-
స్టార్ లింక్కు షాక్.. శాటిలైట్ బ్రాడ్బ్యాండ్పై ఎయిర్టెల్ కీలక అడుగు..!
మన దేశంలో అందరి కంటే ముందుగా శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించాలని చూసిన స్టార్ లింక్కు గట్టి షాక్ తగిలింది. స్టార్ లింక్ కంటే ముందే దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు వన్ వెబ్ సిద్దం అవుతుంది. ఆ దిశగా అడుగులు కూడా వేస్తుంది. మన దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అంధించడానికి ప్రముఖ నెట్వర్క్ సంస్థ భారతి ఎయిర్టెల్, యుకె ప్రభుత్వ గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్ వర్క్ వన్ వెబ్, బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ హ్యూస్ వ్యూహాత్మక ఆరు సంవత్సరాల భాగస్వామ్య ఒప్పందం మీద సంతక చేశాయి. శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవల్లో భాగంగా భారతీ ఎయిర్టెల్తో కలిసి హైదరాబాద్కి చెందిన హ్యూస్ కమ్యూనికేషన్స్ జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేశాయి. ఈ జాయింట్ వెంచర్లో ఎయిర్టెల్ సుమారు 33 శాతం, హ్యూస్ కమ్యూనికేషన్స్ 67 శాతం వాటాలను కల్గి ఉన్నాయి. వీరు సంయుక్తంగా ఏర్పాటుచేసిన జాయింట్ వెంచర్ భారత్లో శాటిలైల్ ఇంటర్నెట్ సేవలను అందించనున్నారు. ముఖ్యంగా ఫైబర్ కనెక్టివిటీ లేని మారుమూల ప్రాంతాల్లో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వన్ వెబ్ నెట్వర్క్ పట్టణాలు, గ్రామాలు, స్థానిక & ప్రాంతీయ మున్సిపాలిటీలలోని కష్టతరమైన ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించగలదు అని కంపెనీలు ఒక ప్రకటనలో తెలిపాయి. 2022 చివరలో ప్రారంభం శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవల కోసం ఎయిర్టెల్, హ్యూస్ కమ్యూనికేషన్స్తో 2019లోనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇరు కంపెనీల ‘వెరీ స్మాల్ అపెర్చర్ టెర్మినల్ (VSAT)’ వ్యాపారాలను ఇకపై కలిపేయనున్నట్లు పేర్కొన్నాయి. భారత్లో అతిపెద్ద శాటిలైజ్ సర్వీస్ ఆపరేటర్గా హ్యూస్ కమ్యూనికేషన్స్ నిలుస్తోంది. బ్యాంకింగ్, ఏరోనాటికల్, మేరీటైమ్ మొబిలిటీ, విద్య, టెలికాం వంటి రంగాల్లో సేవలందిస్తోంది. శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ వల్ల దేశంలోని లడఖ్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి ఈశాన్యం వరకు భారతదేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాల్లో శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందించవచ్చు అని వన్ వెబ్ సీఈఓ నీల్ మాస్టర్సన్ తెలిపారు. ఈ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవల 2022 చివరి నాటికి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. (చదవండి: Gold Price: పసిడి పరుగో పరుగు.. తులం ఎంతంటే?) -
ఎలన్ మస్క్కు మరో భారీ షాక్!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కు మరో భారీ షాక్ తగిలింది. త్వరలో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్లో ప్రారంభించనున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం అక్టోబర్ 1న స్టార్లింక్ ఇండియా డైరెక్టర్గా సంజయ్ భార్గవను నియమించారు. అయితే ఇప్పుడు సంజయ్ భార్గవ వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్టార్ లింక్లో తన లాస్ట్ వర్కింగ్ డే డిసెంబర్ 31 అని అధికారంగా వెల్లడించారు. ఎలన్ మస్క్ 1999లో ఆన్ లైన్ పేమెంట్ సంస్థ పేపాల్ను ఏర్పాటు చేశారు. 2000సంవత్సరంలో మనదేశానికి చెందిన సంజయ్ బార్గవ పేపాల్ సంస్థలో కీరోల్ ప్లే చేశారు. తాజాగా ఆయన పనితీరు మెచ్చిన మస్క్..,సంజయ్ భార్గవను స్టార్ లింక్ ఇండియా డైరక్టర్గా నియమించారు. అలా నియమించిన మూడు నెలలకే సంజయ్ బార్గవ స్టార్లింక్ నుంచి వైదొలుగుతున్నట్లు లింక్డిన్లో పోస్ట్ చేశారు. స్టార్ లింక్ ఇండియా బోర్డ్ చైర్మన్ పదవితో పాటు కంట్రీ డైరక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంజయ్ భార్గవ లింక్డిన్ పోస్ట్ లో పేర్కొన్నారు. అంతేకాదు స్టార్లింక్ సంస్థ నుంచి బయటకి రావడంపై తాను ఎలాంటి కామెంట్ల చేయడం లేదని, మీడియా సైతం తాను తీసుకున్న నిర్ణయం పట్ల గౌరవించాలని కోరారు. చదవండి: భారత్ దెబ్బకు..కిందకు దిగొచ్చిన ఎలన్ మస్క్ కంపెనీ..! -
భారత్ దెబ్బకు..కిందకు దిగొచ్చిన ఎలన్ మస్క్ కంపెనీ..!
స్టార్లింక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రవేశపెట్టాలని భావించిన టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలన్మస్క్కు గత నెలలో మనదేశంలో గట్టి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారతదేశంలో స్టార్లింక్ ప్రీ బుకింగ్ ఆర్డర్స్ తీసుకోవడం నిలిపివేసిన తర్వాత ఇప్పుడు ప్రీ బుకింగ్ కోసం గతలో యూజర్ల వసూలు చేసిన డబ్బులను తిరగి ఖాతాలో జమ చేస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 2020లో శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ కంపెనీ స్టార్లింక్ వినియోగదారుల నుంచి ప్రీ ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించింది. ప్రీ బుకింగ్ ఆర్డర్లు 99 డాలర్ల ధరకు లభ్యం అయ్యాయి. మన దేశంలో ఈ శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవల అందించడం కోసం ప్రీ బుకింగ్ పేరుతో రూ.7300లను స్టార్లింక్ వసూలు చేసింది. లైసెన్స్ తీసుకోకుండా స్టార్లింక్ వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం నేరం అని టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటీ) సంస్థను హెచ్చరించడంతో స్టార్ లింక్ నవంబర్ 2021లో భారతదేశంలో ప్రీ బుకింగ్ ఆర్డర్లను తీసుకోవడం నిలిపివేసింది. దీంతో భారత్లో స్టార్లింక్ సేవలను అందించేందుకుగాను వాణిజ్య లైసెన్స్ కోసం ఈ ఏడాది జనవరి 31లోపు దరఖాస్తు చేసుకోనుందని స్టార్లింక్ ఇండియా హెడ్ సంజయ్ భార్గవ్ లింక్డ్ఇన్లో గతంలో పేర్కొన్నారు. అక్టోబర్ 1, 2021 నాటికి భారతదేశంలో ఈ సేవల ఇప్పటికే 5000కు పైగా ప్రీ ఆర్డర్లు అందినట్లు కంపెనీ ప్రకటించింది. భారతదేశంలో లైసెన్స్ పొందే వరకు ప్రీ ఆర్డర్ల రూపంలో తీసుకున్న డబ్బును రీఫండ్ చేయాలని డీఓటీ ఆదేశించినట్లు స్టార్లింక్ భారతదేశంలోని కస్టమర్లకు ఈ-మెయిల్ చేసినట్లు సమాచారం. భారతదేశంలో స్టార్లింక్ సేవలు అందించడానికి ముందు పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని కంపెనీ హైలైట్ చేసినట్లు ఒక ప్రముఖ మీడియా నివేదించింది. దేశంలో ఉపగ్రహ ఆధారిత సేవలను అందించడానికి భారత ప్రభుత్వం నుంచి అవసరమైన లైసెన్స్(లు) తీసుకోవాలని డీఓటి ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. (చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా మోటార్స్..!) -
ఎలన్ మస్క్పై దుమ్మెతిపోస్తున్న చైనా పౌరులు! ఎందుకంటే..
Chinese Citizens Slam Musk Online After Space Station Near Misses: టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ను చైనా పౌరులు ఆన్లైన్లో దుమ్మెతిపోస్తున్నారు. తీవ్ర పదజాలంతో మస్క్పై చైనా దేశస్తులు విరుచుకుపడుతున్నారు. కారణం ఇదే..! ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటెర్నెట్ సేవలను అందించేందుకు స్టార్లింక్ ప్రొగ్రాంను ఎలన్ మస్క్ ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థతో సుమారు 42 వేలకుపైగా స్టార్లింక్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఫాల్కన్ రాకెట్ ద్వారా ఇప్పటికే 18 వందలకు పైగా స్టార్లింక్ శాటిలైట్లను స్పేస్ ఎక్స్ పంపింది. దశలవారీగా స్టార్లింక్ శాటిలైట్లను స్పేస్ ఎక్స్ పంపుతోంది. కాగా ఈ మిషన్లో భాగంగా 2021లో జూలై 1 నుంచి అక్టోబర్ 21 సమయంలో స్టార్లింక్ శాటిలైట్స్ చైనా స్పేస్ స్టేషన్కు ప్రమాదాన్ని గురిచేసే అవకాశం ఏర్పడిందని చైనా అంతరిక్ష సంస్థ సోమవారం డిసెంబర్ 27న యూఎన్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ అలర్ట్గా ఉండడంతో చైనా స్పేస్ స్టేషన్ కక్ష్యను కాస్త జరపడంతో పెద్ద ముప్పు నుంచి తృటిలో తప్పిందని పేర్కొంది. యూఎన్కు చైనా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఇప్పడే వెలుగులోకి వచ్చింది. దీంతో చైనా పౌరులు స్పేస్ ఎక్స్ అధినేతపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. రానున్న రోజుల్లో చైనా స్పేస్ స్టేషన్ టియాన్హేలోని మూడు మాడ్యూళ్లలో అతిపెద్దదైన టియాన్హేను ప్రయోగాన్ని ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభించింది. 2022 చివరి నాటికి స్టేషన్ పూర్తవుతుందని చైనా ప్రకటించింది. అమెరికన్ స్పేస్ వార్ఫేర్..! చైనా చేసిన వ్యాఖ్యలపై స్పేస్ ఎక్స్ స్పందించలేదు. సోమవారం చైనా మైక్రోబ్లాగింగ్ సైట్ విబోలో చైనా పౌరులు ఎలన్ మస్క్ ప్రయోగిస్తోన్న స్టార్లింక్ ఉపగ్రహాలను అంతరిక్ష వ్యర్థాల కుప్పతో పోల్చుతున్నారు. ఇంకొంతమందైతే..."అమెరికన్ స్పేస్ వార్ఫేర్ ఆయుధాలు" అని అభివర్ణించారు. చదవండి: అంతరిక్షంలోకి యువరాజ్సింగ్ బ్యాట్..! తొలి వ్యక్తిగా యువీ రికార్డు..! -
భారత్ దెబ్బకు..దారికొచ్చిన ఎలన్ మస్క్..!
