-
ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?
హీరోయిన్ త్రిష వయసు 41 ఏళ్లు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్ హీరోయిన్గా తన హవా చూపిస్తోంది. రీసెంట్ టైంలో పాన్ ఇండియా మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. 40 దాటిపోయినా సరే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది. త్రిషపై వదంతులు చాలానే ఉన్నాయి. అలానే గతంలో ఓసారి నిశ్చితార్థం వరకు వెళ్లి పెళ్లి ఆగిపోయింది. ఇదంతా పక్కనబెడితే ఓ హీరో పెళ్లికి.. త్రిష అడ్డుపడిందని మీకు తెలుసా?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!)'ఒకరికి ఒకరు' సినిమాతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అలియా శ్రీరామ్.. త్రిషతో 'మనసెల్లామ్' అనే మూవీ చేశాడు. అలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. 2007లో శ్రీకాంత్, వందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే వందనకు త్రిష అంతకు ముందే తెలుసు. దీంతో పెళ్లికి ముందు వందనతో నువ్వు శ్రీకాంత్ని పెళ్లి చేసుకోవద్దని, అతడు మంచివాడు కాదని, ఇంగ్లీష్ మాట్లాడటం రాదని త్రిష చెప్పింది. ఇదే విషయాన్ని వందన, శ్రీకాంత్ దగ్గర చెప్పింది.ఎందుకలా చెప్పావ్ అని త్రిషని శ్రీకాంత్ అడగ్గా.. నువ్వు నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకోబోతున్నావ్ కదా, అందుకే ప్రాంక్ చేశానని త్రిష చెప్పుకొచ్చింది. తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇదిలా ఉండగా 1999లో 'జోడీ' మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన త్రిష.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూవీస్ చేసింది. మధ్యలో కొన్నాళ్లు గ్యాప్ వచ్చింది. కానీ '96'తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. 'పొన్నియన్ సెల్వన్' లాంటి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి 'విశ్వంభర'లో నటిస్తోంది.(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ అమలాపాల్.. వీడియో వైరల్!) -
పిల్లలు నా పేరు చెప్పడానికి కూడా ఇష్టపడరు: శ్రీకాంత్
హీరో శ్రీకాంత్తో మూడునాలుగు సినిమాలే చేసింది ఊహ. అప్పటివరకు ఆన్స్క్రీన్పై జోడీ కట్టిన ఆమె రియల్ లైఫ్లోనూ తనతో జత కట్టింది. శ్రీకాంత్ను పెళ్లాడింది. వీరి పెళ్లయి దాదాపు పాతికేళ్లవుతోంది. వివాహం తర్వాత ఊహ సినిమాలకు దూరమైంది. ముగ్గురు పిల్లలను చూసుకుంటూ ఇంటికే పరిమితమైంది. ఊహ సినిమాలు మానేయడానికి గల కారణంపై తాజాగా శ్రీకాంత్ స్పందించాడు.అది తన నిర్ణయమేఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. 'సినిమాలు మానేయమని ఊహకు మేమెవరం చెప్పలేదు. తనే వద్దనుకుంది. అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేశాకే పెళ్లి చేసుకుంది. సినిమాలకు దూరమవ్వాలన్నది కేవలం తన నిర్ణయమే! ముగ్గురు పిల్లలు (రోషన్, మేధ, రోహన్) పుట్టాక వాళ్లే తన ప్రపంచమైపోయింది. ఏమాటకామాట.. అర్థం చేసుకునే వ్యక్తి దొరకడం పెద్ద అదృష్టం. ఊహను పెళ్లి చేసుకున్న క్షణాలు నా జీవితంలోనే బెస్ట్.ఎక్కడా పేరు చెప్పుకోరుపిల్లల విషయానికి వస్తే.. రోషన్ సైకాలజీ చదివాడు. ఇప్పుడిప్పుడే నటుడిగా ఎదుగుతున్నాడు. నేను శ్రీకాంత్ కుమారుడిని అని ఎక్కడా చెప్పుకోడు. నా కూతురు మేధ కెనడాలో చదువుతోంది. అక్కడున్న తెలుగువారితో ఎన్నడూ కూడా శ్రీకాంత్ మా నాన్న అని చెప్పలేదు. ఎక్కడికైనా వెళ్లాలన్నా కూడా వీళ్లు నా పేరు ఉపయోగించుకోరు. శ్రీకాంత్ వాళ్ల అబ్బాయిని అని రికమండేషన్ చేయించుకోరు. వాళ్లంతట వాళ్లే సొంతంగా ఎదగాలని కష్టపడతారు' అని చెప్పుకొచ్చాడు.చదవండి: బాలీవుడ్ నటికి సర్జరీ.. ఇప్పుడెలా ఉందంటే? -
హెర్బల్ ప్రొటీన్ ఉత్పత్తులను ఆవిష్కరించిన..హెబ్బాపటేల్ (ఫొటోలు)
-
బెంగళూరు రేవ్ పార్టీ లో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు!
