలి. ఫ్యాక్చువల్ తప్పులపై ఆధారపడి ప్రశ్నలు రూపొందిస్తే (ఈ ఏడాది నీట్లో ఇలాగే జరిగింది) అది నాణ్యమైన ప్రశ్నపత్రం కాదు. 3. అర్థవంతమైన బహుళార్థక ప్రశ్నలు ఇవ్వాలి. ప్రవేశ పరీక్షల్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమాధానాలు అంచనా కట్టవచ్చుననీ, సమాధానం కచ్చితంగా తెలియకపోయినా కొన్ని మోసపు పద్ధతుల ద్వారా సరైన సమాధానం రాబట్టవచ్చుననీ అనుకుంటారు. ఇది వాస్తవం కాదు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలంటే విషయంపై లోతైన అవగాహన అవసరం. విద్యార్థుల మేధకు పరీక్ష పెట్టేలా కొన్ని తప్పుడు సమాధానాలు కూడా ఉంటాయి. కాబట్టి నీట్, జేఈఈ వంటి పరీక్షలకు ఈ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు సరిగ్గా సరిపోతాయి. వివరణాత్మకమైన సమాధానాలు రాస్తే... ప్రశ్న పత్రాలు దిద్దేవారి తీరునుబట్టి మార్కుల్లో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు విద్యార్థికి సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించే తత్వం ఉందా, లేదా అనేది తేల్చవు. కాబట్టి కొన్ని వివరణాత్మక ప్రశ్నలూ జోడించడం మేలు. వీటిని సెకెండ్ పేపర్లో పెట్టి తులన అనేది టాప్ 20 శాతం విద్యార్థులకే పరిమితం (టాప్ 10 శాతం విద్యార్థులను ఎంపిక చేయడం మన లక్ష్యమైనప్పుడు) చేస్తే దిద్దడంలో తేడాలు గణనీయంగా తగ్గుతాయి. 4. నీట్, జేఈఈ వంటి పరీక్షల నిర్వహణకు అత్యంత కీలకమైన మరో అంశం పారదర్శకత. అన్ని ప్రశ్నలను బహిరంగ పరచకపోయినా నమూనా లేదా మాదిరి ప్రశ్నలు కొన్నింటినైనా జన సామాన్యానికి అందుబాటులో ఉంచాలి. ఎంత శాతం మంది విద్యార్థులు ఏ ఆప్షన్ ఎంచుకున్నారు వంటి సమాచారం అందివ్వాలి. ఈ ఆప్షన్స్కూ, విద్యార్థి పరీక్షలో సాధించిన మార్కులకూ మధ్య సంబంధాలను వివరించాలి. ఈ ఏర్పాట్ల వల్ల ప్రధానంగా రెండు లాభాలు ఉంటాయి. ప్రశ్న పత్రాలు కూర్చేవారు ఏకాగ్రతతో ఆ పని చేస్తారు. రెండోది పరీక్ష, నిర్వహణ... రెండింటిపై నమ్మకం పెరుగుతుంది. ర్యాంకుల నిర్ధారణకు పర్సంటైల్స్, స్కేల్డ్ స్కోర్లను జాగ్రత్తగా వినియోగించడం అవసరం. కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్షల్లో ఒక్కో విద్యార్థికి ఒక్కో రకమైన ప్రశ్న పత్రం వస్తుంది కాబట్టి సమాధానాల ద్వారా వచ్చిన మార్కులు అర్థం లేనివిగా మారిపోతాయి. అందుకే వీటికి బదులుగా అందరికీ తెలిసిన సైకోమెట్రిక్ టెక్నిక్ల సాయంతో స్కేల్డ్ స్కోర్లను నిర్ధారించాల్సిన అవసరముంది. ఈ స్కేల్డ్ స్కోర్స్ ఆధారంగా పర్సంటైల్ మార్కులు సిద్ధమవుతాయి. మోసాలను పసిగట్టేందుకు నిరర్థక ప్రశ్నలు, సైకోమెట్రిక్ అనాలసిస్, స్టాటిస్టిక్స్ వంటివి ఎంతో ఉపయోగపడతాయి. ఒకవేళ ఏదైనా నిరర్థక ప్రశ్న వస్తే వాటిని పక్కనపెట్టాలి. తప్పుడు మార్గాల్లో సమాధానాలు చెప్పే ప్రయత్నం చేసిన వారిని డిస్క్వాలిఫై చేయాలి. జేఈఈ మెయిన్ ్స పరీక్ష నిర్వహణకు ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రేవేట్ ఏజెన్సీలపై ఆధారపడుతోంది. నీట్ను మాత్రం స్వయంగా నిర్వహిస్తోంది. నాణ్యమైన, అందరికీ ఆమోదయోగ్యమైన ప్రశ్న పత్రం తయారీ ఎన్టీఏకు కష్టమేమీ కాబోదు. అయితే ఈ రకమైన ప్రశ్న పత్రం తయారీని చాలా శ్రద్ధతో, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో తయారు చేయాల్సి ఉంటుంది. బోధనాంశాలపై పట్టున్నవారు, ప్రత్యేకమైన ఏజెన్సీలు, ప్రశ్నల రూపకల్పన, సమాధానాల విశ్లేషణలకు అత్యాధునిక సైకోమెట్రిక్ పద్ధతులను ఉపయోగించడం అవసరమవుతుంది. ఎందుకంటే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఎన్ టీఏ విశ్వసనీయతపై, అది నిర్వహించే పరీక్షలపై పెద్ద ప్రశ్న చిహ్నం పడింది కాబట్టి! సమాజం మొత్తం ఈ రకమైన స్థితికి చేరడం భవిష్యత్తులో వృత్తినిపుణులుగా ఎదగాల్సిన విద్యార్థులకు ఏమంత మంచిది కాదు.శ్రీధర్ రాజగోపాలన్ వ్యాసకర్త ‘ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సహ–వ్యవస్థాపకుడు (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