స్టార్లింక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రవేశపెట్టాలనే టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలన్మస్క్కు భారత్ గట్టిషాకిచ్చింది. స్టార్లింక్ సేవలను ఎవరు ప్రీ ఆర్డర్స్ చేయవద్దని కేంద్రం తెలిపింది. దీంతో భారత్లో ప్రీ ఆర్డర్స్ను నిలిపివేస్తూ స్టార్లింక్ నిర్ణయం తీసుకుంది. లైసెన్స్కు రెడీ..! లైసెన్స్ లేకుండా స్టార్లింక్ సేవలను భారత్లో ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని స్టార్లింక్ వెనక్కి తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎలన్ మస్క్ దారికొచ్చినట్లుగా కన్పిస్తోంది. ఎట్టకేలకు భారత్లో స్టార్లింక్ సేవలను అందించేందుకుగాను వాణిజ్య లైసెన్స్ కోసం వచ్చే ఏడాది జనవరి 31లోపు దరఖాస్తు చేసుకోనుందని స్టార్లింక్ ఇండియా హెడ్ సంజయ్ భార్గవ లింక్డ్ఇన్లో పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి భారత్లో సేవలు.. ఏప్రిల్ నాటికి స్టార్లింక్ తన సేవలను మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎలాంటి అవాంతరాలు లేకుంటే డిసెంబర్ 2022 నాటికి దేశవ్యాప్తంగా 2 లక్షల సబ్స్క్రిప్షన్లను కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు భార్గవ తెలిపారు. వీటిలో సుమారు 80 శాతం మేర గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండేలా కంపెనీ ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే స్టార్లింక్ భారత్లో 5,000 వరకు ప్రీ ఆర్డర్స్ను పొందింది. చదవండి: జియో యూజర్లకు గుడ్న్యూస్..! 20 శాతం క్యాష్బ్యాక్..! ఎలా పొందాలంటే..! -
వెనక్కి తగ్గిన ఎలన్ మస్క్.. ప్రీ బుకింగ్స్ నిలిపివేత!
భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలతో ఆకట్టుకోవాలనుకున్న ఎలన్ మస్క్ చివరకు వెనక్కి తగ్గాడు. స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలకు భారత్లో ఇంకా లైసెన్స్ లభించలేదన్న విషయం మనకు తెలిసిందే. లైసెన్స్ లేకుండా దేశంలో స్పేస్ఎక్స్ స్టార్లింక్ ప్రీ ఆర్డర్స్ తీసుకోవడాన్ని కేంద్రం తప్పుపట్టింది. దీంతో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రీ బుకింగ్ సంస్థ నిలిపివేసింది. పోర్టల్లో "స్టార్లింక్ ఆర్డర్ చేయడం కోసం ఆసక్తి చూపించినందుకు ధన్యవాదాలు! స్టార్లింక్ సేవలు మీ ప్రాంతంలో అందుబాటులో లేవు" అని ఉంది. స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలకు భారత్లో లైసెన్స్ లభించకున్న 99 డాలర్ల(రూ.7,400)తో బేటా వెర్షన్ సేవలను అందించనున్నట్లు, ఆర్డర్లకు దరఖాస్తు పెట్టుకోవాలంటూ భారతీయులను కోరింది. ఈ నేపథ్యంలో ఐదు వేల ముందస్తు ఆర్డర్లు వచ్చినట్లు స్టార్లింక్ భారత్ హెడ్ సంజయ్ భార్గవ ఈమధ్యే వెల్లడించారు కూడా. ఈ క్రమంలోనే టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటీ) స్టార్లింక్ సేవలపై అభ్యంతరాలు లేవనెత్తింది. అంతేకాదు ఇక్కడి రెగ్యులేటర్ ఫ్రేమ్ వర్క్కు అనుగుణంగా పని చేయాల్సిందేనని, డీఓటీ అనుమతులు తప్పనిసరని, లైసెన్స్కు దరఖాస్తు చేసుకోవాలని స్పేస్ఎక్స్కు సూచించింది. అంతేకాదు స్టార్లింక్ను ఎవరూ బుక్ చేసుకోవద్దంటూ జనాలకు సూచించింది. కేంద్ర ఈ విధంగా సూచించిన తర్వాత స్టార్లింక్ తన ప్రీ బుకింగ్ సౌకర్యాన్ని నిలిపివేసింది. (చదవండి: ఓలాకు గట్టిపోటీ..! భారీ ప్రణాళికతో ఏథర్..!) -
‘ఎలన్మస్క్, స్టార్లింక్పై క్రిమినల్ కేసు పెట్టండి’
న్యూఢిల్లీ: లైసెన్సు లేకుండానే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తామంటూ కస్టమర్ల నుంచి డబ్బు వసూలు చేసినందుకు గాను అమెరికన్ సంస్థ స్టార్లింక్పై క్రిమినల్ కేసు పెట్టాలని ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థ టెలికం వాచ్డాగ్ విజ్ఞప్తి చేసింది. నవంబర్ 27న టెలికం కార్యదర్శికి ఈ మేరకు లేఖ రాసింది. ఈ విషయంలో తగు స్థాయిలో సత్వర చర్యలు తీసుకోనందుకు గాను సంబంధిత అధికారులపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. 2021 ఫిబ్రవరి నుంచే స్టార్లింక్ ప్రీ–బుకింగ్ ప్రారంభించినప్పటికీ దీనికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడంలో టెలికం శాఖ (డాట్) తీవ్ర జాప్యం చేసిందని పేర్కొంది. ఈలోగా అమాయక కస్టమర్ల నుంచి స్టార్లింక్ భారీగా దండుకుందని టెలికం వాచ్డాగ్ తెలిపింది. కంపెనీ చెప్పే లెక్కలు బట్టి చూస్తే 11,000 కస్టమర్ల నుంచి దాదాపు 10,89,000 డాలర్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోందని వివరించింది. అనుమతులు తీసుకోకుండానే కష్టమర్ల నుంచి చందాలు వసూలు చేసిన వ్యవహారంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్తో విచారణ జరిపించాలని, కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బును వడ్డీతో సహా, ఎలాంటి కోతలు లేకుండా, స్టార్లింక్ పూర్తిగా రిఫండ్ చేసేలా చర్యలు తీసుకోవాలని టెలికం వాచ్డాగ్ కోరింది. అమెరికా ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం ఎలాన్ మస్క్కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్లింక్.. భారత్లోనూ కార్యకలాపాలు మొదలుపెట్టే సన్నాహాల్లో ఉంది. ప్రీ–బుకింగ్ కూడా చేపట్టింది. అయితే, స్టార్లింక్కు లైసెన్సు ఇవ్వలేదని, కంపెనీ సర్వీసులకు సబ్స్క్రయిబ్ చేయరాదని డాట్ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే టెలికం వాచ్డాగ్ ఫిర్యాదు ప్రాధాన్యం సంతరించుకుంది. చదవండి: Starlink: ఎంట్రీకి ముందే షాకుల మీద షాకులు.. -
భారత్లో ఎలన్ మస్క్కి ఎదురు దెబ్బ
TRAI Barred Elon Musk's Starlink Broadband Pre Orders in India: అపరకుబేరుడు ఎలన్ మస్క్కి భారీ షాకిచ్చింది భారత ప్రభుత్వం. మానసపుత్రిక స్పేఎస్ఎక్స్ అందించే బ్రాడ్బాండ్ సర్వీస్కు భారత్ నుంచి ముందస్తు ఆర్డర్స్ తీసుకోకుండా నిషేధించింది. అంతేకాదు స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్కు ఎవరూ ప్రీ ఆర్డర్లతో సబ్ స్క్రయిబ్ కావొద్దంటూ భారతీయులకు సూచించింది కేంద్ర సమాచార శాఖ. భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలతో ఆకట్టుకోవాలన్న ఎలన్ మస్క్ ప్రయత్నాలకు విఘాతం కలుగుతోంది. తాజాగా లైసెన్స్ లేకుండా స్పేస్ఎక్స్ స్టార్లింక్ ప్రీ ఆర్డర్స్ తీసుకోవడాన్ని కేంద్రం తప్పుపట్టింది. స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలకు భారత్లో ఇంకా లైసెన్స్ లభించలేదన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ 99 డాలర్ల(రూ.7,400)తో బేటా వెర్షన్ సేవలను అందించనున్నట్లు, ఆర్డర్లకు దరఖాస్తు పెట్టుకోవాలంటూ భారతీయులను కోరింది. ఈ నేపథ్యంలో ఐదు వేల ముందస్తు ఆర్డర్లు వచ్చినట్లు స్టార్లింక్ భారత్ హెడ్ సంజయ్ భార్గవ ఈమధ్యే వెల్లడించారు కూడా. ఈ క్రమంలోనే టెలికమ్యూనికేషన్స్ విభాగం(Department of Telecommunications (DoT).. స్టార్ లింక్ సేవలపై అభ్యంతరాలు లేవనెత్తింది. అంతేకాదు ఇక్కడి రెగ్యులేటర్ ఫ్రేమ్ వర్క్కు అనుగుణంగా పని చేయాల్సిందేనని, డాట్ అనుమతులు తప్పనిసరని, లైసెన్స్కు దరఖాస్తు చేసుకోవాలని స్పేస్ఎక్స్కు సూచించింది. అంతేకాదు స్టార్లింక్ను ఎవరూ బుక్ చేసుకోవద్దంటూ జనాలకు సూచించింది. అయితే తాజా పరిణామంపై స్పందించేందుకు సంజయ్ భార్గవ నిరాకరించారు. ఇదిలా ఉంటే స్టార్లింక్ వెబ్సైట్ ప్రకారం.. వచ్చే ఏడాది నుంచి భారత్లో సేవలను అందించేందుకు సిద్ధంగా ఉంది స్టార్లింక్. ఇక భారత్లో స్టార్లింక్కు మొదటి నుంచే ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో స్పేస్ఎక్స్ బిడ్ను తిరస్కరించాలని కోరుతూ బ్రాడ్బాండ్ అసోసియేషన్లోని వన్వెబ్(ఇది కూడా స్పేస్ ఆధారిత సేవలు అందించేదే!), అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ తదితర కంపెనీలు ట్రాయ్, ఇస్రోలకు లేఖలు రాశాయి కూడా. చదవండి: 'జియో' కంటే తక్కువ ధరకే Starlink శాటిలైట్ ఇంటర్నెట్..! -
