-
అసైన్డ్ భూములను లాక్కుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ఈ ప్రభుత్వం లాక్కుంటోందని సీఎల్పి నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గ్రామాల్లో శ్మశానవాటికలు, ఇతర అవసరాలకు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫార్మాసిటీ, పారిశ్రామికవాడల నిర్మాణం కోసం వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం అరకొర పరిహారం చెల్లించి తీసుకుందని ఆరోపించారు. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోనే 10 వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం సేకరించిందన్నారు. ఈ ప్రాంతంలో ఎకరా రూ.4–5 కోట్ల విలువ చేస్తుందన్నారు. బుద్వేల్లో 164 ఎకరాల అసైన్డ్ భూములు సేకరించిన ప్రభుత్వం ప్లాట్లు వేసి అమ్ముతోందని ఆరోపించారు. అసైన్డ్ భూములు అసైనీల వద్దే ఉండనీయాలని, ధరణిలో వారికి హక్కులు కల్పిం చాలని కోరారు. తెలంగాణ ప్రగతిపై ఆదివారం శాసనసభలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. పీపుల్స్ మార్చ్ పేరుతో ఇటీవల నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా తన దృష్టికి వచ్చిన ప్రజాసమస్యలను ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం లక్షల మంది ప్రజలు నిరీక్షిస్తున్నారని, ప్రతి గ్రామంలో భూములను సేకరించి ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని అన్నారు. అటవీ భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులందరికీ పోడు పట్టాలు అందలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. దీనిపై అధికార బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఉద్యోగాలు లేక కష్టాల్లో యువత.. ఎమ్మెస్సీ, ఎంఏ, బీఈడీ వంటి ఉన్నత చదువులు చదివిన యువత ఉద్యోగాలు లభించక గ్రామాల్లో ఇస్త్రీ షాపులు, సోడా దుకాణాలు నడుపుకుంటూ తీవ్ర ఆవేదనలో ఉన్నారని భట్టి విక్రమార్క పేర్కొనగా, మళ్లీ బీఆర్ఎస్ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్పీకర్ పోచారం కలగజేసుకుని.. ‘భట్టి గారూ..మీరు ఆరు మాసాల పాదయాత్ర మొత్తం చెప్పడానికి సమయం సరిపోదు’అని సూచన చేశారు. అనంతరం భట్టి ప్రసంగం కొనసాగిస్తూ.. వర్సిటీల్లో అధ్యాపకులను భర్తీ చేయాలని, ప్రైవేటు వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. ఉపాధ్యాయులు లేక బడులు మూతబడుతున్నాయని, తక్షణమే డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సరే.. కాల్వలు ఏవీ? రాష్ట్రంలో వివిధ కొత్త ప్రాజెక్టులను నిర్మించిన ప్రభుత్వం వాటి కింద కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు నిర్మించకపోవడంతో నీళ్లు ఉన్నా ఆయకట్టుకు సరఫరా కావడం లేదని భట్టి విక్రమార్క విమర్శించారు. కాళేశ్వరం కింద కాల్వలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. కడెం వంటి పాత ప్రాజెక్టులు, కాల్వల నిర్వహణ గాలికి వదిలేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ముంపునకు గురి అవుతున్న చెన్నూరు, భూపాలపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల ప్రజలకు పునరావాసం కల్పిం చి, పరిహారం చెల్లించాలని కోరారు. గిరిజనబంధు, బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి.. గిరిజనబంధుతో పాటు బీసీలకు సబ్ప్లాన్, మైనారిటీలకు సచార్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో క్వింటాల్కి 15 కేజీల వరకు తరుగు తీస్తున్నారని, పంట రుణమాఫీ సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులను మూసివేయించాలని డిమాండ్ చేశారు. -
లేటెస్ట్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు! గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ షురూ..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అద్భుతమైన డిస్కౌంట్ డీల్స్, ఆఫర్లను అందిస్తోంది అమెజాన్. మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయితే ఈ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా షావోమీ, ఒప్పో, శాంసంగ్ వంటి బ్రాండ్ల లేటెస్ట్ స్మార్ట్ఫోన్లను తక్కువ ధరకు ఇప్పుడే కొనుక్కోవచ్చు. ప్రైమ్ సబ్స్క్రైబర్లు కానివారు మాత్రం అర్ధరాత్రి వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇదీ చదవండి ➤ మరో చవక మొబైల్.. అతితక్కువ ధరకే సరికొత్త స్మార్ట్ఫోన్ విడుదల అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్లో లేటెస్ట్ స్మార్ట్ఫోన్లపై అందుబాటులోకి వచ్చిన బెస్ట్ డీల్స్లో కొన్నింటి గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం.. ఐఫోన్ 14 (iPhone 14) అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 విక్రయానికి ముందు ప్రైమ్ ఎర్లీ డీల్స్లో భాగంగా ఐఫోన్ 14 రూ. 67,499లకే అందుబాటులోకి వచ్చింది. యాపిల్ ఏ15 బయోనిక్ చిప్తో కూడిన ఈ ఫోన్ కార్ క్రాష్ డిటెక్షన్, ఎమర్జెన్సీ శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్లతో ఉన్న ఈ స్మార్ట్ఫోన్ గత ఏడాది భారత్లో రూ. 79,900 ధరతో లాంచ్ అయింది. దీంతోపాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లను వినియోగిస్తే రూ. 1,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎంపికచేసిన మోడల్స్కు ఎక్స్ఛేంజ్ ఆఫర్లో భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఇదీ చదవండి ➤ Expensive TV: వామ్మో రూ. 1.15 కోట్లు.. మార్కెట్లోకి అత్యంత ఖరీదైన టీవీ షావోమీ 12 ప్రో 5జీ (Xiaomi 12 Pro 5G) Snapdragon 8 Gen 1 చిప్సెట్తో వచ్చే షావోమీ 12 ప్రో 5జీ ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్లో భాగంగా తగ్గింపు ధర రూ. 41,999లకే లభిస్తోంది. లాంచింగ్ సమయంలో దీని బేస్ మోడల్ ధర రూ.62,999 ఉండగా తర్వాత రూ.52,999లకు తగ్గింది. కొనుగోలుకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే రూ. 1,250 తగ్గింపు ఉంటుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా గరిష్టంగా రూ.36,000 డిస్కౌంట్ లభించే ఆస్కారం ఉంది. ఐకూ 9 5జీ (iQoo 9 5G) ప్రైమ్ మెంబర్షిప్ కలిగి ఉంటే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ సమయంలో ఐకూ 9 5జీ స్మార్ట్ఫోన్ని రూ.29,990లకే కొనుక్కోవచ్చు. భారతదేశంలో ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ. 42,990. ఈ హ్యాండ్సెట్ 5nm స్నాప్డ్రాగన్ 888+ చిప్సెట్పై పనిచేస్తుంది. 120 వాట్స్ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. మీ ప్రస్తుత ఫోన్ని ఎక్సేంజ్కు ఇస్తే రూ. 26,650 వరకు తగ్గింపు లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ (Samsung Galaxy M33 5G) 6.6-అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, Exynos 1280 చిప్సెట్, 5జీ కనెక్టివిటీతో వచ్చే ఈ మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ లాంచింగ్ ధర రూ.18,999. ఇది ఇప్పుడు ప్రైమ్ ఎర్లీ డీల్స్లో భాగంగా రూ.16,999లకే అందుబాటులో ఉంది. అదనంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి రూ.1,000. పాత హ్యాండ్సెట్ ఎక్స్చేంజ్ ద్వారా రూ.16,100 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. రెడ్మీ 12సీ (Redmi 12C) MediaTek Helio G85 ప్రాసెసర్, 6.72-అంగుళాల ఎల్సీడీ స్క్రీన్తో వచ్చే ఎంట్రీ లెవల్ రెడ్మీ 12సీ హ్యాండ్సెట్ని ప్రైమ్ ఎర్లీ డీల్స్ సమయంలో రూ.7,699లకే కొనుగోలు చేయవచ్చు. అయితే దీని అసలు లాంచ్ ధర రూ. రూ.8,999. పాత హ్యాండ్సెట్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.7,300 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్ వచ్చేస్తోంది: ఫోన్లు, గృహోపకరణాలపై ఆఫర్లే ఆఫర్లు