లోతైన దర్యాప్తు అవసరం
తవ్వుతున్నకొద్దీ బయటపడుతున్న జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వాకాలు చూస్తుంటే దాని వాలకం ‘అయ్యవారిని చేయబోతే కోతి అయింద’న్న చందంగా మారిందని అందరికీ అర్థమైంది. జేఈఈ మెయిన్ మొదలుకొని నీట్, యూజీసీ నెట్ సహా తొమ్మిది ప్రవేశ పరీక్షలవరకూ నిర్వహిస్తున్న ఈ సంస్థ విడుదల చేసే ప్రశ్నపత్రాలు, వాటి జవాబులు గుజరాత్, హరియాణా, బిహార్, జార్ఖండ్, మహారాష్ట్ర వంటిచోట్ల ‘కావలసినవారికి’ బజారులో దొరికాయని సీబీఐ రంగ ప్రవేశం చేశాక తేటతెల్లమైంది. బిహార్ పోలీసులు అరెస్టు చేసిన 20 మంది నిందితులను విచారిస్తే మే 5న నిర్వహించిన నీట్–యూజీ ప్రశ్నపత్రం ఒకరోజు ముందే పీడీఎఫ్ రూపంలో వారికి వచ్చిందని తేలింది. ఎందుకో ఈ ప్రశ్నపత్రాల మాఫియా దక్షిణాది రాష్ట్రాలవైపు దృష్టి సారించినట్టు లేదు. గత పదిరోజుల వ్యవధిలో ఎన్టీఏ నిర్వహించాల్సిన నాలుగు పరీక్షలు రద్దుకావటం అసాధారణం. రెండు లక్షలమంది విద్యార్థులు రాయాల్సిన ఆదివారంనాటి నీట్ పీజీ పరీక్షను కేవలం 12 గంటల ముందు రద్దుచేశారు. ఎన్టీఏ చీఫ్ సుబోద్ కుమార్ సింగ్ దీనంతటికీ బాధ్యుడని తేలుస్తూ ఆయన్ను తొలగించారు. అంతేనా... దీంతో పాపప్రక్షాళన పూర్తయినట్టేనా? ‘ఒకే దేశం–ఒకే పరీక్ష’ పేరిట ఏమాత్రం పారదర్శకతలేని ఈ వ్యవస్థను సృష్టించిన పాలకుల మాటేమిటి? గత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, బెంగాల్, పంజాబ్, హరియాణాల్లో భిన్న సంస్థలు నిర్వహించిన 70కి పైగా పరీక్ష పత్రాలు లీకయ్యాయని మీడియా కథనాలు చెబుతున్నాయి. నిరుడు తెలంగాణలో పరీక్షపత్రాలు లీకవటంతో నిరుద్యోగులు భగ్గుమన్నారు. నిజాయితీగా అహోరాత్రాలూ చదివిన కోటిన్నరమంది విద్యార్థుల భవితవ్యం ఈ లీకుల పర్యవసానంగా దెబ్బతిన్నదని అంటున్నాయి. ఈ లీకుల బెడద లేకుండా అన్ని సంస్థలనూ తలదన్నేలా నెలకొల్పామని చెప్పిన ఎన్టీఏ తీరు సైతం సక్రమంగా లేదంటే ఇక ఏమనాలి?నిజమే... వైద్య విద్యలో దేశమంతా వర్తించే ఒకే పరీక్ష నిర్వహిస్తే వేలకు వేలు ఖర్చుపెట్టడం, వేర్వేరు పరీక్షలకు సంసిద్ధం కావటంవంటి విద్యార్థుల వెతలు తీరుతాయని సర్వోన్నత న్యాయస్థానం 2011లో భావించింది. లీకులను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుందనుకున్నది. కానీ ఆచరణలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. వైద్య విద్యకు ఒకే ప్రవేశ పరీక్ష ఉండేలా చర్యలు తీసుకోవాలని అప్పటి భారత వైద్య మండలి(ఎంసీఐ)కి చేసిన సూచన కాస్తా అనేక మలుపులు తిరిగి చివరకు ఇలాంటి ఉమ్మడి పరీక్ష నిర్వహణ రాజ్యాంగ విరుద్ధమని 2013లో సుప్రీంకోర్టే 2–1 మెజారిటీ తీర్పునిచ్చింది. కానీ తీర్పు ఇచ్చే ముందు ముగ్గురు న్యాయమూర్తుల మధ్యా ఎలాంటి చర్చా జరగలేదన్న కారణంతో 2016లో అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మళ్లీ విచారించి నీట్ను అనుమతించింది. దేశంలో ఫెడరల్ వ్యవస్థ ఉన్నదని, ఉమ్మడి జాబితాలోని విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చేముందు రాష్ట్రాలతో, విద్యారంగ నిపుణులతో, ఇతర వర్గాలతో చర్చించాలని ఎవరూ అనుకోలేదు. ఒకపక్క హిందీ భాషాప్రాంత విద్యార్థులకు వారి భాషలో ప్రశ్నపత్రం ఇవ్వాలని నిర్ణయించిన ఎంసీఐ దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు స్థానిక భాషల్లో ఇవ్వటం కుదరదని మొరాయించింది. ఆ తర్వాత 2017లో ఎన్టీఏ ఆవిర్భవించాక 13 భాషల్లో ప్రశ్నపత్రాలు ఇస్తోంది. లీకులకు ఆస్కారంలేదని పెట్టిన వ్యవస్థ అందుకు తగ్గట్టుగా ఉందా అనేది ఉన్నతస్థాయిలో గమనించేవారే లేకపోయారు. కేంద్ర సిలబస్లు, ముఖ్యంగా సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా నిర్వహించే ఈ పరీక్షల్లో రాష్ట్ర సిలబస్తో చదివినవారు రాణించగలరా అన్న సందేహమూ రాలేదు. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో దశాబ్దాలుగా వర్ధిల్లుతున్న విద్యా మాఫియా జాతీయ స్థాయికి విస్తరించింది. తమిళనాడు ప్రభుత్వం నియమించిన 2021లో నియమించిన జస్టిస్ రాజన్ కమిటీ అధ్యయనం ప్రకారం నీట్కు ముందు ఇంగ్లిష్ మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సులకు 80.2 శాతం నుంచి 85.12 శాతంవరకూ ఎంపికయ్యేవారు. తమిళ మాధ్యమంలో చదివిన వారి శాతం 14.88 శాతం ఉండేది. కానీ నీట్ మొదలైనాక ఇంగ్లిష్ మాధ్యమం విద్యార్థులు 97 శాతంవరకూ సీట్లు తెచ్చుకుంటుండగా, తమిళ మాధ్యమం విద్యార్థుల వాటా దాదాపు 3 శాతానికి పడిపోయింది. నీట్ సాధించేవారిలో అధికాదాయ కుటుంబాల పిల్లల సంఖ్య అంతక్రితంకన్నా పెరగ్గా, నిరుపేద వర్గాల పిల్లల సంఖ్య తగ్గిందని ఆ నివేదిక వివరించింది. నీట్వల్ల ప్రతిభావంతులకు సీట్లు వస్తున్నాయన్న వాదనను ఆ కమిటీ ఎండగట్టింది. నీట్కు ముందు హెచ్ఎస్సీ విద్యార్థుల సగటు స్కోరు 98.1 శాతం వుండగా, ఇప్పుడది 89.05 శాతం మాత్రమే.ఈసారి వివిధ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఒకపక్క, ఎన్టీఏ ప్రశ్నపత్రాల లీకు మరోపక్క మన వ్యవస్థలకున్న విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇందులో మొదటిది దేశ ప్రజానీకం ఆకాంక్షల్నీ, రెండోది లక్షలాదిమంది విద్యార్థుల ఆశలనూ తలకిందులు చేసింది. ఇందువల్ల ప్రపంచంలో మనం నగుబాటుపాలయ్యామని ఇప్పటికీ ఎన్డీఏ సర్కారు గ్రహించకపోవటం, దొంగను తేలుకుట్టినట్టు వ్యవహరించటం ఆశ్చర్యకరం. ఈ ప్రపంచంలో విద్యాధనాన్ని మాత్రమే ఎవరూ కొల్లగొట్టలేరని చిన్నప్పుడు అందరం చదువుకున్నాం. కళ్లు మూసుకున్న పాలకుల నిర్వాకం కారణంగా దాన్ని సైతం ఎగరేసుకుపోవచ్చని ప్రశ్నపత్రాల మాఫియా నిరూపించింది. అందుకే ఎన్టీఏ చీఫ్ను సాగనంపితే సరిపోదు. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయవిచారణ జరిపించి, ఇలాంటి లీకులకు ఆస్కారం లేకుండా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. -
నీట్ పేపర్ లీకేజీలో మరో కీలక పరిణామం.. రంగంలోకి దిగిన సీబీఐ
సాక్షి,ఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే నీట్ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజా కేంద్రం ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసింది. దీంతో నీట్పై వస్తున్న ఆరోపణలపై సీబీఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనుంది. కాగా, బీహార్లో జరిగిన లీకేజీతో పాటు గ్రేస్ మార్క్లపై సీబీఐ దృష్టి సారించనుంది.కేంద్రం నిర్ణయంతో నీట్ పరీక్ష లీకేజీపై కేంద్ర విద్యాశాఖ అప్రమత్తమైంది. నీట్ పరీక్ష ప్రక్రియ, నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సిఫార్సుల కోసం ఇస్రో మాజీ చైర్మన్ కే.రాధాకృష్ణన్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ తరుణంలో పేపర్ లీకేజీపై దర్యాప్తు చేయాలంటూ కేంద్రం సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. పేపర్ లీకేజీపై కేసు నమోదు చేసుకుంది.720కి 720 మార్కులువైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నీట్-యూజీ2024 ప్రవేశ పరీక్ష మే 5న జరిగింది. దేశ వ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. జూన్ 4న ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో నీట్ చరిత్రలో ఎన్నడూ రాని విధంగా 67 మంది విద్యార్ధులకు 720కి 720 మార్కులు రావడం అనుమానాలు తెరపైకి వచ్చాయి.విద్యార్ధుల్లో ఉత్కంఠతీగ లాగితే డొంకంతా కదిలినట్లు నీట్ పేపర్ లీకేజీ జరిగినట్లు తేలింది. లీకేజీలో నిందితుల హస్తం ఆరా తీయగా.. బీహార్లో కేంద్రంగా నీట్ పేపర్ చేతులు మారాయని, పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, వరుస పరిణామాలపై సీబీఐ కేసు నమోదు చేయడంతో నీట్ పరీక్ష లీకేజీ ఎటుకి దారి తీసుస్తుందోనని విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. -
చదువుకు షాన్ దార్!
