-
ఈ వారం భారత్లో విడుదలైన కొత్త బైకులు ఇవే!
పండుగ సీజన్ తరువాత కూడా భారతీయ మార్కెట్లో కొత్త బైకులు విడుదలవుతూనే ఉన్నాయి. బెంగళూరుకు చెందిన కంపెనీ ఓ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయగా, చెన్నైకు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ రెండు కొత్త బైకులను లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ బైక్స్ ధరలు, ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాయల్ ఎన్ఫీల్డ్ షాట్గన్ 650 దేశీయ బైక్ తయారీ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల 650 సీసీ విభాగంలో ఓ స్టైలిష్ బైక్ లాంచ్ చేసింది. రూ. 4.25 లక్షల ధర వద్ద లభించే ఈ బైక్ కేవలం 25 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. 648 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ మంచి మీటియోర్ లాంటి డిజైన్ కలిగి 47 హార్స్ పవర్, 52.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుందని తెలుస్తోంది. 2024 హిమాలయన్ భారతదేశంలో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఇప్పుడు సరోకొత్త మోడల్గా మార్కెట్లో విడుదలైంది. ఈ లేటెస్ట్ బైక్ ధరలు రూ.2.69 లక్షల నుంచి రూ.2.79 లక్షల మధ్య ఉంటాయి. ఈ ధరలు 2023 డిసెంబర్ 31 వరకు మాత్రమే చెల్లిబాటు అవుతాయి. ఆ తరువాత ధరలు పెరిగే అవకాశం ఉంది. 2024 హిమాలయన్ లిక్విడ్ కూల్డ్, 452 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి 40 హార్స్ పవర్ మరియు 40 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్తో 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. కాబట్టి అద్భుతమైన పర్ఫామెన్స్ చూడవచ్చు. ఇదీ చదవండి: నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తున్న అందగత్తె.. కానీ ఈమె.. ఓర్క్సా మాంటిస్ ఎలక్ట్రిక్ బైక్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ 'ఓర్క్సా ఎనర్జీ' (Orxa Energy).. దేశీయ విఫణిలో 'మాంటీస్ ఎలక్ట్రిక్' (Mantis Electric) బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.6 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). కేవలం ఒకే వేరియంట్లో లభించే ఈ బైక్ 1.3 కిలోవాట్ ఛార్జర్ పొందుతుంది. కేవలం 8.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ బైక్ ఒక ఫుల్ ఛార్జ్తో 221 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. అల్ట్రావయోలెట్ ఎలక్ట్రిక్ బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉండే 'మాంటీస్ ఎలక్ట్రిక్' 182 కేజీల బరువును కలిగి అద్భుతమైన పనితీరుని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ బైక్ లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వినియోగదారులకు ఉత్తమ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుందని సంస్థ తెలిపింది. -
బుల్లెట్ నడిపిన సీఎం ఖట్టర్
చంఢీగర్: ఎలాంటి భద్రత లేకుండా బైక్ రైడ్ చేశారు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై సీఎం ముందు వెళుతుండగా.. భద్రతా సిబ్బంది, అధికారులు ఆయనను అనుసరించారు. కర్నాల్ ఎయిర్పోర్టు వరకు బైక్ ప్రయాణం చేశారు. హరియాణాలో 'కార్ ఫ్రీ డే' సందర్భంగా సీఎం బైక్ ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ను తగ్గించే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. వారంలో ఓ రోజు కార్లను ఉపయోగించకుండా ప్రజలను ప్రోత్సహించే సంకల్పంతో బైక్ రైడ్ నిర్వహించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్(ఎక్స్) ఖాతాలో తెలిపారు. తన సొంత నియోజకవర్గమైన కర్నాల్లో ఈ ర్యాలీ చేపట్టారు. "कार फ्री डे" हो या "नशामुक्त हरियाणा" बनाने का संकल्प हो बिना जनसहयोग के पूरा नहीं हो सकता! “कार फ्री डे” पर करनाल एयरपोर्ट तक की यात्रा बाइक द्वारा करके, आज के दिन कार ट्रैफिक कम करने का एक छोटा सा प्रयास मेरा भी रहा। मुझे आशा है कि प्रदेश के जागरूक लोग इस सन्देश को आगे… pic.twitter.com/a5DQeDn1ky — Manohar Lal (@mlkhattar) September 26, 2023 ఇదీ చదవండి: బీజేపీ నేతపై లుక్అవుట్ నోటీసులు -
మీరెప్పుడూ చూడని గ్రేట్ ఖలీ రైడింగ్ వీడియో.. ఓ లుక్కేసుకోండి!
Khali Royal Enfield Riding: బాక్సింగ్ గురించి తెలిసినవారికి ప్రత్యేకంగా 'గ్రేట్ ఖలీ' (Great Khali) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రెజ్లింగ్ అరేనాలో పాల్గొన్న భారతీయ ప్రముఖులలో ఒకరిగా నిలిచిన ఈయన రిటైర్ అయిన తరువాత ఇండియాకి తిరిగి వచ్చేసాడు. అప్పటి నుంచి కొన్ని టీవీ యాడ్స్లో నటించడం, 2015లో పంజాబ్లో కాంటినెంటల్ రెజ్లింగ్ స్కూల్ ప్రారంభించడం వంటివి చేసి కాలం గడుపుతున్నారు. ఇటీవల ఖలీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్ వేదికగా విడుదలైన ఒక వీడియోలో ఖలీ 'రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్' నడపడం చూడవచ్చు. ఈ సంఘటన చూడటానికి బొమ్మ బైకుపై ఆజానుబాహుడున్నట్లు అనిపిస్తుంది. ఈ వీడియోకు ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. అత్యంత బరువైన బైకుల్లో ఒకటైన బుల్లెట్ ఖలీ ముందు చిన్న బైకుగా మారిపోయింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే లక్షల మంది దీనిని లైక్ చేశారు. కొంత మంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఖలీ బైకుని రైడ్ చేస్తూ కనిపించడం ఇదే మొదటిసారి కాదు, గతంలో ఇంటర్సెప్టర్ 650, బుల్లెట్, హీరో స్ప్లెండర్, బజాజ్ పల్సర్ వంటి వాటిని రైడ్ చేస్తూ కూడా కనిపించాడు. ఇదీ చదవండి: ఏం ఐడియా గురూ! డ్రైవర్ క్రియేటివిటీకి ఫిదా అవుతున్న ప్యాసింజర్లు.. నిజానికి ఖలీ ఎత్తు 7 అడుగుల కంటే ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఏ బైకైనా అతని పరిణామంతో పోలిస్తే మరగుజ్జు మాదిరిగా కనిపిస్తుంది. బైకులు మాత్రమే కాకుండా ఆయన వద్ద టయోటా ఫార్చ్యూనర్, టయోటా గ్లాంజా వంటి కార్లను కలిగి ఉన్నప్పటికీ.. అతని పరిమాణానికి అనుకూలంగా కస్టమైజ్ చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by The Great Khali (@thegreatkhali) -
ర్యాపిడో డ్రైవర్ రాయల్ ఎన్ఫీల్డ్పై రావడమేంటి?.. బుక్ చేసిన టెకీకి వింత అనుభవం!
బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ ర్యాపిడోలో రైడ్ బుక్ చేశాడు. కొంతసేపటికి ర్యాపిడో డ్రైవర్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ మోటార్సైకిల్పై రావడంతో ఆ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఎంతో ఆనందపడిపోయాడు. అయితే అతని ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆ ర్యాపిడో డ్రైవర్ గురించి తెలుసుకున్న అతను కంగుతిన్నాడు. నిషిత్ పటేల్ తన ర్యాపిడో రైడ్ అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కుబెర్నెట్స్ మీట్అప్కు వెళ్లేందుకు అతను ర్యాపిడో రైడ్ బుక్ చేశాడు. ఆ సమయంలో తనకు ఎదురైన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నాడు. ఆ ర్యాపిడో డ్రైవర్ హై ఎండ్ మోటార్ సైకిల్పై రావడంతోపాటు, అతనొక నూతన టెక్నాలజీని రూపొందించే ఇంజినీర్ అని తెలిసేరికి అతను కంగుతిన్నాడు. పైగా అతను తాను పనిచేస్తున్న కుబెర్నెట్స్ క్లస్టర్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించే కంపెనీలో పనిచేస్తుంటాడని తెలిసే సరికి నిషిత్ పటేల్ షాకయ్యాడు. ఈ పోస్టుకు 6 వేలకు పైగా వ్యూస్ దక్కడంతో పాటు యూజర్స్ నుంచి లెక్కకుమించిన కామెంట్స్ వస్తున్నాయి. ఒక యూజర్ ‘మీరు అతని సైడ్ బిజినెస్ టర్నోవర్ ఎంతో అడగాల్సింది’ అని నిషిత్ను అడగగా, ‘అవును ఆ తరువాత నా మదిలో అదే ప్రశ్న వచ్చిందని’ నిషిత్ తెలిపారు. మరో యూజర్ ‘అయితే ఏమైంది? అహ్మదాబాద్లో ఉన్నత విద్యాధికులు ఎన్నో ఏళ్లుగా ఓలా, ఉబర్, ర్యాపిడోలను నడుపుతున్నారు’ అని కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: పురావస్తు తవ్వకాల్లో విచిత్ర అద్దం.. అది అట్టాంటి ఇట్టాంటిది కాదట! You won't believe the crazy @peakbengaluru moment I had today! On my way to a Kubernetes meetup, my Rapido captain pulled up on a Royal Enfield Hunter. Turns out he's a DevOps engineer at a company managing enterprise Kubernetes clusters. Just another day in India's tech capital — Nishit Patel (@nishit130) August 5, 2023 -
‘థాంక్యూ మోదీజీ’.. కశ్మీర్ యువతి బైక్ రైడ్ వీడియో వైరల్
శ్రీనగర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ కశ్మీర్ అంశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆర్టికల్ 370ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కశ్మీర్లో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమని మోదీ సర్కార్ స్పష్టం చేస్తూ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక, ఆర్టికల్ రద్దు అనంతరం, జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక, కశ్మీర్లో ఆర్టికల్ 370, 35A రద్దు తర్వాత శ్రీనగర్లో తమకు ఎంతటి ఆహ్లాదకర పరిస్థితులు ఉన్నాయో ఓ యువతి ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చింది. దీంతో, ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వివరాల ప్రకారం.. శ్రీనగర్లో ఓ యువతి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతూ రోడ్లపై ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె ‘ఈరోజు నేను గర్వంగా చెప్పాలనుకుంటున్నాను.. నా కశ్మీర్ అబ్బాయిలకే కాదు.. మనలో కూడా చాలా మారిపోయింది. 370, 35A రద్దుకు ముందు ఇది సాధ్యం కాలేదు. భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేసింది. ఇక, ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Today I proudly wanna to say that my #Kashmir has changed a lot not only for the boys but also for Us. It was not possible before abrogation of 370 & 35A. Thank you GOI. pic.twitter.com/5zU9vgUAoL — Nusrat Fatima (@knusrata) August 4, 2023 మరోవైపు.. ఈ వీడియోపై కశ్మీర్ యువకులు స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వీడియోను పోలీసులకు షేర్ చేస్తూ అబ్బాయిలకే ట్రాఫిక్ రూల్స్ వర్తిస్తాయా? అమ్మాయిలకు వర్తించవా? అని ప్రశ్నించారు. దీంతో, పోలీసులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు జరిమానా విధించినట్టు స్పష్టం చేశారు. Action taken under relevant sections of MV Act. Violator also counseled not to repeat such acts. pic.twitter.com/To30U8FaiB — Traffic City Srinagar. (@SSPTFCSGR) August 4, 2023 ఇది కూడా చదవండి: నోర్మూయ్, ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు.. మెట్రోలో లేడీస్ లొళ్లి -
ఇక ఎలక్ట్రిక్ బుల్లెట్ బండి.. ప్రకటించిన రాయల్ఎన్ఫీల్డ్
రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్సైకిళ్ల తయారీ సంస్థ ఐషర్ మోటార్స్ రాబోయే రెండేళ్లలో భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ను పరిచయం చేయాలని చూస్తోంది. ఇందుకోసం కోసం 1,50,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సిద్ధార్థ లాల్ తెలిపారు. ఉత్పత్తి మాడ్యులర్ పద్ధతిలో క్రమంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. గుర్గావ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ భారతదేశంలో ప్రీమియం మోటార్సైకిల్ విభాగంలో 90 శాతం వాటాతో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఎలక్ట్రిక్ మోటార్సైకిళ్ల విభాగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైన రాయల్ ఎన్ఫీల్డ్ తమ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ మార్కెట్ అవసరాలను అంచనా వేయడానికి ఒక వాణిజ్య బృందాన్ని నియమించినట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రోటోటైప్ను పరీక్షిస్తున్నామని, రెండేళ్లలో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ను విడుదల చేస్తామని సిద్ధార్థ లాల్ వెల్లడించారు. భారతదేశంలో మిడ్-వెయిట్ మోటార్సైకిళ్ల మార్కెట్ వేగంగా పెరుగుతోందని చెప్పారు. కంపెనీ గత త్రైమాసికంలో 225,368 రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్సైకిళ్లను విక్రయించిందని, ఇది ఏడాది క్రితంతో పోలిస్తే 21 శాతం పెరిగిందని ఆయన వివరించారు. ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు హీరో మోటోకార్ప్, హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా), బజాజ్ ఆటో రాబోయే నెలల్లో దాదాపు డజను మిడ్-వెయిట్ మోటార్సైకిళ్లను రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీగా తీసుకొస్తున్నాయి. గత నెలలో బజాజ్-ట్రయంఫ్ భారతదేశంలో రెండు 400సీసీ మోడళ్లను విడుదల చేసింది. అలాగే హార్లే డేవిడ్సన్తో కలిసి హీరో మోటర్ కార్ప్ అభివృద్ధి చేసిన X440 బైక్ డెలివరీలను త్వరలో ప్రారంభించాలని భావిస్తోంది. -
బైక్కు గుడి కట్టించి పూజలు - సినిమాను తలపించే ఇంట్రెస్టింగ్ స్టోరీ!