Flipkart Big Saving Days Sale: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరోసేల్ను ప్రకటించింది. ఇండిపెండెన్స్డే సేల్కంటే ముందు ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ షురూ చేయ నుంది. ఆగస్టు 4 నుంచి 9వ తేదీవరకు నిర్వహించే ఈసేల్లో స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్పై తగ్గింపు ధరలను అందించనుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ తరువాత కస్టమర్లను ఆకట్టుకునేందు భారీ తగ్గింపులను ప్రకటించనుంది.డిస్కౌంట్లపై అదనపు వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్, శాంసంగ్ తదితర టాప్ దిగ్గజ కంపెనీల స్మార్ట్ఫోన్లపై భారీ డీల్స్ను అందించనుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 11 తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం,ఇవి రూ. 68,999 రూ. 41,999కి జాబితా చేయగా, జనాదరణ పొందిన 5జీ స్మార్ట్ఫోన్లపై గణనీయమైన ధరల తగ్గింపు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రాబోయే సేల్లో ఎక్కువ తగ్గింపులను అందిస్తుందని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. (Today August 2nd gold price గుడ్ న్యూస్: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు) అదేవిధంగా పిక్సెల్ 6ఏ, శాసంగ్ జెడ్ ఫ్లిప్ 3, గూగుల్, నథింగ్, పోకో, ఒప్పో, వివో, రియల్మీ వంటి అనేక ఇతర స్మార్ట్ఫోన్లు కూడా ధర తగ్గింపులను అందుకోనున్నాయి. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కస్టమర్లు ఐదు శాతం క్యాష్బ్యాక్ను ఆశించవచ్చు.ఐసీఐసీఐ, కోటక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ఈఎంఐపై గరిష్టంగా 4,500 తక్షణ తగ్గింపు లభిస్తుంది. (రూ. 26,399కే యాపిల్ ఐఫోన్14: ఎలా?) అలాగే ఫ్యాషన్తోపాటు టీవీలు, ఉపకరణాలు, ఆహారం, పానీయాలు, క్రీడలు & ఫిట్నెస్, కారు & బైక్ ఉపకరణాలు, బేబీ కేర్ ప్రొడక్ట్స్ తదితరాలపై 60 శాతం వరకు భారీ తగ్గింపు పొందవచ్చు . ఇంకా బైక్లు & స్కూటర్లు (ఎలక్ట్రిక్ స్కూటర్లతో సహా) రూ.56,500 నుండి ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. టీవీలు, ఇతర గృహోపకరణాలపై 75 శాతం డిస్కౌంట్. స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. -
యాపిల్ ఐఫోన్14పై భారీ తగ్గింపు, ఈ రోజే చివరి రోజు
Flipkart Big Saving Days Sale Apple iPhone 14: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈరోజు (జూలై 19)తో ముగియనుంది. ఈ సేల్ యాపిల్ స్మార్ట్ఫోన్పై భారీ తగ్గింపు లభిస్తోంది. యాపిల్ ఐఫోన్ తక్కువ ధరలో లభిస్తోంది అంటే ఐఫోన్ లవర్స్కు పండగే పండగ. అలాంటి వారు.. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్14ను సొంతం చేసుకోవాలనుకుంటే ఇదే మంచి తరుణం. వివరాలేంటో చూద్దాం రండి! (యాపిల్ వాచ్ కొత్త ఫీచర్ వచ్చేసింది: క్రానిక్ హార్ట్ కండిషన్ ఈజీ ట్రాక్) ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్లో ఐఫోన్ 14 రూ. 47,501 తగ్గింపు తర్వాత కేవలం రూ. 32.399కి అందుబాటులో ఉంది. ఇంత తక్కువ ధరకు యాపిల్ ఐఫోన్ను కొనుగోలు చేయడానికి అవకాశం నేటితో ముగియనుంది. యాపిల్ ఐఫోన్ 14 రూ. 10,901 తగ్గింపుతో రూ. 68,999 వద్ద అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, యాక్సిస్ బ్యాంక్ , సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ , EMI లావాదేవీలపై రూ. 1000 తగ్గింపును పొందవచ్చు. దీంతో ఫోన్ ధర రూ.67,999కి తగ్గింది. దీంతోపాటు పాత స్మార్ట్ఫోన్కు బదులుగా ఫ్లిప్కార్ట్ రూ. 35,600 దాకా తగ్గింపు లభిస్తుంది. అలా ఫ్లిప్కార్ట్ సేల్లో రూ. 47,501 తగ్గింపు తర్వాత రూ. 32,399కి లభిస్తుంది. గత ఏడాది చివర్లో లాంచ్ అయిన యాపిల్ ఐఫోన్ 14 ఐఫోన్ 13 లానే ఉంది,పెద్దగా అప్డేట్ లేదనే అంచనాల నేపథ్యంలో ప్రారంభ అమ్మకాల సమయంలో పెద్దగా స్పందనను పొందడంలో విఫలమైంది. అయితే ఇటీవలి ఫ్లిప్కార్ట్ సేల్లో ఆదరణ పొందుతోన్నట్టు తెలుస్తోంది. -
షాప్సి యాప్ డౌన్లోడ్లు 20 కోట్లు
బెంగళూరు: ఫ్లిప్కార్ట్కు చెందిన హైపర్ వ్యాల్యూ ప్లాట్ఫామ్ ‘షాప్సి’ మొబైల్ అప్లికేషన్ (యాప్) 20 కోట్ల డౌన్లోడ్ మైలురాయిని అధిగమించినట్టు ప్రకటించింది. ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మెగా సేల్ను ఈ సంస్థ ఇటీవలే ప్రారంభించింది. ఈ సేల్లో అమ్మకాలు రెండింతలు అధికంగా నమోదయ్యాయని తెలిపింది. (జీల్ ప్రమోటర్లకు శాట్ షాక్ ) చీరలు, పురుషుల టీ షర్ట్లు, కుర్తీలు ఎక్కువగా అమ్ముడుపోయినట్టు వివరించింది. ఈ సంస్థకు మహారాష్ట్ర, యూపీ, పశి్చమబెంగాల్ టాప్–3 మార్కెట్లుగా ఉన్నాయి. 60 శాతం డిమాండ్ టైర్–3 పట్టణాల నుంచే ఉన్నట్టు తెలిపింది. షాప్సి ప్లాట్ఫామ్పై ఆకర్షణీయమైన ధరలకే ఉత్పత్తులు అందుబాటులో ఉండడం, కస్టమర్ అనుకూల ఫీచర్లతో ఈ సంస్థ ఎక్కువ మందికి చేరువ అవుతుండడం గమనార్హం. (ఐటీఆర్ ఫైలింగ్లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్) ఇదీ చదవండి: అదరగొట్టేస్తున్న యాంకరమ్మ: దిమ్మతిరిగే వీడియో హల్చల్ -
వేదాంతా చేతికి ట్విన్ స్టార్ బిజ్
న్యూఢిల్లీ: సహచర సంస్థ ట్విన్ స్టార్ టెక్నాలజీస్ లిమిటెడ్ (టీఎస్టీఎల్) నుంచి సెమీకండక్టర్, డిస్ప్లే బిజినెస్లను సొంతం చేసుకోనున్నట్లు వేదాంతా లిమిటెడ్ వెల్లడించింది. తద్వారా సమీకృత సెమీకండక్టర్, డిస్ప్లే బిజినెస్లు కలిగిన తొలి కంపెనీగా వేదాంతా ఆవిర్భవించనుంది. వేదాంతాకు అల్టిమేట్ హోల్డింగ్ కంపెనీ అయిన టీఎస్టీఎల్.. వోల్కన్ ఇన్వెస్ట్మెంట్స్కు పూర్తి అనుబంధ సంస్థకావడం గమనార్హం! కాగా.. షేర్ల బదిలీ ద్వారా టీఎస్టీఎల్ సెమీకండక్టర్, డిస్ప్లే బిజినెస్ యూనిట్లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వేదాంతా వెల్లడించింది. దీంతో వేదాంతా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోకు సెమీకండక్టర్, డిస్ప్లే గ్లాస్ బిజినెస్ జత కలవనున్నాయి. -
డేంజర్: ఇది జరిగితే మీ బ్యాంక్ అకౌంట్ ప్రమాదంలో ఉన్నట్టే..
ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. అమాయక ప్రజల డబ్బును దోచుకునేందుకు సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తు వేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మీ డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు అత్యంత తేలికగా స్కామర్ల చేతికి చేరుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. పలు అక్రమ వైబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ నంబర్లు, కార్డ్ హోల్డర్ పేర్లు, సీవీవీతో సహా వివరాలను స్కామర్లకు విక్రయిస్తున్నాయి. అదీ కూడా ఒక్కో కార్డు వివరాలు కేవలం 5 యూఎస్ డాలర్లు. అంటే రూ.410లకు మాత్రమే. పశ్చిమ దేశాలలో చెల్లింపులు ప్రాసెస్ చేయడానికి కార్డు వివరాలు ఉంటే సరిపోతుంది. ఓటీపీ అవసరం ఉండదు. అందుకే ఆయా దేశాల్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. కానీ భారత్లో వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) ద్వారా రెండు-కారకాల ప్రామాణీకరణ తప్పనిసరి. అయినప్పటికీ దీన్ని కూడా అధిగమించడానికి స్కామర్లు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఉన్నట్టుండి సిమ్ డీయాక్టివేట్ అయితే.. బాధితుల ఒరిజినల్ సిమ్ను డీయాక్టివేట్ చేయడం ద్వారా స్కామర్లు ఓటీపీని ఎలా యాక్సెస్ చేస్తున్నారో భారతీయ పోలీసు అధికారులను టైమ్స్ ఆఫ్ ఇండియా ఉటంకిస్తూ పేర్కొంది. హ్యాకర్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలను బాధితుడి పేరు, ఫోన్ నంబర్తో సహా షాడో వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా అమ్మకానికి పెడుతున్నారు. సైబర్ మోసగాళ్లు ఈ వివరాలను కొనుగోలు చేసి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదించి బాధితుల సిమ్ కార్డ్ డీయాక్టివేట్ చేయిస్తున్నారు. తర్వాత డూప్లికేట్ సిమ్ పొంది ఓటీపీలను సునాయాసంగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. నష్టం జరిగేంత వరకు బాధితుడి ఈ మోసం గురించి తెలియదు. కాబట్టి మీ సిమ్ కార్డ్ ఉన్నట్టుడి డీయాక్టివేట్ అయినట్లు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. కొన్ని నిమిషాల్లోనే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఈ వెబ్సైట్లను నిర్వహిస్తున్నదెవరు? నివేదిక ప్రకారం.. అక్రమ వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్లను రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన హ్యాకర్లు నిర్వహిస్తున్నట్లుగా తేలింది. వీళ్లు వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా కార్డ్ వివరాలను హ్యాక్ చేసి విక్రయిస్తున్నారు. సంపన్న పాశ్చాత్య దేశాలకు చెందిన వారి కార్డు వివరాలకు ఒక్కో కార్డుకు 10 డాలర్లు (రూ.820) చొప్పున తీసుకుంటుండగా భారత్ సహా ఆసియా దేశాలకు చెందిన బాధితుల కార్డుల వివరాలకు చవగ్గా కేవలం 5 డాలర్లు (రూ.410)కే అమ్మేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. 2022 జనవరిలో అటువంటి అక్రమ వెబ్సైట్ ఒకదానిని అధికారులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. కానీ అలాంటి అక్రమ వెబ్సైట్లు, టెలీగ్రామ్ చానెళ్లు లెక్కకు మించి పుట్టుకొస్తున్నాయి. ఇదీ చదవండి: ఇంటర్నెట్ షట్డౌన్: ఆరు నెలల్లో ఇన్ని వేల కోట్ల నష్టమా? -
50% డిస్కౌంట్: అన్లిమిటెడ్ స్టోర్స్లో ‘రెడ్ అలర్ట్ సేల్’
న్యూఢిల్లీ: వివిధ ఉత్పత్తులపై అత్యుత్తమ రాయితీలు, ఆఫర్లతో ‘రెడ్ అలర్ట్ సేల్’ ప్రారంభించినట్లు అన్లిమిటెడ్ స్టోర్స్ ప్రకటించింది. అన్ని బ్రాండెడ్ వస్త్రాలపై 50% ఫ్లాట్ ఆఫర్ అందిస్తుంది. అలాగే రూ. 3 వేల షాపింగ్పై అంతే విలువైన ఉత్పత్తులను ఉచితంగా పొందవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని అన్లిమిటెడ్ స్టోర్లలో ఈ ఆఫర్ జూలై రెండో తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్లంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కంపెనీ కోరింది. -
ఇకపై డాక్టర్ చీటీ లేకుండానే గర్భనిరోధక మాత్రలు.. ట్రైల్ సేల్స్కు అనుమతి!
జపాన్ ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇకపై దేశంలో డాక్టర్ చీటీ లేకుండానే గర్భనిరోధక మాత్రలు విక్రయించేందుకు అనుమతినిచ్చింది. అయితే ముందుగా వీటిని ట్రయల్ రూపంలో విక్రయించాలని నిర్ణయించింది. అత్యవసర గర్భనిరోధక మాత్రల విషయమై జపాన్లో చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ ఉన్న నియమం ఇదే.. జపాన్ ఆరోగ్యశాఖ తాజాగా అత్యవసర గర్భనిరోధక మాత్రలు ‘మార్నింగ్ ఆఫ్టర్ పిల్స్’ విక్రయాలకు అనుమతినిచ్చింది. ఇప్పటి వరకూ వీటిని కొనుగోలు చేయాలంటే పలు నిబంధనలు ఉన్నాయి. ఎవరైనా మహిళ, లేదా అత్యాచార బాధితురాలు ఈ మాత్రలను కొనుగోలు చేయాలంటే, తప్పనిసరిగా అందుకు సంబంధించిన డాక్టర్ చీటీ చూపించడం తప్పనిసరి. ఆరేళ్ల క్రితం రాజుకున్న వివాదం 2017లో ఎటువంటి డాక్టర్ చీటీ లేకుండా గర్భనిరోధర మాత్రలు విక్రయించడంపై వివాదం చెలరేగింది. ఈ నేపధ్యంలో జపాన్ ప్రభుత్వం కొద్దిపాటి సడలింపుతో డాక్టర్ చీటీ లేకుండా వీటి విక్రయాలకు అనుమతినిచ్చింది. అయితే ‘మార్నింగ్ ఆఫ్టర్ పిల్స్’ మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంచడం తగినది కాదనే వాదన కొందరిలో మొదలయ్యింది. దీనివలన సమస్యలు పెరుగుతాయిని వారు పేర్కొన్నారు. 90వ దశాబ్ధంలో సులభంగా లభ్యం 90వ దశాబ్ధంలో జపాన్లో గర్భనిరోధక మాత్రలు డాక్టర్ చీటీ లేకుండానే విక్రయించేవారు. అయితే పలు పరిశోధనల్లో అత్యవసర గర్భనిరోధక మాత్రలతో ముప్పు పొంచి ఉన్నదని వెల్లడయ్యింది. 46 వేల మంది వినతి మేరకు.. 2020 చివరిలో లింగసమానత్వానికి జాపాన్ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నేపధ్యంలో మరోమారు అత్యవసర గర్భనిరోధక మాత్రల విక్రయాలపై తిరిగి వాదనలు మొదలయ్యాయి. తాజాగా వీటి విక్రయాలపై ప్రభుత్వానికి 46,312 మంది సలహాలు, సూచనలు అందించారు. వీరిలో చాలామంది గర్భనిరోధక మాత్రలను ట్రయల్ రూపంలో విక్రయించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: పాపం పసివాడు:16 రోజులు కోమాలో ఉండి.. -
కొండను కొంటారా? అమ్మకానికి సిద్ధంగా ఉంది!