సాక్షి బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని ఓ ఫామ్హౌస్లో ఆదివారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరిగిన రేవ్ పార్టీ లో బెంగళూరుతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నట్టు అందుతున్న సమాచారం కలకలం రేపుతోంది. పుట్టినరోజు వేడుకల పేరిట ఎల్రక్టానిక్ సిటీ సింగేనా అగ్రహారలో ఉన్న ఫార్మ్హౌస్లో ఈ రేవ్ పార్టీ జరిగింది. ఈ మేరకు అందిన పక్కా సమాచారంతో సీసీబీ యాంటీ నార్కోటిక్స్ విభాగం అధికారులు డీసీపీ శ్రీనివాసగౌడ నేతృత్వంలో రేవ్ పార్టీపై దాడి చేశారు. మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు సుమారు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 25 మందికి పైగా యువతులున్నట్టు అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా, ఐదుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వారికి వైద్య పరీక్షలు రేవ్పార్టీ జరిగినట్లు బెంగళూరు పోలీసులు ధ్రువీకరించారు. అయితే పార్టీలో ప్రముఖులు ఎవరెవరు ఉన్నదీ వెల్లడించలేదు. అదనపు పోలీస్ కమిషనర్ డాక్టర్ చంద్రగుప్తా సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. బెంగళూరు పోలీసులు ఒక ప్రకటన సైతం జారీ చేశారు. రేవ్ పార్టీ కి సంబందించి ఐదుగురిని అరెస్టు చేశామని, ఎల్రక్టానిక్ సిటీ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకున్నామని, రక్తం నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నామన్నారు. రేవ్పార్టీలో 100 మంది ఉన్నారని, డాగ్స్కా్వడ్ను పిలిపించి తనిఖీలు చేపట్టామని, కొన్ని మాదకద్రవ్యాలు లభించాయని వివరించారు. ‘సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ’ పేరిట రేవ్ పార్టీ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. సుమారు 15.56 గ్రా. ఎండీఎంఏ, 6.2 గ్రా. హైడ్రో గంజాయి, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జీఆర్ ఫార్మ్హౌస్లో పార్టీ హెబ్బగోడి పోలీస్స్టేషన్ పరిధిలో కాన్కార్డు యజమాని గోపాలరెడ్డి పేరిట ఉన్న జీఆర్ ఫార్మ్హౌస్లో ఈ పార్టీ జరిగింది. హైదరాబాద్కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని నిర్వహించినట్లు తెలిసింది. ఈ పార్టీ కోసం విమానాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నటీనటులు, మోడళ్లు, టెక్కీలు పాల్గొన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.50 లక్షల వరకు వ్యయం నగరం నడిబొడ్డున ఇంత పెద్దయెత్తున రేవ్ పార్టీ నిర్వహిస్తే పోలీసుల నుంచి ఇబ్బందులు రావొచ్చని భావించి నగర శివార్లలో నిర్వహించినట్లు సమాచారం. ఈ ఒక్కరోజు పార్టీ కోసం సుమారు రూ.30 లక్షల నుంచి రూ. 50 లక్షల మేర ఖర్చు చేసినట్లు తెలిసింది. దాడి చేసేందుకు వచి్చన పోలీసులను గమనించగానే నిర్వాహకులు తలుపులు మూసేశారు. అయితే వారు బలవంతంగా తలుపులు తెరిచి లోపలకు వెళ్లారు. అప్పటికే కొందరు డ్రగ్స్ను దాచి పెట్టారు. కొంతమంది తమ వద్ద ఉన్న మాదకద్రవ్యాలను టాయిలెట్ కమోడ్లలో వేసి ఫ్లష్ చేశారు. కాగా పోలీసులు ఫార్మ్హౌస్ను క్షుణ్ణంగా గాలించారు.ముగ్గురు డ్రగ్ పెడ్లర్లతో పాటు నిర్వాహకుడు వాసు, మరొకరు ఇలా.. మొత్తం ఐదు మందిని అరెస్టు చేశారు. వాసు పుట్టినరోజు పార్టీ నిర్వాహకులు అరుణ్, సిద్దిఖి, రణబీర్, నాగబాబులను అదుపులోకి తీసుకున్నారు. పరప్పన అగ్రహార పోలీసుస్టేషన్లో ఈ పార్టీ కి అనుమతులు తీసుకున్నట్లు వాసు చెబుతున్నప్పటికీ అది అవాస్తవమని తెలుస్తోంది. పార్టీ కి వచి్చన వారు ఫార్మ్హౌస్ లోపలికి వెళ్లాలంటే సెక్యూరిటీ పాస్వర్డ్ చెప్పేలా ఏర్పాటు చేసినట్లు సమాచారం. రేవ్ పార్టీలో తెలుగు నటులు హేమ, శ్రీకాంత్, డ్యాన్స్ మాస్టర్ జానీ కూడా పాల్గొన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.అయితే తాము ఆ పార్టీలో పాల్గొనలేదని వీడియో బైట్ల ద్వారా వారు వివరణ ఇచ్చారు. అయితే హేమ మాత్రం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఆమె విడుదల చేసిన వీడియో హైదరాబాద్లో తీసింది కాదని, ఆ ఫార్మ్హౌస్ లోపలే హేమ వీడియో బైట్ ఇచి్చనట్లు ఆమె ధరించిన దుస్తుల ఆధారంగా అనుమానిస్తున్నారు. నేను నా ఇంట్లోనే ఉన్నా: శ్రీకాంత్ బెంగళూరు రేవ్ పార్టీ తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ చెప్పారు. ఈ మేరకు తన ఇంట్లో నుంచే ప్రత్యేకంగా వీడియోను విడుదల చేశారు. ‘నేను హైదరాబాద్లోని మా ఇంట్లోనే ఉన్నాను. నేను బెంగళూరు రేవ్ పార్టీ కి వెళ్లినట్లు, పోలీసులు అరెస్టు చేశారనే వార్తలతో కొందరు నాకు ఫోన్ చేశారు. నేను కూడా వీడియో క్లిప్స్ చూశా. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకున్నారు. కొన్నింటిలో మాత్రం నేను వెళ్లాననే వార్తలు వచ్చాయి.అవి చూసి నేను, మా కుటుంబ సభ్యులందరం నవ్వుకున్నాం. అలా వార్తలు రాసిన వాళ్లు తొందపడటంలో తప్పులేదనిపించింది. ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన అతనెవరో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. నేనే షాకయ్యా. నేను రేవ్ పార్టీ లకు, పబ్స్కు వెళ్లే వ్యక్తిని కాను. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు..’ అని శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. నేను హైదరాబాద్లోనే చిల్ అవుతున్నా..: సినీ నటి హేమ బెంగళూరులో నన్ను అరెస్ట్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ నేను హైదరాబాద్లోనే ఉన్నా. ఓ ఫామ్హౌస్లో చిల్ అవుతున్నా. బెంగళూరులో ఎలాంటి పార్టీ కి వెళ్లలేదు నన్ను అనవసరంగా ఇందులోకి లాగుతున్నారు. నాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. -
బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం.. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో నటి హేమ
-
మా ఇంట్లోనే ఉన్నా.. దయచేసి ఎవరూ నమ్మొద్దు: హీరో శ్రీకాంత్
-
మా ఇంట్లోనే ఉన్నా.. దయచేసి ఎవరూ నమ్మొద్దు: హీరో శ్రీకాంత్
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ సెలబ్రిటీల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే ఈ పార్టీలో పలువురు ప్రముఖులు పాల్గొన్నట్లు వార్తలొచ్చాయి. దీంతో టాలీవుడ్ సినీతారలు అలర్ట్ అయ్యారు. తాను అలాంటి పార్టీకి వెళ్లలేదంటూ ఇప్పటికే నటి హేమ స్పష్టం చేశారు. మరోవైపు ఆ సినీతారలు ఎవరన్న దానిపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. తాజాగా ఈ పార్టీకి టాలీవుడ్ హీరో, నటుడు శ్రీకాంత్ హాజరైనట్లు వార్తలొచ్చాయి. దీంతో వీటిపై ఆయన స్పందించారు. రేవ్ పార్టీలు, పబ్లకు వెళ్లే వ్యక్తిని కాదని అన్నారు. దయచసి తప్పుడు కథనాలను నమ్మవద్దని అభిమానులకు శ్రీకాంత్ సూచించారు. శ్రీకాంత్ మాట్లాడుతూ..'రేవ్ పార్టీలు, పబ్లకు వెళ్లే వ్యక్తిని కాదు. దయచేసి తప్పుడు కథనాలను నమ్మకండి. బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని మా ఇంట్లోనే ఉన్నా. కొన్ని ఛానెల్స్లో నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లానని వార్తలొచ్చాయి. ఆ న్యూస్ చూసి నాతో సహా మా కుటుంబ సభ్యులందరూ నవ్వుకున్నాం. నేను ఇంట్లోనే ఉన్నాను. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు. అందులో ఉన్న వ్యక్తి ఎవరో నాలా ఉండంటంతోనే అలా రాశారేమో. అతడికి కాస్త గడ్డం ఉంది. ముఖం కవర్ చేసుకున్నాడు. అతన్ని చూసి నేను కూడా షాకయ్యా. అచ్చం నాలా ఉన్నాడనిపించింది. నా ఇంట్లో నుంచే మాట్లాడుతున్నా. దయచేసి అసత్య కథనాలు ఎవరు నమ్మొద్దు' అని అన్నారు. అంతే కాకుండా తాను ఎప్పుడైనా బర్త్ డే పార్టీలకు వెళ్లినా కొంత సేపు అక్కడి ఉండి వచ్చేస్తానని తెలిపారు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదని.. మీడియా మిత్రులు సహా ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అసలు విషయం తెలుసుకోకుండా.. రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టేసి రాసేస్తున్నారు.. నాలాగా ఉన్నాడనే పొరబడి ఉంటారని నేను అనుకుంటున్నా.. నేను ఇంట్లోనే ఉన్నా.. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు అని అన్నారు. -
జనతా బార్ సందేశం
రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జనతా బార్’. రోచిశ్రీ మూవీస్ పతాకంపై అశ్వథ్ నారాయణ సమర్పణలో రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం మేలో రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. రాయ్ లక్ష్మి మాట్లాడుతూ– ‘‘బార్ గర్ల్గా ప్రారంభమయ్యే నా పాత్ర సమాజంలోని మహిళలు గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎలా ఎదిగింది? అన్నదే ఈ చిత్రం కథాంశం. ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉంది’’ అని అన్నారు. ‘‘కుస్తీ పోటీల నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమాతో సమాజంలో స్త్రీల ప్రాధాన్యతను మరోసారి చాటి చెప్పే ప్రయత్నం చేశాం’’ అన్నారు రమణ మొగిలి -
బాలీవుడ్లో తెలుగువాడి బయోపిక్.. ఎవరీ శ్రీకాంత్ బొల్లా?
ఆంధ్రప్రదేశ్కు ప్రముఖ అంధ పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొల్లా జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్లో ‘శ్రీకాంత్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజ్ కుమార్ రావు హీరోగా నటించగా, జ్యోతిక, శరత్ కేల్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తుషార్ హీరానందానీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. పుట్టుకతోనే అంధుడైన శ్రీకాంత్..తనకున్న లోపాన్ని దీటుగా ఎదుర్కొన్ని పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. శ్రీకాంత్ బాల్యం సీన్తో బాల్యం సీన్తో ట్రైలర్ ప్రారంభం అయింది. బాల్యంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తనకున్న లోపాన్ని అదిగమించి పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగాడు? బొల్లాంట్ ఇండస్ట్రీస్ను ఎలా స్థాపించాడు? తదితర అంశాలలో చాలా ఎమోషనల్గా ట్రైలర్ సాగింది. శ్రీకాంత్ పాత్రలో రాజ్ కుమార్ రావు ఒదిగిపోయాడు. . టీ సీరిస్, ఛాక్ అండ్ ఛీస్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, నిధి పర్మార్ హీరానందానీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎవరీ శ్రీకాంత్? శ్రీకాంత్ బొల్లా సొంత ఊరు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం. 1991లో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. పుట్టుకతోనే అంధుడు. చూపు లేకపోవడంతో చిన్నప్పుడే అతన్ని వదిలించుకోవాలని తల్లిదండ్రలకు కొంతమంది బంధువులు సలహా ఇచ్చారట. కానీ వాళ్లు మాత్రం తమ కొడుకును పట్టుదలతో చదివించారు. తనకున్న లోపాన్ని అనుకూలంగా మార్చుకొని కష్టపడి చదివాడు శ్రీకాంత్. ఆరేళ్ల వయసులో ప్రతి రోజూ కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ స్కూలుకు వెళ్లేవాడు. ఎనిమిదేళ్ల వయసులో అంధ విద్యార్ధులు చదువుకునే బోర్డింగ్ స్కూలులో సీటు లభించింది. దీంతో శ్రీకాంత్ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాడు. ఇంజనీర్ కావాలన్నది ఆయన కల. అది జరగాలంటే సైన్స్, మ్యాథ్స్ చదవాలి. కానీ, ఆ సబ్జెక్టులు తీసుకోవడానికి ఆయనకు అర్హత లేదంటూ స్కూల్ యాజమాన్యం అభ్యంతరం చెప్పింది. ఈ విషయంపై కోర్టుకెక్కాడు ఆయన. ఆరు నెలల విచారణ తర్వాత ఆయన సైన్స్ సబ్జెక్ట్ చదివేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇంటర్మీడియట్లో 98 శాతంతో క్లాస్లో టాపర్గా ఆయన నిలిచారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో శ్రీకాంత్ బొల్లా ఇంజినీరింగ్ చదవాలనుకున్నా.. అంధుడైన కారణంగా ఆ అడ్మిషన్ దక్కలేదు. దీంతో అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో ఐదు యూనివర్సిటీల నుంచి ఆయనకు ఆఫర్లు వచ్చాయి. మసాచుసెట్స్లోని ఎంఐటీని ఆయన ఎంచుకున్నారు. అక్కడ సీటు పొందిన మొట్టమొదటి అంతర్జాతీయ అంధ విద్యార్థి శ్రీకాంత్. ఎంఐటీలో మేనేజ్మెంట్ సైన్స్లో ఆయన గ్రాడ్యుయేట్ అయ్యారు. జాబ్ కూడా వచ్చింది. కానీ తాను మాత్రం ఇండియాలోనే పని చేయాలనుకున్నాడు. 