ఎక్కడైనా దేవునికి గుడి కట్టి పూజలు చేయడం ఆనవాయితీ.. హిందూ సంప్రదాయం ప్రకారం పంచ్ భూతాలను కూడా పూజిస్తారు. అయితే వీటన్నింటికి భిన్నంగా రాజస్థాన్లో ఒక 'బైకు'కి గుడి కట్టి పూజలు చేస్తున్నారు. ఇంతకీ ఆ బైకుకి ఎందుకు గుడి కట్టారు. దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, 1980 చివరలో 'ఓం సింగ్ రాథోడ్' అనే యువకుడు తనకు ఎంతగానో ఇష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్సైకిల్పై ప్రయాణించేటప్పుడు ఒక చెట్టుకు ఢీ కొట్టి ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన పాలీ జిల్లాలోని చోటిలా గ్రామ సమీపంలో జరిగింది. బుల్లెట్ బాబా.. ప్రమాదం జరిగిన తరువాత పోలీసులు ఆ బైకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే ఆశ్చర్యకరంగా ఆ బుల్లెట్ బైక్ మరుసటి రోజు వెళ్లి ప్రమాదం జరిగిన చోటుకే చేరినట్లు తెలిసింది. ఇది ఎవరో ఆకతాయిల పని అని భావించి పోలీసులు మళ్ళీ ఆ బైకుని స్టేషన్కి తీసుకెళ్లారు. మళ్ళీ మునుపటి మాదిరిగానే ప్రమాదం జరిగిన చోటుకే చేరింది. ఈ సంఘటన మొదట్లో అందరిని భయానికి గురిచేసింది. ఆ తరువాత ఇందులో ఏదో దైవత్వం ఉందని గ్రహించి స్థానికులు ఓం సింగ్ రాథోడ్కు నివాళులర్పించాలని నిర్ణయించుకున్నారు. ఓం సింగ్ రాథోడ్ ఆత్మ బుల్లెట్ బైకు మీద తిరుగుతుందని భావించి స్థానికులు ప్రమాదం జరిగిన స్థలాన్నే స్థానికులు దేవాలయంగా మార్చారు. ఆ ప్రదేశంలో బుల్లెట్ బైకుకి పూజలు చేయడం ప్రారంభించారు. బుల్లెట్ మోటార్సైకిల్కు ఓం సింగ్ రాథోడ్ గౌరవార్థం 'బుల్లెట్ బాబా' అని పేరు పెట్టారు. ప్రతి రోజూ ఎంతో మంది భక్తులు ఈ మందిరాన్ని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు. (ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 10 వేల జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు కోట్ల సామ్రాజ్యం - ఒక టీచర్ కొడుకు సక్సెస్ స్టోరీ..) ఈ బుల్లెట్ బాబా ఆలయంలో అగరవత్తులు వెలిగించడం, మోటార్ సైకిల్ చుట్టూ ప్రదక్షిణలు చేయడం, మద్యం పోయటం వంటివి అక్కడి ఆచారం. ఈ విధంగా చేస్తే భక్తులకు ప్రయాణ సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగవని ఘాడంగా విశ్వసిస్తారు. ఈ గుడికి కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి కూడా భక్తులు, సందర్శకులు వస్తుంటారు. కొంతమంది మోటార్సైకిల్దారులు, సాహస యాత్రికులు మరియు ఆధ్యాత్మిక ఔత్సాహికులు తమ ప్రయాణ ప్రయాణంలో భాగంగా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. (ఇదీ చదవండి: ఆ రెండు యాప్స్ ఉంటే మీ వివరాలు చైనాకే.. వెంటనే డిలీట్ చేయండి!) View this post on Instagram A post shared by Royalenfieldholic® 𝟮𝟬𝟬𝗸🎯 (@royalenfieldholic) -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో బైక్ - లాంచ్ ఎప్పుడంటే?
Royal Enfield Scram 440: దేశీయ టూ వీలర్ దిగ్గజం 'రాయల్ ఎన్ఫీల్డ్' (Royal Enfield) మార్కెట్లో మరో సరికొత్త మోడల్ విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఈ బైక్ వచ్చే సంవత్సరానికి భారతీయ విఫణిలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, రాయల్ ఎన్ఫీల్డ్ విడుదల చేయనున్న కొత్త బైక్ స్క్రామ్ 440 మోడల్ అవుతుందని సమాచారం. అంటే ఇది ఇప్పటికే మార్కెట్లో స్క్రామ్ ఆధారంగా తయారయ్యే అవకాశం ఉంది. ఇది 411 సీసీ ఇంజిన్ కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజిన్ ఇప్పటికే స్క్రామ్ 411లో ఉంది. (ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!) ఈ బైక్ డిజైన్, ఫీచర్స్ వంటివి అధికారికంగా విడుదలకాలేదు, త్వరలో అందుబాటులో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఈ బైక్ స్క్రామ్ సబ్-బ్రాండ్ క్రింద ఉంటుంది. అయితే హిమాలయన్ బైక్ కంటే కూడా తక్కువ ధర వద్ద ఉంటుందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇండియన్ మార్కెట్లో విడుదలకానున్న బైకుల జాబితాలో రాయల్ ఎన్ఫీల్డ్ మాత్రమే కాకుండా యమహా, హోండా వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ వారి పరిధిని విస్తరిస్తూ దేశంలో ఉనికిని మరింత చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
బంగారు బుల్లెట్.. ఆఖరికి సైలెన్సర్ కూడా..
Gold Colour Royal Enfield: భారతదేశంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకున్న క్రేజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ బైకులను యువకుల దగ్గర నుంచి పెద్ద వారి వరకు చాలా మంది ఇష్టపడతారన్నది అందరికి తెలిసిన వాస్తవం. అయితే కొంత మంది ఈ బైక్ ప్రేమికులు వారికి కావలసిన రీతిలో మోడిఫైడ్ చేసుకుంటారు. ఇలాంటి నేపథ్యంలో భాగంగా ఒక వ్యక్తి తన బైకుని గోల్డెన్ బుల్లెట్ మాదిరిగా రూపొందించుకున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాయల్ బుల్లెట్ 5577 అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెలువడిన వీడియోలో మీరు గమనిస్తే ఈ గోల్డ్ బుల్లెట్ ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. పేరుకి గోల్డ్ బుల్లెట్ అయినా ఇది బంగారంతో తయారు కాలేదు. గోల్డ్ పెయింట్ స్కీమ్ మాత్రమే పొందింది. అందులో కూడా బైక్ కలర్ అలాగే ఉంది, అక్కడక్కడా గోల్డ్ షేడ్స్ చూడవచ్చు. ఇది బుల్లెట్ 350సీసీ బైక్ కావడం గమనార్హం. నిజానికి గోల్డ్ కలర్ స్కీమ్ పొందే వాహనాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కనిపించే గోల్డ్ కలర్ బుల్లెట్.. టర్న్ ఇండికేటర్స్, హెడ్ల్యాంప్ కవర్, నంబర్ ప్లేట్, ఫ్రంట్ ఫోర్క్ కవర్ ఎగువ భాగంలో చూడవచ్చు. అంతే కాకుండా ఫుట్రెస్ట్లు, క్లచ్, లివర్, ఓడోమీటర్ అన్నీ గోల్డెన్ షేడ్లో ఉన్నాయి. ఇక ఈ బైక్ హ్యాండిల్బార్పై ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్న బొమ్మ లాంటిది చూడవచ్చు. ఇది కూడా గోల్డెన్ షేడ్లోనే ఉంది. (ఇదీ చదవండి: వయసు 11.. సంపాదన వందల కోట్లు - చిన్నారి సక్సెస్ స్టోరీ!) గోల్డెన్ బుల్లెట్ రైడ్ చేసే వ్యక్తి కూడా బైకుకి తగిన విధంగా బంగారు ఉంగరాలు, బ్రాస్లెట్, వాచ్ వంటివి ధరించాడు. ఈ బైక్ సైలెన్సర్ కూడా బంగారు రంగులోనే ఉంది. ఈ మోటార్సైకిల్కి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియావైలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: 750సీసీ విభాగంలో రాయల్ బండి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క!) ఈ గోల్డెన్ బైక్ గోల్డెన్ మ్యాన్ అని పిలువబడే మహారాష్ట్ర పూణే సమీపంలోని పింప్రి-చించ్వాడ్ ప్రాంతానికి చెందిన 'సన్నీ వాఘురే' అనే వ్యక్తికి సంబంధించినదని తెలుస్తోంది. గతంలో కేరళకు చెందిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ అనే వ్యక్తి ఏకంగా గోల్డ్ కలర్ రోల్స్ రాయిస్ టాక్సీగా ఉపయోగిస్తున్నాడు. View this post on Instagram A post shared by Amit Raviraj Shinde (@royal_bullet_5577) -
750సీసీ విభాగంలో రాయల్ బండి.. ప్రత్యర్థులకు గట్టి షాక్!
