-
సియోల్: బ్యాటరీల ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. 20 మంది మృతి
సియోల్: దక్షిణ కొరియాలోని లిథియం బ్యాటరీల ఫ్యాక్టరీలో సోమవారం(జూన్24) ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్లు సమాచారం. రాజధాని సియోల్ దక్షిణ ప్రాంతంలో ఆరిసెల్ బ్యాటరీ ప్లాంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దాదాపు 35 వేల బ్యాటరీ సెల్స్ను ఉంచిన గోదాములో పేలుళ్లు జరగడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన చోట ఇప్పటివరకు 20 మృతదేహాలను అధికారులు గుర్తించారు. డజన్లకొద్దీ ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. లిథియం బ్యాటరీల నుంచి వెలువడే మంటలార్పడానికి డ్రైశాండ్ను వినియోగించారు. నీళ్లు ఈ మంటలను ఆర్పలేవు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 100 మంది దాకా పని చేస్తున్నారు. వీరిలో 78 మంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మంటలు అదుపులోకి రావడంతో సహాయక బృందాలు కర్మాగారం లోపలికి చేరుకొని మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదంపై దేశాధ్యక్షుడు యూన్సుక్ యోల్ స్పందించారు. మంటలను అదుపుచేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, విద్యుత్ వాహనాల్లో వాడే లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో సౌత్ కొరియా ముందుంది. -
మళ్లీ ‘చెత్త’ పని చేసిన నార్త్ కొరియా కిమ్!
ఇప్పటి వరకు ఉత్తర కొరియా తన దగ్గరున్న క్షిపణులు, అణుబాంబులతో దక్షిణ కొరియాను బెదిరిస్తూ వచ్చింది. అయితే తాజాగా ఆ దేశం దక్షిణ కొరియాను ‘చెత్త బెలూన్ల’తో కవ్విస్తోంది. ఉత్తర కొరియా ఇటీవల 150 బెలూన్లకు చెత్తను కట్టి దక్షిణ కొరియాలోకి విడుదల చేసింది. దీనిపై దక్షిణ కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఖఠినవైఖరి అవలంబిస్తామని ఉత్తర కొరియాను హెచ్చరించింది.ఉత్తరకొరియా తీరును ఎండగడుతూ లౌడ్ స్పీకర్ల ద్వారా మరోసారి వ్యోంగ్యాంగ్ (ఉత్తర కొరియాలోని ప్రధాన నగరం)నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని సియోల్(దక్షిన కొరియాలోని ప్రధాన నగరం) పరిపాలనా అధికారులు హెచ్చరించారు. జాతీయ భద్రతా సమావేశంలో ఈమేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. సౌత్ కొరియా అధ్యక్ష కార్యాలయం వెలుపల లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసి ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా ప్రసారాలు ప్రారంభిస్తామని జాతీయ భద్రతా అధికారులు హెచ్చరించారు.కొద్ది రోజులుగా ఉత్తర కొరియా చెత్తతో కూడిన వందలాది బెలూన్లను పంపిందని దక్షిణ కొరియా సైన్యం మీడియాకు తెలిపింది. ఈ బెలూన్లు తెస్తున్న చెత్తలో ఉత్తర కొరియా ప్రచార సామాగ్రి ఉందా లేదా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని సైన్యం తెలిపింది. కాగా సరిహద్దు ప్రాంతాల్లో కరపత్రాలు, ఇతర చెత్తను పారవేస్తున్న దక్షిణ కొరియా కార్యకర్తలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇటీవల ఉత్తర కొరియా తెలిపింది. ఈ ప్రటన తరువాతనే దక్షిణ కొరియాకు చెత్త కట్టిన బెలూన్లు రావడం ప్రారంభమయ్యింది.1950లలో కొరియా యుద్ధం జరిగినప్పటి నుండి ఉత్తర, దక్షిణ కొరియాలు తమ ప్రచార కార్యక్రమాలలో బెలూన్లను ఉపయోగిస్తూ వస్తున్నాయి. ఇదిలా ఉండగా 2018- అంతర్-కొరియా ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు దక్షిణ కొరియా జాతీయ భద్రతా మండలి తెలిపింది. ఈ ఒప్పంద ఉద్దేశ్యం ఇరు కొరియా దేశాల మధ్య పరస్పర నమ్మకం ఏర్పడే వరకూ సరిహద్దు శత్రుత్వాన్ని తగ్గించడం.ఈ ఒప్పందాన్ని ఎత్తివేడం వల్ల ఉత్తర కొరియా సరిహద్దులో దక్షిణ కొరియా మళ్లీ సైనిక విన్యాసాలు ప్రారంభించేందుకు వీలు కలుగుతుందని, పొరుగు దేశం కవ్వింపు చర్యలని తిప్పొకొట్టవచ్చని భద్రతా మండలి పేర్కొంది. ఒప్పందపు రద్దు ప్రతిపాదనను ఆమోదం కోసం క్యాబినెట్ కౌన్సిల్కు సమర్పించనున్నారు. కాగా ఉత్తర కొరియా ఇప్పటివరకు దక్షిణ కొరియాలోని వివిధ ప్రాంతాల్లో వెయ్యికి పైగా చెత్తతో కూడిన బెలూన్లను ఎగరేసింది. వీటిలో పేడ, సిగరెట్ పీకలు, గుడ్డ ముక్కలు, వ్యర్థ కాగితాలు ఉన్నట్లు గుర్తించారు. దక్షిణ కొరియా సైన్యం తెలిపిన వివరాల ప్రకారం ఈ బెలూన్లలో ఎటువంటి ప్రమాదకర పదార్థాలు లేవు. -
Seoul: సౌత్కొరియాలో డాక్టర్ల పోరుబాట.. పేషెంట్ల విలవిల
సియోల్: సౌత్ కొరియాలో డాక్టర్లు వారం రోజుల నుంచి ఆందోళన బాట పట్టారు. వచ్చే ఏడాది నుంచి మెడికల్ కోర్సుల్లో ఏడాదికి 2 వేల సీట్లు పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీ విధులను కూడా బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. దీంతో ఎమర్జెన్సీ వార్డుల్లో పేషెంట్లు డాక్టర్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధాని సియోల్లోని 5 పెద్ద ఆస్పత్రుల్లో ఇప్పటికే షెడ్యూల్ అయిన సగం సర్జరీలు రద్దవుతున్నాయి. దీనిపై దేశ వైద్యశాఖ సహాయ మంత్రి పార్క్ మిన్సూ స్పందించారు. డాక్టర్ల ప్రాథమిక కర్తవ్యం పేషెంట్ల ప్రాణాలు కాపాడటమని, నిరసనల కంటే వారు ఈ విషయానికే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పనిచేసే చోటే ఉండాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల వల్ల ఇప్పటివరకు 7813 మంది డాక్టర్లు ఉద్యోగాలు వదిలి వెళ్లిపోయారని, ఇందుకే మరింత మంది డాక్టర్లు అవసరమని చెప్పారు. అయితే స్టే ఎట్ వర్క్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని, ప్రభుత్వం డాక్టర్ల సంఖ్యను పెంచే బదులు వారి వేతనాలు, పని ప్రదేశంలో సౌకర్యాలు పెంచాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని సుదూర గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందిండం కోసమే మెడికల్ సీట్ల సంఖ్యను పెంచుతున్నామని ప్రభుత్వం చెబుతుంటే ఏప్రిల్లో జరిగే సాధారణ ఎన్నికల కోసమే ప్రభుత్వం ఈ స్టంట్ ప్లే చేస్తోందని డాక్టర్లు అంటున్నారు. ఇదీ చదవండి.. అలెక్సీ నావల్ని కుటుంబ సభ్యులనూ వదలని పుతిన్ -
24 గంటలూ ఓపెన్... సిబ్బంది మాత్రం నిల్!