భూమ్మీద కాదు, అంతరిక్షంపై ఆదిపత్యం కోసం పోటా పోటీ పడుతున్నారు
స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్, అమెజాన్ అధినేత జెఫ్బెజోస్లు భూమి మీద జరిగే వ్యాపారాల్లోనే కాదు, అంతరిక్షంలో జరిపే ప్రయోగాల్లోనూ నువ్వా నేనా అంటూ ఒకరికొకరు పోటీపడుతున్నారు. ఇప్పటికే ఆర్టెమిస్ ప్రాజెక్టులో భాగంగా లూనార్ ల్యాండర్ ప్రాజెక్ట్ను ఛేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేసి అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ విఫలమయ్యారు. తాజాగా స్పేస్లో ఆదిపత్యం చెలాయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శాటిలైట్ ఇంటర్నెట్ విషయంలో మస్క్ అందరికంటే ముందంజలో ఉండగా.. జెఫ్బెజోస్ సైతం 'ప్రాజెక్ట్ కైపర్' పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ను అందించనున్నారు. ఇందుకోసం ఉపగ్రాహాలను స్పేస్లోకి పంపేందుకు అమెరికా ప్రభుత్వం నుంచి వరుసగా అనుమతులు తీసుకుంటున్నారు. జెఫ్బెజోస్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే 4,500 కంటే ఎక్కువ ఉపగ్రహాలను (శాటిలైట్స్) స్పేస్లోకి పంపేందుకు యూఎస్ కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ నుండి అనుమతి పొందారు. తాజాగా గత వారం మరో 7,774 ఉపగ్రహాలను స్పేస్లోకి పంపేందుకు, నవంబర్ 7న (నిన్న ఆదివారం) అమెజాన్ 2022 చివరి నాటికి రెండు ప్రోటోటైప్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఎఫ్సీసీని అనుమతి కోరారు. ఈ అనుమతులతో ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారా ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలతో పాటు ప్రపంచంలోని వినియోగదారులందరికి శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించవచ్చని ఎఫ్సీసీ అనుమతి కోసం పంపిన నివేదికలో జెఫ్ బెజోస్ పేర్కొన్నారు. వరల్డ్ వైడ్గా ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగుపడినప్పటికీ ప్రపంచ జనాభాలో 51%, అభివృద్ధి చెందుతున్న దేశాల జనాభాలో 44% మాత్రమే ఇంటర్నెట్ సేవల్ని వినియోగిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. స్పేస్ ఎక్స్ ముందంజ స్పేస్ఎక్స్ యజమాని ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించారు. ప్రాజెక్ట్ లో భాగంగా 2027 నాటికల్లా 4,425 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1,800కుపైగా శాటిలైట్లను పంపారు. వాటి సాయంతో అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, యూరప్లోని 14 దేశాల్లో వంద డాలర్ల ప్రీ-ఆర్డర్ బుకింగ్(రిఫండబుల్) శాటిలైట్ సేవల్ని అందిస్తున్నారు. ఒకవేళ సిగ్నల్ వ్యవస్థ గనుక పని చేయకపోతే ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తారు. స్టార్లింక్స్తో పాటు ఎకోస్టార్, లియోశాట్, ఓ3బీ, టెలీస్టాట్, అప్స్టార్ట్ తో పాటు వర్జిన్ గెలాక్టిక్ ‘వన్వెబ్’ పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తున్నారు. చదవండి:శుభవార్త..! 'జియో'కంటే తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్..! -
భారతీయులకు శుభవార్త..! 'జియో' కంటే తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్..!
భారతీయులకు శుభవార్త. త్వరలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు జియో కంటే తక్కువ ధరకే లభించనున్నాయి. ఇప్పటికే జియో భారత టెలికాం రంగంలో సంచలనాలను నమోదుచేసింది.అతి తక్కువ ధరలో 4జీ ఇంటర్నెట్ను అందించిన మొబైల్ నెట్వర్క్ సంస్థగా జియో నిలిచింది. పలు కంపెనీలు తమ టారిఫ్ వాల్యూలను తగ్గించాల్సి వచ్చింది. జియో రాకతో ఇంటర్నెట్ రంగంలో పెనుమార్పులే వచ్చాయి. అయితే ఇప్పుడు జియో కంటే తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్ను అందించేందుకు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఎలన్ మస్క్ కేంద్రం ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు. ఆ చర్చలు కొలిక్కి వస్తే మనదేశంలో ఇంటర్నెట్ యూజర్లకు శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు అతితక్కువ ధరకే లభించనున్నాయి. భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ త్వరలో ఎలన్ మస్క్కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు భారత్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు ఎలా ఉంటాయనే అంశంపై చర్చ జరుగుతుండగా.. స్టార్ లింక్ స్పందించింది. భారతీయులకు అనుగుణంగా శాటిలైట్ ఇంటర్నెట్ను సబ్సిడీకి అందివ్వనున్నట్లు తెలిపింది. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..మనదేశంలో స్టార్లింక్ తన సబ్స్క్రిప్షన్ ప్లాన్లను సబ్సిడీ రేట్లతో అందించే ఆలోచనలో ఉన్నట్లు స్టార్లింక్కి ఇండియా హెడ్ సంజయ్ భార్గవ తెలిపారు. భారత్లో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ధర తక్కువగా ఉంటాయని అన్నారు. వినియోగదారులు చెల్లించే ధరలకంటే అందించే సేవలు ఎక్కువగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టార్ లింక్ ప్రస్తుతం దేశంలోని అంతర్గత ప్రాంతాలపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఇక్కడ ఇంటర్నెట్ సేవల్ని యాక్సెస్ చేయడం చాలా కష్టం. తక్కువ ధర, సరైన సదుపాయల్ని కల్పించడం ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ రూపురేకల్ని మార్చవచ్చని అన్నారు. శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు స్పేస్ఎక్స్ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో భారత్లో స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం బుకింగ్లను ప్రారంభించింది. బుకింగ్లో భాగంగా కొనుగోలుదారులు రూ.7,500 డిపాజిట్ చెల్లించాలి.అలా చెల్లించిన వారికి ప్యాకేజీలో భాగంగా, స్టార్లింక్ డిష్ శాటిలైట్, రిసీవర్, సెటప్ చేయడానికి అవసరమైన అన్ని పరికరాలను అందిస్తుంది. ప్రారంభంలో ఇంటర్నెట్ స్పీడ్ 100-150ఎంబీపీఎస్ పరిధిలో ఉంటుంది. అయితే, తక్కువ భూ కక్ష్యలో మరిన్ని స్టార్లింక్ శాటిలైట్లను పంపడం ద్వారా ఇంటర్నెట్ వేగం జీబీపీఎస్కి చేరుకోవచ్చని స్టార్లింక్ ప్రతినిధులు భావిస్తున్నారు.ప్రస్తుతం ఈ ప్రయోగం ప్రారంభదశలోఉండగా..వచ్చే ఏడాది జూన్ జులై నాటికి కమర్షియల్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొని రానున్నారు. 100 స్కూళ్లకు ఉచితం నివేదికలో భాగంగా శాటిలైట్ ఇంటర్నెట్ సెటప్ను స్టార్లింక్ సంస్థ 100 పాఠశాలలకు ఉచితంగా అందజేస్తుందని, వాటిలో 20 సెటప్లు ఢిల్లీ పాఠశాలలకు, మిగిలిన 80 సెటప్లు ఢిల్లీ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నట్లు స్టార్లింక్ ఇండియా బాస్ సంజయ్ భార్గవ స్పష్టం చేశారు. -
Work From Village: పల్లెల్లో వర్క్ఫ్రం హోం ? గ్రామీణ ప్రాంతాలపై స్టార్లింక్ దృష్టి