Royal Enfield 750cc Bike: కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్న 'రాయల్ ఎన్ఫీల్డ్' (Royal Enfield) ఇప్పటికే 350సీసీ, 650 సీసీ విభాగంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. అయితే ఇప్పుడు 750సీసీ విభాగంలో తన హవా నిరూపించుకోవడం కోసం సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఆధునిక కాలంలో వాహన వినియోగదారులు అధిక పనితీరు కలిగిన బైకులను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ 750 సీసీ విభాగంలో తన సత్తా చాటుకోవడమే కాకుండా, వినియోగదారులకు మరింత చేరువ కావడానికి దేశీయ దిగ్గజం ప్రయత్నిస్తోంది. కంపెనీ ఈ లేటెస్ట్ బైకుని 2025 నాటికి భారతీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. కొత్త బైక్ కోడ్నేమ్ ట్విన్-సిలిండర్ ఇంటర్సెప్టర్ 650తో ఎంతోమందికి బైక్ ప్రేమికులను ఆకర్శించిన రాయల్ ఎన్ఫీల్డ్ 750సీసీ స్పేస్లోకి ప్రవేశించాలని యోచిస్తూ 'ఆర్' (R) కోడ్నేమ్తో ప్లాట్ఫామ్ అభివృద్ధి చేయనుంది. భారతదేశంలో మాత్రమే కాకుండా.. ఉత్తర అమెరికా, యూరప్, యునైటెడ్ కింగ్డమ్తో సహా వివిధ మార్కెట్లలో ప్రవేశించడానికి ఆసక్తి చూపుతోంది. ఇందులో R2G - 750cc బాబర్ మోటార్సైకిల్ అనే సంకేతనామం కలిగిన ప్రాజెక్ట్ మొదటిది. UKలోని లీసెస్టర్లోని టెక్ సెంటర్లో లీడ్ డెవలప్మెంట్ జరుగుతోంది. ఇది దశాబ్దాలుగా రాయల్ ఎన్ఫీల్డ్ పోర్ట్ఫోలియోలో అతిపెద్ద మోటార్సైకిల్గా అవతరించే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: విడుదలకు ముందే అంచనాలు దాటేస్తున్న హోండా ఎలివేట్ - బుకింగ్స్) నిజానికి రాబోయే 750 సీసీ బైక్ ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న ట్విన్-సిలిండర్ 650 సీసీ ఇంజన్ పునరావృతం. అయితే ఇప్పుడు ఈ ఇంజిన్తో ఏ బైక్ వస్తుంది, దాని వివరాలు ఏమిటి అనే మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కానీ బహుశా 750 సీసీ విభాగంలో విడుదలయ్యే రాయల్ ఎన్ఫీల్డ్ 'బాబర్' అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
అమ్మకాల్లో దూసుకెళ్తున్న రాయల్ ఎన్ఫీల్డ్!
ప్రముఖ లగ్జరీ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ దేశీయ మార్కెట్లో అమ్మకాల్లో దూసుకెళ్తుంది. జూన్ నెలలో 26శాతం వృద్దిని సాధించి 77,109 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది జూన్లో 61,407 బైక్స్ అమ్మింది. భారత్లో రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు ఏడాది క్రితం 50,265 యూనిట్లు అమ్ముడు పోగా..ఈ ఏడాది 34 శాతం పెరిగి 67,495 అమ్మినట్లు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతినిధులు తెలిపారు. అయితే ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. 2022 జూన్ లో 11,142 యూనిట్లను ఎగుమతి చేయగా.. గత నెలలో వాటి సంఖ్య 9,614 యూనిట్లతో సరిపెట్టుకుంది. ఈ సందర్భంగా రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓ బీ గోవింద రాజన్ మాట్లాడుతూ.. ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన మోటారు సైకిళ్లతో తాము దేశీయంగా, గ్లోబల్ మార్కెట్లలో మంచి సేల్స్ నమోదు చేశామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ బైక్ లవర్స్ను ఆకట్టుకుంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. -
Evolution Of Royal Enfield Bikes: రాయల్ ఎన్ఫీల్డ్ సుదీర్ఘ చరిత్ర - ఆసక్తికరమైన ఫోటోలు
-
ఫాక్స్కాన్ రంగంలోకి: రాయిల్ ఎన్ఫీల్డ్, ఓలా ఏమైపోవాలి?
ప్రపంచంలోనే అతిపెద్ద యాపిల్ ఐఫోన్ తయారీ ఫాక్స్కాన్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోందట. ఈమేరకు ప్రస్తుతం పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో ఈ-బైక్ మార్కెట్లో రానున్నకాలంలో కొత్త ఎలక్ట్రిక్ బైక్లను రిలీజ్ చేయాలని భావిస్తున్న ఓలా ఎలక్ట్రిక్, రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థలకు గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, యాపిల్ ఐఫోన్ తయారీదారు తన వార్షిక నివేదికలో ఆగ్నేయాసియాలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ప్లాంట్ను స్థాపించడానికి కంపెనీకి సహాయం చేస్తుందని పేర్కొంది. దీనిపై ఫాక్స్కాన్ ఎగ్జిక్యూటివ్లతో చర్చించడానికి భారతీయ ప్రతినిధి బృందం త్వరలో తైవాన్ను సందర్శించాలని యోచిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అయితే పలు బ్రాండ్ ఎలక్ట్రిక్ టూవీలర్స్ను తయారు చేస్తుందా లేదా జాయింట్ వెంచర్ ద్వారా ఒకే బ్రాండ్కు పరిమితమవుతుందా అనేది స్పష్టత లేదు. (టీసీఎస్కు భారీ ఎదురుదెబ్బ: బిగ్ డీల్ నుంచి ట్రాన్సామెరికా ఔట్!) కాగా ఇప్పటికే తమిళనాడులో పెద్ద ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్న ఫాక్స్కాన్ మహారాష్ట్రలో కూడా ఈవీ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉంది. అటు తెలంగాణపై కూడా దృష్టి సారిస్తోన్న సంగతి తెలిసిందే. (అమెరికా గుడ్ న్యూస్: వీలైనన్ని ఎక్కువ వీసాలిచ్చేందుకు తీవ్ర కృషి!) -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో నాలుగు బైకులు - ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?