మార్కెట్లో రకరకాల దుకాణాలు వచ్చేస్తున్నాయి. ఈ ఏఐ పుణ్యమా అన్ని సాంకేతికతో కూడాన ఆధునిక స్టోర్లు మన ముందు ప్రత్యక్షమవుతున్నాయి. పైగా అన్నీ మన ఒడిలోకే వంచి వాలిపోయేలా పనులు చకచక అయిపోతున్నాయి. అయితే అదే తరహాలో ఇక్కడొక విలక్షణమైన స్టోర్ ఉంది. 24 గంటలు తెరిచే ఉంటుంది. కానీ ఒక్క సిబ్బంది కూడా ఉండరు. మరీ ఎలా పనిచేస్తుంది?. కస్టమర్లు ఎలా కొనుక్కుంటారు? అనే కదా డౌటు..!. అలాంటి వెరైటీ స్టోర్ సియోల్లో ఉంది. దీనిపేరు రామెన్ స్టోర్. దీనిలో మనకు కావల్సిన అన్ని వస్తువులు ఉంటాయి. మనం అక్కడే కొనుక్కుని ఎంచక్కా వండకుని తినేసి రావొచ్చు. మరీ బిల్ ఎలా పే చేయాలంటే..మనకు మనమే స్వతహాగా పే చేయడమే. అలాగైతే ఎవరైనా ఈజీగా వస్తువులన్నీ ఎత్తుకుపోవచ్చు కదా అంటారా..! అంతా ఈజీ కాదు. ఎందుకంటే..? అడగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయి. మీరు నచ్చిన వస్తువులను తీసుకుని దాని పక్కనే ఉన్న బిల్పే చేసే ఆటోమెటిడ్ మెషిన్లో ఎంటర్ చేసి మనీ పే చేస్తే చాలు. ఒకరకంగా చెప్పాలంటే సెల్ఫ్ పేయింగ్ అన్నమాట!. ఈ మేరకు ఫుడ్ వ్లోగర్ లిల్లీ హ్యూన్ అనే ఆమె ఆ స్టోర్కి సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రాంలో షేర్ చేసింది. అందులో ఆమె తనకు నచ్చిన న్యూడిల్స్, ప్రిపరేషన్కి కావాల్సిన పదార్థాల తోపాటు సైడ్ డిష్లను తాను ఎలా తీసుకుని బిల్ పే చేసిందో వివరించింది. ఆ తర్వాతా ఆమె అక్కడే ఎలా ఎంచక్కా వండుకుని తినేసిందో కూడా చెప్పింది. అక్కడ మనం కావల్సింది వండుకోవడమే గాక అందుకు కావాల్సిన సైడ్ డిష్లు కూడా ఉంటాయి. వాటికి మాత్రం బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. అవి ఫ్రీ. ఐతే ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం ఇది రియల్? ఆ..! అని ఆశ్చర్యపోయారు. చాలామంది ఇది వర్క్ ఔట్ అవ్వడం కష్టం అని అంటున్నారు. ఎందుకంటే ఆ సీసీటీవీలను కూడా పాడు చేసి ఎత్తుకుపోవడం వంటివి జరుగుతాయంటూ కామెంట్లు చేశారు. View this post on Instagram A post shared by Lily Huynh (@biteswithlily) (చదవండి: ఫ్రూట్ ఇడ్లీ గురించి విన్నారా? తయారీ విధానం చూస్తే..షాకవ్వుతారు!) -
ప్రతీకారం ఇలా కూడా తీర్చుకోవచ్చా.. దంపతులు చేసిన పనికి విల్లా యజమాని షాక్..?
వెకేషన్ రెంటల్ కంపెనీ ఎయిర్బీఎన్బీకి భారీషాక్ తగిలింది. ఇద్దరు దంపతులు తీర్చుకున్న రివెంజ్ దెబ్బతో ఆ సంస్థకు రూ.1.2లక్షల నష్టం వాటిల్లింది. వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. చైనాకు చెందిన భార్యభర్తలు సౌత్ కొరియాలో సియోల్లో 25 రోజుల పాటు వెకేషన్కు వెళ్లాలని అనుకున్నారు. ఇందుకోసం వెకేషన్ రెంటల్ కంపెనీ ఎయిర్బీఎన్బీలో సియోల్లో ఓ విల్లాను బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకునే సమయంలో విల్లా యజమాని ‘లీ’(Lee)ని, ఎయిర్బీఎన్బీని సంప్రదించలేదు. అయితే వాళ్లిద్దరూ తాము బుక్ చేసుకున్న విల్లా నగరంలో లేదని, ఎక్కడో శివారు ప్రాంతంలో ఉందని తెలుసుకొని కంగుతిన్నారు. తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని విల్లా ఓనర్ని అడిగారు. అందుకు ఆయన ఒప్పుకోలేదు. చేసేది లేక చైనా నుంచి సియోల్కు వచ్చారు. 25 రోజుల పాటు విల్లాలో ఉన్న భార్యభర్తలు విల్లా ఓనర్పై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. లీ’కి ఫోన్ చేసి మీ విల్లాలో నిఘా కెమెరాలు ఉన్నాయా? అవి పనిచేస్తున్నాయా? అడిగారు. అందుకు మా విల్లాలో సీసీ కెమెరాలు లేవని చెప్పడంతో తమ ప్లాన్ను అమలు చేశారు. అవసరానికి మించి లైట్లు, ట్యాప్లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, గ్యాస్ ట్యాప్లను ఆన్ చేశారు. 25 రోజుల్లో కేవలం ఐదుసార్లు మాత్రమే సియోల్ను సందర్శించారు. ఆ ఐదు రోజుల్లో ఐదైదు నిమిషాలు మాత్రమే ఉన్నారు. గడువు ముగియడంతో విల్లాను ఖాళీ చేశారు. ఈ క్రమంలో గ్యాస్ కంపెనీ అధికారులు విల్లా ఓనర్కు లీకి ఫోన్ చేశారు. మీ విల్లాలో గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉందనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. అధికారులు సమాచారంతో విల్లాలో ఎదైనా ప్రమాదం జరిగిందేమోనని బయపడ్డారు. విల్లాను సందర్శించిన తర్వాత దంపతులు చేసిన పనికి యజమానికి లీ షాక్కు గురయ్యాడు. విల్లాలో ఏం జరిగిందోనని తెలుసుకునే ప్రయత్నించే క్రమంలో కిటికీలు తెరిచి ఉండడం, గ్యాస్ ఆన్లో ఉండడం గమనించాడు. $116 (రూ. 9,506) నీరు, కరెంట్ $730 (రూ. 59,824), గ్యాస్ ఇతర $728 (రూ. 59,660) బిల్లులు వచ్చాయి. 120,000 లీటర్ల కంటే ఎక్కువ నీటిని ఉపయోగించారు. భార్య భర్తల ప్రతీకారంతో తమ సంస్థకు భారీ ఎత్తున నష్టం జరిగిందని ఎయిర్బీఎన్బీ సైతం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, తమపై ప్రతీకారం తీర్చుకున్న చైనాలో ఉన్న భార్యభర్తలపై కోర్టును ఆశ్రయిస్తానని, వాళ్లిద్దరూ ఎక్కడున్నా కటకటల్లోకి పంపిస్తానని లీ చెప్పడం కొసమెరుపు. చదవండి👉 ఎయిర్టెల్ అదిరిపోయే ఆఫర్.. ఓటీటీ ప్లాట్ఫామ్స్ను ఉచితంగా చూడొచ్చు! -
మా వైఫల్యం వల్లే ఆ 156 మంది చనిపోయారు: పోలీస్ చీఫ్ యూన్ హీ క్యూన్