2012లో తిరిగి హైదరాబాద్కి వచ్చాడు. బొల్లాంట్ ఇండస్ట్రీస్ను స్థాపించాడు. ప్యాకేజింగ్ మెటీరియల్ తయారు చేసే ఈ కంపెనీ, తాటి ఆకులతో పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఇందులో ఎక్కువమంది వికలాంగులే పని చేస్తున్నారు. 2017లో ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రచురించిన ‘ 30 ఏళ్లలోపు 30 మంది’ జాబితాలో శ్రీకాంత్ బొల్లాకు చోటు దక్కింది. 2022లో స్వాతి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల ఈ జంట ఓ బిడ్డకు జన్మనిచ్చారు. -
‘కళ్యాణ్’ స్థానంలో మళ్లీ సీఎం కుమారుడే పోటీ
ముంబై: లోక్సభ ఎన్నికల్లో కళ్యాణ్ నియోజకవర్గంలో ఎట్టకేలకు సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు సిట్టింగ్ ఎంపీ శ్రీకాంత్ షిండే మరోసారి బరిలో దిగనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ శనివారం ప్రకటించారు. కళ్యాణ్ పార్లమెంట్ స్థానంలో శ్రీకాంత్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ నేతలు వ్యతిరేకించారు. అయితే ఇవాళ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్వయంగా కళ్యాణ్ స్థానంలో శ్రీకాంత్ షిండే పోటీ చేస్తారని ప్రకటించటం ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్సభ ఎన్నికల్లో శ్రీకాంత్ షిండే గెలుపు కోసం బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. నాగ్పూల్లో బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సం సందర్భంగా ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడారు. ‘కళ్యాణ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మళ్లీ శ్రీకాంత్ షిండే బరిలో దిగుతున్నారు. ఆయన్ను ఓడించేందుకు తమకూటమకి ప్రతిపక్షమే లేదు. కళ్యాణ్ స్థానంలో శవసేన (ఏక్నాథ్ షిండే) పార్టీ బరిలోకి దిగుతుంది. అభ్యర్థిగా ఏక్నాథ్ షిండే కుమారుడు సిట్టింగ్ ఎంపీ శ్రీకాంత్ షిండే పోటీ చేస్తారు’ అని దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. శ్రీకాంత్ షిండే.. ఇప్పటికే కళ్యాణ్ పార్లమెంట్ స్థానంలో రెండుసార్లు (2014, 2019) పోటిచేసి విజయం సాధించారు. ఇక.. ఇప్పటికే ‘జ్వలించే టార్చ్’ గుర్తును సొంతం చేసుకున్న శివసేన (యూబీటీ) ఇప్పటికే 21 స్థానాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అదే వింధంగా షిండే వర్గం 9 స్థానాలు, బీజేపీ 24 స్థానాలు, ఎన్సీపీ( అజిత్ పవార్)- 4, రాష్ట్రీయా సమాజ్ పక్షా-1 ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కూటమి మరో 10 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి మే 20 పోలింగ్ జరిగి.. జూన్ 4ను ఫలితాలు విడుదల కాన్నాయి. -
హీరో శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకలు
-
మరి అన్నయ్యంటే ఏమనుకున్నారు.. తన ప్రేమ అమృతం!
మెగాస్టార్ చిరంజీవికి అంతటా అభిమానులే! ఇండస్ట్రీలో కూడా ఆయన్ను ఆరాధించేవారు ఎంతోమంది! వారిలో హీరో శ్రీకాంత్ ఒకరు. మెగాస్టార్ను అన్నయ్య అని పిలుస్తూ ఉంటాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్దాదా జిందాబాద్ చిత్రాలు ఎంతలా సూపర్ డూపర్ హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే! ఈ సినిమాల తర్వాత ఈ అన్నదమ్ములు మరింత క్లోజయ్యారు. ఈరోజు(మార్చి 23న) శ్రీకాంత్ బర్త్డే.. అది గుర్తుపెట్టుకుని మరీ చిరంజీవి స్వయంగా అతడి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపాడు. అంతేనా? స్వయంగా కేక్ కట్ చేయించి తినిపించాడు. కేక్ మీద హ్యాపీ బర్త్డే శ్రీకాంత్.. లవ్ ఫ్రమ్ అన్నయ్య అని రాయించడం హైలైట్గా మారింది. తర్వాత శ్రీకాంత్ ఫ్యామిలీతో కాసేపు సరదాగా గడిపాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. The Dada-ATM combo was clicked as the Mega Star @KChiruTweets visited @actorsrikanth 's home to celebrate the actor’s birthday! 😍😍#Chiranjeevi #MegastarChiranjeevi #ActorSrikanth #RoshanMeka pic.twitter.com/MDrO1YwxCc — Dileep Kumar (@chirufanikkada1) March 23, 2024 చదవండి: హిట్ సినిమాల చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేంటి ఇంతందంగా మారిపోయింది! -
‘అనన్య’ విజయం సాధించాలి: హీరో శ్రీకాంత్
జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘అనన్య’. ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ పతాకంపై జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ నిర్మిస్తున్నారు. హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 22న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో "అనన్య" ప్రచార చిత్రాన్ని శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ ఆవిష్కరించి, ఈ చిత్రం ఘన విజయం సాధించాలని అభిలషించారు. ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరించి తమ "శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్"కు శుభారంభాన్నిస్తుందని నిర్మాత జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ పేర్కొన్నారు. సెన్సార్ సభ్యుల ప్రశంసలు దండిగా అందుకుని, ఈనెల 22న వస్తున్న "అనన్య" ప్రేక్షకుల ఆదరాభిమానాలు సైతం పుష్కలంగా పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు ప్రసాద్ రాజు బొమ్మిడీ తెలిపారు. తమ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసి, ఆల్ ది బెస్ట్ చెప్పిన హీరో శ్రీకాంత్ కు దర్శకనిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు. -