న్యూఢిల్లీ: పొలం గట్టున కూర్చునో.. మంచె మీద కంప్యూటర్ పెట్టుకునో.. పెరట్లో చెట్టు నీడన.. ఊరిపట్టున ఉంటూనే వర్క్ఫ్రం హోం పద్దతిలో ఉద్యోగం చేసే అవకాశం అతి త్వరలోనే రానుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందించేందుకు అంతర్జాతీయ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. అన్ని కుదిరితే అతి త్వరలో వైర్సెల్ బ్రాడ్బ్యాండ్ సేవలు పల్లెలను పలకరించనున్నాయి. నీతి అయోగ్ నిర్ణయంతో అమెరికాకు చెందిన బ్రాడ్బ్యాండ్ సేవల సంస్థ స్టార్లింక్ తన కార్యకలాపాల్లో భాగంగా భారత్లో గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్బ్యాండ్ సర్వీసులను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం దేశీ టెలికం కంపెనీలతో జట్టు కట్టాలని భావిస్తోంది. స్టార్లింక్ ఇండియా కంట్రీ డైరెక్టర్ సంజయ్ భార్గవ ఈ విషయాలు తెలిపారు. జిల్లాల్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ప్రణాళికకు సంబంధించి నీతి ఆయోగ్ ఫేజ్–1లో గ్రామాలను ఎంపిక చేసిన తర్వాత తాము బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్స్తో చర్చలు ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. టార్గెట్ రూరల్ గ్రామీణ జిల్లాల్లో 100 శాతం బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడానికి ఇతర సంస్థలతో కూడా తాము కలిసి పని చేయాలనుకుంటున్నట్లు భార్గవ చెప్పారు. దేశీయంగా శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించేందుకు అవసరమయ్యే టెర్మినల్స్ ను కంపెనీ భారత్లో తయారు చేయబోతోందన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. స్థానికంగా వాటి ని ఉత్పత్తి చేసే యోచనేదీ ప్రస్తుతం లేదని పేర్కొ న్నారు. స్టార్లింక్ మెరికాకు చెందిన బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన రాకెట్ల తయారీ సంస్థ స్పేస్ఎక్స్కు స్టార్లింక్ అనుబంధ సంస్థ. ఇది ఇటీవలే భారత్లో కంపెనీ పేరు నమోదు చేసుకుంది. ఉపగ్రహ సాంకేతికత ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీసులు అందించనుంది. ఇందుకోసం 99 డాలర్లు (సుమారు రూ. 7,350) డిపాజిట్గా కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే భారత్లో 5,000 పైచిలుకు ప్రీ–ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. వైర్లెస్ స్టార్లింక్ సంస్థ లో ఎర్త్ ఆర్బిట్ (లియో) మోడ్లో బ్రాడ్బ్యాండ్ సేవలు అందించేలా ప్రణాళిక రూపొందిస్తోంది. పోల్స్, వైర్లు, ఫిక్స్డ్ ఏరియా వంటి చిక్కులు లేకుండా లియో ద్వారా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ పొందవచ్చు. కరోనా తర్వాత వర్క్ఫ్రం విధానం పాపులర్గా మారింఇ. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్బ్యాండ్ సేవలు ఎక్కువగా అందుబాటులో లేక చాలా మంది పట్టణ ప్రాంతాల్లోనే ఉంటూ వర్క్ఫ్రం హోం చేశారు. ఇక ఊర్లకు వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సేవలు వస్తే అక్కడ కూడా వర్క్ఫ్రం హోం కల్చర్ చేసుకునేందుకు వీలవుతుంది. -
రూటు మార్చిన ఎలన్ మస్క్.. ఇండియా మార్కెట్ కోసం సరికొత్త వ్యూహం
న్యూఢిల్లీ: ఇండియాలో తన వ్యాపార విస్తరణకు సంబంధించి ప్రపంచ కుబేరుడు ఎలన్మస్క్ సరికొత్త వ్యూహం ఎంచుకున్నారు. ఇప్పటి వరకు టెస్లా కార్ల అమ్మకాల ద్వారా ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని భావించారు. అయితే ఈ వ్యవహారం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. దీంతో వ్యూహం మార్చి ఇంటర్నెట్ సేవలను తెర మీదకు తెచ్చారు. బ్రాడ్బ్యాండ్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ తాజాగా భారత్లో కార్యకలాపాలు ప్రారంభించే దిశగా సన్నాహాలు వేగవంతం చేసింది. స్థానికంగా బ్రాడ్బ్యాండ్ సేవలను అందించేందుకు భారత్లో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఎస్సీపీఎల్) పేరిట దీన్ని నెలకొల్పినట్లు స్టార్లింక్ కంట్రీ డైరెక్టర్ (ఇండియా) సంజయ్ భార్గవ తెలిపారు. ఇక తాము లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు, బ్యాంక్ ఖాతాలు తెరవనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పర్మిషన్ల పనిలో ప్రభుత్వ అనుమతులకు లోబడి 2 లక్షల యాక్టివ్ టెర్మినల్స్తో డిసెంబర్ 2022 నుంచి భారత్లో బ్రాడ్బ్యాండ్ సేవలు ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే భారత్ నుంచి 5,000 ప్రీ–ఆర్డర్లు వచ్చాయని కంపెనీ చెబుతోంది. ఒకో కస్టమర్ నుంచి 99 డాలర్లు (సుమారు రూ. 7,350) డిపాజిట్ వసూలు చేస్తోంది. సెకనుకు 50–150 మెగాబిట్స్ స్పీడ్తో ఇంటర్నెట్ కనెక్టివిటీ అందిస్తామని చెబుతోంది. దేశీయంగా రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు భారతి గ్రూప్నకు చెందిన వన్వెబ్తో స్టార్లింక్ పోటీపడాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్బ్యాండ్ సేవలను విస్తరించడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెడుతోంది. -
Starlink: డబ్బులు కట్టి నెలలు అవుతున్నా..ఇంత వరకు పత్తాలేదు..!
ప్రపంచ వ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు జోరుగా సాగుతున్నా..ఇప్పటికే ప్రీ ఆర్డర్లు బుక్ చేసుకున్న వినియోగదారులకు ఇంటర్నెట్ను అందించడంలో ఎలన్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో శాటిలైట్ ఇంటర్నెట్ కోసం వినియోగదారులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని నెలలు కావొస్తున్నా ఇంటర్నెట్ సేవలు అందడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్,10 యూరోపియన్ కంట్రీస్ కలిపి మొత్తం 14దేశాల్లో పరిమిత స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. కానీ 90శాతం ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్న యూఎస్లో..కొందరికి శాటిలైట్ ఇంటర్నెట్ను అందించే విషయంలో ఎలన్ మస్క్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. జాన్ డ్యూరాన్ అనే వ్యక్తి ఫిబ్రవరిలో 100 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.7,503.50) డిపాజిట్ చెల్లించాడు. డిపాజిట్ చెల్లించిన తరువాత స్టార్ లింక్ కిట్ అందుతుంది. కానీ జాన్ ప్రీ ఆర్డర్ బుక్ చేసుకొని 9నెలలు అవుతున్నా స్టార్లింక్ నుంచి ఎలాంటి రిప్లయి రాలేదు. కాంటాక్ట్ చేసినా ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి సెప్టెంబర్లో స్టార్లింక్ ప్రీ ఆర్డర్ను రద్దు చేసుకున్నట్లు జాన్ తెలిపారు. నేను పిచ్చివాడిని కాదు,స్టార్ లింక్ సర్వీస్ విషయంలో చాలా అసంతృప్తికి గురైనట్లు చెప్పారు. ప్రస్తుతం జాన్ ఇంటర్ నెట్ కోసం ఫోన్ నుండి మొబైల్ హాట్స్పాట్ను ఉపయోగిస్తున్నాడు. ఒక జానే కాదు మరి కొంతమంది వినియోగదారులు సైతం ప్రీ ఆర్డర్ను క్యాన్సిల్ చేసుకున్నారు. ఆర్డర్ను క్యాన్సిల్ చేయడంతో కట్టిన మనీ తిరిగి ఇచ్చేశారని,మరి ఇంటర్నెట్ సేవల్ని ఎప్పుడు అందిస్తారో చెప్పాలని అంటున్నారు.ఇప్పటికే ఎలన్ మస్క్ వరల్డ్ వైడ్గా పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ను అందించేందుకు 1600 శాటిలైట్లను స్పేస్లోకి పంపారు. మొత్తంగా 42వేల శాటిలైట్లను పంపే పనిలో పడ్డారు. త్వరలో వరల్డ్ వైడ్గా ఇంటర్నెట్ను అందిచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఎలన్ వినియోగదారుల నుంచి వస్తున్న విమర్శలపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. చదవండి: అన్న కుక్కను దువ్వుతుంటే.. తమ్ముడి ఆస్తులు పెరుగుతున్నాయ్ -
శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఇస్రోతో వన్ వెబ్ కీలక ఒప్పందం