సియోల్: రాజధాని సియోల్లో శనివారం రాత్రి చోటుచేసుకున్న దుర్ఘటనకు తమ వైఫల్యమే కారణమని దేశ పోలీస్ చీఫ్ యూన్ హీ క్యూన్ అంగీకరించారు. హాలోవిన్ ఉత్సవాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 156 మంది చనిపోగా, మరో 151 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 26 మంది పరిస్థితి విషమంగా ఉంది. ‘జరగబోయే ప్రమాదం గురించి ఘటనకు ముందు అందిన అత్యవసర ఫోన్కాల్స్పై మా అధికారులు సరిగా స్పందించలేదని తేలింది. వెంటనే చర్యలు తీసుకుని ఉంటే విషాదం నివారించగలిగే వారం. ప్రభుత్వ విభాగం అధిపతిగా ఈ దుర్ఘటనకు నాదే బాధ్యత’ అని యూన్ చెప్పారు. ఈ దుర్ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. మృతి చెందిన 156 మందిలో 101 మంది మహిళలుండగా వీరిలో ఎక్కువ మంది టీనేజర్లని ప్రభుత్వం తెలిపింది. పురుషులతో పోలిస్తే వీరు తక్కువ ఎత్తు ఉండటం, శారీరకంగా తక్కువ బలవంతులు కావడంతో తోపులాటలో ఛాతీ ఎక్కువ ఒత్తిడికి గురై ఊపిరాడక చనిపోయారని పేర్కొంది. హాలోవీన్ ఉత్సవాల కోసం 137 మంది అధికారులను కేటాయించామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. వీరికి డ్రగ్స్ వాడకాన్ని నివారించే బాధ్యతలే తప్ప, బందోబస్తు విధులను కేటాయించలేదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం, నిర్వాహకులెవరూ లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని భావిస్తున్నామన్నారు. మృతుల్లో అమెరికా, చైనా, రష్యా, ఇరాన్ తదితర దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు. చదవండి: ఎవరెస్ట్ నేర్పే పాఠం ఎలాంటిదంటే.. -
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. యువ నటుడు, గాయకుడు మృతి
దక్షిణ కొరియా రాజధాని సియోల్లో హాలోవీన్ వేడుకలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ వేడుకలో దాదాపు 150పైగా ప్రజలు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో యువ గాయకుడు, నటుడు లి జి హాన్(24) కూడా మృతి చెందారు. లి జి హాన్(Lee Ji-han) మృతితో దక్షిణ కొరియా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్టోబర్ 29న సియోల్లో జరిగిన హాలోవీన్ వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో ఈ యంగ్ పాప్ సింగర్ మరణించినట్లు అక్కడి స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. చదవండి: సమంత అనారోగ్యంపై స్పందించిన మరో అక్కినేని హీరో, వెంకటేశ్ కూతురు లీ జీ హాన్ మృతిపై కొరియాకు చెందిన పలువురు నటీనటులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా రాజధాని నగరం సియోల్లో రద్దీగా ఉండే నైట్ లైఫ్ జిల్లా ఇటావాన్లో శనివారం(అక్టోబర్ 29న) హాలోవీన్ వేడుకులను నిర్వహించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడి ఇరుకైన వీధుల్లోంచి జనం ఒక్కసారిగా పోటెత్తడంతో తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలో ఊపిరాడక దాదాపు 154పైగా మంది మరణించారు. అందులో ఈ యువ గాయకుడు లీ జీ హాన్ ఒకరు. -
South Korea: హాలోవీన్ వేడుకల్లో విషాదం (ఫోటోలు)
-
హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట..150కి చేరిన మృతుల సంఖ్య
సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్లో హాలోవీన్ వేడుకలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.çహాలోవీన్ను పురస్కరించుకుని శనివారం రాత్రి వీధుల్లో సంబరాలకు గుమిగూడిన జనం అకస్మాత్తుగా ఒక ఇరుకైన వీధిలోంచి పోటెత్తడంతో తొక్కిసలాట సంభవించింది. ఈ అనూహ్య ఘటనలో మృతుల సంఖ్య 151కి చేరింది. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. తొక్కిసలాటలో ఊపిరాడక ఈ మరణాలు సంభవించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Officials in Seoul said that at least 120 people were dead and 100 others were injured after a stampede in the South Korean capital's popular Itaewon district, where crowds had gathered to celebrate Halloween. https://t.co/auJuczo3Ll pic.twitter.com/7FXmfW8qab — The New York Times (@nytimes) October 29, 2022 ఇటెవోన్ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన హాలోవీన్ ర్యాలీలో సుమారు లక్షమంది పాల్గొన్నాట్లు సమాచారం. వేల సంఖ్యలో గుమికూడిన ప్రజలు హ్యామిల్టన్ హోటల్ సమీపంలోని ఇరుకు మార్గం గుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తోపులాట జరిగి వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. కొందరు ఊపిరాడక స్పృహ తప్పి పడిపోగా మరికొందరు చనిపోయారు. WARNING: GRAPHIC CONTENT – At least 149 people, mostly teenagers and young adults in their 20s, were killed in South Korea when a crowd celebrating Halloween surged into an alley in a night-life area of Seoul https://t.co/ZBB3cKhxO5 pic.twitter.com/evlVibGuUw — Reuters (@Reuters) October 29, 2022 పదుల సంఖ్యలో ఒకరిపై ఒకరు పడిపోయి అపస్మారక స్థితిలో ఉన్న వారికి సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రులకు తరలించారు. రక్షణ, సహాయక చర్యల నిమిత్తం 400 మంది సిబ్బందిని, 140 వాహనాలను వినిగించామన్నారు. ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయిన 150 మందిపైగా బాధితులకు సీపీఆర్ అందించినట్లు తెలిపారు. ఘటన అనంతరం ఆ ప్రాంతమంతా అంబులెన్సులు, పోలీసు వాహనాల సంచారంతో నిండిపోయింది. Pushing and stressing hysterically, a man tries to escape..during the celebrations at the Halloween party..in South Korea..#SouthKorea #Halloween #Seoul #Itaewon #이태원 #이태원사고 #압사사고. pic.twitter.com/qqmgvLOXVf — Siraj Noorani (@sirajnoorani) October 29, 2022 తోపులాటకు కారణం తోపులాటకు దారి తీసిన కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇరుకు వీధిలోని ఇటెవొన్ బార్కు ఓ సెలబ్రిటీ వచ్చారన్న వార్తలతో జనం అక్కడికి చేరుకునేందుకు ఒక్కసారిగా ప్రయత్నించడమే తోపులాటకు కారణమని స్థానిక మీడియా అంటోంది. 2020 కరోనా మహమ్మారి అనంతరం తొలిసారి జరుగుతున్న ఈ వేడుకలకు జనం పెద్ద సంఖ్యలో హాజరైనట్లు సమాచారం. ఆ ప్రాంతం అంత సురక్షితమైంది కాదంటూ శనివారం సాయంత్రం నుంచే సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షం కావడం గమనార్హం. అత్యవసర సమావేశం విషాద ఘటన అనంతరం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆదివారం జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. గాయపడిన వారికి వైద్య ఖర్చులు, మరణించిన వారి అంత్యక్రియలక నిర్వహణ ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తుకు ఆదేశించినట్లు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