Upcoming Royal Enfield Bikes: ద్విచక్ర వాహన విభాగంలో భారతీయ మార్కెట్లో 'రాయల్ ఎన్ఫీల్డ్' (Royal Enfield) బైకులకున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పటి నుంచి కూడా ఈ బైకులకు డిమాండ్ భారీగా ఉంది. ఇప్పటికే క్లాసిక్ 350, మీటియోర్ 350, ఇంటర్సెప్టర్ 650, హిమాలయన్ విక్రయాలతో శరవేగంగా ముందుకు దూసుకెళ్తున్న సంస్థ త్వరలో మరో నాలుగు బైకులు విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ ఈ ఏడాది విడుదల చేయనున్న ఈ నాలుగు బైకుల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 గత కొన్ని రోజులుగా సంస్థ హిమాలయన్ 450 విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కంపెనీ కూడా ఈ మోడల్ మీద పనిచేస్తున్నట్లు సమాచారం. ఇందులో 450 సీసీ ఇంజిన్ ఉండే అవకాశం ఉండండి నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఏడాది దీపావళి నాటికి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 రాయల్ ఎన్ఫీల్డ్ అనగానే చాలామందికి మొదట గుర్తొచ్చే బైక్ బుల్లెట్. బైక్ రైడర్ల మనసులో అంతగా ఈ పేరు పాతుకుపోయింది. అయితే ఈ బైక్ త్వరలోనే కొత్త వెర్షన్గా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ న్యూ జనరేషన్ బుల్లెట్ 350 క్లాసిక్ మాదిరిగా కాకుండా కొంత లేటెస్ట్ డిజైన్ పొందుతుందని సమాచారం. (ఇదీ చదవండి: 1986లో రాయల్ ఎన్ఫీల్డ్ ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!) రాయల్ ఎన్ఫీల్డ్ షాట్గన్ 650 ప్రస్తుతం 350 సీసీ విభాగంలో మాదిరిగానే 650 విభాగంలో కూడా విడుదలయ్యే వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పటికే ఈ విభాగంలో ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ జిటి 650 వంటివి ఉన్నాయి. కాగా ఈ విభాగంలో కంపెనీ షాట్గన్ 650 విడుదలకానున్నట్లు సమాచారం. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బాబర్ 350 జావా కంపెనీ మార్కెట్లో విక్రయిస్తున్న బాబర్ బైక్ గురించి వినే ఉంటారు. అయితే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ క్లాసిక్ బాబర్ 350 పేరుతో ఒక కొత్త బికా విడుదల చేయడానికి సన్నద్ధమైపోయింది. ఈ బైక్ గురించి ప్రస్తుతానికి అధికారిక వివరాలు వెల్లడి కాలేదు, కానీ ఈ ఏడాది మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. -
మా ఎలక్ట్రిక్ బైక్లు మామూలుగా ఉండవు: రాయల్ ఎన్ఫీల్డ్ సీఈవో
రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) ప్రత్యేకమైన, విభిన్నమైన ఎలక్ట్రిక్ బైక్లను అభివృద్ధి చేస్తోందని ఆ కంపెనీ సీఈవో గోవిందరాజన్ తెలిపారు. వీటిని అభివృద్ధి చేయడానికి ఇప్పటికే పెట్టుబడి పెట్టడం ప్రారంభించామని, చెన్నై ప్లాంట్ పరిధిలో సప్లయర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ‘ఈవీ ప్రయాణంలో, మేము స్థిరమైన పురోగతిని సాధిస్తున్నాం. రాయల్ ఎన్ఫీల్డ్ ఈవీ ప్రయాణం ఇప్పుడు టాప్ గేర్లో ఉందని నేను చెప్పగలను. బలమైన రాయల్ ఎన్ఫీల్డ్ డీఎన్ఏతో ప్రత్యేకంగా విభిన్నమైన ఎలక్ట్రిక్ మోటార్సైకిళ్లను రూపొందించడమే మా లక్ష్యం’ అని విశ్లేషకులతో సమావేశంలో గోవిందరాజన్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై బలమైన దీర్ఘకాలిక ఉత్పత్తి, సాంకేతికత రోడ్మ్యాప్ను రూపొందించామని, సప్లయర్ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ప్రస్తుతం దృష్టి పెడుతున్నామని వెల్లడించారు. దేశీయ మార్కెట్లో నెట్వర్క్ విస్తరణ గురించి మాట్లాడుతూ కంపెనీ ప్రస్తుతం దేశమంతటా దాదాపు 2,100 రిటైల్ అవుట్లెట్లను కలిగి ఉందని వివరించారు. రూ.1000 కోట్ల పెట్టుబడి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఇతర అంశాలపై దృష్టి సారించిన రాయల్ ఎన్ఫీల్డ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,000 కోట్ల క్యాపెక్స్ను ప్రకటించింది. ఇందులో కొంత భాగం ప్రస్తుత పెట్రోల్ బైక్ల తయారీ, కొత్త వాటి అభివృద్ధికి వినియోగించనున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: FAME 2 SUBSIDY: ఎలక్ట్రిక్ బైక్లు కొనేవారికి బ్యాడ్ న్యూస్.. సబ్బిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం! -
సూపర్ మీటియోర్ 650 ధరలు పెంచిన రాయల్ ఎన్ఫీల్డ్ - వివరాలు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'రాయల్ ఎన్ఫీల్డ్' (Royal Enfield) ఇప్పటికే తన 'సూపర్ మీటియోర్ 650' బైకుని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే కంపెనీ ఈ బైక్ ధరలను ఇప్పుడు ఒక్క సారిగా రూ. 5000 వరకు పెంచింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కంపెనీ ఈ సూపర్ మీటియోర్ 650 ధరలను పెంచిన తరువాత ఈ బైక్ ప్రారంభ ధర రూ. 3.54 లక్షలు. ఇది ఆస్ట్రల్, ఇంటర్స్టెల్లార్, సెలెస్టియన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు కూడా రూ. 5వేలు పెరిగాయి. కావున ఈ బైక్స్ కొనాలనుకునే కస్టమర్లు కొత్త ధరలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బేస్ వేరియంట్ అయిన ఆస్ట్రల్ మూడు సింగిల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి బ్లాక్, బ్లూ అండ్ గ్రీన్ కలర్స్. ఇక మిడ్ స్పెక్ వేరియంట్ ఇంటర్స్టెల్లార్ రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. అవి గ్రే, గ్రీన్ అనే డ్యూయెల్ కలర్స్. డిజైన్ విషయానికి వస్తే మొదటి రెండు వేరియంట్లు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అయితే టాప్ వేరియంట్లో మాత్రం పెద్ద ఫ్రంట్ స్క్రీన్, టూరింగ్ సీట్, పిలియన్ బ్యాక్ రెస్ట్ వంటి అదనపు యాక్ససరీస్ లభిస్తాయి. రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 బైకులో 648 సిసి ప్యారలల్ ట్విన్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 47 bhp పవర్, 52.3 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. కావున పనితీరుపరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: కొంప ముంచిన గూగుల్ మ్యాప్.. నేరుగా సముద్రంలోకి - వీడియో) ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ట్రిప్పర్ నావిగేషన్, బ్లూ టూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉంటాయి. ఈ బైక్ ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఈ బైక్ సీటు ఎత్తు భూమి నుంచి 650 మిమీ. 241 కేజీల బరువు కలిగిన ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 15.7 లీటర్లు. కావున లాంగ్ రైడ్ చేయడానికి ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. -
1986లో రాయల్ ఎన్ఫీల్డ్ ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!