ప్రపంచంలో పెనుమార్పులు తీసుకురానున్న యుకె ఆధారిత గ్లోబల్ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రొవైడర్ వన్ వెబ్ సంస్థలో భారతి ఎయిర్టెల్ భారీగా వాటాను కొనుగోలు చేసిన మనకు తెలిసిందే. వన్ వెబ్ సంస్థ చేపట్టిన ప్రాజెక్టు విజయవంతమైతే ఇంటర్నెట్ కొత్త దశలోకి అడుగుపెడుతుంది. ఇక ఈ భూగోళం మీద ఎక్కడైనా ఆన్లైన్ సేవలు అందుకోవచ్చు. మారుమూల ప్రాంతాలకు.. కనీస రవాణా సౌకర్యాలు లేని ప్రదేశాల్లోని వారు కూడా ఇంటర్నెట్ను వినియోగించే అవకాశం ఉంటుంది. ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినా సేవలు నిలిచిపోయే సమస్య రాదు. అటువంటి వన్ వెబ్ ప్రాజెక్టు ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలో ప్రవేశ పెట్టడం కోసం భారత అంతరిక్ష సంస్థ ఇస్రోతో వన్ వెబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం గురుంచి భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. "భారత నేల నుంచి వన్ వెబ్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి మేము(వన్ వెబ్) ఇస్రోతో ఒప్పందం చేసుకున్నాము. ఈ రోజు ఈ ఒప్పందం గురుంచి మీ అందరితో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను" అని సునీల్ మిట్టల్ చెప్పారు. అసలు ఏమిటి వన్ వెబ్ ప్రాజెక్టు ఇప్పటి వరకు ప్రపంచంలో అన్నీ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అందించడం కోసం కేబుల్స్ వేయడం, టవర్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే నేరుగా ఉపగ్రహాల నుంచి ఇంటర్నెట్ సేవలు అందించనున్నారు. ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించడం కోసం వన్ వెబ్ ప్రాజెక్టు పేరుతో లండన్ కేంద్రంగా 2012లో జార్జివేలర్ అనే వ్యక్తి స్థాపించాడు. అయితే, ఆ కంపెనీ దివాళా తీసే సమయంలో మన దేశ దిగ్గజ టెలికామ్ కంపెనీ, యుకె ప్రభుత్వం అందులో భారీ వాటాను దక్కించుకున్నాయి. (చదవండి: ఎంజీ ఆస్టార్ వచ్చేసింది. ధర ఎంతంటే?) ఇప్పుడు ఆ ప్రాజెక్టు శర వేగంగా దూసుకెళ్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగానే తొలి దశలో 150 కిలోల బరువున్న 650 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఇప్పటికే 322 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరుకొన్నాయి. రెండో దశలో దాదాపు 1900కి పైగా ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహాలను ఫ్లోరిడాలోని ఒక కంపెనీ తయారు చేస్తోంది. ఫ్రాన్స్కు చెందిన ఏరియన్ స్పేస్ కంపెనీ రష్యా సోయజ్ రాకెట్ల సాయంతో ఇప్పటి వరకు అంతరిక్షంలోకి పంపించేవారు. కానీ, ఇప్పుడు ఈ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టడం కోసం ఇస్రోతో వన్ వెబ్ ఒప్పందం చేసుకుంది. ఈ చిన్న ఉపగ్రహాలు గంటకు 27వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి భూభ్రమణాన్ని 90-120 నిమిషాల్లో పూర్తి చేస్తాయి. వన్ వెబ్ కీ పోటీగా స్పేస్ ఎక్స్ స్టార్ లింకు ప్రాజెక్టు దూసుకెళ్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా ప్రారంభించింది. -
దేశంలోని పది లోక్సభ నియోజకవర్గాల్లో స్టార్ లింక్ సేవలు
స్పేస్ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టార్ లింక్ బ్రాండ్ బ్యాండ్ సేవలు త్వరలోనే మనదేశంలోని పది గ్రామీణ లోక్ సభ నియోజకవర్గాలలో ప్రారంభించనున్నట్లు ఒక సంస్థ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. స్టార్ లింక్ ప్రాజెక్టు కింద ఉపగ్రహాల సహాయంతో మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ అందించాలని స్పేస్ ఎక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. హాథోర్న్, కాలిఫోర్నియా ఆధారిత సంస్థ స్పేస్ఎక్స్ 2021 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించాలని అంచనా వేసింది. రాబోయే భవిష్యత్తులో ఈ సేవలను కల్పించడానికి భారతదేశాన్ని పరిశీలిస్తోంది. ఇందుకోసం దేశంలోని పది గ్రామీణ లోక్ సభ నియోజకవర్గాలపై దృష్టి సారిస్తుందని ఇండియా స్టార్ లింక్ డైరెక్టర్ సంజయ్ భార్గవ ఒక పోస్టులో తెలిపారు. శాసనసభ్యులు, మంత్రులు, బ్యూరోక్రాట్లతో సమావేశం కానున్నట్లు ఆయన సూచి౦చారు. దేశంలో స్టార్ లింక్ వ్యాపారాన్ని పర్యవేక్షించడానికి స్టార్లింక్ ఇండియా డైరక్టర్గా సంజయ్ భార్గవను స్పేస్ఎక్స్ నియమించింది. స్టార్ లింకు ప్రాజెక్టు కింద మొదట ఉపగ్రహాన్ని ఫిబ్రవరి 2018లో స్పేస్ ఎక్స్ ప్రయోగించింది. (చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో చైనాకు పోటీగా భారత్ దూకుడు!) స్టార్ లింక్ ప్రస్తుతం 1,600కు పైగా ఉపగ్రహాలను కలిగి ఉంది. వీటి ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడానికి స్పేస్ ఎక్స్ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, చిలీ, పోర్చుగల్, యుకె, యుఎస్ వంటి ఇతర 14 దేశాలలో బీటా టెస్టింగ్ కనెక్టివిటీ ప్రారంభించింది స్పేస్ ఎక్స్. స్టార్ లింక్ డిసెంబర్ 2022 నాటికి భారతదేశంలో 2 లక్షల మందికి చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది అని భార్గవ పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే 5,000 టెర్మినల్స్ కోసం ముందస్తుగా ఆర్డర్ చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కనెక్షన్ కోసం 99 డాలర్ల (సుమారు రూ.7,350) డిపాజిట్ వసూలు చేస్తోంది. బ్రాడ్బ్యాండ్ సర్వీసుల విభాగంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు భారతీ గ్రూప్నకు చెందిన వన్వెబ్తో స్టార్లింక్ నేరుగా పోటీపడనుంది. -
ఇండియాలో టార్గెట్ ఫిక్స్,స్టార్ లింక్ బ్రాండ్ బ్యాండ్ ప్రారంభం అప్పుడే
న్యూఢిల్లీ: స్పేస్ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టార్ లింక్ బ్రాండ్ బ్యాండ్ సేవలు త్వరలోనే మనదేశంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి భారత్లో బ్రాడ్బ్యాండ్ సర్వీసులు ప్రారంభించే యోచనలో ఎలాన్ మస్క్ ఉన్నారని ఇండియా స్టార్లింక్ కంట్రీ డైరెక్టర్ సంజయ్ భార్గవ తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులకు లోబడి 2 లక్షల యాక్టివ్ టెర్మినల్స్తో వీటిని ప్రారంభించవచ్చని పేర్కొన్నారు. భారత్లో ప్రీ–ఆర్డర్ల సంఖ్య 5,000 స్థాయిని దాటేసిందని సోషల్ మీడియా పోస్ట్లో ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్బ్యాండ్ సేవలను విస్తరించడంపై తమ సంస్థ ఆసక్తిగా ఉందని భార్గవ వివరించారు. బీటా దశలో 50 నుంచి 150 మెగాబిట్ పర్ సెకన్ స్థాయిలో డేటా స్పీడ్ అందిస్తామని స్టార్లింక్ చెబుతోంది. ఈ కనెక్షన్ కోసం 99 డాలర్ల (సుమారు రూ. 7,350) డిపాజిట్ వసూలు చేస్తోంది. బ్రాడ్బ్యాండ్ సర్వీసుల విభాగంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు భారతీ గ్రూప్నకు చెందిన వన్వెబ్తో స్టార్లింక్ నేరుగా పోటీపడనుంది. అంతర్జాతీయంగా స్టార్లింక్ కనెక్షన్లకు ప్రీ–ఆర్డర్లు 5,00,000 స్థాయిని దాటేసిందని భార్గవ చెప్పారు. దేశీయంగా రాబోయే నెలల్లో ప్రయోగాత్మక పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాగలవని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సెమీకండక్టర్ల కొరత కారణంగా స్టార్లింక్ కిట్లను తయారు చేసే వేగం మందగించిందని ఆయన వివరించారు. చదవండి: ‘నీ అబ్బ సొత్తేం కాదు’, నువ్వేం తక్కువ కాదుగా ! -
స్టార్లింక్ ఇండియా డైరక్టర్ను నియమించిన ఎలన్ మస్క్..!
Sanjay Bhargava To Join Musk Starlink As India Country Director: భారత్ కార్ల మార్కెట్ పై కన్నేసిన టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ‘స్టార్ లింక్’ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్కు విస్తరించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే భారత టెలికాం డిపార్ట్మెంట్ నుంచి స్టార్లింక్ అనుమతులను కూడా ప్రయత్నించిన్నట్లు తెలుస్తోంది. భారత్లో స్టార్లింక్ సేవలను త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా స్టార్లింక్ ఇండియా డైరక్టర్గా సంజయ్ భార్గవను స్పేస్ఎక్స్ నియమించింది. చదవండి: రోల్స్రాయిస్ నుంచి తొలి ఎలక్ట్రిక్ కార్పై ఓ లుక్కేయండి..! పేపల్ నుంచి... అక్టోబర్ 1 నుంచి స్టార్లింక్ ఇండియా డైరక్టర్గా సంజయ్ భార్గవ పనిచేయనున్నారు. సంజయ్ భార్గవ తన లింక్డ్ ఇన్ ఖాతాలో ఈ విషయాన్ని తెలియజేశారు. గతంతో పేపల్ ఫిన్టెక్ సంస్థలో సంజయ్ పనిచేశారు. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సంస్థ భరోసా క్లబ్కు చైర్మన్గా వ్యవహరించారు. స్టార్లింక్ సేవలు త్వరలోనే భారత్కు వచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు సంజయ్ భార్గవ వెల్లడించారు. భారత్లో టెలికాం రెగ్యూలేటరీ ట్రాయ్ నుంచి త్వరలోనే ఆమోదం వస్తోందని సంజయ్ అభిప్రాయపడ్డారు. చదవండి: వచ్చేశాయి.. ! బడ్జెట్ ఫ్రెండ్లీ రియల్మీ వాషింగ్మెషిన్లు, వాక్యూమ్ క్లీనర్లు..! ధర ఎంతంటే..? -
‘నీ అబ్బ సొత్తేం కాదు’, నువ్వేం తక్కువ కాదుగా !