కొండను కొంటారా?! ఖాళీ స్థలాలను కొనుక్కుంటారు. చక్కని స్థలాల్లో నిర్మించిన ఇళ్లు, భవంతులు కొనుక్కుంటారు. అంతేగాని, కొండలు గుట్టలు కొనుక్కుంటారేమిటి? అయినా, వాటిని ఎవరైనా అమ్ముతారా అనుకుంటున్నారా? ఆశ్చర్యపోకండి! తాజాగా ఒక కొండ అమ్మకానికి సిద్ధంగా ఉంది. మన దేశంలో కాదులెండి. ఇంగ్లండ్లోని యార్క్షైర్ డేల్స్ నేషనల్ పార్క్లో ఉన్న 170 అడుగుల పొడవైన ‘కిల్న్సే క్రేగ్’ అనే కొండను ఇటీవల అమ్మనున్నట్లు ప్రకటించారు. దీని ధర 1.50 లక్షల పౌండ్లు (రూ.1.55 కోట్లు). యార్క్ డేల్స్లోని వార్ఫడేల్ ప్రాంతంలో సున్నపురాతితో ఏర్పడిన ఈ కొండ పర్యాటక ఆకర్షణగా పేరుపొందింది. చాలామంది పర్యాటకులు దీనిపైకెక్కి ఫొటోలు దిగుతుంటారు. దీని మీద నుంచి చుట్టుపక్కల కనిపించే దృశ్యాలను కెమెరాల్లో బంధిస్తుంటారు. ఈ కొండ సహా దీని చుట్టూ ఉన్న 18.76 ఎకరాల స్థలంలో ప్రభుత్వం వ్యవసాయ పర్యావరణ పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం దీన్ని ఆసక్తిగల ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయనున్నట్లు ప్రకటించింది. (చదవండి: ఆన్లైన్ ఆర్డర్లలో ఈ ఆర్డర్ వేరయా! రోజులు కాదు ఏకంగా నాలుగేళ్లు పట్టింది డెలివరీకి!) -
రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు
విలాసవంతమైన టవర్స్; లగ్జరీ భవనాలు, ఎత్తైన శిఖరాలకు పెట్టింది పేరైన దుబాయ్లో రియల్ ఎస్టేట్కున్న డిమాండ్ మామూలుది కాదు. వెర్సైల్స్ను తలపించే మార్బుల్ ప్యాలెస్ ధర వింటే షాక్వుతారు. మార్కెట్లో దీని ధర రూ. 1,600 కోట్లు (750 మిలియన్ దిర్హామ్ల) పలుకుతోంది. విలాసవంతమైన భవనాలు ఎక్కువగా ఉండే నగరంలో మార్కెట్లో అత్యంత ఖరీదైన ఇల్లు అమ్మకానికి వుంది. ఇలాంటి ఇంద్రభవనంపై మోజుపడుతున్నవారిలో భారతీయుడు ఉండటం విశేషం. మార్బుల్ ప్యాలెస్ అదిరిపోయే ఫీచర్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్లచే "మార్బుల్ ప్యాలెస్" గా పిలుస్తున్న ఈ భవనాన్ని అతి ఖరీదైన ఇటాలియన్ మార్బుల్ స్టోన్తో నిర్మించారు. Luxhabitat Sotheby's International Realty విక్రయిస్తున్న ఈ భవన నిర్మాణం దాదాపు 12 సంవత్సరాలు పట్టిందట. 60వేల చదరపు అడుగుల ఇంటిలో ఐదు బెడ్రూమ్లు ఉంటాయి. ఇందులో మాస్టర్ బెడ్రూమ్ 4,000 చదరపు అడుగులు ఒక పెద్ద భవనాన్ని మించిఅన్నమాట. (ఫేస్బుక్ మూత పడనుందా? కోర్టు సంచలన వ్యాఖ్యలు) ఇంకా 15-కార్ల గ్యారేజ్, 19 రెస్ట్రూమ్లు, ఇండోర్ అలాగే అవుట్డోర్ పూల్స్, రెండు రూఫ్లు, 80,000 లీటర్ (21,000 గాలన్లు) కోరల్ రీఫ్ అక్వేరియం, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఎమర్జెన్సీ రూమ్లు తదితర ఫీచర్లలో ఉన్నాయి. ఇది 70 వేల చదరపు అడుగుల స్థలంలో గోల్ఫ్ కోర్స్కి ఎదురుగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) ఈ ఆస్తిని ఎవరైనా కొనుక్కెవచ్చు లేదా అద్దెకు తీసుకోవచ్చు, లేదా టెన్నిస్ లేదా పాడెల్ బాల్ కోర్ట్ కోసం ఉపయోగించవచ్చు అంటున్నారు. బ్రోకర్ కునాల్ సింగ్. ఈయన అంచనా ప్రకారం, కేవలం ఐదు నుండి పది మంది సంపన్నులు దీన్ని కొనుగోలు చేయగలరు. అంతేకాదు గత మూడు వారాల్లో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఇంటిని చూశారు. ఇందులో రష్యాకు చెందిన కొనుగోలు ప్రతినిధి ఒకరు కాగా, రెండో కస్టమర్ ఎమిరేట్స్ హిల్స్లో ఇప్పటికే మూడు నివాసాలను కలిగి ఉన్న ఇండియన్ కావడం గమనార్హం. ఆయన భార్య ఇంకొంచెం మెరుగైన దాని కోసం చూస్తోందని అందుకే నిర్ణయం తీసుకోలేదని సింగ్ పేర్కొన్నాడు. -
పీనాసి ప్రియుడు: అరటి పండు తొక్కతీసి..
ప్రియురాలికి ఖరీదైన గిఫ్టులు ఇచ్చి ఆమెను ఇంప్రెస్ చేయాలని చాలామంది యువకులు తపన పడిపోతుంటారు. అయితే దీనికి భిన్నంగా ప్రవర్తించిన ఒక యువకునికి సంబంధించిన ఉదంతం ఇప్పుడు వైరల్గా మారింది. చాలామంది డబ్బులు ఆదా చేసేందుకు వివిధ పద్దతులను ఆశ్రయిస్తుంటారు. సాధారణంగా అరటిపండ్లను తొక్కతోనే విక్రయిస్తుంటారు. అయితే తూకానికి అరటి పండ్లను కొనుగోలు చేసినప్పుడు తొక్కతో పాటు బరువు చూస్తే.. అది కాస్త అధిక బరువు ఉంటుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఒక యువకుడు డబ్బులను ఆదా చేసేందుకు అరటి పండ్ల తొక్కలను తీసి, దానిలోని పండు భాగానికి తూకం వేసి, తన ప్రియురాలి కోసం కొనుగోలు చేశాడు. తన బాయ్ ఫ్రెండ్ పీనాసితనాన్ని అందరికీ చూపించేందుకు ఆ యువతి ఈ ఘటనను వీడియోలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో ఒక యువకుడు అరటిపండు తొక్కలను వేరుచేసి, తరువాత వాటి బరువును తూచడం కనిపిస్తుంది. ఇలా చేయడం వలన అరటి పండు బరువు తగ్గుతుందని, ఫలితంగా వాటి ఖరీదు కూడా తగ్గుతుందని అతని ఆలోచన. ఈ వీడియో చూసిన యూజర్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఒక యూజర్.. ‘మీరు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే జీవితాంతం రోదించేందుకు సిద్ధంగా ఉండండి’ అని రాయగా, మరొకరు ‘మీరు ఈ బాధల నుంచి బయపడండి. వెంటనే ఆ వ్యక్తి దూరంకండి’ అని రాశారు. ఇది కూడా చదవండి: వధువు పరారైనా ఆగని పెళ్లి.. తండ్రి చొరవకు అభినందనల వెల్లువ! -
సూపర్ ఆఫర్: ఐపోన్13పై ఏకంగా రూ. 36వేల డిస్కౌంట్
న్యూఢిల్లీ: ఫ్లిప్కార్ట్ ప్రకారం 'బెస్ట్ సెల్లర్' ఐఫోన్ 13పై దాదాపు 36వేల దాకా తగ్గింపుతో రూ.25,900కి వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్ 14 ను పోలిన స్పెసిఫికేషన్సే ఐఫోన 13లో కూడా ఉన్నాయి. 2021లో లాంచ్ అయినపుడు ఈ స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర రూ. 79,900. తాజాగా ఫ్లిప్కార్ట్లో రూ. 36,099 తగ్గింపు తర్వాత రూ. 25,900కి అందుబాటులో ఉంది. (తక్కువ ధరలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ధర ఎంతంటే?) ప్రస్తుతం రూ. 7,901 తగ్గింపుతో రూ. 61,999 వద్ద లిస్ట్ అయింది. అయితే కొనుగోలుదారులు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్పై 5శాతం క్యాష్బ్యాక్ పొందవచ్చు. రూ. 33 వేల దాకా ఎక్స్ఛేంజ్ ఆపర్ కూడా లభ్యం. ఈ ఆఫర్లన్నీ వర్తిస్తే యాపిల్ ఐఫోన్ 13 రూ. 25,900కే సొంతం చేసుకోవచ్చు. (మస్క్కు మరో ఝలక్: కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్బై) ఐఫోన్ 13 స్పెసిఫికేషన్స్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే A15 బయోనిక్ చిప్సెట్ 12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 12 ఎంపీ సెల్ఫీ కెమెరా 3227 ఎంఏహెచ్ బ్యాటరీ ఇదీ చదవండి: అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? -
అమెజాన్ సేల్.. 5జీ స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్.. సమ్మర్ ఆఫర్ గురూ!