మిసైల్ దూకుడు పెంచిన ఉత్తరకొరియా.. షాక్లో యూఎస్, దక్షిణ కొరియా
సియోల్: ఉత్తర కొరియా ఒక అనుమానాస్పద క్షిపణి ప్రయోగం చేసినట్లు దక్షిణ కొరియ బలగాలు పేర్కొన్నాయి. ఈ ప్రయోగం యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ దక్షిణ కొరియా పర్యటనకు ముందు రోజే ఉత్తర కొరియా ఈ క్షిపణి ప్రయోగం చేసినట్లు దక్షిణ కొరియా తెలిపింది. ఈ విషయాన్ని జపాన్ కోస్ట్ గార్డు కూడా ధృవీకరించిందని టోక్యో రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. అంతేగాక ఈ విషయమై తమ జపాన్ కోస్ట్ గార్డు తీరంలో ఉన్న నౌకలకు హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా జపాన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. దక్షిణ కొరియా ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం నిర్వహించనుందని హెచ్చరించిన కొద్ది రోజుల్లోనే ఉత్తర కొరియా ఈ క్షిపణి ప్రయోగానికి తెగబడటం గమనార్హం. ఇదిలా ఉండగా..అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గురువారం దక్షిణ కొరియా రాజధాని సియోల్ చేరుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆమె ఉత్తర దక్షిణ కొరియాల సరిహద్దు పటిష్ట భద్రతను పర్యవేక్షించనున్నారు. ఈ వారంలోనే ఈ రెండు దేశాలు రోనాల్డ్ రీగన్ సముద్రతీర ప్రాంతంలో సంయుక్తంగా సైనిక కసరత్తులను నిర్వహించనున్నాయి. ఐతే ఉత్తర కొరియా ఈ ఇరు దేశాల సైనిక కసరత్తులను యుద్ధ సన్నహాలుగా పరిగణిస్తూ ఫైర్ అవుతోంది. ఐతే ఆయా దేశాలు మాత్రం తమ భద్రతా దృష్ట్యా సాగిస్తున్న విన్యాసాలుగా చెబుతున్నాయి. అదీగాక అమెరికా దక్షిణ కొరియా రక్షణ నిమిత్తం దాదాపు 28 వేల సైనికులను మోహరించింది. (చదవండి: చైనా మాస్టర్ ప్లాన్.. ప్రపంచవ్యాప్తంగా అక్రమ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు!) -
జనవరిలో పెళ్లి ప్రకటన, తాజాగా మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
సౌత్ కొరియాకు చెందిన స్టార్ హీరోయిన్ పార్క్ షిన్ హై తల్లయింది. పండంటి మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చినట్లు కొరియన్ మీడియా వెల్లడించింది. సియోల్లోని ఓ ప్రైవేటు ఆసుప్రతిలో పార్క్ షీన్ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సాల్ట్ ఎంటర్టైన్మెంట్ ఎజెన్సీ ప్రకటించింది. ప్రియుడు, సహా నటుడు చోయి టే జూన్ను ఆమె పెళ్లి చేసుకున్న ఈ ఏడాది జనవరి అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పెళ్లిని, ప్రెగ్నెన్సీని ఒకేసారి ఈ జంట ప్రకటించింది. చదవండి: సింగర్ సిద్ధూ హత్య.. సల్మాన్కు లారెన్స్ వార్నింగ్.. అప్రమత్తమైన పోలీసులు తాజాగా ఈ జంటకు బిడ్డ పుట్టడంతో ఈ కొత్త దంపతులకు సౌత్ కొరియాకు చెందిన నటీనటుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా 2017 నుంచి పార్క్ షిన్ హై, చోయి టే జూన్లు డేటింగ్లో ఉన్నారు. ఈ క్రమంలో 2022 జనవరిలో వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యామని, ప్రస్తుతం షీన్ ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కాగా షిన్ హై ‘‘స్టేర్వే టూ హేవెన్, మిరాకిల్ ఇన్ సెల్ నెం.7, యూ ఆర్ బ్యూటీఫుల్, ది హెయిర్స్’’ వంటి సిరీస్తో గుర్తింపు పొందింది. చదవండి: OTT: అమెజాన్లో కేజీయఫ్ 2 స్ట్రీమింగ్, ఇకపై ఉచితం View this post on Instagram A post shared by 박신혜/Shin Hye Park (@ssinz7) -
గుడ్న్యూస్: ఇక మాస్క్లతో పని లేదు
సియోల్: మహమ్మారి కరోనా వైరస్ సోకకుండా ఇకపై మాస్క్లు.. శానిటైజర్లు.. భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించడం అవసరం లేదు. మాస్క్లకు బై బై చెప్పేసి శానిటైజర్లను ఇక పక్కన పడేస్తున్నారు. ఈ పరిస్థితి ప్రస్తుతం దక్షిణ కొరియా దేశంలో సంతరించుకుంటోంది. రెండు నెలల్లో బహిరంగ ప్రాంతాల్లో మాస్క్లు ధరించడం అనవసరమని ఆ దేశం ప్రకటించింది. ఎందుకంటే ఆ దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీ శరవేవగంగా సాగుతోంది. దక్షిణ కొరియాలో వయోధికులకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ వేయించారు. 52 మిలియన్ల మందికి అంటే దాదాపు 70 శాతం ప్రజలకు వ్యాక్సిన్ పూర్తి చేశారు. జూన్లోపు ప్రజల్లో ఒక డోసు వ్యాక్సిన్ పొందని వారు ఒక్కరూ కూడా ఉండరని దక్షిణ కొరియా ప్రకటించింది. 60 నుంచి 74 ఏళ్లలోపు ప్రజల్లో 60 శాతం మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి క్వాన్ డియోక్ చెయొల్ తెలిపారు. దక్షిణ కొరియాలో మంగళవారం కొత్తగా 707 కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 1,37,682. నాలుగు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లు ఆ దేశంలో వేస్తున్నారు. -
శాంసంగ్ చైర్మన్ లీకున్ కన్నుమూత