ఆధునిక కాలంలో ఎక్కువ మంది యువకులు ఇష్టపడే బైకులలో 'రాయల్ ఎన్ఫీల్డ్' ప్రధానంలో చెప్పుకోదగ్గవి. రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు ఉన్న చరిత్ర అంతా.. ఇంతా కాదు. గతంలో తక్కువ తక్కువ సంఖ్యలో వినియోగంలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు రోడ్డుపై విరివిగా కనిపిస్తున్నాయి. భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ ధరలు ఇప్పుడు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద లభిస్తున్నాయి. అయితే 1986లో రాయల్ ఎన్ఫీల్డ్ ధర కేవలం రూ. 18,700 మాత్రమే కావడం గమనార్హం. దీనికి సంబంధించిన బిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాయల్ ఎన్ఫీల్డ్ 4567k ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడైన పోస్ట్ చూస్తే 1986లో రాయల్ ఎన్ఫీల్డ్ ధర ఎలా ఉందొ తెలిసిపోతుంది. ఈ బిల్ కూడా M/s R S ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ పేరు మీద ఉంది. ఇందులో ఈ బైక్ ధర రూ. 18,800 అని, రూ. 250 డిస్కౌంట్ లేదా ఇతరత్రా కారణాల వల్ల తగ్గించడం వల్ల దీని ధర రూ. 18,700 అని స్పష్టమవుతోంది. అప్పటి ధరలతో పోల్చుకుంటే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ధరలు సుమారు పది రెట్లు ఎక్కువని తెలుస్తోంది. ప్రస్తుతం స్టాండర్డ్ బుల్లెట్ 350 ఆన్-రోడ్ ధర సుమారు రూ .1.7 లక్షల వరకు ఉంది. 1901లో 'ఇంగ్లాండ్'లోని వోర్సెస్టర్ షైర్, రెడ్దిచ్ కు చెందిన కంపెనీ తమ మొదటి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ తయారు చేసింది. ఆ తరువాత భారతీయ కార్ల తయారీ సంస్థ ఐషర్ మోటార్స్ లిమిటెడ్ లో భాగమైన భారత సంతతికి చెందిన మద్రాస్ మోటార్స్ రాయల్ ఎన్ఫీల్డ్ నుండి లైసెన్స్ పొందింది. రాయల్ ఎన్ఫీల్డ్ గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన మొదట్లో ఎక్కువగా రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను వాడేవారు. 1954లోనే ప్రభుత్వం 800 యూనిట్ల 350 సిసి బైకులను కొనుగోలు చేసింది. దీన్ని బట్టి చూస్తే అప్పట్లోనే ఈ బైక్ ఎంత ఆదరణ పొందిందో అర్థమవుతుంది. రెడ్డిచ్ బిజినెస్ భారతదేశంలోని 'మద్రాస్ మోటార్స్'తో కలిసి 1955లో "ఎన్ఫీల్డ్ ఇండియా" ను సృష్టించింది, తద్వారా మద్రాసు లైసెన్స్ కింద 350 సిసి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ బైక్ ఉత్పత్తి చేసింది. దాదాపు 70 సంవత్సరాలు తరువాత ఏకంగా భారతీయ మార్కెట్లో తిరుగులేని బైకుగా చెలామణి అవుతోంది. ఏడు దశాబ్దాల తరువాత కంపెనీ ఇప్పుడు దేశంలో అత్యంత విజయవంతమైన ద్విచక్ర వాహన బ్రాండ్లలో ఒకటిగా మారింది. View this post on Instagram A post shared by Being Royal (@royalenfield_4567k) -
పవర్ ఫుల్ బైక్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 బెస్ట్ బైక్స్!
భారతీయ మార్కెట్లో ప్రస్తుతం లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు నుంచి అత్యంత ఖరీదైన బైకుల వరకు అందుబాటులో ఉన్నాయి. అయితే మనం ఈ కథనంలో రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల మధ్య లభించే టాప్ 5 బైకుల గురించి తెలుసుకుందాం. కెటిఎమ్ 390 డ్యూక్: ఎక్కువ మంది యువతకు ఇష్టమైన బైకులలో కెటిఎమ్ 390 డ్యూక్ ఒకటి. దీని ధర రూ. 2.96 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ 2017 నుంచి చిన్న చిన్న అప్డేట్లను పొందుతూనే ఉంది. కావున అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికున్న ఆదరణ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ 373సీసీ ఇంజిన్ కలిగి 9000 ఆర్పిఎమ్ వద్ద 43.5 పిఎస్ పవర్, 7000 ఆర్పిఎమ్ వద్ద 37 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310: ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ టీవీఎస్ కంపెనీకి చెందిన అపాచీ ఆర్ఆర్ 310 కూడా ఎక్కువమంది ఇష్టపడే బైకుల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 2.72 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ స్పోర్ట్బైక్ అద్భుతమైన డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 312.2 సీసీ ఇంజిన్ 33.5 బిహెచ్పి పవర్, 27.3 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. హోండా సిబి300ఆర్: హోండా కంపెనీకి చెందిన సిబి300ఆర్ బైక్ ధర రూ. 2.77 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇందులో 286 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 30.7 బిహెచ్పి పవర్, 27.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా రైడర్ కు సులువైన క్లచ్ ఆపరేటింగ్ కోసం అసిస్ట్ అండ్ స్లిప్లర్ క్లచ్ వంటివి కూడా ఇందులో లభిస్తాయి. సుజుకీ వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్: మన జాబితాలో మూడు లక్షలకంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో ఒకటి సుజుకీ వీ స్ట్రోమ్ ఎస్ఎక్స్. దీని ధర రూ. 2.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ 249 సీసీ, 4 స్ట్రోక్,సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఎస్ఓహెచ్సీ ఇంజిన్ పొందుతుంది, కావున మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350: భారతదేశంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ క్లాసిక్ 350. ఈ బైక్ ధర రూ. 1.90 లక్షల నుంచి రూ. 2.21 లక్షల వరకు ఉంటుంది (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 6,100 ఆర్పిఎమ్ వద్ద 20.3 బిహెచ్పి పవర్, 4,000 ఆర్పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. -
2023 Royal Enfield 650 Twins: రాయల్ ఎన్ఫీల్డ్ 650 బైక్స్ ఇప్పుడు మరింత కొత్తగా