Elon Musk Jeff Bezo Rival: పోటీ ప్రపంచంలో పోటాపోటీ విమర్శలూ సహజమే. కానీ, అవి విపరీతానికి చేరితేనే వెగటు పుడుతుంది. బిలియనీర్లు ఎలన్ మస్క్, జెఫ్ జెజోస్ల మధ్య మాటల వైరం రోజురోజుకీ శ్రుతి మించుతోంది. వీలు దొరికినప్పుడల్లా బెజోస్పై పరోక్షంగా విరుచుకుపడుతున్న మస్క్.. తాజాగా మరోసారి దురుసు వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో అవతలి నుంచి కూడా కౌంటర్ పడడం విశేషం. ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ బ్లూ ఆరిజిన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(అమెజాన్ బాస్) న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకుని స్పేస్ఎక్స్ ప్రయోగాలను నెమ్మదించేలా చేస్తున్నాయని ఆరోపించాడు ఎలన్ మస్క్. 2021 కోడ్ కాన్ఫరెన్స్లో బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేశాడాయాన. ‘‘నీ తరపు లాయర్లు ఎంత గొప్పవాళ్లైనా కావొచ్చు. చంద్రుడి చేరాలనే మా ప్రయత్నాన్ని ఎన్ని దావాలేసినా ఆపలేరు. అంతరిక్ష యానం నీ అబ్బసొత్తు కాదు’’ అంటూ ఒకానొక దశలో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు మస్క్. ఇదిలా ఉంటే స్పేస్ఎక్స్, స్టార్లింక్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు బ్లూ ఆరిజిన్ వరుసగా దావాలు వేస్తోందన్నది ఎలన్ మస్క్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అమెజాన్ కౌంటర్ మస్క్ ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే అమెజాన్ నుంచి కౌంటర్ పడింది. ఎలన్ మస్క్ తాను బెజోస్ లాంటోడేనని గుర్తించ లేకపోతున్నాడంటూ సెటైర్ వేసింది. గతంలో స్పేస్ఎక్స్ వేసిన దావాలకు సంబంధించిన చిట్టాను బయటపెట్టింది అమెజాన్. ఈ మేరకు అమెరికన్ టెక్నాలజీ బ్లాగ్ ది వర్జ్కు సంబంధిత డాక్యుమెంట్లను పంపించింది. స్పేస్ఎక్స్ ఇప్పటిదాకా వివిధ కోర్టుల్లో వేసిన 13 దావాలు, అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లు, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ చేసిన స్టేట్మెంట్ల తాలుకా వివరాలను వెల్లడించింది. 2004 నుంచి అమెరికా ప్రభుత్వం, నాసా, యూఎస్ ఎయిర్ఫోర్స్లకు వ్యతిరేకంగా స్పేస్ఎక్స్ దాఖలు చేసిన పిటిషన్లు ఇందులో ఉన్నాయి. This is hilarious. Amazon sent us a 13-page PDF to prove Elon Musk is as litigious as Jeff Bezos https://t.co/Kh10AehEgB via @Verge — Eric Berger (@SciGuySpace) September 29, 2021 అమెజాన్ శాటిలైట్ డివిజన్ ప్రతినిధి ప్రాజెక్ట్ కుయిపర్ పేరు మీద ఈ డాక్యుమెంట్లు వర్జ్కు వచ్చాయి. ‘‘ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పని చేసిన స్పేస్ఎక్స్.. గతంలో చేసింది ఇదే కదా. ఏకంగా ప్రభుత్వంపైనే బ్లాక్మెయిలింగ్కు దిగింది’’ అని కుయిపర్ పేరు మీద స్టేట్మెంట్ రిలీజ్ అయ్యింది. మొత్తం 39 డాక్యుమెంట్లు ఉండగా, వాటిని 13 పేజీల(పీడీఎఫ్ ఫైల్రూపంలో) కుదించి పంపించారు. SpaceX has sued to be *allowed* to compete, BO is suing to stop competition — Elon Musk (@elonmusk) September 29, 2021 సెటైర్ అయితే తమ దావాల వ్యవహారాన్ని స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ సమర్థించుకున్నాడు. ‘‘మేం పోటీప్రపంచంలోకి అనుమతించాలని స్పేస్ఎక్స్ తరపున దావాలు వేశాం. కానీ, బీవో(బ్లూఆరిజిన్ను ఉద్దేశించి) అసలు పోటీయే ఉండకూడదని దావాలు వేస్తోంది’’ అని వ్యంగ్యం ప్రదర్శించాడు. ఇక న్యాయపరమైన చర్యలతో బ్లూ ఆరిజిన్ కంపెనీ తనకు మోకాలు అడ్డుపెట్టడంపై ఎలన్ మస్క్ ఘాటుగానే స్పందిస్తున్నాడు. బహుశా తమపై కేసులు వేయడానికే బ్లూ ఆరిజిన్ బాస్ జెఫ్ బెజోస్ అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుని ఉంటాడంటూ గతంలో సెటైర్లు సైతం పేల్చాడు. చదవండి: ఇద్దరూ ఇద్దరే.. వీళ్ల చర్యలు ఊహాతీతం -
కాంతివేగంతో ఇంటర్నెట్ స్పీడ్...! ఎలన్ మస్క్ నుంచి సంచలన ప్రకటన
వాషింగ్టన్: మన నిత్య జీవితంలో ఇంటర్నెట్ ఒక భాగమైంది. ఇంటర్నెట్ లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేము. 4జీ రాకతో ఇంటర్నెట్ స్పీడ్ గణనీయంగా పెరిగింది. 4జీ నెట్వర్క్ సుమారు 10 ఎమ్బీపీఎస్ స్పీడ్ వరకు ఇంటర్నెట్ను అందిస్తుంది. తాజాగా పలు టెలికాం సంస్థలు 5జీ టెక్నాలజీపై కూగా దృష్టిసారించాయి. 5జీ టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు పలు కంపెనీలు ఇప్పటికే చర్యలను తీసుకుంటున్నాయి. కాగా టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఒక అడుగు ముందుకేసి స్టార్లింక్ ద్వారా శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. చదవండి: Anand Mahindra Responds To Elon Musk: ఎలన్ మస్క్ వాదనతో ఏకీభవించిన ఆనంద్ మహీంద్రా..! ఇప్పటికే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో స్టార్లింక్ తన సేవలను కూడా ప్రారంభించింది. తాజాగా ఎలన్ మస్క్ స్టార్లింక్ ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో సంచలన వ్యాఖ్యలను చేశాడు. భవిష్యత్తులో స్టార్లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలను ఏలాంటి గ్రౌండ్ స్టేషన్లను వాడకుండానే ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చునని పేర్కొన్నారు. స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలు సుమారు కాంతి వేగంతో డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చునని ఇంటర్నెట్ సైంటిస్ట్ స్కాట్ మ్యాన్లీతో ట్విటర్లో వెల్లడించారు. స్టార్లింక్ బ్రాడ్బ్యాండ్ సేవల్లో డౌన్లింక్ స్టేషన్ల అవసరాన్ని హైలైట్ చేసిన మస్క్, వచ్చే 4 నుంచి 6 నెలల్లో స్టార్లింక్ ఉపగ్రహాలను ప్రయోగించడంతో ఇంటర్-శాటిలైట్ లేజర్ లింక్లను కలిగి ఉంటుందని చెప్పారు. స్థానికంగా ఇంటర్నెట్కు ఎలాంటి డౌన్లింక్ అవసరం లేదని పేర్కొన్నారు. శాటిలైట్లో లేజర్ లింక్లను వాడడంతో గ్రౌండ్ స్టేషన్ అడ్డంకులను పూర్తిగా తగ్గిస్తాయన్నారు. సిడ్నీ నుంచి లండన్కు డేటా ట్రాన్స్ఫర్ 40 శాతం సంప్రదాయక ఇంటర్నెట్ కంటే వేగంగా, కాంతి వేగానికి దగ్గరిగా స్పీడ్ ఉంటుందని వెల్లడించారు.ఒక కిలోమీటర్ పర్ సెకనుకు 3,00,000 వేగంతో కాంతి ప్రయాణిస్తుంది. సంప్రదాయక ఆప్టిక్ ఫైబర్ ద్వారా డేటా వినిమయం 2 లక్షల కిమీ/సెకను వేగంతో ప్రయాణిస్తుంది. ఆప్టిక్ ఫైబర్ ద్వారా జరిగే డేటా వినిమయ ప్రక్రియలో కొన్ని అడ్డంకులు ఏర్పడడంతో స్పీడ్ తగ్గిపోతుంది. స్టార్లింక్లో వాడే ఇంట్రా లేజర్తో డేటా వినిమయాన్ని కాంతి వేగానికి సమానంగా లేదా దగ్గరిగా డేటా వినిమయం చేయవచ్చునని తెలిపారు. సాధారణంగా ఇంటర్నెట్ స్పీడ్ సదరు నెట్వర్క్ లాటెన్సీపై ఆధారపడి పనిచేస్తోంది. లాటెన్సీ అనేది ఒక పాయింట్ నుంచి మరొక పాయింట్కు డేటాను పంపడానికి పట్టే సమయం. ఉపగ్రహాలు భూమికి దూరంగా ఉన్నప్పుడు ఇంటర్నెట్ స్పీడ్లో జాప్యం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా వీడియో కాల్లు, ఆన్లైన్ గేమింగ్ వంటి కార్యకలాపాల పనితీరు తక్కువగా ఉంటుంది. ఎలన్ మస్క్ అందించనున్న స్టార్లింక్ ఉపగ్రహాలు సాంప్రదాయ ఉపగ్రహాల కంటే భూమికి 60 రెట్లు దగ్గరగా ఉంటాయి. దీంతో లాటెన్సీ అతి తక్కువగా ఉంటుంది. స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలు సుమారు కాంతి వేగానికి సమానంగా ఉంటుందని ఎలన్ మస్క్ అభిప్రాయపడ్డారు. చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..! -
భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఖాయం!