సియోల్: దక్షిణ కొరియా సంస్థను గ్లోబల్ టెక్ టైటాన్గా మార్చిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ శామ్సంగ్ కంపెనీ చైర్మన్ లీ కున్-హీ (78) కన్నుమూశారు. గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఆదివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్టు శాంసంగ్ అధికారికంగా ప్రకటించింది. లీ సారథ్యంలోనే శాంసంగ్ ప్రపంచంలోనే అత్యధిక స్మార్ట్ ఫోన్లు, మెమొరీ చిప్స్ను ఉత్పత్తి కంపెనీగా అవతరించింది. లీ మరణంపై కంపెనీ విచారం వ్యక్తం చేస్తూ.. లీ నిజమైన దార్శనికుడని, శాంసాంగ్ను దక్షిణ కొరియా నుంచి గ్లోబల్ టెక్ కంపెనీగా, పారిశ్రామిక శక్తి కేంద్రంగా మార్చారంటూ కొనియాడింది. కాగా శాంసంగ్ టర్నోవర్ దక్షిణ కొరియా మొత్తం జీడీపీలోని 10వ వంతుతో సమానంగా ఉంది. (చదవండి: వాళ్ల బాస్ నిజం తెలుసుకునే చాన్సే లేదు (స్పాన్సర్డ్) అయితే లీకి 2014లో తొలిసారి గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి ఆయన హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నారు. లీ కొరియాలోని డేగులో 1942 జనవరి 9న జన్మించారు. శాంసంగ్ వ్యవస్థాపకుడైన ఆయన తండ్రి లీ బైంగ్ చుల్ మరణం అనంతరం లీ శాంసంగ్ బాధ్యతలను చేపట్టారు. ఆ తర్వాత స్మార్ట్ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ చిప్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారీలో శాంసంగ్ సంస్థను లీ అగ్రగామిగా తీర్చిదిద్దారు. (చదవండి: ఆపిల్పై శాంసంగ్ సెటైర్లు) -
పైత్యం ఎక్కువైతే ఇలాంటివే జరుగుతాయి
సియోల్ : కరోనా వైరస్ జనాలను ఎంత భయపెడుతుందో చెప్పడానికి ఈ వార్తను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మనం ముట్టుకునే ప్రతీచోట వైరస్ ఉంటుందో లేదో తెలియదు గాని... మనం చేసే పనులు ఒక్కోసారి తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. కరోనా వైరస్కు భయపడి మనం తినే కూరగాయలు నుంచి వాడే ప్రతి వస్తువును శుభ్రం చేసే తీసుకుంటున్నాం. ఇది మంచిదే.. కరెన్సీ నోట్లకు వైరస్ ఉంటుందా లేదా అన్నది పక్కనపెడితే.. ఒకవేళ ఉన్నా వాటిని ఒకసారి నీళ్లలో ముంచి ఎండలో పెడితే సరిపోతుంది. కానీ ఇక్కడ ఒక ప్రబుద్దుడు వైరస్ సోకుంతుందేమోనని భయపడి వాటిని వాషింగ్ మెషిన్లో వేశాడు. ఇంకేముంది మంచిగా ఉన్న కరెన్సీ నోట్లన్నీ నిమిషాల్లో చిత్తుకాగితాల్లా మారిపోయాయి. వైరస్ రాకుండా శుభ్రత పాటించడం మంచిదే.. కానీ ఆ శుభ్రత మరీ ఎక్కువైపోతే ఇలాంటి ఘటనలే చోటుచేసుకుంటాయి.(పొగాకు నుంచి కోవిడ్ వ్యాక్సిన్?) ఈ ఘటన దక్షిణకొరియాలోని సియోల్లో చోటుచేసుకుంది. సియోల్కు చెందిన ఒక వ్యక్తికి తన కుటుంబసభ్యుని అంత్యక్రియలు జరిపించమని అతని బంధువులు, మిత్రులు 50వేల వాన్ (కొరియా కరెన్సీ) అందజేశారు. మన ఇండియన్ కరెన్సీలో దీని విలువ సుమారు 3వేల రూపాయలు. అయితే వారు ఇచ్చిన డబ్బుకు కరోనా వైరస్ ఉందన్న అనుమానం అతనికి వచ్చింది. వాషింగ్ మెషిన్లో ఆ నోట్లను వేస్తే వైరస్ సోకకుండా డిస్ ఇన్ప్క్ట్ చేస్తుందని భావించాడు.అంతే ఆ నోట్లన్నీ తీసి వాషింగ్ మెషిన్లో వేశాడు. ఒక్కరౌండ్ స్పిన్ అవగానే నోట్లను బయటికి తీసి చూడగా చాలా వరకు నోట్లు చిరిగిపోయి ఉన్నాయి. దీంతో ఆ వ్యక్తి పరుగున బ్యాంకుకు వెళ్లి అసలు విషయం చెప్పి సహాయం చేయాలని కోరాడు. అయితే బ్యాంకు అధికారులు ఆ నోట్లను పరిశీలించి ఇవి చెల్లవని.. ఏ సహాయం చేయలేమని చేతులెత్తేశారు. దీంతో బాధితుడు లబోధిబోమంటూ ఎలాగైనా తనను ఆదుకోవాలని విన్నవించుకున్నాడు. అధికారులు ఈ విషయాన్ని మేనేజర్ సియో జున్ వోన్ దృష్టికి తీసుకెళ్లారు. నోట్లలో చాలా వరకు చిరిగినవి ఉన్నాయని.. మంచి నోట్లను పరిశీలించి చూడగా కేవలం 507 వాన్లు మాత్రమే బాగున్నాయని చెప్పి బాధితుడికి అంతే మొత్తం ఇచ్చి అక్కడినుంచి పంపించేశారు. దయచేసి కరెన్సీ నోట్లను వాషింగ్ మెషిన్, ఓవెన్లలో వేయొద్దని ప్రజలకు బ్యాంకులు విజ్ఞప్తి చేశాయి. -
లైంగిక ఆరోపణలు : మేయర్ బలవన్మరణం
సియోల్ : దక్షిణ కొరియా తదుపరి అధ్యక్ష పదవికి పోటీపడతారని భావిస్తున్న సియోల్ మేయర్ ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటూ బలవన్మరణానికి పాల్పడ్డారు. సియోల్ మేయర్ పార్క్ వాన్సూన్ మృతదేహాన్ని నగరానికి సమీపంలోని పర్వత ప్రాంతంపై కనుగొన్నారు. మీటూ ఆరోపణలతో వివిధ రంగాల ప్రముఖులపై బాధిత మహిళలు ఆరోపణలు గుప్పిస్తున్న క్రమంలో పార్క్ వాన్సూన్ విషాదాంతం చోటుచేసుకుంది. ఆయన అధికార నివాసంలో లభించిన సూసైడ్ నోట్లో ఈ ప్రపంచాన్ని వీడుతున్నందుకు అందరూ తనను క్షమించాలని రాసుకున్నారు. తన దహన సంస్కారాలు నిర్వహించి అస్తికలను తన తల్లితండ్రుల సమాధుల వద్ద చల్లాలని ఆయన కోరారు. తన కుటుంబాన్ని బాధపెట్టినందుకు కుటుంబ సభ్యులు తనను మన్నించాలని పార్క్ వాన్సూన్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావించకుండా బై ఎవిరివన్ అంటూ లేఖను ముగించారు. దశాబ్ధ కాలంగా సియోల్ మేయర్గా కొనసాగుతున్న పార్క్ దక్షిణ కొరియా రాజకీయాల్లో, పాలక డెమొక్రటిక్ పార్టీలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. గతంలో తన కార్యదర్శిగా పనిచేసిన మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మరుసటి రోజే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా 2015లో పార్క్ వద్ద కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఆయన తనను లైంగిక వేధింపులకు గురిచేశారని పనివేళల్లో అభ్యంతరకరంగా ప్రవర్తించేవారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఆయన అండర్వేర్ ధరించి ఉన్న సెల్ఫీలను తనకు పంపి మెసెంజర్ యాప్లో అసభ్యకర కామెంట్లు చేసేవారని ఫిర్యాదు చేశారు. పార్క్ చర్యలతో తనకు విపరీతంగా భయం వేసేదని, సియోల్నగర ప్రజలు, నగర ప్రయోజనాల కోసం వాటిని భరించానని ఆమె పేర్కొన్నారు. మహిళ ఫిర్యాదును ధ్రువీకరించిన పోలీసులు వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. మరోవైపు పార్క్ మరణించడంతో ఆయనకు వ్యతిరేకంగా మహిళ చేసిన ఫిర్యాదులపై విచారణ సైతం ముగిసిపోనుంది. చదవండి : హీరోయిన్ మెటీరియల్ కాదన్నారు -
ఉత్తర కొరియా దుందుడుకు చర్య.. ఉద్రిక్తత!