వాహన ప్రేమికులు రోజురోజుకి ఆధునిక ఉత్పత్తులను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో వాహన తయారీ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 & కాంటినెంటల్ GT 650 బైకులను లేటెస్ట్ అప్డేట్స్తో లాంచ్ చేసింది. ధరలు: దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ ఆధునిక బైకుల ధరలు కలర్ ఆప్సన్స్ మీద ఆధారపడి ఉంటాయి. కాంటినెంటల్ జిటి 650 బైక్ ప్రారంభ ధర రూ. 3.19 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 3.39 లక్షల వరకు ఉంటుంది. ఇక ఇంటర్సెప్టర్ 650 ప్రారంభ ధర రూ. 3.03 లక్షలు కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 3.21 లక్షలు. ధరలు వీటి మునుపటి మోడల్స్ కంటే కొంత ఎక్కువగా ఉంటాయి. కలర్ ఆప్సన్స్: కాంటినెంటల్ జిటి 650 బైక్ రాకర్ రెడ్/బ్రిటీష్ రేసింగ్ గ్రీన్, డక్స్ డీలక్స్, అపెక్స్ గ్రే/స్లిప్స్ట్రీమ్ బ్లూ అనే మూడు కలర్ ఆప్సన్స్లో లభిస్తుంది. అదే సమయంలో ఇంటర్సెప్టర్ 650 విషయానికి వస్తే క్యాన్యన్ రెడ్/కాలి గ్రీన్, బ్లాక్ పెర్ల్/సన్సెట్ స్ట్రిప్, బార్సిలోనా బ్లూ/బ్లాక్ రే కలర్స్లో లభిస్తుంది. (ఇదీ చదవండి: కియా నుంచి నాలుగు కొత్త కార్లు: సిఎన్జి, 5 సీటర్ ఇంకా..) అప్డేటెడ్ డిజైన్ & ఫీచర్స్: ఆధునిక హంగులతో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ 650 బైక్స్ ఇంజిన్, అల్లాయ్ వీల్స్, ఎగ్జాస్ట్, సైడ్ ప్యానెల్ వంటివి బ్లాక్-అవుట్ థీమ్ పొందుతాయి. ఇందులో ఇప్పుడు అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. అంతే కాకుండా కొత్త అల్యూమినియం స్విచ్ క్యూబ్స్, ఎల్ఈడీ హెడ్లైట్స్ వంటివి ఇందులో కనిపిస్తాయి. యుఎస్బి ఛార్జింగ్ ఆప్సన్ కూడా ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్గా వస్తోంది. ట్యూబ్లెస్ టైర్స్ ఈ బైకులలో అమర్చారు. ఇంజిన్: అప్డేటెడ్ రాయల్ ఎన్ఫీల్డ్ 650 డిజైన్, ఫీచర్స్ అప్డేట్ పొందినప్పటికీ ఇంజిన్ మాత్రం మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాంటినెంటల్ జిటి, ఇంటర్సెప్టర్ బైక్ రెండూ 648 సీసీ ప్యారలల్ ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజిన్ కలిగి 47.5 హెచ్పి పవర్, 52 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. కావున పనితీరులో కూడా ఎటువంటి మార్పులు ఉండే అవకాశం లేదు. (ఇదీ చదవండి: వెహికల్ స్క్రాపింగ్పై క్లారిటీ వచ్చేసింది.. చూశారా!) బ్రేకింగ్ & సస్పెన్షన్ సెటప్: భారతీయ మార్కెట్లో 650 సిసి విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ బైకులు బోల్ట్ ట్రస్సింగ్తో ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్ను కలిగి 41 మిమీ ఫ్రంట్ ఫోర్క్, వెనుకవైపు డ్యూయల్ కాయిల్-ఓవర్ షాక్లు పొందుతుంది. అదే సమయంలో ఈ బైక్స్ ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్స్, వెనుక 240 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, డ్యూయెల్ ఛానల్ స్టాండర్డ్గా అందుబాటులో ఉంటుంది. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్త బైక్స్.. వచ్చేస్తున్నాయ్
భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. గత కొన్ని రోజులుగా కంపెనీ అమ్మకాలు తారా స్థాయిలో చేరుకుంటున్నాయి. 2023 ఫిబ్రవరిలో 71,544 యూనిట్లను విక్రయించి 2022 ఫిబ్రవరి కంటే 20.93 శాతం ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది. అమ్మకాల్లో దూసుకెళ్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను తీసుకురావడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కంపెనీ లైనప్లో హంటర్ 350సీసీ, బుల్లెట్ 350సీసీ, క్లాసిక్ 350సీసీ, మీటియోర్ 350సీసీ, హిమాలయన్, స్క్రామ్ 411, ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650, మరియు సూపర్ మెటోర్ 650 వంటి తొమ్మిది మోడళ్లు ఉన్నాయి. కంపెనీ కొత్త ప్రణాళికలో భాగంగా రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో రెండు 350సీసీ బైకులు విడుదలయ్యే అవకాశం ఉందని నివేదికల ద్వారా తెలుస్తోంది. అవి బుల్లెట్ 350, షాట్గన్ 350 బాబర్ బైకులు. అంతే కాకుండా 450 సీసీ విభాగంలో, 650 సీసీ విభాగంలో కొత్త బైకులు విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350: రాయల్ ఎన్ఫీల్డ్ విడుదల చేయనున్న కొత్త బైక్ ఈ బుల్లెట్ 350. ఇది దాని మునుపటి మోడల్ కంటే అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. మీటియోర్ 350 మాదిరిగానే ఇది కూడా 5 స్పీడ్ గేర్బాక్స్తో 346 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ పొందనుంది. (ఇదీ చదవండి: బజాజ్ నుంచి అప్డేటెడ్ బైక్స్ విడుదల) రాయల్ ఎన్ఫీల్డ్ షాట్గన్ 350 బాబర్: ఇక కంపెనీ విడుదలచేయనున్న మరో కొత్త బైక్ 'రాయల్ ఎన్ఫీల్డ్ షాట్గన్ 350 బాబర్'. ఇది కూడా మీటియోర్ 350 మాదిరిగానే అదే ఇంజిన్, పర్ఫామెన్స్ పొందే అవకాశం ఉంది. డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా మునుపటి మోడల్స్ కంటే ఉత్తమంగా ఉంటుంది. దీని ధర రూ. 2 లక్షల వరకు ఉంటుందని అంచనా. -
పాపులర్ హిమాలయన్ బైకులు వెనక్కి: కారణం ఏంటంటే?
అతి తక్కువ కాలంలోనే యువ రైడర్ల మనసు దోచిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు సుమారు 5,000 యూనిట్ల హిమాలయన్ బైకులకు రీకాల్ ప్రకటించింది. యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) ప్రకారం, శీతాకాలంలో రోడ్లను ట్రీట్ చేయడానికి ఉపయోగించే ఉప్పు బైక్ బ్రేక్ పనితీరు తగ్గిస్తుంది, లేదా మొత్తం నష్టానికి కారణమవుతుందని నివేదించింది. కంపెనీ 2017 - 2021 మధ్య తయారు చేసిన 4,891 యూనిట్ల హిమాలయన్ బైకులు దీనికి ప్రభావయుతమయ్యే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ముందుగానే రీకాల్ ప్రకటించింది. ఇందులో భాగంగానే డీలర్లు ప్రభావిత వాహనాల ముందు, వెనుక బ్రేక్ కాలిపర్లను రీప్లేస్ చేస్తారు. 2021 తర్వాత విడుదలైన బైకులు ఈ సమస్యకు ప్రభవితమయ్యే అవకాశం లేదు. గతంలో కూడా హిమాలయన్కు రీకాల్ ప్రకటించారు. అప్పుడు యుకె, యూరప్, దక్షిణ కొరియా దేశాలలో రీకాల్ ప్రకటించారు. ఇప్పుడు అదే సమస్యకు గాను అమెరికాలో రీకాల్ ప్రకటించడం జరిగింది. అయితే భారతదేశంలో ఈ మోడల్ బైకులకు రీకాల్ ప్రకటించడంపై కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇప్పటివరకు భారతదేశంలోని బైకులలో ఎటువంటి సమస్య నమోదు కాకపోవడం గమనార్హం. -
2023 ఫిబ్రవరిలో టూవీలర్ సేల్స్: టీవీఎస్ నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ వరకు