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ 5జీ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మే 27 నుంచి మే 31 వరకు జరిగే ఈ సేల్లో 5జీ స్మార్ట్ఫోన్లు వన్ప్లస్, రియల్మీ, శాంసంగ్తో పాటు ఇతర బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. కొనుగోలు దారులు ఈ ప్రత్యేక సేల్లో రూ.1,666 నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ ృపొందవచ్చని వెల్లడించింది. అదనంగా, అమ్మకాలు జరిగే సమయంలో ఎక్ఛేంజ్ ఆఫర్లో రూ.10,000 వేల వరకు బోనస్ పొందవచ్చు. ప్రైమ్ మెంబర్ షిప్ యూజర్లకు 24 నెలల పాటు ఎంపిక చేసుకున్న ఫోన్లపై ఎలాంటి అదనపు ఛార్జీలు విధించబోమని ఓ ప్రకటనలో పేర్కొంది. ఐక్యూ 11 5జీ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2ప్రాసెసర్ అందుబాటులో ఉన్న ఐక్యూ 11 5జీ స్మార్ట్ ఫోన్పై రూ.5వేల వరకు ఎక్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. 9 నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. ఈ ఫోన్ 2కే ఈ6 అమోలెడ్ డిస్ప్లే, 1800 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. రెడ్మీ నోట్15 జీ రెడ్మీ నోట్12 5జీ కొనుగోలు దారులకు రూ.2,000 వరకు ఎక్ఛేంజ్ డిస్కౌంట్తో పాటు పలు బ్యాంక్లు అందించే ఆఫర్లు సైతం వినియోగించుకోవచ్చు. ఈ రెడ్మీ 5జీ ఫోన్ 120 హెచ్జెడ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4జనరేషన్ 1 5జీ ప్రాసెసర్, 48 ఎంపీ ఏఐ ట్రిపుల్ రేర్ కెమెరాతో వస్తుంది. షావోమీ 13 ప్రో షావోమీ 13 ప్రో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2, 4 ఎన్ఎం ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రూ.71,999 ఖరీదైన ఈ ఫోన్ను అమెజాన్, బ్యాంక్లు ఇచ్చే మొత్తం ఆఫర్లను కలుపుకొని ఎక్ఛేంజ్ డిస్కౌంట్ కింద రూ.10,000 తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్లో 6.73 అంగుళాల 2కే 120 హెచ్జెడ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, 4,820 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. వన్ప్లస్ 10 ప్రో 5జీ వన్ప్లస్ 10 ప్రో 5జీ ఫోన్ ధర రూ.55,499 కొనుగోలు చేయొచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్ఛేంజ్ బోనస్ కింద రూ.10,000 వరకు తగ్గింపు ఆఫర్ను సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు 9 నెలల పాటు నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. ఈ ఫోన్లో 48 ఎంపీ మెయిన్ కెమెరా, 50 ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8ఎంపీ టెలిఫోటో లెన్స్లు ఉన్నాయి. వన్ ప్లస్ 10 ఆర్ 5జీ వన్ ప్లస్ 10 ఆర్ 5జీ ధర రూ. 32,999గా ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న అమెజాన్ సేల్లో ఈ ఫోన్పై రూ. 3వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్తో పాటు 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ లభిస్తుంది. 50ఎంపీ మెయిన్ కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా ఫోన్ వెనుక భాగంలో ఉంది. శాంసంగ్ ఎం14 5జీ శాంసంగ్ ఎం14 5జీ 6.6 ఎఫ్హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 5ఎన్ఎం ప్రాసెసర్, 50ఎంపీ ట్రిపుల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అమెజాన్లో ఈ ఫోన్ రూ. 15,490 కి కొనుగోలు కొనుగోలు చేయొచ్చు. రూ. 500 ఎక్స్చేంజ్ ఆఫర్లతో పాటు బ్యాంక్లు అందించే ఆఫర్లు ఉన్నాయి . రియల్మీ నార్జో 50 5జీ రియల్మీ నార్జో 50 5జీ 6.6 అంగుళాల ఎఫ్హెచ్డీ ప్లస్ డిస్ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 810 5జీ, పవర్ ఫుల్ గేమింగ్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. బ్యాంక్ ఆఫర్లు, అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్తో 3,000 డిస్కౌంట్ లభిస్తుండగా.. రూ.14,249 కే కొనుగోలు చేయొచ్చు. చదవండి👉 అంతా బాగుంది అనుకునేలోపు యూట్యూబర్లకు ఊహించని షాక్! -
Realme 5th Anniversary Sale:స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ ఆఫర్స్
సాక్షి,ముంబై: రియల్మీ ఐదో వార్షికోత్సవ సేల్ను ప్రకటించింది. రియల్మే మార్కెట్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. రియల్మీ అఫీషియల్ వెబ్సైట్తో పాటు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ప్లాట్ఫామ్ల్లో కూడా ఈ యానివర్సరీ సేల్ సందర్భంగా రియల్మీ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్లు సహా , ఇతర రియల్మీ ప్రొడక్టులపై ప్రత్యేక ఆఫర్లు లభించనున్నాయి. మే 3 వరకు కస్టమర్లు భారీ ఆఫర్లను అందుకోవచ్చు. స్మార్ట్ఫోన్లు రియల్మీ జీటీ నియో 3టీ సుమారు రూ.8,000 డిస్కౌంట్తో రూ.19,999కే లభ్యం. ఫ్లాగ్షిప్ రియల్మీ జీటీ 2 ప్రో.. రూ.14వేల డిస్కౌంట్తో రూ.35,999కు లభిస్తోంది. ఈ సేల్లో రియల్మీ 10 ప్రో 5జీ, రియల్మీ 10 మొబైళ్లపై రూ.2,000 వరకు ఆఫర్ ఉంది. దీంతోపాటు రియల్మీ 9ఐ 5జీ, రియల్మీ సీ55, రియల్మీ సీ30 ,రియల్మీ సీ35, రియల్మీ జీటీ2, రియల్మీ 9 ప్రో+ 5జీ సహా మరిన్ని మొబైళ్లపై ఈ సేల్ సందర్భంగా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ల్యాప్టాప్స్: రియల్మీ బుక్ స్లిమ్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ ల్యాప్టాప్ డిస్కౌంట్తో ప్రస్తుతం రూ.47,999, రియల్మీ బుక్ స్లిమ్ ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్టాప్ రూ.32,999కు ఫ్లిప్కార్ట్ ఈ ఆఫర్లతో ల్యాప్టాప్లు లభ్యం. స్మార్ట్ టీవీలు రియల్మీ 32, 43 అంగుళాల 4కే యూహెచ్డీ టీవీలపై రూ.3,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. రియల్మీ స్మార్ట్ టీవీ నియో 32 ఇంచుల టీవీ రూ.1,000 డిస్కౌంట్తో రూ.11,999కే అందుబాటులో ఉంది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) It's your time to grab the leap-forward deals! Don't miss the chance to catch the 5th-anniversary bonanza at https://t.co/HrgDJTHBFX. Head straight to the website now! pic.twitter.com/pVaIJliwPU — realme (@realmeIndia) May 1, 2023 -
Infinix INBook Y1 Plus Neo రూ. 20వేలకే ల్యాప్ట్యాప్, ఎట్రాక్టివ్ ఫీచర్స్!