కులం పేరుతో దూషించి దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్సీ పై కేసు నమోదు
-
పల్లెటూరి ప్రేమకథ
వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి జంటగా దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించిన చిత్రం ‘రాధా మాధవం’. గోనాల్ వెంకటేశ్ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘రాధా మాధవం’ ట్రైలర్ చూస్తే అందమైన ప్రేమకథా చిత్రమని తెలుస్తోంది. ట్రైలర్ చాలా బాగుంది.. సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘అందమైన పల్లెటూరి ప్రేమకథా చిత్రం ‘రాధా మాధవం’. మా సినిమా సెన్సార్ పనులు జరుపుకుంటోంది’’ అన్నారు దాసరి ఇస్సాకు. ‘‘ఈ నెలలోనే మా సినిమా రిలీజ్ అవుతుంది.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు గోనాల్ వెంకటేశ్. ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథతో సహజత్వం ఉట్టి పడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దాసరి ఇస్సాకు. మా చిత్రం ట్రైలర్ను విడుదల చేసిన శ్రీకాంత్గారికి థ్యాంక్స్’’ అన్నారు వినాయక్ దేశాయ్. -
తొలి రౌండ్లోనే శ్రీకాంత్ ఓటమి
ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్ హెచ్ఎస్ ప్రణయ్, ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే ఇంటి దారి పట్టగా... లక్ష్య సేన్, ప్రియాన్షుæ, కిరణ్ జార్జి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. జకార్తాలో బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ల్లో శ్రీకాంత్ 21–19, 14–21, 11–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో... ప్రణయ్ 18–21, 21–19, 10–21తో లో కీన్ యె (సింగపూర్) చేతిలో ఓడిపోయారు. -
గోపిచంద్ సినిమాతో ఎంట్రీ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి దాదాపు ఐదేళ్ల తర్వాత టాలీవుడ్ తలుపు తట్టింది. ఒంటరి సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ముద్దుగుమ్మ ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. మలయాళం, తమిళం, కన్నడలో పలు సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో కేవలం హీరో, మహాత్మ, నిప్పు లాంటి చిత్రాల్లో మాత్రమే కనిపించిది. తన 22 ఏళ్ల సినీ కెరీర్లో టాలీవుడ్లో కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే చేసింది. ఇంతకీ ఆమె హీరోయిన్ ఎవరో గుర్తుకు వచ్చిందా? ప్రస్తుతం కోలీవుడ్తో పాటు కన్నడ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్లో అలా వచ్చి.. ఇలా గుడ్ బై చెప్పిన అందాల ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందాం పదండి. కేరళలోని త్రిసూర్లో జన్మించిన భావన..2002లో మలయాళంలో నమ్మల్ అనే చిత్రం తన కెరీర్ ప్రారంభించింది. మొదటి సినిమాకే కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత మలయాళంలో ఛాన్సులు కొట్టేసిన ముద్దగుమ్మ చాలా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత 2008లో గోపీచంద్ నటించిన ఒంటరి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నితిన్ సరసన హీరో చిత్రంలో మెరిసింది. శ్రీకాంత్ నటించిన మహాత్మ చిత్రంతో గుర్తింపు వచ్చినప్పటికీ.. టాలీవుడ్ ఈ కేరళకుట్టికి పెద్దగా కలిసిరాలేదు. తెలుగులో కేవలం నాలుగు చిత్రాల్లో మాత్రమే కనిపించింది. అయితే తమిళం, కన్నడలో ఛాన్స్లు రావడంతో టాలీవుడ్కు బైబై చెప్పేసింది. భావన చివరిసారిగా రవితేజ నటించిన నిప్పు చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. నిర్మాతతో ప్రేమ పెళ్లి అయితే 2012లో కన్నడలో రోమియో చిత్రంలో నటించారు. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న నవీన్తో భావనకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ.. 2018లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఇటీవలే వీరిద్దరు ఆరో వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం భావన తన భర్తతో కలిసి బెంగళూరులో స్థిరపడింది. కాగా.. భావన చివరిసారిగా మలయాళ చిత్రం 'ఎన్టిక్కక్కకోరు ప్రేమోందర్న్'లో కనిపించింది. View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) -
హిందూ కార్యకర్త పూజారికి బెయిల్
హుబ్బళ్లి: మూడు దశాబ్దాల క్రితం నాటి రామాలయ ఉద్యమ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న హిందూ కార్యకర్త శ్రీకాంత్ పూజారి శనివారం బెయిల్పై విడుదలయ్యాడు. పెండింగ్ కేసులను పరిష్కరిస్తున్న క్రమంలో 2023 డిసెంబర్లో పూజారి కేసు బయటకు వచి్చంది. 1992లో రామాలయం ఉద్యమంలో పాలుపంచుకున్న అతడిపై అక్రమ మద్యం విక్రయం తదితర 16 కేసులు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. రెండు పోలీస్ స్టేషన్లలో అతడిపై రౌడీషీట్ కూడా ఉంది. పోలీసులు తనను మార్కెట్కు వెళదామంటూ తీసుకొచి్చ, కటకటాల వెనుక పడేసినట్లు పూజారి ఆరోపించాడు. తనపై ఎటువంటి కేసులు లేవన్నాడు. బెయిల్పై తన విడుదలకు సహకరించిన హిందూ సంస్థలకు రుణపడి ఉంటానని అన్నాడు. రామాలయం కోసం పోరాడిన తను తిరిగి అయోధ్యకే వెళతానని చెప్పాడు. -
ఈమె ఆ స్టార్ హీరో కూతురు.. హీరోయిన్లని మించిపోయే గ్లామర్.. గుర్తుపట్టారా?