ఎండాకాలం సెలవుల తర్వాత స్కూల్స్ మళ్లీ తెరుచుకున్నాయి. పిల్లలు, తల్లిదండ్రులు మళ్లీ బిజీ బిజీ అయిపోయారు. విద్యార్థుల్ని పాఠశాలలకు తీసుకెళ్లే వాహనాలతో ఉదయం వేళ రోడ్లు రద్దీగా ఉంటున్నాయి. పిల్లల భవిష్యత్తును నిర్దేశించేది పాఠశాలే కదా..అందుకే కొత్తగా పిల్లల్ని స్కూల్లో చేర్పించేటప్పుడు తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. అందుబాటులో ఉన్న స్కూళ్లలో వసతులు, బోధన సౌకర్యాలు ఇతరత్రా అన్నీ పరిశీలించి పిల్లలను చేర్పిస్తుంటారు.అయితే హైదరాబాద్లో అన్ని రకాల స్కూళ్లూ ఉన్నాయి. వీటిల్లో ఆ స్కూలు స్థాయిని బట్టి ఫీజుల్లో అంతరం, సిలబస్లో తేడా ఉంటుండగా.. వివిధ రకాల ప్రత్యేకతలతో యాజమాన్యాలు తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్లో వేల సంఖ్యలో స్కూల్స్ ఉన్నాయి. కొన్ని స్కూల్స్లో స్టేట్ సిలబస్.. కొన్నింటిలో సీబీఎస్ఈ, మరికొన్నింటిలో ఐసీఎస్ఈ సిలబస్ చెబుతుంటారు. ఇక అంతర్జాతీయ పాఠశాలలు పరిగణించే కొన్ని స్కూళ్లు కూడా నగరంలో ఉన్నాయి. అలాంటి పాఠశాలలు ఏవి? ఎలాంటి వసతులు అందిస్తున్నాయి? నిజంగానే అంతర్జాతీయ స్థాయి విద్య, బోధన ఉందా?, ఫీజుల మాటేమిటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ..సాక్షి, హైదరాబాద్..అంతర్జాతీయ సిలబస్..విద్యా బోధన, వసతులు, ప్రత్యేకతల్లో కొత్త పుంతలు తొక్కుతూ కార్పొరేట్ స్థాయి స్కూల్స్ అనేకం నగరంలో ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులతో హైదరాబాద్లో అనేక స్కూళ్లు వెలిశాయి. సీబీఎస్ఈతో పాటు ఇంటర్నేషనల్ బాకలరేట్ (ఐబీ), ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐజీసీఎస్ఈ), కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (సీఐఈ), బ్రిటిష్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ బాకలరేట్ ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రామ్ (ఐబీ పీవైపీ), కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ (సీఐఎస్) తదితర సిలబస్ల పేరిట తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి.మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్) వంటి సంస్థలతో, విదేశాల్లోని పాఠశాలలతో అను సంధానమై.. అక్కడి విద్యార్థులతో నేరుగా మాట్లాడేలా, చదువులో వారి అనుభవాలను ఇక్కడి విద్యార్థులతో పంచుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి. తద్వారా విద్యార్థుల్లో చదువుపై ఉన్న అవగాహనలో మార్పు వచ్చేలా, అంతర్జాతీయ స్థాయి ఆలోచనా విధానం అలవడేలా కృషి చేస్తున్నామని వారు పేర్కొంటున్నారు.వసతులు ఎలా ఉంటాయి? దాదాపుగా అన్ని పాఠశాలలు సమాన స్థాయిలో వసతులు అందిస్తున్నాయి. విశాలమైన తరగతి గదులు, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఆర్ట్ స్టూడియోలు, లాంగ్వేజ్ ల్యాబ్స్, డ్యాన్స్, మ్యూజిక్ రూమ్స్, విశాలమైన ప్లే గ్రౌండ్, ఆడిటోరియం, ఆంఫీ థియేటర్, డైనింగ్ హాల్స్ వంటి ఎన్నో సౌకర్యాలు ఉంటున్నాయి. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంతో కళా నైపుణ్యం పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తు న్నారు. గుర్రపు స్వారీ, స్విమ్మింగ్తో పాటు క్రీడల్లోనూ తర్ఫీదునిస్తున్నారు. దాదాపు అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా సువిశాలమైన ప్రాంగణాల్లో వ్యక్తిత్వ వికాసం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని ఓ స్కూల్ యాజమాన్యం తెలిపింది. మానసిక ఎదుగుదల కోసం కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దాదాపుగా అన్ని స్కూళ్లు 100 ఎకరాల వరకు విస్తీర్ణంలో ఉన్నాయి. చెట్లు, పచ్చిక బయళ్లతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారు.బోధన ఎలా?విద్యార్థులకు పుస్తకాలే ప్రపంచం అనేలా కాకుండా వినూత్నమైన బోధనా పద్ధతులు అవలంభిస్తున్నారు. వివిధ రకాల సిలబస్ల్లో శిక్షణ పొందిన నిష్ణాతులైన టీచర్లను యాజమాన్యాలు నియమించుకుంటున్నాయి. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో విద్యార్థులకు ఎలాంటి బోధన అందిస్తున్నారో పరిశోధనలు చేసి అలాంటి పద్ధతులను ఇక్కడ అనుసరిస్తున్నారు. బొమ్మల రూపాల్లో, కళాత్మక రూపాల్లో పిల్లలకు సులువుగా పాఠాలు అర్థమయ్యేలా బోధిస్తున్నారు.కామన్ గ్రౌండ్ కొలాబరేటివ్ మెథడాలజీ విధానంలో పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా చెబుతున్నారు. దీంతో పిల్లల్లో చదువుపై ఆసక్తి పెరుగుతుందని ఓ నిర్వాహకుడు చెప్పారు. ఈ క్రమంలో కొన్ని స్కూళ్లు విదేశీ టీచర్లను సైతం నియమిస్తున్నాయి. ఇక్కడి బోధనా పద్ధతులు నచ్చి విదేశీ విద్యార్థులు కూడా ఇక్కడ చేరుతుండటం గమనార్హం.పిల్లల్ని చేర్పించాలంటే..⇒ ముందుగా పాఠశాల వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత స్కూల్ టూర్ ఏర్పాటు చేస్తారు. స్కూల్లో ఉన్న వసతులు చూసుకున్నాక నచ్చితే ఫీజు, కర్రిక్యులమ్, లొకేషన్, రవాణా సదుపాయాలు వంటి వివరాలను అడ్మిషన్ అధికారితో మాట్లాడుకోవాలి. ఆ తర్వాత మీకు అప్లికేషన్ ఫారం లింక్ పంపిస్తారు.అందులో మీ పిల్లల పూర్తి వివరాలు నింపి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మీ వివరాలను అడ్మిషన్ బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. వాళ్లు మీ వివరాల విషయంలో సంతృప్తి చెందితే సమాచారం పంపిస్తారు. ఆ తర్వాత టర్మ్ ఫీజు చెల్లించి సీటు పొందాలి. అయితే కొన్ని పాఠశాలల్లో ఎంట్రన్స్ పరీక్ష కూడా ఉంటుంది. అందులో మంచి మార్కులు సాధించాల్సి ఉంటుంది.ఫీజుల మాటేమిటి? ఇంటర్నేషనల్ స్కూల్స్ కాబట్టి ఫీజులు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. ప్రీ నర్సరీకే ఏడాదికి కనీసం రూ.3.2 లక్షల ఫీజు ఉంది. ఇక సీబీఎస్ఈ సిలబస్ అయితే ఒకలా.. ఐబీ ప్రోగ్రామ్ అయితే మరోలా ఫీజులు ఉన్నాయి. 12వ తరగతికి కనీసం రూ.10.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.16 లక్షల వరకు ఉంది. టాప్ స్కూల్స్ ఇవే.. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఆగాఖాన్ ఇంటర్నేషనల్ స్కూల్, మ్యాన్చెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్, గాడిమయ్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్, శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్, బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, గ్లెండేల్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్, మెరు ఇంటర్నేషనల్ స్కూల్ వంటివి టాప్ స్కూల్స్ జాబితాలో ఉన్నాయి.చదువుతో పాటు నైపుణ్యాల పెంపుదలవిద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్య అందించేందుకు చాలా కృషి చేస్తున్నాం. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా ఇక్కడ నేర్పిస్తాం. మేం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఐబీ సిలబస్లో బోధిస్తున్నాం. బ్రిటన్, అమెరికాలోని ప్రఖ్యాత స్కూళ్లతో అనుసంధానమై అక్కడి బోధనా పద్ధతులను అనుసరిస్తున్నాం. చదువుతో పాటు వివిధ రంగాల్లో విద్యార్థులు తమ నైపుణ్యాలు పెంపొందించుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. – కందాడి కొండల్రెడ్డి, మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ చైర్మన్ -
నీట్ పేపర్ లీక్ : కేంద్రం దిద్దుబాటు చర్యలు
ఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పరీక్షల నిర్వహణపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చైర్మన్ కే రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏడుగురు కమిటీ సభ్యుల్ని నియమించింది. లీకేజీపై రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.కాగా, కేంద్రం ఆదేశాలతో.. రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీ ప్రవేశ పరీక్ష విధానంలో సంస్కరణలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పని విధానాల్లో మార్పులు , డేటా సెక్యూరిటీ తదితర అంశాలపై కమిటీ సిఫారసులు చేయనుంది. రాధాకృష్ణన్తో పాటు కమిటీలో ఎయిమ్స్ ఢిల్లీ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదారబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామమూర్తి, ఐఐటీ మద్రాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ఎమిరిటస్,కర్మయోగి భారత్ సహ వ్యవస్థాపకుడు పంకజ్ బన్సల్,ఐఐటీ ఢిల్లీ డీన్ (విద్యార్ధి వ్యవహారాలు) ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్, కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైశ్వాల్ సభ్యులుగా ఉన్నారు.Ministry of Education constitutes a High-Level Committee of Experts to ensure transparent, smooth and fair conduct of examinations. Committee to make recommendations on Reform in the mechanism of the examination process, improvement in Data Security protocols and structure and… pic.twitter.com/TJ9NqqUJMi— ANI (@ANI) June 22, 2024 -
గ్రాడ్యుయేట్లకు అమెరికా గ్రీన్ కార్డు: ట్రంప్
వాషింగ్టన్: జాతీయవాదిగా, వలసలను వ్యతిరేకించే నాయకుడిగా పేరుగాంచిన అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ధోరణి మార్చుకున్నారు. అమెరికాలో చదువుకొనే విదేశీ విద్యార్థులకు తీపి కబురు చెప్పారు. తాజాగా ఆల్–ఇన్ పాడ్కాస్ట్లో మాట్లాడారు. అమెరికా కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విదేశీ విద్యార్థులకు అటోమేటిక్గా గ్రీన్ కార్డులు అందించే విధానం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిన అవసరం ఉండదని, అమెరికాలోనే ఉండొచ్చని వెల్లడించారు. జూనియర్ కాలేజీల్లో చదువుకున్నవారికి సైతం గ్రీన్కార్డులు ఇస్తామన్నారు. ఇండియా, చైనా దేశాల విద్యార్థులు అమెరికా కాలేజీల్లో చదువుకొని, స్వదేశాలకు తిరిగివెళ్లి మల్టీ బిలియనీర్లుగా పైకి ఎదుగుతున్నారని, పరిశ్రమలు స్థాపించి, వేలాది మందికి ఉపాధి కలి్పస్తున్నారని చెప్పారు. వారు ఇక్కడే ఉండేలా చేస్తే అమెరికాకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థగా ట్రంప్ మరోసారి బరిలోకి దిగుతుండటం తెలిసిందే. -
నీట్ పరీక్ష రద్దు చేయాలి
సీతమ్మధార (విశాఖ జిల్లా): నీట్ యూజీ – 2024 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని విద్యార్థి, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. నీట్ పరీక్షల్లో అక్రమాలపై శుక్రవారం విశాఖ, తిరుపతిలో విద్యార్థులు, ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ పరీక్షను రద్దు చేయించి, తిరిగి నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మంత్రులు, రాజకీయ నేతలను కోరాయి. నీట్లో అక్రమాలను నిరసిస్తూ విశాఖలోని జీవీఎంసీ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద జన జాగరణ సమితి నేతలు, విద్యార్థులు ప్రదర్శన చేశారు. ఈ పరీక్షలను రద్దు చేసి తిరిగి ఆన్లైన్లో నిర్వహించేలా రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని జన జాగరణ సమితి విశాఖ నగర కన్వీనర్ చింతపల్లి సునీల్కుమార్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో అక్రమాలపై పలు రాష్ట్ర్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం బాధాకరమన్నారు. విద్యార్ధుల భవిష్యత్తును గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆరోగ్య, వైద్య, విద్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇక్కడి విద్యార్థులకు కనీసం వివరణ ఇవ్వకుండా మౌనంగా ఉండడం తగదన్నారు. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి నీట్ పరీక్షలో అక్రమాలపై ప్రధాని నరేంద్ర మోదీ తప్పనిసరిగా స్పందించి, స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నీట్ను ఆన్లైన్లో మాత్రమే నిర్వహించేలా కేంద్రం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భార్గవరెడ్డి, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దుతిరుపతి సిటీ: నీట్ పరీక్ష రద్దు కోరుతూ ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ పరీక్షను తిరిగి నిర్వహించాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే మల్లికార్జున డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని, కనీసం పరీక్ష పపర్ లీకేజిపై స్పందన లేదని మండిపడ్డారు. కనీసం విద్యార్థులకు భరోసా ఇవ్వకుండా బాధ్యతా రాహిత్యంగా మాట్లాడారని అన్నారు. యుద్ధాలను ఆపగలిగే మోదీ పేపర్ లీకేజిని ఎందుకు ఆపలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు యార్లపల్లి గోపి, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు షేక్ జావెద్ పాల్గొన్నారు. -