సాక్షి, ముంబై: బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు,స్మార్ట్ టీవీలు, ఇతర ఉత్పత్తులతో ఆకట్టుకున్నఇన్ఫినిక్స్ ఇపుడిక ల్యాప్టాప్ విభాగంలో క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా పోర్టబుల్ కంప్యూటర్ లాంటి సరికొత్త ల్యాప్టాప్ను ఆవిష్కరించింది. ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియో పేరుతో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. అల్యామినియమ్ అలాయ్ మెటల్ బాడీ, 15.6 ఇంచుల ఫుల్హెచ్డీ డిస్ప్లే, ఇంటెల్ సెలెరోన్ ఎన్5100 (Intel Celeron N5100) క్వాడ్కోర్ ప్రాసెసర్ లాంటి ఫీచర్లను ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియోలో అందించింది. ఈ ల్యాప్టాప్ ఫస్ట్ సేల్లో లాంచింగ్ ధరను ఆఫర్ చేస్తోంది. (బీ అలర్ట్: మంటల్లో టాటా నెక్సాన్ ఈవీ, కంపెనీ స్పందన ఏంటంటే?) ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియో స్పెసిఫికేషన్లు 15.6 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ సెలెరోన్ ఎన్5100 క్వాడ్కోర్ బడ్జెట్ ప్రాసెసర్, 260 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ఇంటెల్ యూహెచ్డీ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో,డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, రెండు యూఎస్బీ పోర్టులు, ఓ హెచ్డీఎంఐ పోర్టు, రెండు యూఎస్బీ టైప్-సీ పోర్టులు, ఓ మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్, 3.5mm హెడ్ఫోన్ జాక్,బ్యాక్లిట్ కీబోర్డ్ ,యాంటీ-గ్లేర్ గ్లాస్ టచ్ప్యాడ్ లాంటి ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. ఈ ల్యాప్టాప్ బరువు 1.76 కేజీలుగా ఉంది. (layoffs: షాకిచ్చిన ఇండియన్ ట్విటర్, 30 శాతం మందికి గుడ్ బై?) 2 మెగాపిక్సెల్ ఫుల్ హెచ్డీ వెబ్క్యామ్ , 2 వాట్ల సౌండ్ ఔట్పుట్ ఇచ్చే స్పీకర్లు, 40Wh బ్యాటరీ45 వాట్ల పీడీ టైప్-సీ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ 75 శాతం చార్జ్ అవుతుందని ఇన్ఫినిక్స్ వెల్లడించింది. ఇక ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ ల్యాప్టాప్ 7 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ ఇస్తుంది. ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియో ధర, సేల్ 8 జీబీ ర్యామ్, 256 జీబీఎస్ఎస్డీ స్టోరేజ్ వేరియంట్ ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియో ల్యాప్టాప్ ధర రూ.20,990గా ఉంది.అలాగే 8 జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.22,990లు. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ ద్వారా ఈనెల 26వ తేదీ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. సిల్వర్, బ్లూ, గ్రే కలర్ ఆప్షన్లలో లభ్యం. -
అమెజాన్లో ఆగని ఆఫర్లు.. ఈ వస్తువులపై ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్!
Amazon Blockbuster Value Days Sale: మీరు ఓ కంపెనీకి చెందిన బ్రాండెడ్ టీవీ కొనాలనుకుంటున్నారు? అయితే ఆ టీవీ డిస్కౌంట్కే వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. అందుకోసం ఏయే ఈ - కామర్స్ సంస్థలు టీవీలపై డిస్కౌంట్లు ఇస్తున్నాయోనని అని ఎదురు చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ‘బ్లాక్బ్లస్టర్ వ్యాల్యూ డేస్’ సేల్ను ప్రారంభించింది. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 17 వరకు ప్రత్యేకంగా సేల్ నిర్వహించ నుంది. ఈ సేల్లో పలు ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. అంతేకాదు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్పై జరిపే కొనుగోళ్లు, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై 10 శాతం ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ సైతం అందిస్తుంది. (పనిమనుషులకు హెలికాప్టర్లో ఐలాండ్ ట్రిప్, వైరల్ వీడియో) ఇక ఈ ప్రత్యేకమైన సేల్లో 32 అంగుళాల స్మార్ట్ టీవీలపై 50 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ‘4కే, ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ’ టీవీలపై 60 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ఏడాది పాటు నో - కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. (క్రెడిట్కార్డు వాడుతున్నారా? ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..గుదిబండే!) వన్ ప్లస్, ఎల్జీ, సోనీతో పాటు ఇతర టీవీ ఉత్పత్తులపై 70శాతం డిస్కౌంట్కే సొంతం చేసుకోవచ్చు. వన్ ప్లస్, రెడ్మీ, శాంసంగ్తో పాటు ఇతర గేమింగ్ డివైజ్లపై 25శాతం, గేమ్ టైటిల్స్పై 50 శాతం డిస్కౌంట్లు పొందవచ్చు. అమెజాన్ ఉత్పత్తులైన ప్లే స్టేషన్ డివైజ్లపై 70 శాతం తగ్గింపుకే సొంతం చేసుకోవచ్చు. ఫోన్లపై డిస్కౌంట్లు బ్యాంక్ ఆఫర్లతో పాటు ధరల విభాగాలలో ప్రసిద్ధ మోడళ్లపై తగ్గింపు ధరలకే అమెజాన్ విక్రయిస్తుంది. విక్రయ సమయంలో, ఫ్యాషన్, గృహోపకరణాలు, కిచెన్లో వినియోగించే వస్తువులు ఇలా ఇతర విభాగాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఉండనున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 ఊహించని ఎదురు దెబ్బ..చిక్కుల్లో వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డే! -
రూ.10వేలయాపిల్ ఎయిర్పాడ్స్ రూ. 549కే: చెక్ యువర్ లక్!
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న యాపిల్ కంపెనీకి చెందిన ఎయిర్పాడ్స్ కొనుగోలు చేయాలనుకుంటే.. ఫ్లిప్కార్ట్ సేల్పై ఓ లుక్కేయాల్సిందే. తాజా ఫ్లిప్కార్ట్ సేల్లో యాపిల్ ఎయిర్ పాడ్లు కేవలం రూ. 549కి అందుబాటులో ఉన్నాయి. Apple AirPod (2nd Gen) లు కంపెనీ అధికారిక ఆన్లైన్ స్టోర్లో రూ. 9,999కి రీటైల్ చేస్తుండగా ఫ్లిప్కార్ట్ సేల్లో కేవలం రూ. 549కే సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలుకు, పాత స్మార్ట్ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నట్టే, ఫ్లిప్కార్ట్సేల్లో ఇయర్బడ్స్ కొనుగోలు చేయాలంటే పాతస్మార్ట్ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే సరిపోతుంది. తద్వారా నిబంధనల మేరకు రూ. 9,450 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో సుమారు పది వేల రూపాయల యాపిల్ ఇయర్ బడ్స్ను రూ.549కి సొంతం చేసుకోవచ్చు. (దిగుమతులు: పసిడి వెలవెల, వెండి వెలుగులు) -
రోజుకు కేవలం రూ.73: యాపిల్ ఐఫోన్ 12మినీ మీ సొంతం!