Satellite Broadband Service Could: భారత్ కార్ల మార్కెట్ పై కన్నేసిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ‘స్టార్ లింక్’ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్కు విస్తరించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందుకోసం Department of Telecommunications అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ట్విటర్ ఇంటరాక్షన్లో భాగంగా ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు.. స్టార్ లింక్ సేవలు భారత్కు విస్తరిస్తామని సమాధానం వచ్చింది మస్క్ నుంచి. అదే జరిగితే భారత్లో ఇంటర్ నెట్కు వినియోగించే సెల్ఫోన్ టవర్లు, కేబుళ్లతో పాటు శాటిలైట్ ఇంటర్నెట్ వినియోగదారులకు అందనుంది. ఇందుకోసం ఇంటిమీద చిన్న యాంటెన్నాతో ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. చదవండి: థర్మామీటర్ గడియారాలొస్తున్నాయ్! Just figuring out the regulatory approval process — Elon Musk (@elonmusk) August 31, 2021 స్పేస్ఎక్స్ యజమాని ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించారు. ప్రాజెక్ట్ లో భాగంగా 2027 నాటికల్లా 4,425 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1,800కుపైగా శాటిలైట్లను పంపారు. వాటి సాయంతో అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, యూరప్లోని 14 దేశాల్లో వంద డాలర్ల ప్రీ-ఆర్డర్ బుకింగ్(రిఫండబుల్) శాటిలైట్ సేవల్ని అందిస్తున్నారు. ఒకవేళ సిగ్నల్ వ్యవస్థ గనుక పని చేయకపోతే ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తారు. స్టార్లింక్స్తో పాటు ఎకోస్టార్, లియోశాట్, ఓ3బీ, టెలీస్టాట్, అప్స్టార్ట్ తో పాటు వర్జిన్ గెలాక్టిక్ ‘వన్వెబ్’ పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తున్నారు. చదవండి: సెల్ఫోన్ టవర్లు, కేబుళ్లు కనుమరుగు కానున్నాయా..! -
సెల్ఫోన్ టవర్లు, కేబుళ్లు కనుమరుగు కానున్నాయా..!
ఇంటర్నెట్ అనగానే మనకు సెల్ఫోన్ టవర్లు, కేబుళ్లు, ఇళ్లలో వైఫైలు గుర్తొస్తాయి. కానీ.. ఇక ముందు అవేమీ ఉండవు. సెల్ సిగ్నల్తో పనిలేకుండా నేరుగా ఫోన్లకు, ఇంటిమీద చిన్న యాంటెన్నాతో కంప్యూటర్లకు ఇంటర్నెట్ రానుంది. ఇదంతా శాటిలైట్ ఇంటర్నెట్ మహిమ. ఇప్పటికైతే కేబుల్ ఇంటర్నెట్ బాగానే ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు, సబ్మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లపై చైనా ఆధిపత్య యత్నాలు వంటివి శాటిలైట్ ఇంటర్నెట్కు దారులు తెరుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు రంగంలోకి దిగాయి కూడా. ఈ సంగతులు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ప్రస్తుతానికి కేబుళ్లదే రాజ్యం.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఇంటర్నెట్కు సబ్మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లే కీలకం. ప్రస్తుతం సముద్రాల అడుగున 13 లక్షల కిలోమీటర్ల పొడవైన 428 ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు ఉన్నాయి. అన్నిదేశాల మధ్య మొత్తం ఇంటర్నెట్ డేటాలో 98 శాతం సబ్మెరైన్ కేబుళ్ల ద్వారానే ట్రాన్స్ఫర్ అవుతోంది. కొన్నేళ్లుగా ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. అందులోనూ గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, వీటి అనుబంధ కంపెనీలకు సంబంధించిన డేటానే భారీగా ఉంటోంది. అందుకే ఈ కంపెనీలు సబ్మెరైన్ కేబుల్స్ వేసే పనిలోకి దిగాయి. ఇందుకోసం గత ఐదేళ్లలోనే రూ.12 వేల కోట్ల వరకు ఖర్చుపెట్టాయి. చైనా కంపెనీల వివాదంతో.. ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు సబ్మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు నిర్మిస్తున్నాయి. అయితే కొన్నేళ్లుగా చైనా కంపెనీ హువావే పెద్ద మొత్తంలో కేబుళ్ల నిర్మాణ కాంట్రాక్టులు చేస్తోంది. దీనిపై అమెరికా సహా పలు కీలక దేశాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా తమ దేశానికి చెందిన టెక్ కంపెనీల ద్వారా గూఢచర్యానికి పాల్పడుతోందని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ భవిష్యత్తులో యుద్ధం, ఇతర విపత్కర పరిస్థితులు వస్తే.. ఆధిపత్యం కోసం చైనా ఏమైనా చేసేందుకు సిద్ధమన్న ఆందోళనలూ ఉన్నాయి. హువావే కంపెనీ నిర్మించి, నిర్వహిస్తున్న సబ్మెరైన్ కేబుళ్ల ద్వారా చైనా గూఢచర్యానికి పాల్పడవచ్చని.. దేశాలకు, వ్యక్తులకు సంబంధించి రహస్య సమాచారం, వ్యూహాలను తెలుసుకోవచ్చని.. ఇంటర్నెట్ను స్తంభింపజేయవచ్చని అమెరికా కొద్దిరోజుల కింద హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఫేస్బుక్ సంస్థ, ఆస్ట్రేలియా, మరికొన్ని దేశాల ప్రభుత్వాలు కేబుళ్ల నిర్మాణం, నిర్వహణలో చైనా కంపెనీల భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి. భవిష్యత్తు శాటిలైట్ ఇంటర్నెట్దే.. ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల విషయంగా టెక్ యుద్ధం జరుగుతుండటంతో.. ప్రత్యామ్నాయమైన శాటిలైట్ ఇంటర్నెట్పై దృష్టి పడింది. ఈ విధానంలో మన ఫోన్ నుంచే నేరుగా శాటిలైట్కు అనుసంధానమై ఇంటర్నెట్ను పొందడానికి అవకాశం ఉంటుంది. అదే కంప్యూటర్లు అయితే కొన్ని ప్రత్యేక పరికరాల ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్కు అనుసంధానం కావడానికి వీలుంటుంది. అడవులు, కొండలు, గుట్టలు మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా ఇంటర్నెట్ అందుకోవచ్చు. ఇప్పటికే నాసా సహా పలు దేశాల అంతరిక్ష సంస్థలు పరిమిత స్థాయిలో శాటిలైట్ ఫోన్, ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నాయి. ఇటీవలే ప్రైవేటు సంస్థలు ఈ రంగంలో కాలుపెట్టాయి. వర్జిన్ గెలాక్టిక్ యజమాని రిచర్డ్ బ్రాన్సన్ కూడా వన్వెబ్ పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థను నెలకొల్పారు. త్వరలోనే శాటిలైట్లను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు ఎకోస్టార్, లియోశాట్, ఓ3బీ, టెలీస్టాట్, అప్స్టార్ట్ వంటి పలు కంపెనీలు ఇప్పటికే శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో పరిమిత సేవలు అందిస్తున్నాయి. 4,425 శాటిలైట్లతో ‘స్టార్ లింక్’ టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల యజమాని ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్టు ప్రారంభించారు. మొత్తంగా 4,425 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి.. ప్రపంచం నలుమూలలా ఇంటర్నెట్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1,600కుపైగా శాటిలైట్లను పంపారు. కేబుల్, శాటిలైట్.. డేటా ప్రయాణం ఇలా.. ఉదాహరణకు మనం అమెరికాలోని వ్యక్తికి ఒక ఈ–మెయిల్ పంపితే.. ఈ–మెయిల్లోని టెక్ట్స్, ఫొటోలు వంటి సమాచారం మన సెల్ఫోన్/కంప్యూటర్ నుంచి.. సెల్ఫోన్ టవర్/రూటర్ మీదుగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కు.. అక్కడి నుంచి సముద్ర తీరాల్లో ఏర్పాటు చేసే ల్యాండింగ్ ఆఫీస్కు చేరుతుంది. తర్వాత సముద్రం అడుగున ఉన్న (సబ్మెరైన్) కేబుళ్ల ద్వారా ప్రయాణించి అమెరికా తీరంలోని ల్యాండింగ్ ఆఫీస్కు చేరుతుంది. అక్కడి నుంచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కు.. సెల్ఫోన్ టవర్/రూటర్ ద్వారా సదరు వ్యక్తి సెల్ఫోన్/కంప్యూటర్కు డేటా చేరుకుంటుంది. ఇదే శాటిలైట్ ఇంటర్నెట్ అయితే.. మన సెల్ఫోన్/ శాటిలైట్ ఇంటర్నెట్ పరికరం అమర్చిన కంప్యూటర్ నుంచి డేటా నేరుగా సమీపంలోని శాటిలైట్కు చేరుతుంది. దాని నుంచి అమెరికాపైన ఉన్న మరో శాటిలైట్కు ట్రాన్స్ఫర్ అవుతుంది. దాని నుంచి నేరుగా సెల్ఫోన్/ రిసీవర్ ఉన్న కంప్యూటర్కు చేరుతుంది. శాటిలైట్ ద్వారా డేటా బదిలీ కాస్త సులువుగా కనిపిస్తున్నా.. ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారా ఇంటర్నెట్ వేగం ఎక్కువగా ఉంటుంది. ఫోన్లు, శాటిలైట్లు, రిసీవర్ల మధ్య డేటా ట్రాన్స్ఫర్ అయ్యేప్పుడు ప్రతిసారి ప్రొటోకాల్ పర్మిషన్లు అవసరమవుతాయి. అదే కేబుల్ ద్వారా అయితే.. ఇరువైపులా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వద్ద మాత్రమే ప్రొటోకాల్ పర్మిషన్లు అవసరం. -
రికార్డు సృష్టించిన స్టార్లింక్ ఇంటర్నెట్..! స్పీడ్ ఎంతంటే..