కేంద్ర విద్యాశాఖ మంత్రికి చేదు అనుభవం
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఉదయం యోగా డే వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్లారాయన. అయితే అక్కడ ఆయనకు నల్లజెండాలతో విద్యార్థులు స్వాగతం పలికారు.నీట్, యూసీజీ-నెట్ పరీక్షలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ యోగా డే కార్యక్రమం కోసం వెళ్లిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను విద్యార్థులు అడ్డుకునే యత్నం చేశారు. నల్లజెండాలతో అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పోలీసులు అప్పటికే బారికేడ్లను ఏర్పాటు చేయగా.. వాటిని తోసుకుంటూ ముందుకు వచ్చే యత్నం చేశారు. ఈ నిరసనలతో ఆయన యోగా డేలో పాల్గొనకుండానే వెనక్కి వెళ్లిపోయారు.ఇదీ చదవండి: నీట్ పేపర్ లీకేజీ నిజమే మరోవైపు.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నిరసనగా ధర్మేంద్ర ప్రధాన్ నివాసం బయట ఈ ఉదయం యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే.. యూజీసీ నెట్ను రద్దు చేసిన కేంద్రం, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు నీట్ అవకతవకలపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో నిన్న ధర్మేంద్ర ప్రధాన్ ప్రెస్ మీట్ నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజీ పడబోమంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇవాళ కూడా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. దీంతో కీలక ప్రకటన ఏదైనా వెలువడే అవకాశం లేకపోలేదు. -
‘నీట్’ లీకేజీపై నిరసన జ్వాల
తిరుపతి సిటీ/గుంటూరు ఎడ్యుకేషన్/లక్ష్మీపురం : నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఉదంతంపై గురువారం రాష్ట్రంలోని పలుచోట్ల నిరసనలు జరిగాయి. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ, ఎంఆర్ పల్లి దండి మార్చ్ సర్కిల్ వద్ద ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్ష పత్రం లీకేజీ బీజేపీ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు.మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటూ ప్రగల్భాలు పలికే ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్లు కూడా నీట్ పేపర్ లీకేజీపై స్పందించాలని, విద్యార్థులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షను మళ్లీ పకడ్బందీగా నిర్వహించాలని, దేశంలోని అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై పార్లమెంట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రవి, అక్బర్, రమేష్నాయక్, నాగేంద్ర ఏఐఎస్ఎఫ్ నాయకులు బండి చలపతి, చిన్న, నవీన్, ప్రవీణ్, పెద్ద సంఖ్యలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు చంద్రమౌళీనగర్ నుంచి లక్ష్మీపురంలోని మదర్థెరిసా విగ్రహం వరకు విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ ఎన్టీఏ నిర్వహించిన పరీక్షలన్నింటిపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, గుంటూరు కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చుని నిరసన చేపట్టారు.నీట్ పరీక్ష పేపర్ లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు జంగాల చైతన్య, యశ్వంత్లు డిమాండ్ చేశారు. లేకుంటే వారి కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రామాయణంతో ఆటలా? బాంబే ఐఐటీ విద్యార్థులకు భారీ జరిమానా
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ బాంబే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)మరోమారు వార్తల్లో నిలిచింది. రామాయణంలోని కొన్ని అంశాల ఆధారంగా ఇక్కడి విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ వివాదాస్పదంగా మారింది. రామాయణాన్ని అపహాస్యం చేసేవిధంగా విద్యార్థులు ఈ నాటకం వేశారంటూ పెద్దఎత్తున విమర్శలు చెలరేగాయి.రామాయణం నాటకం పేరుతో బాంబే ఐఐటీ విద్యార్థులు సనాతన హిందూ సంప్రదాయాలను మంట గలిపారనే విమర్శలు వెల్లువెత్తాయి. రెండు నెలల క్రితం ఐఐటీ బాంబేలో ‘రాహోవన్’ పేరుతో విద్యార్థులు రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఒక నాటకాన్ని ప్రదర్శించారు. ఇది విమర్శలపాలైన నేపధ్యంలో తాజాగా ఆ విద్యార్థులపై ఐఐటీ బాంబే అధికారులు చర్యలు చేపట్టారు.ఈ నాటకంలో వివిధ పాత్రలు పోషించిన విద్యార్థులలో ఒక్కొక్కరికి రూ.1.20 లక్షల చొప్పున జరిమానా విధించారు. బాంబే ఐఐటీలో ప్రతియేటా ఆర్ట్స్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. 2024 మార్చి 31న ఈ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ వేడుకల్లో కొంత మంది విద్యార్థులు ‘రాహోవన్ ’ అనే నాటకాన్ని ప్రదర్శించారు.రామాయణం ఇతివృత్తంగా ఈ నాటకాన్ని రూపొందించారు. అయితే శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడి పేర్లను వారు పోషించిన పాత్రలకు నేరుగా ఉపయోగించలేదు. అయితే రామాయణంలోని అరణ్య కాండంలోని కొన్ని ఘట్టాలను పోలిన సన్నివేశాలు వీరు ప్రదర్శించిన నాటకంలో ఉన్నాయి. అవి రామాయణాన్ని అపహాస్యం చేసేవిగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. వీరు వేసిన నాటకంలోని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
విచారణ జరిపించాలి..