సాక్షి, ముంబై: ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్, ముచ్చటైన యాపిల్ ఐఫోన్ 12 మినీ సొంతం చేసుకోవాలనేకునే కస్టమర్లకు గుడ్ న్యూస్. ఫ్లిప్కార్ట్ సేల్లో డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ కూడా ఉంది. అంతేకాదు ఈఎంఐ ఆప్షన్ ద్వారా రోజుకు కేవలం 73 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అదెలా అంటారా? (సల్మాన్ బ్రాండ్ న్యూ బుల్లెట్ ప్రూఫ్ కార్: ఇంటర్నెట్లో వీడియో హల్చల్) ఐఫోన్ 12 మినీ ప్రారంభ ధర రూ. 69,900, అయితే ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో రూ. 5,901 తగ్గింపు తర్వాత యాపిల్ ఐఫోన్ 12 మినీ రూ.53,999గా ఉంది. దీనికి అదనంగా, హెచ్డీఎఫ్సీ డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై బ్యాంక్లో రూ. 2,000 తగ్గింపును పొందవచ్చు. దీంతో ధర రూ.51,999 దిగి వచ్చింది. కొనుగోలుదారులు 24 నెలల వరకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ కార్డ్పై నో కాస్ట్ EMIని పొందవచ్చు.ఐఫోన్ 12 మినీ కోసం నెలకు కేవలం రూ. 2250 చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం రోజుకు కేవలం రూ.73 అన్నమాట. (గుడ్ న్యూస్: యథాతథంగా కీలక వడ్డీరేట్లు) Apple iPhone 12, Apple iPhone 12 Pro, Apple iPhone 12 Pro Maxతో పాటు 2020లో లాంచ్ చేసింది యాపిల్.దీన్ని యాపిల్ అమ్మకాలను నిలిపివేసినా , ఫ్లిప్కార్ట్, ఇదితర ఈకామర్స్ ప్లాట్ఫారమ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. యాపిల్ ఐఫోన్ 12 మినీ: 5.4-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే, A14 బయోనిక్ చిప్, 12ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. -
ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్: ఐఫోన్ 14 పై రూ. 44వేల భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: యాపిల్ ఐఫోన్ 14పై భారీ తగ్గింపు లభిస్తోంది.ఈ రోజు (మార్చి 31) ప్రారంభమయ్యే ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్లో అనేక ఉత్పత్తులపై స్మార్ట్డీల్స్ అందిస్తోంది. ముఖ్యంగా ఖరీదైన ఐఫోన్ 14 స్మార్ట్ఫోన్ను సొంతం చేసుకోవాలనుకుంటున్న వారికి బంపర్ ఆఫర్. దాదాపు రూ. 44,901 తగ్గింపు తర్వాత కేవలం రూ. 34,999కి అందుబాటులో ఉంది. (సంక్షోభ సమయంలో హెచ్సీఎల్ టెక్ గుడ్న్యూస్) మార్చి 31 నుండి ఏప్రిల్ 3 వరకు జరిగే బిగ్ బచత్ ధమాల్ సేల్ సందర్భంగా ఫ్లిప్కార్ట్ మొబైల్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో రూ.10,901 తగ్గింపుతో రూ.68,999కి విక్రయిస్తోంది. దీంతోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.4000 తక్షణ తగ్గింపు, స్మార్ట్ఫోన్ ఎక్స్చేంజ్లో రూ. 30,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అలా రూ. 44,901 తగ్గింపు తర్వాత యాపిల్ 14 ఫ్లిప్కార్ట్లో రూ. 34,999కి లభించనుంది. (ఇదీ చదవండి: హయ్యస్ట్ సాలరీతో మైక్రోసాఫ్ట్లో జాబ్ కొట్టేసిన అవని మల్హోత్రా) యాపిల్ ఐఫోన్ 14లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే 12 ఎంపీ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా,12 ఎంపీ సెల్ఫీ కెమెరా లాంటి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (అచ్చం యాపిల్ స్మార్ట్వాచ్ అల్ట్రాలానే : ధర మాత్రం రూ. 1999లే!) -
లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు!
న్యూఢిల్లీ: లగ్జరీ అపార్టుమెంట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.దేశీయ అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్ దూసుకుపోతోంది. తాజాగా మూడు రోజుల్లో రూ. 8వేల కోట్లకుపైగా విలువైన లగ్జరీ ఫ్లాట్లను విక్రయించింది. లాంచింగ్ ముందే వీటిని విక్రయించడం విశేషం. (రిలయన్స్ అధినేత అంబానీ కళ్లు చెదిరే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్) ప్రీ-ఫార్మల్ లాంచ్ సేల్స్లో భాగంగా గురుగ్రామ్లోని సెక్టార్ 63లో గోల్ఫ్ కోర్స్ ఎక్స్టెన్షన్ వద్ద నిర్మించిన ‘ది అర్బర్’ డీఎల్ఎఫ్ ప్రాజెక్ట్ ఈ ఫీట్ సాధించింది. లాంచింగ్కు మూడు రోజుల ముందుగానే పూర్తి సేల్స్ను నమోదు చేసింది. 25 ఎకరాల్లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్లో ఐదు టవర్లు, 38/39 అంతస్తులున్నాయి. ఇందులో 4 BHK 1137 ఫ్లాట్స్ ఉన్నాయి. వీటి ధరలు యూనిట్కు రూ. 7 కోట్ల నుండి ప్రారంభం. (‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!) తమ ప్రాజెక్ట్కు అద్భతమైన స్పందన లభించిందనీ, డీఎల్ఎఫ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాష్ ఓహ్రి సంతోషం ప్రకటించారు. లగ్జరీ గృహాలు, జీవనశైలి సౌకర్యాలకు పెరుగుతున్న ఆదరణకు ఇది సంకేతమన్నారు. 75 ఏళ్లుగా కస్టమర్ల ఆకాంక్షలకనుగుణంగా శ్రద్ధ, నిబద్ధతతో అందిస్తున్న సేవలు, కొనుగోలుదారుల విశ్వాసం నేపథ్యంలో ప్రాజెక్ట్ కోసం అధిక స్పందన లభిస్తోందన్నారు. ముఖ్యంగా, 95 శాతం మంది కొనుగోలు దారులు తమ తుది వినియోగం కోసం కొనుగోలు చేశారన్నారు.గురుగ్రామ్లో అర్బర్ నిస్సందేహంగా తమకొక మైలురాయి లాంటిదన్నారు. -
అమ్మకానికి హెచ్ఎండీఏ భూములు.. ప్లాట్ల ఆన్లైన్ వేలం ఎప్పుడంటే?