సియోల్: ఉభయ కొరియాల మధ్య చర్చలకు వేదికగా నిలిచిన అనుసంధాన కార్యాలయాన్ని ఉత్తర కొరియా పేల్చివేసింది. సైనిక చర్యకు దిగుతామని ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో మంగళవారం ఈ ఘటనకు పాల్పడింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా యూనిఫికేషన్ మినిస్ట్రీ(ఏకీకరణ మంత్రిత్వ శాఖ- కొరియా పునర్కలయికను ప్రోత్సహించేందుకు నెలకొల్పబడింది) శాఖ ధ్రువీకరించింది. ఈ మేరకు.. ‘‘కేసంగ్ అనుసంధాన కార్యాలయాన్ని ఉత్తర కొరియా పేల్చివేసింది’’ అని ప్రకటన విడుదల చేసింది. ఘటన జరిగిన సమయంలో పార్లమెంటులో ఉన్న దక్షిణ కొరియా యూనిషికేషన్ మినిస్టర్ కిమ్ యోన్- చౌల్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఊహించిందే జరిగింది. పరిస్థితులను సమీక్షిస్తున్నాం’’ అని తెలిపారు.(అమెరికా తీరుపై ఉత్తర కొరియా అసహనం!) ఇక ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ను వ్యతిరేకిస్తూ దక్షిణ కొరియా నిరసనకారులు సరిహద్దులో బుడగలు ఎగురవేసిన విషయం తెలిసిందే. అంతేగాకుండా అణ్వాయుధాలపై కిమ్ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో దాయాది దేశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కిమ్ సోదరి, వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ప్రత్యామ్నాయ పొలిట్ సభ్యురాలు కిమ్ యో జాంగ్.. దక్షిణ కొరియాపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతేగాక గత కొన్నిరోజులుగా శత్రు దేశ చర్యల(అమెరికాతో సంబంధాల)ను గమనిస్తున్నామన్న ఆమె.. తదుపరి చర్యలకు సిద్ధమవ్వాల్సిందిగా సైన్యాన్ని ఆదేశించానని శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేగాక.. ఉత్తర- దక్షిణ కొరియాల బంధానికి వేదికైన అనుసంధాన కార్యాలయం పూర్తిగా ధ్వంసం చేసేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తాజాగా ఈ మేరకు తన నిర్ణయాన్ని అమలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.(దక్షిణ కొరియాకు కిమ్ సోదరి హెచ్చరికలు) చైనా స్పందన.. ఇరు దేశాల ఉమ్మడి భాగస్వామ్యంతో సరిహద్దులో నెలకొల్పిన కేసంగ్ పారిశ్రామిక ప్రాంతంలో పేలుడు సంభవించిందని యోనప్ న్యూస్ ఏజెన్సీ కథనాలు ప్రసారం చేసింది. నిమిషాల వ్యవధిలోనే ప్రాంతమంతా దట్టమైన పొగతో అలుముకుందని తెలిపింది. అదే విధంగా.. దాయాది దేశంతో విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో నిస్సైనిక ప్రాంతంలో సైనిక బలగాలను మోహరించాలని నార్త్ కొరియా భావిస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఇక కొరియా సరిహద్దుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జావో లిజియన్ తాజాగా స్పందించారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కాగా దక్షిణ కొరియాకు అమెరికా మద్దతుగా నిలవగా.. ఉత్తర కొరియా మిత్రదేశంగా చైనా కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
వాళ్లంతా సంకర జాతి కుక్కలు: కిమ్ సోదరి
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్ బెదిరింపులకు దాయాది దేశం దక్షిణ కొరియా తలొగ్గింది. ఆమె హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ఉత్తర కొరియా తీరును నిరసించిన కార్తకర్తలపై కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు డెయిలీ మెయిల్ కథనం ప్రచురించింది. గత కొన్ని రోజులుగా కిమ్ ఆరోగ్య పరిస్థితిపై అనేక కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఎరువు ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వదంతులకు తాత్కాలికంగా చెక్ పెట్టారు. అయినప్పటికీ కిమ్కు శస్త్ర చికిత్స జరిగిందని.. ఆయన మరణించారన్న ఊహాగానాలకు మాత్రం తెరపడలేదు. (మిలిటరీ మీటింగ్లో కిమ్) ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాలో నివసిస్తున్న కొంతమంది నిరసనకారులు, దాయాది దేశం నుంచి వలస వచ్చిన వారు.. కిమ్ నియంతృత్వ పోకడలు, అణ్వాయుధాలపై ఉత్తర కొరియా విధానాలను విమర్శిస్తూ.. సరిహద్దుల్లో బెలూన్లు ఎగురవేశారు. వాటితో పాటు కిమ్ను దుయ్యబడుతూ రాయించిన కరపత్రాలను గాల్లోకి విసిరారు. ఇక ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ ... ‘‘మాతృదేశానికి ద్రోహం చేసిన ఫిరాయింపుదార్లంతా సంకరజాతి కుక్కలు. వారి ప్రేలాపనలకు యజమానులు సమాధానం చెప్సాల్సిన సమయం ఆసన్నమైంది’’ అంటూ అధికార మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. (నిరసనకారుడిని ఒక్కసారిగా తోసేయడంతో..) అదే విధంగా కిమ్ను విమర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనట్లయితే.. ఇరు దేశాల మధ్య కుదిరిన మిలిటరీ ఒప్పందం నుంచి తప్పుకొంటామని దాయాది దేశాన్ని హెచ్చరించారు. అంతేగాకుండా ఉభయ కొరియాల పునర్ కలయికకు నిదర్శనంగా నిలిచిన అనుసంధాన వేదికలన్నింటినీ మూసివేస్తామని బెదిరింపులకు దిగారు. దీంతో బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని దక్షిణ కొరియా అధ్యక్ష భవన వర్గాలు వెల్లడించినట్లు డెయిలీ మెయిల్ పేర్కొంది. ఆ బెలూన్ల వల్ల అంతా నష్టమే తప్ప ఏ మంచి జరుగలేదంటూ సియోల్ అధికారి ఒకరు వాపోయినట్లు తెలిపింది. కాగా కిమ్ తర్వాత ఆయన చెల్లెలు కిమ్ యో జాంగ్ ఉత్తర కొరియాలో కీలక నేతగా ఎదుగుతున్న విషయం తెలిసిందే. కిమ్ మరణించారన్న వదంతుల నేపథ్యంలో ఆయన వారసురాలిగా కిమ్ యో జాంగ్ పాలనాపగ్గాలు చేపట్టనున్నారనే వార్తలు ప్రచారమయ్యాయి. -
ప్రేక్షకులుగా ‘సెక్స్ డాల్స్’.. భారీ జరిమానా