సాధారణంగా హీరో లేదా హీరోయిన్కి వారసులు దాదాపుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఒకప్పుడు అబ్బాయిలు ఎక్కువగా వచ్చేవారు కానీ ఇప్పుడు చాలామంది అమ్మాయిలు కూడా తల్లితండ్రుల వారసత్వాన్ని టాలీవుడ్లో కొనసాగిస్తున్నారు. ఈమె తల్లిదండ్రులు కూడా ప్రముఖ హీరోహీరయినే. కాకపోతే ఈమె నటి అవుతుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్. కానీ చూస్తుంటే మాత్రం హీరోయిన్లని మించిపోయేంత అందంగా కనిపిస్తుంది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? (ఇదీ చదవండి: ప్రభాస్ హీరోయిన్కి చేదు అనుభవం.. అలా జరగడంతో!) పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మేధ. ఈమె ప్రముఖ హీరో శ్రీకాంత్ కూతురు. 90ల్లో 'పెళ్లి సందడి' లాంటి సినిమాలతో ఫ్యామిలీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ నటుడు.. ప్రస్తుతం విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు. శ్రీకాంత్ కొడుకు రోషన్.. ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటించాడు కానీ అదృష్టం కలిసిరాలేదు. చిన్న కొడుకు రోహన్ ఇంకా చదువుకుంటున్నాడు. అయితే కూతురు మేధ.. రీసెంట్గానే చదువు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా శ్రీకాంత్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం గుడి బయట శ్రీకాంత్ కూతురు మేధ.. కెమెరా కంటికి చిక్కింది. పింక్ కలర్ చీరలో అందంగా మెరిసిపోతున్న ఈమెని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే హీరోయిన్లని మించిపోయేలా ఉన్న ఈమె.. నటి అవుతుందా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కానీ ఒకవేళ ఇండస్ట్రీలోకి వస్తే మాత్రం మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్ అవుతుందనడంలో సందేహం లేదు. (ఇదీ చదవండి: పెళ్లి పీటలెక్కనున్న 'పల్సర్ బైక్' రమణ.. గ్రాండ్గా ఎంగేజ్మెంట్) -
తాత సంవత్సరీకానికి వచ్చి ఇద్దరు మనుమళ్ల విషాదం!
వరంగల్, మహబూబాబాద్: తాత సంవత్సరీకానికి వచ్చిన ఇ ద్దరు మనుమళ్లు వాగులో స్నానానికి వెళ్లి ప్ర మాదవశాత్తు మునిగి చనిపోయారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లి గ్రా మంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల, పోలీసుల కథనం ప్రకారం.. వేములపల్లి గ్రామానికి చెందిన తాటిపాముల రాజీరు ఏడాది క్రితం చనిపోయాడు. శుక్రవారం సంవత్సరీకం (ఏడాది మాశికం). దీంతో అతని మనుమళ్లు తాటిపాముల పవన్(25), సిరిమల్లె శ్రీకాంత్ (17) (బావబామ్మర్దులు)లు వేములపల్లికి వచ్చారు. గ్రామంలోని పెద్దవాగులో స్నానానికి ఇద్దరు వెళ్లారు. వాగులో భారీ గుంతలు ఉండడం.. లోతు తెలియక దిగిన వారు ఈత రాకపోవడంతో మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. చిట్యాల సీఐ వేణు చందర్, ఎస్సై జాడి శ్రీధర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. తాత సంవత్సరీకానికి వచ్చి ఇద్దరు మనుమళ్లు వాగులో పడి చనిపోవడంతో వారి తల్లిదండ్రుల రోదనలతో గ్రామంలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. ఇవి చదవండి: అన్నీ సంచలనాలే.. ‘టీఎస్పీఎస్సీ’ కేసుతో కరీంనగర్కు లింకు! -
విడాకులంటూ బ్రేకింగ్ ఇచ్చేశారు.. వెంటనే ఫోన్ చేసి చెప్పా: శ్రీకాంత్
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో హీరోగా, ప్రతినాయకుడిగా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని స్టార్గా ఎదిగారు. ఇటీవలే కోటబొమ్మాళి పీఎస్తో అభిమానులను అలరించిన శ్రీకాంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో ఓ లుక్కేద్దాం. ఇటీవలే ఓ మూవీ కార్యక్రమంలో శ్రీకాంత్ పాల్గొన్నారు. అక్కడే సీనియర్ హీరోయిన్ రాశి కూడా కనిపించింది. ఈవెంట్లో వీరిద్దరూ చాలా సరదాగా పలకరించుకున్నారు. అంతేకాకుండా ఈవెంట్లో పాల్గొన్న రాశి.. శ్రీకాంత్ భుజంపై కొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వేదికపై హిట్ పెయిర్గా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరు చిన్నప్పటి స్నేహితుల్లా సందడి చేశారు. ఆ వీడియో పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాశి కొట్టడంపై శ్రీకాంత్ స్పందిస్తూ.. 'చాలా ఏళ్ల తర్వాత మేమిద్దరం ఫంక్షన్లో కలిశాం. అక్కడ ఉన్న హీరోయిన్ రాశిని అమ్మ అన్నది. దీంతో నేను కూడా సరదాగా రాశి అమ్మా అన్నా.. దానికే తను సరదాగా నవ్వుతూ కొట్టింది. అంతకు మించి ఏం లేదు. నేను నటించిన వారిలో సౌందర్య, ఉమతో చాలా కంఫర్ట్గా ఫీలయ్యేవాన్ని. మా ఇంటికి కూడా ఒక ఫ్యామిలీలాగా వచ్చేవారు. సైడ్ ఆర్టిస్టులతో అందరితో బాగా ఉండేవాన్ని' అని అన్నారు. విడాకుల రూమర్స్పై మాట్లాడుతూ.. 