సాక్షి, సిటీబ్యూరో: నగర శివారు ప్రాంతాల్లోని హెచ్ఎండీఏ స్థలాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. అందుబాటు ధరల్లో ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎమ్మెస్టీసీ ఈ వేలం ప్రక్రియను నిర్వహించనుంది. మధ్యతరగతి ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్లు ఈ ల్యాండ్ పార్సిళ్లను కొనుగోలు చేసేందుకు అనుగుణంగా స్థలాల విస్తీర్ణం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఔటర్రింగ్ రోడ్డుకు దగ్గరలో 39 ల్యాండ్ పార్సిళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 6 ప్లాట్లు, సంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్ పార్సిళ్లు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఈ స్థలాల వివరాలను కేఎంఎల్ ఫైల్ ద్వారా చూసుకునే సదుపాయం ఉంది. 121 నుంచి 10,164 గజాల వరకు ఈ స్థలాలు ఉన్నాయి. గండిపేట వద్ద 3 ప్లాట్లు, శేరిలింగంపల్లిలో 5, ఇబ్రహీంపట్నంలో 2 ప్లాట్లు, అమ్మకానికి ఉన్నాయి. మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లిలో 4, ఘట్కేసర్లో 1, బాచుపల్లిలో 1 చొప్పున ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో 16, ఆర్సీపురంలో 6 ప్లాట్లు, జిన్నారంలో ఒకటి చొప్పున స్థలాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఆన్లైన్ వేలం.. 39 స్థలాలను వచ్చే నెల మార్చి 1న ఎమ్మెస్టీసీ ఆధ్వర్యంలో ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా క్లియర్ టైటిల్ కలిగిన ఈ స్థలాలను కొనుగోలు చేసిన వారు సత్వరమే భవన నిర్మాణ అనుమతులు పొందేందుకు అవకాశం ఉంది. ఆన్లైన్ వేలంలో పాల్గొనడానికి వీలుగా ఈ నెల 27న సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెస్టీసీలో నమోదు చేసుకోవాలి. ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 28న సాయంత్రం 5 గంటలలోపు నిర్దేశించిన ఈఎండీ (ధరావత్తు) రుసుమును చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నెల 21న రంగారెడ్డి జిల్లా పరిధిలోని స్థలాలకు శేరిలింగంపల్లి జోనల్ ఆఫీసులో, 22వ తేదీన సంగారెడ్డి జిల్లాలోని స్థలాలకు ఆర్సీపురంలోని లక్ష్మీ గార్డెన్స్లో 23న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్థలాలపై ఉప్పల్ సర్కిల్ ఆఫీసులో ప్రీ బిడ్ సమావేశాలను నిర్వహించనున్నారు. చదవండి: ధర తక్కువ.. డిమాండ్ ఎక్కువ..హైదరాబాద్లో మాకు ఆ ఏరియాలోనే ఇల్లు కావాలి! -
కరీబియన్ దీవి కారుచౌక
ఫొటోలో కనిపిస్తున్నది కరీబియన్ సముద్రంలోని దీవి. దక్షిణ అమెరికా దేశం నికరగ్వా తీరానికి ఆవల పన్నెండు మైళ్ల దూరంలో ఉందిది. చుట్టూ నీలి కడలి, నడి మధ్యన పచ్చదనంతో అలరారే ఈ ప్రైవేటు దీవి పేరు ‘ఇగ్వానా దీవి’. ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దీవిలో అధునాతన సౌకర్యాలు చాలానే ఉన్నాయి. ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తున ఉన్న అబ్జర్వేటరీ టవర్తో కూడిన ఒక మూడు పడకగదుల ఇల్లు, దీవి పడమటి వైపున చక్కని ఈతకొలను, వైఫై, మొబైల్, టీవీ తదితర సౌకర్యాలు, చుట్టూ ఎటుచూసినా పచ్చని అరటి, కొబ్బరిచెట్లతో ఉన్న ఈ దీవి ప్రస్తుతం అమ్మకానికి సిద్ధంగా ఉంది. దీని ధర 3.76 లక్షల పౌండ్లు మాత్రమే! లండన్ నగరంలోని ఒక సామాన్యమైన ఫ్లాట్ ధర కంటే ఇది చాలా చౌక. దీనిని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి మరి! -
ఎయిర్ షో సందర్భంగా నాన్వెజ్ అమ్మకాలు బంద్!
ఏరో ఇండియా షో సందర్భంగా బెంగళూరులో నాన్వెజ్ అమ్మకాలను నిషేధించారు. ఈ మేరకు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 20 వరకు మాంసం దుకాణాలు, మాంసాహార హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాలని బెంగళూరు పౌర సంస్థ ఆదేశించింది. అంతేగాదు యలహాంక ఎయిర్ఫోర్స్ స్టేషన్కు సుమారు 10 కిలోమీటర్లు పరిధిలో మాంసాహార వంటకాలు అందించడం, అమ్మడంపై నిషేధం ఉంటుందని బృహత్ మహానగర పాలికే(బీబీఎంపీ) తన పబ్లిక్ నోటీసులో పేర్కొంది. ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు ఏరో ఇండియా షో నిర్వహించనున్నారు. దీన్ని ఉల్లంఘిస్తే బీబీఎంపీ చట్టం 2020 తోపాటు ఇండియన్ ఎయిర్ క్రాప్ట్ రూల్ ప్రకరాం శిక్షార్హులని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో నాన్వెజ్ ఫుడ్ చాలా స్కావెంజర్ పక్షులను ఆకర్షిస్తోందని, మరీ ముఖ్యంగా గాలి పటాలు ఎయిర్ ప్రమాదాలకు కారణమని తెలిపింది. ఈ ఎయిర్ షో కోసం దాదాపు 731 మంది ఎగ్జిబిటర్లు, 633 మంది భారతీయులు, 98 మంది విదేశీయులు నమోదు చేసుకున్నట్లు ఏరో ఇండియా తన వెబ్సైట్లో పేర్కొంది. ఏరో ఇండియా 1996 నుంచి బెంగళూరులో ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఏరోస్పేస్ ఎగ్జిబిషన్లను విజయవంతంగా 13 సార్లు నిర్వహించి తనకంటూ ఒక ప్రత్యేక సముచిత స్థానాన్నిసంపాదించుకుంది. (చదవండి: ప్యాసింజర్లను ఎక్కించుకోని టేకాఫ్ ఘటన: ఎయిర్లైన్కు భారీ పెనాల్టీ) -
పాక్ ఆర్థిక కష్టాలు.. అమ్మకానికి అమెరికాలోని ఎంబసీ ఆస్తులు
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది పాకిస్థాన్. చేసిన అప్పులు తీర్చేందుకు, ఉద్యోగులకు జీతాలు సైతం ఇచ్చేందుకు ఇబ్బందులు పడుతూ ఆస్తులు అమ్ముకుంటోంది. తమకు సాయం చేయాలని అంతర్జాతీయ సంస్థలతో పాటు వివిధ దేశాలను వేడుకుంటోంది. ఈ క్రమంలోనే అమెరికాలోని ఎంబసీ ఆస్తులను అమ్మకానికి పెట్టింది. వాషింగ్టన్లోని పాత ఎంబసీ బిల్డింగ్ను అమ్మకానికి పెట్టగా కొనుగోలు చేసేందుకు మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు పాకిస్థాన్ స్థానిక మీడియా వెల్లడించింది. భారత సంస్థ బిడ్.. వాషింగ్టన్లోని పాక్ ఎంబసీ భవనాన్ని కొనుగోలు చేసేందుకు అత్యధికంగా 6.8 మిలియన్ డాలర్లకు జువిష్ సంస్థ బిడ్ దాఖలు చేసింది. ఆ భవనం స్థానంలో ప్రార్థనా మందిరం నిర్మించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత రెండోస్థానంలో భారత్కు చెందిన ఓ రియాల్టీ సంస్థ బిడ్ వేసింది. 5 మిలియన్ డాలర్లకు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చింది. అలాగే.. పాకిస్థాన్కు చెందిన రియాల్టీ సంస్థ 4 మిలియన్ డాలర్లకు కోట్ చేసినట్లు పాక్ డాన్ పత్రిక వెల్లడించింది. మరోవైపు.. ప్రైవేటీకరణపై ఏర్పడిన పాకిస్థాన్ కేబినెట్ కమిటీ ఆర్థిక మంత్రి ఇషాక్ డార్ నేతృత్వం సోమవారం భేటీ అయింది. న్యూయార్క్లోని రూసెవెల్త్ హోటల్ సైట్ను లీజుకు ఇచ్చేందుకు ఫైనాన్షియల్ అడ్వైజర్ను నియమించాలని ప్రైవేటీకరణ కమిషన్కు సూచించినట్లు డాన్ పత్రిక తెలిపింది. పాకిస్థాన్కు వాషింగ్టన్లో రెండు ప్రాంతాల్లో రాయబార కార్యాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి పాతది కాగా మరొకటి కొత్తది. ఆర్ స్ట్రీట్లో ఉన్న భవనాన్ని 1956లో కొనుగోలు చేశారు. 2000 వరకు అందులో కార్యకలాపాలు సాగాయి. పాత భవనాన్ని అలాగే అమ్మేయాలా? లేక పునరుద్ధరణ పనులు చేయించి విక్రయించాలా? అనే అంశంపై ఎంబసీ అధికారులు చర్చిస్తున్నట్లు పాక్ పత్రిక పేర్కొంది. ఇదీ చదవండి: ‘ఏ దోస్త్ మేమున్నాం’.. పాకిస్థాన్కు జిన్పింగ్ భరోసా