సియోల్ : మైదానాల్లో ప్రేక్షకుల స్థానంలో సెక్స్ డాల్స్ను వాడినందుకుగానూ ఎఫ్సి సియోల్ క్లబ్కి, కే లీగ్ భారీ జరిమానా విధించింది. స్టాండ్స్లో బట్టల దుకాణాల్లో పెట్టే బొమ్మలకు బదులు సెక్స్ డాల్స్ను వాడి అభిమానుల మనోభావాలను దెబ్బతీసినందుకుగానూ 100 మిలియన్ ఓన్(దాదాపు 61 లక్షల రూపాయలు) భారీ జరిమానాను ఎఫ్సి సియోల్ క్లబ్కి విధించింది. ('వర్షాకాలం తర్వాతే దేశంలో క్రికెట్ మొదలవ్వొచ్చు') కరోనా మహమ్మారితో ప్రేక్షకులు లేక క్రీడానిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఇక కనీసం టీవీల్లోనైనా మ్యాచ్లను లైవ్లో వీక్షించేవారికి ఫీల్ మిస్సవ్వకుండా ఉండటానికి గ్రౌండ్లో భారీగా అభిమానులు ఉన్నట్టు బొమ్మలతో నింపింది దక్షిణ కొరియాకి చెందిన ఎఫ్సి సియోల్ క్లబ్. అయితే ఆ బొమ్మలని సెక్స్ టాయ్స్ని తయారు చేసే ఓ సంస్థ సరఫరా చేసింది. గ్వాంగ్జు, ఎఫ్సీ-ఎఫ్సీ సియోల్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ను వీక్షించిన ప్రేక్షకులు ఆ బొమ్మలను చూసి ఆశ్చర్యపోయారు. వాటిలో కొన్ని సెక్స్ డాల్స్ కూడా ఉండటంతో అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. స్టేడియం స్టాండ్స్లో ఖరీదైన షోకేస్ బొమ్మలని పెట్టాలనుకున్నామని, కానీ వాటిని ఉత్పత్తి చేసే సంస్థ చేసిన తప్పిదం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని ఎఫ్సి సియోల్ ఫుట్ బాల్ క్లబ్ తెలిపింది. బట్టల దుకాణాల్లో పెట్టే బొమ్మలకు బదులు సెక్స్ డాల్స్ను కూడా తెచ్చి, వాటికి తమ టీమ్ టీషర్టులు తొడిగి స్టేడియంలో పెట్టిందని పేర్కొంది. (గందరగోళంలో క్రీడల భవిష్యత్: కశ్యప్) దక్షిణ కొరియాలో పోర్నోగ్రఫీని బహిష్కరించినప్పటికీ, స్టాండ్స్లో ఉన్న కొన్ని బొమ్మలు ఎక్స్ రేటింగ్ ఉన్న వెబ్ సైట్లకి ప్రచారం కల్పిస్తున్నట్టుగా ఉన్నాయి. లైవ్లో మ్యాచ్ చూసిన అభిమానులు ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో మండిపడ్డారు. దీంతో, ఎఫ్సి సియోల్ క్లబ్ తమ అభిమానులకి క్షమాపణ చెప్పింది. కాగా, ఫిబ్రవరిలో మొదలవ్వాల్సిన 2020 కే లీగ్ ఫుట్ బాల్ మ్యాచ్ కరోనావైరస్ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. కాకపొతే, త్వరితగతిన వైరస్ని అరికట్టామని చెబుతున్న దక్షిణ కొరియాలో ప్రపంచంలో మిగిలిన దేశాల కంటే ముందే క్రీడలకి రంగం సిద్ధం అయింది. దీంతో మే 8 వ తేదీన కే లీగ్ మొదలయింది. ఖాళీ స్టేడియం స్టాండ్లతో పాటు, ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్లు ధరించి, కరచాలనం చేయకూడదనే నియమం విధించారు. ఉమ్ము వేయడం, చీదడం లాంటివి చేయకూడదని, క్రీడాకారుల మధ్య సంభాషణల్ని కూడా నిషేధించారు. కాగా, ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో సియోల్ ఎఫ్సీ 1-0తో గ్వాంగ్ఝూపై గెలిచింది. (లాక్డౌన్: విరుష్కల మరో వీడియో వైరల్) -
కిమ్ ఆరోగ్యం విషమం.. సౌత్ కొరియా స్పందన
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ జోన్ ఉన్ ఆరోగ్యం విషమంగా ఉందన్న వార్తలపై దక్షిణ కొరియా ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. కిమ్ ఆరోగ్యం క్షీణించలేదని పేర్కొన్నాయి. కిమ్ గురించి వస్తున్న వార్తలు నిజం కాదని కొట్టిపడేశాయి. ఇందుకు సంబంధించి ఉత్తర కొరియా నుంచి ఎటువంటి అసాధారణ సంకేతాలు వెలువడటం లేదని ది ప్రెసిడెన్షియల్ బ్లూ హౌజ్(దక్షిణ కొరియా అధ్యక్షుడి అధికార భవనం) పేర్కొంది. కాగా గుండె కండరాల నొప్పితో ఆస్పత్రిలో చేరిన కిమ్ శస్త్ర చికిత్స చేయించుకున్నారని.. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారిందని, బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సియోల్ కేంద్రంగా పనిచేసే వెబ్సైట్... ఏప్రిల్ 12న శస్త్రచికిత్స తర్వాత కిమ్ ప్రస్తుతం హ్యాంగ్సాన్లోని మౌంట్ కుమ్గాంగ్ రిసార్టులోని విల్లాలో ఐసోలేషన్లో ఉన్నారని పేర్కొంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు తెలిపింది. కాగా ఉత్తర కొరియా వ్యవస్థాపక ప్రీమియర్, తన తాత కిమ్ II సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్ హాజరుకాని విషయం తెలిసిందే. అన్నింటా తానే ముందుండి కార్యక్రమాలు నిర్వహించే కిమ్ ఈ విధంగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండటంతో అనారోగ్యమే ఇందుకు కారణమంటూ వార్తలు ప్రచారమవుతున్నాయి.(విషమంగా కిమ్ జోంగ్ ఆరోగ్యం..!) -
యువ గాయని మృతి.. సూసైడ్గా అనుమానాలు!
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ పాప్ సింగర్ గూ హరా హఠాన్మరణం చెందారు. దక్షిణ కొరియాకు చెందిన కే-పాప్ బ్యాండ్ ‘కారా’ సభ్యురాలిగా, గాయనిగా పేరొందిన గూ హరా ఆదివారం సియోల్లోని తన ఇంట్లో అనుమానాస్పదస్థితిలో విగతజీవిగా కనిపించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆమె తన ఇంట్లో మరణించి ఉండటాన్ని పరిచయస్తులు గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె మృతికి కారణాలు తెలియదని, ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చునని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆరు నెలల కిందట కూడా ఆమె తన ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించారు. అప్పట్లో ఆత్మహత్యయత్నానికి ఆమె ప్రయత్నించినట్టు కథనాలు వచ్చాయి. 2008లో ‘కారా’ బ్యాండ్ గర్ల్గా గూ హరా సంగీత పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అప్పట్లో కారా బ్యాండ్ గ్రూప్ సెన్సేషనల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. క్రమంగా ఈ బ్యాండ్ ప్రభ మసకబారింది. ఈ క్రమంలో గత ఏడాది రివేంజ్ పోర్నోగఫీ బారిన పడిన గూ హరా తన మ్యూజిక్ కెరీర్ను అర్ధంతరంగా ఆపేసింది. మాజీ ప్రియుడు తనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిగత వీడియోలను బయటపెడతానని బెదిరించాడు. దీంతో అతన్ని హరా కోర్టుకు ఈడ్చింది. దీంతో కోర్టు అతనికి తాత్కాలిక జైలుశిక్ష విధించింది. ఈ వీడియోల కారణంగానే ఆమె డిప్రెషన్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. -
బతికి ఉండగానే ‘అంత్యక్రియలు’!!