డాక్టర్ కావాలని ఎంతో కష్టపడి చదివి ‘నీట్’ పరీక్షకు హాజరైన లక్షలాది విద్యార్థుల ఆశలపై ఆ పరీక్షల ఫలితాలు నీళ్లు చల్లాయి. ఎన్నడూ లేనివిధంగా 67 మందికి 720 మార్కులకు 720 రావడం, అలా వచ్చినవారిలో పలువురు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడం విద్యార్థులనే కాక, వారి తల్లి తండ్రులనూ నిరుత్తరులను చేసింది.దీనికి తోడు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వందలాదిమందికి పరీక్షానిర్వహణ సంస్థ ఎన్టీఏ గ్రేస్ మార్కులను ఇవ్వడం కూడా విమర్శలకు దారితీసింది. ప్రజల ఆందోళనల నేపథ్యంలో చివరికి గ్రేస్ మార్కులను ఎన్టీఏ ఉపసంహరించుకుంది. కాని, పరీక్షల నిర్వహణలో మాత్రం ఎటువంటి అవకతవకలూ జరగలేదని అనడమే విడ్డూరంగా ఉంది.ప్రతిసారీ విద్యార్థులతో ‘పరీక్షా పే’ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని... కీలకమైన నీట్ పరీక్షపై ఆరోపణలు, అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ మాట్లాడకపోవడం విద్యార్థుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. నీట్ పరీక్ష మాత్రమే కాక దేశంలోని ఎన్నో పోటీ పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోంది. తాజాగా బయటపడ్డ వివాదస్పద అంశాల కారణంగా దానిపై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది.ప్రతిసారీ ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులకు ఎక్కువగా ర్యాంక్లు రావడం, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు తక్కువ ర్యాంకులు రావడంపై దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అనేక అనుమానాలు కల్గుతున్నాయి.ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి అవకతవకలు ఉన్నవని తేలితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా లబ్ధిపొందిన వారిపైనా చర్యలు తీసుకోవాలి. నీట్లో జరిగిన అక్రమాల కారణంగా కష్టపడి చదివిన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. – గడ్డం శ్యామ్, పీడీఎస్యూ తెలంగాణ ఉపాధ్యక్షుడు -
నీట్ పరీక్షా ఫలితాలు.. కోర్టులో విద్యార్ధినికి చుక్కెదురు
ఢిల్లీ: ఇటీవల ఓ విద్యార్ధిని తన నీట్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ చిరిగిందని, ఫలితంగా మార్కులు తక్కువ వచ్చాయని అలహాబాద్ హైకోర్టులో జూన్ 12న పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ఓఎంఆర్ షీట్ను పరిశీలించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. ఆ పిటిషన్పై జస్టీస్ రాజేస్ సింగ్ చౌహాన్ ధర్మాసనం జూన్ 18న విచారణ చేపట్టింది. వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ అవతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది.ఈ తరుణంలో నీట్ పరీక్ష రాసిన ఆయుషి పటేల్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. నీట్ పరీక్షను జాతీయ పరీక్ష మండలి (ఎన్టీఏ) నిర్వహిస్తుంది. ఫలితాల్ని విడుదల చేస్తోంది. అయితే ఈ జూన్ 4న విడుదల చేసిన నీట్ ఫలితాల్లో ఆయేషాకు 335 మార్కులు వచ్చాయి. ఆ మార్కులపై విద్యార్ధిని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆన్సర్ కీ ఆధారంగా తనకు 715 మార్కులు వస్తాయని, కానీ వేరే అప్లికేషన్ నంబర్తో విడుదలైన పరీక్ష ఫలితాల్లో కేవలం 335 మార్కులే వచ్చాయని అలహదాబాద్ కోర్టులో వాపోయారు. ఎన్టీఏ ఓఎంఆర్ చించేసిందిఅంతేకాదు జూన్ 4న నీట్ ఫలితాలు విడుదలైన, తన ఫలితాలు వెలువడడంలో జాప్యం జరిగిందని తెలిపింది. తొలుత నీట్ ఫలితాలు వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. ఓఎంఆర్ షీట్ చిరిగిపోయిందని ఎన్టీఏ ఆమెకు మెయిల్ చేసినట్లు తెలిపింది. ఓఎంఆర్ షీట్ను ఉద్దేశపూర్వకంగా చింపేసిందని ఎన్టీఏపై ఆయుషి ఆరోపణలు గుప్పించింది. తన ఓఎంఆర్ షీట్ను మరోసారి పరిశీలించాలని అన్నారు. అంతేకాదు ఎన్టీఏపై విచారణ చేపట్టాలని, త్వరలో జరగాల్సిన అడ్మిషన్ కౌన్సిలింగ్ జరపకుండా నిలిపి వేయాలని కోరారు. నకిలీ పత్రాలు సమర్పించిఅయితే, కోర్టు ఆదేశాలతో ఎన్టీఏ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ను సమర్పించింది. ఆ ఓఎంఆర్ షీట్ చిరిగిపోలేదు. విద్యార్ధిని నకిలీ ఓఎంఆర్ షీట్ను కోర్టుకు సమర్పించినట్లు నిర్దారణకు వచ్చింది. అందుకు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఎన్టీఏను ఆపలేమని కోర్టు పేర్కొంది. పిటిషన్ ఉపసంహరణఎన్టీఏ సైతం ఆయుషిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ తన ప్రతిపాదనను కోర్టు ముందు ఉంచింది. అయితే వరుస పరిణామాలతో ఆయుషి తరుపు న్యాయవాది తాను దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంటామని కోరగా అందుకు కోర్టు అంగీకరించింది. NEET जैसी परीक्षाओं में लाखों बच्चे मेहनत से तैयारी करते हैं और अपनी जिंदगी के सबसे कीमती पल इस तैयारी में लगाते हैं। पूरा परिवार इस प्रयास में अपनी श्रद्धा और शक्ति डालता है। लेकिन साल दर साल इन परीक्षाओं में पेपर लीक, रिजल्ट से जुड़ी गड़बड़ियाँ सामने आई हैं।