'ఊహాతో నాకు విడాకులు అంటూ వార్తలొచ్చాయి. టీవీలలో బ్రేకింగ్లు కూడా వేశారు. అప్పుడే నేను, నా భార్య అరుణాచలం వెళ్తున్నాం. అప్పుడు వెంటనే ప్రభుకు ఫోన్ చేసి చెప్పా. చూడరా బాబు మేమిద్దరం అరుణాచలం వెళ్తున్నామని చెప్పా. వెంటనే ఆ వార్తలను ఖండించాం.' అని తెలిపారు. పెళ్లికి ముందు మీకు ఇండస్ట్రీలో ఎఫైర్స్ ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించగా సరదాగా నవ్వుతూ ఆన్సరిచ్చారు. బయట ఎవరో ఏదో రాసింది అడిగితే కాదు?.. మీకు తెలిస్తే చెప్పండని నవ్వుతూ మాట్లాడారు. బాలీవుడ్ చిత్రాల్లో అవకాశమొస్తే తప్పకుండా చేస్తానని శ్రీకాంత్ అన్నారు. పోలీస్ ఆఫీసర్గా నచ్చిన చిత్రాల్లో ఖడ్గం అని తెలిపారు. ఇటీవలే పోలీస్గా కొటబొమ్మాళి అనే సినిమాను చేశా.. పోలీసులు స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో చూపించామని అన్నారు. -
ఆ సినిమా తర్వాత నా కెరీర్ గ్రాఫ్ పడిపోయింది: హీరో శ్రీకాంత్
హీరో శ్రీకాంత్ తెలుగులో ఎన్నో సినిమాలు చేశాడు. ఒకప్పుడు స్టార్ హీరోలకే గట్టి పోటీనిచ్చాడు. అయితే రానురానూ శ్రీకాంత్ కెరీర్ డల్ అయింది. గత కొంతకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కనిపిస్తున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న శ్రీకాంత్ టాలీవుడ్లో సెంచరీ మార్క్ను సులువుగా దాటేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గ్రాఫ్ పడిపోవడంపై స్పందించాడు. 'ఆమె సినిమా హిట్టయింది. అప్పటికే తాజ్మహల్, పెళ్లి సందడి సినిమాలు కమిటయ్యాను. వాటితో పాటు ఆహ్వానం, వినోదం వంటి చిత్రాలన్నీ వరుసగా హిట్టయ్యాయి. అప్పటి నుంచి ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే.. ఆ తర్వాత చేయడానికి మూడు సినిమాలు రిలీజ్గా ఉండేవి. హిట్ పడగానే పెద్దపెద్ద బ్యానర్లు వచ్చేవి. కానీ అప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యేసరికి ఈ పెద్ద బ్యానర్లు వెనక్కు వెళ్లిపోయేవి. మహాత్మ(2009) సినిమా తర్వాత నాకు పెద్ద దెబ్బ పడింది. ఇది నా వందో సినిమా. దీని తర్వాత నా కెరీర్ నెమ్మదిగా కిందకు పడిపోయింది. మహాత్మ తర్వాత ఓ పాతిక సినిమాలు చేశాను. కానీ ఏదీ విజయం సాధించలేదు. బహుశా టైం బ్యాడేమో.. కొత్తవాళ్లు ఇండస్ట్రీకి రావడం కూడా అందుకు ఓ కారణం కావచ్చు' అని శ్రీకాంత్ పేర్కొన్నాడు. చదవండి: తెలుగింటి హీరోయిన్.. అందంగా లేదని వెక్కిరించినవాళ్లే కుళ్లుకున్నారు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న.. -
'కోటబొమ్మాళి పీఎస్' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'కోటబొమ్మాళి పీఎస్' సినిమా రివ్యూ
టైటిల్: కోటబొమ్మాళి పీఎస్ నటీనటులు: శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు దర్శకుడు: తేజ మార్ని సంగీతం : మిథున్ ముకుందన్, రంజిన్ రాజ్ సినిమాటోగ్రాఫర్: జగదీశ్ చీకటి ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్ ఆర్ నిర్మాత : బన్నీ వాస్, విద్య కొప్పినీడి నిర్మాణ సంస్థ: జీఏ 2 పిక్చర్స్ విడుదల తేదీ: 2023 నవంబరు 24 రీమేక్ అనేది సేఫ్ గేమ్ లాంటిది. ఓ భాషలో హిట్టయిన మూవీని కాస్త మార్పులు చేర్పులు చేసి మరో భాషలో తీసి హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా మలయాళంలో రిలీజై ప్రేక్షకాదరణ దక్కించుకున్న చిత్రం 'నాయట్టు'. దీన్ని తెలుగు నేటివిటీకి తగ్గ మార్పులు చేసి 'కోటబొమ్మాళి పీఎస్' అనే మూవీగా తీశారు. తాజాగా ఇది థియేటర్లలో వచ్చింది. మరి సినిమా టాక్ ఏంటి? అనేది రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: Aadikeshava Review: 'ఆదికేశవ' సినిమా రివ్యూ) కథేంటి? శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి. ఈ ఊరి పోలీస్ స్టేషన్లో రామకృష్ణ(శ్రీకాంత్) హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుంటాడు. ఇదే స్టేషన్లో రవికుమార్ (రాహుల్ విజయ్), కుమారి (శివాని రాజశేఖర్) కానిస్టేబుల్స్. కోటబొమ్మాళిలో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఊరంతా చాలా హడావుడిగా ఉంటుంది. ఎన్నికల జరగడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ ముగ్గురు కానిస్టేబుల్స్.. ఓ హత్య కేసులో ఇరుక్కుంటారు. దీంతో పోలీసులే ఈ పోలీసుల వెంటపడతారు? మరి హత్య చేసిన ముగ్గురిను.. పోలీసులకు దొరికారా? ఇందులో ఎస్పీ రజియా అలీ(వరలక్ష్మి శరత్ కుమార్) పాత్రేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. సినిమా ఎలా ఉందంటే? రీమేక్ సినిమా తీయడం అనేది ఎంత సేఫో? అంత డేంజర్ కూడా! ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా నవ్వులపాలైపోవడం గ్యారంటీ. ఈ విషయంలో 'కోటబొమ్మాళి పీఎస్' ఫస్ట్ క్లాస్లో పాసైపోయింది! రెండున్నర గంటల సినిమాలో డ్రామా, థ్రిల్, ఎమోషన్ బాగా కుదిరాయి. ముఖ్యంగా యాస విషయంలోనూ కేర్ తీసుకున్నారు. ప్రతి సీన్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే.. మైనర్ బాలికని రేప్ చేశారనే కారణంతో నలుగురు కుర్రాళ్లని పోలీసులు ఎన్కౌంటర్ చేసే సీన్తో సినిమా ఓపెన్ అవుతుంది. ఈ ఆపరేషన్ కోసం రామకృష్ణ(శ్రీకాంత్), ఎస్పీ రజియా అలీ (వరలక్ష్మి శరత్ కుమార్) కలిసి పనిచేస్తారు. ఆ తర్వాత కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్, అందులో పనిచేసే కానిస్టేబుల్స్ రామకృష్ణ, రవి, కుమారి చుట్టూ ఉండే వాతావరణాన్ని ఎష్టాబ్లిష్ చేశారు. మరోవైపు ఉపఎన్నికకు సంబంధించిన స్టోరీ నడుస్తోంది. అనుకోని పరిస్థితుల్లో ఓ ప్రమాదం జరుగుతుంది. దీంతో అదికాస్త రాజకీయం అవుతుంది. రెండు స్టోరీలకు లింక్ ఏర్పడుతుంది. ప్రమాదం అనుకున్నది హత్యగా మారిపోతుంది. ముగ్గురు కానిస్టేబుల్స్.. ఈ హత్య కేసులో ఇరుక్కుంటారు. తమ కార్నర్ చేస్తున్నారని తెలిసి తప్పించుకుని పారిపోతారు. మరి చివరకు వీళ్లు పోలీసులకు దొరికారా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. రూరల్ బ్యాక్ డ్రాప్తో నడిచే సినిమాలు ఈ మధ్య ప్రేక్షకులకు తెగ నచ్చేస్తున్నాయి. 'నాయట్టు' చిత్రాన్ని అలా శ్రీకాకుళం బ్యాక్డ్రాప్కి మార్చి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఊరిలో యాస దగ్గర నుంచి పాత్రల మధ్య నడిచే డ్రామా వరకు బాగానే సెట్ చేసుకున్నారు. ప్రధానంగా ఓ నాలుగైదు పాత్రలు మాత్రమే మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా సీన్స్ రాసుకున్నారు. కాకపోతే ముగ్గురు కానిస్టేబుల్స్, పోలీసులు మధ్య ఛేజింగ్ డ్రామా అంతా కాస్త సాగదీసినట్లు ఉంటుంది. దాన్ని కాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. మెయిన్ లీడ్స్లో శ్రీకాంత్ పాత్రకు రాసుకున్న సీన్స్ బాగున్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే మంచి థ్రిల్ ఇస్తాయి. ఆల్రెడీ పోలీసోడు కాబట్టి తనని ఛేజ్ చేస్తున్న ఎస్పీకే కౌంటర్స్ ఇస్తుంటాడు. సినిమా చూస్తున్నంతసేపు క్లైమాక్స్లో ఏం జరుగుతుందా? పోలీసులు.. హత్య కేసులో ఇరుక్కున్న కానిస్టేబుల్స్ని పట్టుకుంటారా? లేదా అని టెన్షన్ క్రియేట్ అవుతుంది. అయితే మనం అనుకోని ఇన్సిడెంట్స్ క్లైమాక్స్లో జరుగుతాయి. ఎవరెలా చేశారు? ఈ సినిమాలో కథే హీరో. మిగిలిన వాళ్లంత పాత్రధారులు మాత్రమే. అలానే స్టార్ యాక్టర్స్ ఎవరు లేరు. ఉన్నంతలో శ్రీకాంత్ మాత్రమే చాలామందికి తెలిసిన ముఖం. అతడు తనకొచ్చిన హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ రోల్కి పూర్తి న్యాయం చేశాడు. కానిస్టేబుల్ రవిగా చేసిన రాహుల్ విజయ్కి ఉన్నంతలో మంచి సీన్స్ పడ్డాయి. కానిస్టేబుల్ కుమారిగా చేసిన శివాని.. స్టోరీ అంతా ఉంటుంది కానీ యాక్టింగ్కి పెద్దగా స్కోప్ దొరకలేదు. ఎస్పీ రజియా అలీగా వరలక్ష్మి శరత్ కుమార్.. పోలీస్ విలనిజం చూపించింది. మంత్రి పాత్రలో మురళీ శర్మ పర్వాలేదనిపించాడు. మిగిలిన వాళ్లంతా ఫరిది మేరకు నటించారు. టెక్నికల్ విషయాలకొస్తే.. 'లింగి లింగి లింగిడి' పాట వల్ల ఈ సినిమాపై కాస్త క్యూరియాసిటీ పెరిగింది. ఆ సాంగ్ మ్యూజిక్ హిట్. పిక్చరైజేషన్ జస్ట్ బాగుంది. పాటలేం లేవు, బ్యాక్ గ్రౌండ్ స్కోరు కథకు తగ్గట్లు సరిపోయింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. చివరగా డైరెక్టర్ తేజ మార్ని గురించి చెప్పుకోవాలి. మాతృకని పెద్దగా చెడగొట్టకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లు తీయడంలో పాసైపోయారు. ఓవరాల్గా 'కోటబొమ్మాళి పీఎస్'.. ఓ మంచి మూవీ చూసిన ఫీల్ ఇస్తుంది. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: ‘సౌండ్ పార్టీ’ మూవీ రివ్యూ) -
రాజకీయాలతో సంబంధం లేదు
‘‘ప్రస్తుత రాజకీయాలకు, ‘కోటబొమ్మాళి పీఎస్’ సినిమా కథకు ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఈ మూవీలో ఎన్నికల గురించి, ఓటు విలువ గురించి చర్చించాం. వ్యవస్థ, మనం ఎలా అవినీతిమయమై ఉన్నాం అనేది ఈ చిత్రంలో చెబుతున్నాం. ఈ మూవీకి ఏ పొలిటికల్ ఎజెండా లేదు’’ అని డైరెక్టర్ తేజా మార్ని అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘కోటబొమ్మాళి పీఎస్’. ‘బన్నీ’ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా తేజా మార్ని మాట్లాడుతూ– ‘‘వ్యవస్థలో ఉన్న వాళ్లు అదే వ్యవస్థకు బలైతే ఎలా ఉంటుంది? అనే కథని జనాలకు చెప్పాలనిపించింది. కోటబొమ్మాళి అనే ఊరిలో ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఏం జరిగింది? అది ముగ్గురు పోలీస్ అధికారుల జీవితాలను ఎలా మార్చింది? అనేది ఈ చిత్ర కథ. మలయాళ హిట్ ‘నాయట్టు’ కి ఇది తెలుగు రీమేక్ అయినా తెలుగుకి తగ్గట్టు మార్పులు చేశాం. శ్రీకాంత్, వరలక్ష్మిగార్ల పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. రాహుల్, శివాని చక్కగా నటించారు. నిర్మాతలు వాసు, విద్యగార్లు ఎక్కడా రాజీపడలేదు. ‘లింగిడి లింగిడి..’ పాట వల్లే మా సినిమా గురించి అందరికీ తెలిసింది’’ అన్నారు.