సియోల్ : జీవిత పరమార్థాన్ని తెలిపేందుకు, బతుకు మీద తీపిని పెంచేందుకు దక్షిణ కొరియా హీలింగ్ సెంటర్లు సరికొత్త విధానాలు అనుసరిస్తున్నాయి. ప్రాణాలతో ఉండగానే ‘సామూహిక అంత్యక్రియలు’ నిర్వహించుకునే వీలు కల్పిస్తున్నాయి. తద్వారా నిరాశలో కూరుకుపోయిన వారు జీవితాన్ని కొత్త కోణం నుంచి చూసేలా సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో వెలువరించిన నివేదికల ప్రకారం మిగతా దేశాలతో పోలిస్తే దక్షిణా కొరియాలో ఆత్మహత్యలు రెండింతలు ఎక్కువ. ప్రతీ లక్ష మంది పౌరులకు సగటున 20 మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో 2012 నుంచే ఆ దేశంలో అధిక సంఖ్యలో హీలింగ్ సెంటర్లు పుట్టుకొచ్చాయి. బతికి ఉండగానే శవపేటికలోకి పంపి.. చనిపోయామన్న భావన కల్పిస్తూ జీవితంపై ఆశ కల్పించడమే వీటి ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో హైవోన్ అనే హీలింగ్ సెంటర్ మంగళవారం ‘డైయింగ్ వెల్’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. టీనేజర్లు మొదలు వృద్ధుల దాకా పదుల సంఖ్యలో ఈ ‘లివింగ్ ఫర్నియల్’లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా అంత్యక్రియలకు ముందు చేసే కార్యక్రమాలు పూర్తి చేసి.. అనంతరం పది నిమిషాల పాటు శవపేటికలో పడుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘చావుపై ఎప్పుడైతే మనకు అవగాహన వస్తుందో.. చావు తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో బతికి ఉండగానే మనకు బోధపడతాయో అప్పుడు జీవితాన్ని చూసే విధానంలో మార్పు వస్తుంది. సరికొత్త పంథాలో ముందుకు సాగేందుకు ఇది దోహదపడుతుంది అని పేర్కొన్నాడు. మరో టీనేజర్ తన అనుభవం గురించి వివరిస్తూ... ‘శవ పేటికను చూడగానే ముందు భయం వేసింది. ఆ తర్వాత ఆశ్చర్యంగా అనిపించింది. ఇంతకు ముందు ఎవరిని చూసినా నాకు పోటీదార్లే అంటూ ఒత్తిడికి గురయ్యేవాడిని. అందుకే చచ్చిపోవాలనిపించేది. కానీ ఇప్పుడు నా ఆలోచన మారింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తా’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ కార్యక్రమ నిర్వాహకుడు జోయింగ్ మాట్లాడుతూ... ‘ఆత్మహత్య చేసుకోవాలని ఉందని చెప్పిన ఎంతో మంది నిర్ణయాన్ని నేను మార్చగలిగాను. మేము 2012నుంచి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అప్పటి నుంచి నేటిదాకా దాదాపు 25 వేల మంది ఇందులో పాల్గొన్నారు. సామూహిక అంత్యక్రియల కార్యక్రమానికి ఏడ్చేవాళ్లను కూడా పిలవాలనుకున్నాం. కానీ ఈసారి కుదరలేదు. శవపేటికలో ఉన్నపుడు మన కోసం ఏడ్చేవారి స్వరం విన్నపుడు బలవన్మరణానికి పాల్పడి వారిని ఎంత వేదనకు గురిచేశామో అన్న విషయం అర్థమవుతుంది’ అని పేర్కొన్నాడు. -
పాక్ మద్దతుదారులపై షాజియా ఆగ్రహం
సియోల్: పాకిస్తాన్ మద్దతుదారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడాన్ని బీజేపీ నేత షాజియా తప్పుబట్టారు. శుక్రవారం దక్షిణకొరియా రాజధాని సియోల్లో జరిగిన యునైటెడ్ పీస్ ఫెడరేషన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఆమె భారత ఎంబసీకి వెళ్లారు. అయితే అక్కడ పాక్ మద్దతుదారులు కొందరు భారత్కు వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో షాజియా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి తీరును తప్పుపట్టారు. షాజియా నిరసనకారుల భావోద్వేగాలపై స్పందిస్తూ.. ‘ఆర్టికల్ 370 రద్దు చేయడంపై మీకు వ్యతిరేకత ఉండొచ్చు కానీ, మొత్తం దేశాన్ని నిందించడం సబబు కాదు. ఈ అంశం మాదేశ అంతర్గత సమస్య. దీనిపై మాట్లాడే హక్కు కూడా వారికి లేదు. కొన్ని దేశాలలో కనీసం మాట్లాడే హక్కు కూడా ఉండదు. నిరసన తెలిపే హక్కును ఎవరైనా సక్రమంగా వినియోగించుకోవాలి. శాంతియుతంగా తమ నిరసనను తెలియజేస్తే ఏ పరిణామాన్నైనా నేను దైర్యంగా ఎదుర్కొంటాన’ని అన్నారు. కాగా నిరసనకారుల తీవ్రత దృష్ట్యా పోలీసులు షాజియాను, ఆమె సిబ్బందిని సురక్షిత ప్రదేశానికి తరలించారు. -
ఆరేళ్లకే..రూ. 55 కోట్ల భవనం కొనుగోలు!
సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరు, ఎప్పుడు, ఏవిధంగా, ఎందుకు ఫేమస్ అవుతారో ప్రస్తుతం ఊహకందని విషయం. కాస్త ప్రతిభ, తెలివితేటలు ఉంటే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ... డబ్బు, పేరు ఈజీగా సంపాదించుకోవచ్చు. దక్షిణా కొరియాకు చెందిన ఆరేళ్ల చిన్నారి బోరమ్కు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. తనొక యూట్యూబ్ స్టార్. బొమ్మలతో ఆడుకుంటూ వాటి రివ్యూలు ఇచ్చే ఈ చిచ్చర పిడుగుకు రెండు యూట్యూబ్ చానళ్లు ఉన్నాయి. వాటికి దాదాపు 30 మిలియన్ల మంది సబ్స్ర్కైబర్లు ఉన్నారు. ఇక వీక్షకుల సంఖ్య ఇంతపెద్ద మొత్తంలో ఉందంటే బోరమ్ సంపాదన కూడా భారీగానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. అవును ఇప్పుడు తనొక కోటీశ్వరురాలు. తన సంపాదనతో ఏకంగా రాజధాని సియోల్లోని గంగ్నమ్ సబ్అర్బ్ ఏరియాలో 5 అంతస్తుల భవనాన్ని కొనుగోలు చేసింది ఈ చిట్టితల్లి. దాని ధర 9.5 బిలియన్ కొరియన్ వన్లు అంటే మన కరెన్సీలో దాదాపు 55 కోట్ల రూపాయలన్నట మాట. ఏంటి ఆరేళ్లకే ఇంత సంపాదనా.. అది కూడా హాయిగా ఆడుకుంటూ అని నోరెళ్లబెడుతున్నారా. అదంతే అంతా సోషల్ మీడియా మహిమ. ఏమంటారు?.. అంతేగా అంతేగా!! -
ప్రైజ్మనీని విరాళం ఇచ్చిన మోదీ
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీకి.. దక్షిణా కొరియా ప్రభుత్వం ప్రతిష్టాత్మక సియోల్ శాంతి బహుమతి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డు ద్వారా వచ్చిన కోటిన్నర ప్రైజ్మనీని ‘నమామీ గంగే ఫండ్’కు విరాళంగా ఇస్తున్నట్లు మోదీ ప్రకటించారు. అంతేకాక తనకు వచ్చిన అవార్డును భారతీయులకు అంకింతం చేస్తున్నట్లు మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఈ అవార్డు నాకు దక్కిన వ్యక్తిగతమైన గౌరవం కాదు. ఇది దేశ ప్రజలకు చెందుతుంది.. గత ఐదేళ్లలో భారత్ సాధించిన ప్రగతికి ఈ అవార్డు నిదర్శనం. 130 కోట్ల మంది భారతీయుల సత్తాకు ఈ అవార్డు అంకితమిస్తున్నాను’ అన్నారు మోదీ. -
మోదీకి సియోల్ శాంతి బహుమతి ప్రదానం
సియోల్: దక్షిణా కొరియా ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక సియోల్ శాంతి బహుమతిని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అందుకున్నారు. అంతర్జాతీయ సహకారం, ప్రపంచ అభివృద్ధి, మానవ అభివృద్ధికి చేసిన సేవలకుగానూ దక్షిణకొరియా ప్రభుత్వం సియోల్ శాంతి బహుమతిని మోదీకి ప్రదానం చేసింది. ఈ అవార్డు తనకు దక్కిన వ్యక్తిగతమైన గౌరవం కాదని, ఇది దేశ ప్రజలకు చెందుతుందని మోదీ అన్నారు. గత అయిదేళ్లలో భారత్ సాధించిన ప్రగతికి ఈ అవార్డు నిదర్శనమన్నారు. 130 కోట్ల మంది భారతీయుల సత్తాకు ఈ అవార్డు దక్కుతుందన్నారు. మహాత్మా గాంధీ150వ జయంతి జరుగుతున్న సంవత్సరంలో ఈ అవార్డును అందుకోవడం గర్వంగా ఉందని మోదీ చెప్పారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పెనుసవాళ్లని పేర్కొన్నారు. 1988లో సియోల్లో ఒలింపిక్స్ క్రీడలు జరగడానికి కొన్ని వారాల ముందే ఆల్ ఖైదా అనే ఉగ్రవాద సంస్థ ఏర్పడిందని, ఇప్పుడు తీవ్రవాదం, ఉగ్రవాదం .. ప్రపంచదేశాలకు సమస్యగా మారిందన్నారు. సియోల్ శాంతి బహుమతి గతంలో అందుకున్న ప్రముఖుల్లో ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ కోఫీ అన్నన్, జర్మనీ ఛాన్స్లర్ ఏంజిలా మోర్కెల్లు ఉన్నారు.