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్సేవలను అందించడం కోసం ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ స్టార్లింక్ ప్రోగ్రాంను ముందుకుతెచ్చిన విషయం తెలిసిందే. స్టార్లింక్ ప్రోగ్రాంలో భాగంగా శాటిలైట్లనుపయోగించి ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందించనుంది. ఇప్పటికే అమెరికాతో సహా 11 దేశాల్లో స్టార్లింక్ బ్రాడ్బ్యాండ్ సేవలను ప్రారంభించింది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా స్పేస్ఎక్స్ స్టార్లింక్ సేవలను ప్రారంభించవచ్చునని స్పేస్ ఎక్స్ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ్విన్ షాట్వెల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవలతో పోలిస్తే స్టార్లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ గరిష్ట వేగంతో ఇంటర్నెట్ను అందిస్తుంది. తాజాగా ఊక్లా నిర్వహించిన స్పీడ్ టెస్ట్లో స్టార్లింక్ బ్రాడ్బ్యాండ్ రికార్డు సృష్టించింది. ఊక్లా స్పీడ్ టెస్ట్ నివేదిక ప్రకారం 2021 రెండో త్రైమాసికంలో అమెరికాలోని ఇతర బ్రాడ్బ్యాండ్ సేవలను అందిస్తోన్న హ్యూస్ నెట్, వియాసట్ బ్రాడ్బ్యాండ్తో స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలను పోల్చింది.యునైటెడ్ స్టేట్స్లో మెరుపువేగంతో ఇంటర్నెట్ సేవలను అందిస్తోన్న బ్రాడ్బ్యాండ్గా ప్రొవైడర్గా స్టార్లింక్ మాత్రమే నిలిచింది. స్టార్లింక్ బ్రాడ్బ్యాండ్ సరాసరిగా 97.23 Mbps స్పీడ్ను అందిస్తోంది. హ్యూస్నెట్ రెండో స్థానంలో 19.73 Mbps వేగంతో, వియాసత్ మూడో స్థానంలో 18.13 Mbps వేగంతో నిలిచాయని ఊక్లా పేర్కొంది. కాగా స్టార్లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ గరిష్టంగా 139.39 Mbps డౌన్లోడ్ వేగాన్ని అందించింది. స్టార్లింక్ బ్రాడ్బ్యాండ్ అప్లోడింగ్ వేగంలో కూడా రికార్డులను నమోదు చేసింది. స్టార్లింక్ ఇంటర్నెట్, ఫైబర్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ అప్లోడింగ్ స్పీడ్ ను అధిగమించింది. అప్లోడింగ్ వేగంలో స్టార్లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 15.99 Mbps, రెండో త్రైమాసికంలో 17.18 Mbps నమోదు చేసింది. స్టార్లింక్ తరువాత వియాసత్ అప్లోడింగ్ స్పీడ్లో రెండో స్థానంలో నిలిచింది. వియాసత్ అప్లోడింగ్ స్పీడ్లో 3.38 Mbps, హ్యూస్నెట్ అప్లోడింగ్ స్పీడ్లో 2.43 Mbps వద్ద నిలిచింది. స్టార్లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్లోని ఉపగ్రహాలు ‘లో ఎర్త్ ఆర్బిట్’లో కలిగి ఉండడం ద్వారా ఈ స్పీడ్ సాధ్యమైందని ఊక్లా పేర్కొంది. -
SpaceX CEO: ఎలోన్ మస్క్ ఆసక్తికర ట్వీట్!
స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ ఇంటర్నెట్ సర్వీస్ కంపెనీ స్టార్ లింక్ 69,420 మంది ఆక్టివ్ యూజర్లను చేరుకున్నట్లు, "వ్యూహాత్మకంగా ముఖ్యమైన పరిమితి"ని దాటినట్లు ఆసక్తికర ట్వీట్ చేశారు. మరొక ట్వీట్ లో ధ్రువ ప్రాంతాలు మినహా ఆగస్టు నాటికి ప్రపంచ కవరేజీని ప్రారంభించనున్నట్లు పోస్ట్ చేశారు. స్టార్ లింక్ కంపెనీ అధ్యక్షుడు గ్వైన్ షాట్ వెల్ ఇంటర్నెట్ సర్వీస్ సెప్టెంబర్ నాటికి ప్రపంచ కవరేజీని అందించనున్నట్లు చెప్పిన వారం తర్వాత మస్క్ ఈ ట్వీట్ చేశారు. మొత్తం 72 ఉపగ్రహాలు ఆగస్టులో క్రియాశీలం కానున్నట్లు మరో ట్వీట్ లో తెలిపారు. అయితే, 69,420 సంఖ్యపై చాలా మంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. @StevenCravis ట్విట్టర్ వినియోగదారుడు 69,420 సంఖ్య వ్యూహాత్మకంగా ఎందుకు ముఖ్యమని అడిగారు. దానికి మస్క్ సమాధానం ఇవ్వలేదు. మరో ట్విట్టర్ యూజర్(@flcnhvy) ఎయిర్ లైన్ వై-ఫై ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని అడిగారు. దీనికి మస్క్ ఇలా జవాబిచ్చారు.. "గల్ఫ్ స్ట్రీమ్ లో చాలా మంది ప్రజలకు సేవలందించే బోయింగ్ 737, ఎయిర్ బస్ ఎ320లలో టెస్టింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2020 అక్టోబర్లో ఏలోన్ మస్క్ టెస్లా మోడల్ ఎస్ 69,420 డాలర్లకు లభిస్తున్నట్లు చెప్పినట్లు మరికొందరు ట్వీట్ చేశారు. అయితే, ఎలోన్ మస్క్ ఈ సంఖ్య (69,420) ఎందుకు అంత వ్యూహాత్మకంగా ముఖ్యమైనదని అన్నారో ఎవరికి అర్ధం కావడం లేదు. Starlink simultaneously active users just exceeded the strategically important threshold of 69,420 last night! — Elon Musk (@elonmusk) June 25, 2021 చదవండి: బగ్ కనిపెట్టి రూ.22 లక్షలు గెలుచుకున్న 20 ఏళ్ల యువతి! -
వచ్చేస్తోంది..స్పేస్ఎక్స్ స్టార్ లింక్...త్వరలోనే..!
ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్ సర్వీసులో ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ స్టార్ లింక్ ప్రోగ్రాం మరికొద్ది రోజుల్లోనే చరిత్ర సృష్టించనుంది. స్టార్లింక్ ప్రోగాంతో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందించడానికి స్టార్లింక్ కృషి చేస్తోంది. కాగా ప్రస్తుతం స్టార్ లింక్ సేవలు కేవలం 11 దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. స్టార్లింక్ కవరెజీని ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వస్తోందని మంగళవారం జరిగిన మాక్వేరీ గ్రూప్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ లో స్పేస్ఎక్స్ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ్విన్ షాట్వెల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు స్పేస్ ఎక్స్ స్టార్ లిక్ ప్రోగ్రాం కోసం 18 వందల శాటిలైట్లను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి పంపించామని గ్విన్ షాట్వెల్ తెలిపారు. మిగిలిన శాటిలైట్లను సెప్టెంబరు లోపు పంపించి త్వరలోనే గ్లోబల్ కవరెజీ అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. కాగా ప్రతి దేశంలో స్టార్లింక్ సేవలను అందుబాటులోకి తీసుకురావలంటే ఆయా దేశాల ఆమోదం పొందడానికి సమయం పడుతుందని అభిప్రాయపడింది. స్టార్లింక్ ప్రోగ్రాంలో భాగంగా తొలిదశలో సుమారు 12వేల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాలని స్పేస్ఎక్స్ చూస్తోంది. మొత్తంగా 42 వేల ఉపగ్రహాలను పంపనుంది. ఇప్పటికే 12 వేల ఉపగ్రహలను లోవర్ ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఈ ప్రోగ్రాం కోసం సుమారు పది బిలియన్ డాలర్లను వెచ్చించనుంది. స్టార్లింక్ సేవలను పొందడానికి ఇప్పటికే సుమారు 5 లక్షల వరకు ఫ్రీ ఆర్డర్లు బుక్ అయ్యాయని స్పేస్ఎక్స్ కంపెనీ సీవోవో గ్విన్ షాట్వెల్ పేర్కొన్నారు. చదవండి: స్పేస్ ఎక్స్ స్టార్లింక్ ఇంటర్నెట్ షట్డౌన్.. సింపుల్గా పరిష్కరించిన యువకుడు..! -
SpaceX Starlink: ఇంటర్నెట్ షట్డౌన్.. సింపుల్గా పరిష్కరించిన యువకుడు..!
వాషింగ్టన్: మమూలుగా మన దగ్గర ఉండే ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ బాగా వేడెక్కితే ఏం చేస్తాం. కొద్ది సేపు వాటిని ఆఫ్ చేసి తిరిగి మళ్లీ ఆన్ చేస్తాం. ఆరిజోనాకు చెందిన యువకుడు మాత్రం అసాధారణ పద్దతి ఉపయోగించి తిరిగి ఇంటర్నెట్ వచ్చేలా చేశాడు. వివరాలోకి వెళ్లేే.. ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్లింక్తో అమెరికాలో ఇంటర్నెట్ను ప్రవేశపెట్టింది. భూమిపై ఏర్పాటుచేసిన డిష్ ఆంటెన్నాతో యూజర్లు ఇంటర్నెట్ సేవలను పొందుతారు. కాగా అప్పుడప్పుడు డిష్ ఆంటెన్నాలు ఎక్కువగా వేడెక్కడంతో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని స్టార్లింక్ తన వినియోగదారులకు ముందుగానే తెలిపింది. డిష్ ఆంటెన్నాలు తిరిగి కూల్ డౌన్ అయ్యే వరకు ఇంటర్నెట్ సేవలను పొందలేరని పేర్కొంది స్టార్లింక్. ప్రస్తుతం అమెరికాలోని ఆరిజోనా స్టేట్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ ప్రాంతంలో సుమారు 44 డిగ్రీల నుంచి 55 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో ఆరిజోనాలో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కాగా ఈ సమస్య ఆరిజోనాకు చెందిన యువకుడికి రావడంతో స్టార్లింక్ కస్టమర్ సర్వీస్ను సంప్రదించడంతో కంపెనీ ముందుగానే చెప్పిన విషయానే చెప్పింది. దీంతో విసుగు చెందిన యువకుడు ఇంటర్నెట్ డిష్పై నీళ్లను స్ప్రే చేశాడు. వాటర్ పోయడంతో డిష్ ఆంటెన్నా త్వరగా కూల్ డౌన్ అయ్యింది. తిరిగి ఇంటర్నెట్ సేవలను అతడు పొందగల్గిగాడు. ప్రస్తుతం ఈ చర్య చర్చనీయాంశంగా మారింది. ఇకపై ఇంటర్నెట్ షట్డౌన్ అవ్వకుండా ఉండాలంటే డిష్ ఆంటెన్నాపై ఒక చిన్న ఫౌంటెన్ను ఏర్పాటు చేస్తే అసలు అంతరాయం ఉండదని ఓ నెటిజన్ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చదవండి: జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం.. నాసాపై..