क्या परीक्षा कराने… pic.twitter.com/mcHwsVb4IH— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 10, 2024ప్రియాంక గాంధీ సైతంఇక ఆయేషీ పటేల్ తనకు అన్యాయం జరిగిందంటూ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆ వీడియోని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని విడనాడి, పేపర్ లీకేజీలు, అవకతవకలపై చర్య తీసుకోవాలని కోరారు. ఆయుషి పటేల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో బీజేపీ నేతలు ప్రియాంక గాంధీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తప్పుడు ప్రచారాలు, అసత్యాల్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోన్నారు. -
0.001 శాతం నిర్లక్ష్యమున్నా పరిష్కరించాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టిన నీట్–యూజీ 2024 పరీక్ష విధానం, నిర్వహణలో 0.001 శాతం లోపం తలెత్తినా సరే సకాలంలో పరిష్కరించాలని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం వ్యాఖ్యానించింది. మే ఐదో తేదీన నిర్వహించిన నీట్యూజీలో కొందరు విద్యార్థులకు సమయాభావం, ఇతరత్రా కారణాలతో గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని సవాల్చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లను విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల సెలవుకాల ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) చేపట్టిన విషయం విదితమే. ‘‘ అత్యంత కఠినమైన ఇలాంటి ప్రవేశ పరీక్ష కోసం విద్యార్థులు ఎంతగా శ్రమిస్తారో మనందరికీ తెలుసు. వైద్యుడే సమాజంలో అవినీతికి పాల్పడితే సమాజానికి ఎంతటి నష్టం చేకూరుతుందో ఊహించండి. ప్రవేశపరీక్షలు నిర్వహించే ఒక బాధ్యతాయుత సంస్థగా ఒకే మాట మీద నిలబడాలి. మీ వైపు ఏదైనా తప్పు జరిగితే నిజాయతీగా ఒప్పుకోవాలి. సరిదిద్దేందుకు చేపట్టిన చర్యలనూ వివరించాలి. కనీసం ఆ దిశగా చర్యలకు సమాయత్తం అయ్యామని అయినా నిరూపించుకోవాలి. అప్పుడే మీ పనితీరుపై విశ్వాసం పెరుగుతుంది’’ అని ఎన్టీఏ తరఫున వాదించిన లాయర్లకు కోర్టు చీవాట్లు పెట్టింది.రెండు వారాల్లో స్పందన తెలపండికేసుల తదుపరి విచారణ జరిగే జూలై 8వ తేదీలోపు ఏమేం చర్యలు చేపట్టారో నివేదించాలని కోర్టు సూచించింది. మళ్లీ పరీక్షను నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై రెండు వారాల్లోపు మీ స్పందన తెలపాలంటూ ఎన్టీఏ, కేంద్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. పరీక్షలో అడిగిన ఒక ప్రశ్నను పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ప్రస్తావించగా ‘‘దానికి ఎన్టీఏ, కేంద్రం సమాధానం చెప్తాయి. మీరెందుకు పిటిషన్లు వేశారో మమ్మల్ని అర్థంచేసుకోనివ్వండి.మీ వాదనలను సావధానంగా వినేందుకు సాయంత్రందాకా కూర్చుంటాం’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. పేపర్ లీకేజీపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్నూ కోర్టు విచారించింది. గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థులకు ఆ మార్కులను తీసేశామని కేంద్రం, ఎన్టీఏ జూన్ 13వ తేదీన కోర్టుకు నివేదించిన విషయం విదితమే. ఆ మార్కులు పోను మిగి లిన మార్కులతో ఆ విద్యార్థు లు కౌన్సెలింగ్కు వెళ్లొచ్చు లేదంటే మరో సారి పరీక్ష రాసు కోవ చ్చు అని ఎన్టీఏ తెలిపింది. 4,750 కేంద్రాల్లో 24 లక్షల మంది అభ్యర్థులుమే ఐదున 4,750 కేంద్రాల్లో దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు నీట్యూజీ–2024 రాశారు. హరియాణాలోని ఫరీదాబాద్ కేంద్రంలో రాసిన వారిలో ఆరుగురికి సహా దేశవ్యాప్తంగా 67 మందికి 720కిగాను 720 మార్కులు పొంది టాప్ర్యాంక్ సాధించడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎక్కువ మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపడమే ఈ అనూహ్య టాప్ర్యాంకుల పర్వానికి అసలు కారణమని వెల్లడైంది. వ్యవహారం కోర్టుకు చేరడంతో వారందరికీ గ్రేస్ మార్కులు తొలగిస్తున్నామని ఎన్టీఏ ప్రకటించినప్పటికీ అసలు ఈ విధానాన్ని ఎందుకు అనుసరిస్తున్నారని, గోప్యత ఎందుకు పాటించారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.సమయం వృథా అయితే ఆ మేరకు అదనపు సమయం పరీక్ష రాయించాలిగానీ విద్యార్థికి ఏ ప్రామాణిక ప్రాతిపదికన గ్రేస్ మార్కులు ఇస్తారని విద్యావేత్తలు సైతం విస్మయం వ్యక్తంచేస్తున్నారు. నీట్యూజీ కౌన్సెలింగ్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. -
మాదాపూర్ కేరీర్ ఫేయిర్లో విదేశీ వర్సిటీ ప్రతినిధులతో ఉత్సాహంగా విద్యార్థులు (ఫొటోలు)