ఫిబ్రవరి 2023 ముగియడంతో దాదాపు అన్ని కంపెనీలు తమ అమ్మకాల గణాంకాలను వెల్లడించాయి. గత నెలలో దేశీయ మార్కెట్లో వాహనాల అమ్మకాలు కొంత పురోగతి చెందినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. మంచి అమ్మకాలు పొందిన టాప్ 5 టూవీలర్ బ్రాండ్స్ లో హీరో మోటోకార్ప్ మొదటి స్థానంలో చేరింది. గత నెలలో హీరో మోటోకార్ప్ మొత్తం 382317 యూనిట్లను విక్రయించి 2022 ఫిబ్రవరి కంటే 15.34 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇదే నెల గతేడాది కంపెనీ అమ్మకాలు 3,31,462 యూనిట్లు. ఎగుమతుల విషయంలో మాత్రం -54.68 శాతం తగ్గుదలను నమోదు చేసింది. కంపెనీ మొత్తం అమ్మకాలు 3,94,460 యూనిట్లు (ఎగుమతులు + దేశీయ అమ్మకాలు). హోండా మోటార్సైకిల్ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. కంపెనీ దేశీయ అమ్మకాలు 2,27,064 యూనిట్లు కాగా, ఎగుమతులు 20,111 యూనిట్లు. 2023 ఫిబ్రవరిలో మొత్తం అమ్మకాలు 2,47,175 యూనిట్లు. దేశీయ అమ్మకాల్లో కంపెనీ -20.25 శాతం, ఎగుమతుల్లో -25.36 శాతం, మొత్తం అమ్మకాల పరంగా -20.93 శాతం తగ్గుదలను నమోదు చేసింది. టీవీఎస్ మోటార్ విషయానికి వస్తే 2023 ఫిబ్రవరిలో 2,21,402 యూనిట్లను దేశీయ మార్కెట్లో 27.83 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎగుమతుల పరంగా 45,624 యూనిట్లను విక్రయించి 2022 ఫిబ్రవరి కంటే -51.68 శాతం తగ్గుదలను నమోదు చేసింది. మొత్తం అమ్మకాల పరంగా -0.22 శాతం తగ్గుదలతో 2,67,026 యూనిట్ల వద్ద ఆగిపోయింది. 2023 ఫిబ్రవరిలో బజాజ్ ఆటో మొత్తం అమ్మకాలు దేశీయ అమ్మకాలు + ఎగుమతులు 2,35,356 యూనిట్లతో 2022 ఫిబ్రవరి కంటే -15.74 శాతం అతగ్గుదలను నమోదు చేసింది. ఎగుమతులు 1,15,021 యూనిట్లు కాగా, దేశీయ అమ్మకాలు 1,20,335 యూనిట్ల వద్ద ఉన్నాయి. దేశీయ అమ్మకాల్లో కంపెనీ పురోగతిని కనపరిచినప్పటికీ, ఎగుమతుల్లో -37.08 శాతం తగ్గుదలను నమోదు చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాల విషయానికి వస్తే, మొత్తం అమ్మకాలు 71,544 యూనిట్లు (ఎగుమతులు + దేశీయ అమ్మకాలు) కాగా, కేవలం దేశీయ అమ్మకాలు 64,436 యూనిట్లు, ఎగుమతులు 7,108 యూనిట్లు. కంపెనీ ఎగుమతుల్లో 1.18 శాతం వృద్ధిని, దేశీయ అమ్మకాల్లో 23.59 శాతం వృద్ధిని కనపరిచింది. -
జోరు తగ్గని రాయల్ ఎన్ఫీల్డ్: 2023 ఫిబ్రవరి అమ్మకాలు ఇలా..
ఫిబ్రవరి 2023 ముగియడంతో రాయల్ ఎన్ఫీల్డ్ తమ అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం గత నెల 71,544 యూనిట్లు (దేశీయ అమ్మకాలు, ఎగుమతులు) విక్రయించినట్లు తెలిసింది. నివేదికల ప్రకారం రాయల్ ఎన్ఫీల్డ్ గత నెలలో 350సీసీ విభాగంలో హంటర్, బుల్లెట్, క్లాసిక్, మీటియోర్ వంటి మోడల్స్ మాత్రమే కాకుండా హిమాలయన్, స్క్రామ్ 411, ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ జిటి 650 వంటి మోడల్స్ని కూడా విరివిగా విక్రయించింది. 2022 ఫిబ్రవరితో పోలిస్తే కంపెనీ అమ్మకాలు 20.93 శాతం పెరిగాయి. కంపెనీ అమ్మకాలు భారీగా పెరగటానికి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 చాలా సహకరించింది. ఈ మోడల్ కేవలం ఆరు నెలల్లో ఏకంగా లక్ష యూనిట్లు అమ్ముడైంది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో దీనికున్న డిమాండ్ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మోడల్ తరువాత క్లాసిక్ 350 ఎక్కువ అమ్మకాలు పొందింది. రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం అమ్మకాలలో దేశీయ అమమకాలు 64,436 యూనిట్లు కాగా. ఫిబ్రవరి 2022తో పోలిస్తే దేశీయ అమ్మకాలు కూడా 23.59 శాతం పెరిగాయి. ఎగుమతుల విషయానికి వస్తే, కంపెనీ గత నెలలో 7,044 యూనిట్లను ఎగుమతి చేసింది. గత సంవత్సరం ఇదే నెలలో కంపెనీ 7,025 యూనిట్లను విక్రయించింది. ఎగుమతుల్లో కూడా 0.91 శాతం పెరుగుదల ఉంది. -
Royal Enfield Hunter 350: అమ్మకాల్లో ఇది రాయల్ బండి
భారతీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం 'రాయల్ ఎన్ఫీల్డ్' గత సంవత్సరం 'హంటర్ 350' బైక్ లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి కంపెనీ ఇప్పటికి లక్ష యూనిట్లను విక్రయించింది. దీనికి సంబంధించిన సమాచారం కంపెనీ ప్రకటించింది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రెట్రో, మెట్రో అనే రెండు వేరియంట్స్లో విక్రయించబడుతోంది. వీటి ధరలు వరుసగా రూ. 1.50 లక్షలు, రూ. 1.64 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ మొదటి 50,000 యూనిట్లను విక్రయించడానికి నాలుగు నెలల సమయం పట్టింది, ఆ తరువాత కేవలం రెండు నెలల్లో మరో 50,000 యూనిట్లను విక్రయించింది. హంటర్ 350 బైక్ 349 సీసీ సింగిల్ సిలిండర్ టూ-వాల్వ్, SOHC, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజన్ కలిగి 20.2 బిహెచ్పి పవర్, 27 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 114 కిమీ, కాగా మైలేజ్ 36.2 కిమీ/లీ వరకు ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ముందు భాగంలో 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్లతో కూడిన ట్విన్ డౌన్ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ సెటప్ వెనుకవైపు ట్విన్ షాక్లను కలిగి పొందుతుంది. అదే సమయంలో ఈ బైక్ 110/70-17 54P ఫ్రంట్, 140/70-17 66P రియర్ ట్యూబ్లెస్ టైర్లను కలిగి ఉండి, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. హంటర్ 350 బైక్ ఫ్యాక్టరీ బ్లాక్, ఫ్యాక్టరీ సిల్వర్, డాపర్ వైట్, డాపర్ యాష్, డాపర్ గ్రే, రెబెల్ బ్లాక్, రెబెల్ బ్లూ, రెబెల్ రెడ్ అనే ఎనిమిది కలర్ ఆప్సన్స్లో లభిస్తుంది. ఇది 2,055 మిమీ పొడవు, 800 మిమీ వెడల్పు, 1,055 మిమీ ఎత్తు, 1,370 మిమీ వీల్బేస్ కలిగి 13 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ఇండోనేషియా, జపాన్, కొరియా, థాయ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్, అర్జెంటీనా, కొలంబియా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఈ బైక్ మోటార్సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు కూడా సొంతం చేసుకుంది. కంపెనీ అమ్మకాలలో ఇప్పటికే ఇది మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. -
రాయల్ఎన్ఫీల్డ్ సూపర్ బైక్ వచ్చేసింది..సూపర్ ఫీచర్లతో
సాక్షి,ముంబై: స్టయిలిష్ అండ్ లగ్జరీ బైక్ మేకర్ రాయిల్ ఎన్ఫీల్డ్ మరో కొత్త బైక్ను లాంచ్ చేసింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న బైక్ ప్రియులను ఆకట్టుకునేలా అద్భుత ఫీచర్లతో 650 సీసీ క్రూయిజర్ ‘సూపర్ మెటోర్ 650’ బైక్ను తీసుకొచ్చింది. అతి త్వరలో భారతీయ మార్కెట్లలో కూడా సందడి చేయనుంది. రాయల్ ఎన్ఫీల్డ్ 350 సిరీస్లో భాగంగా ఇటలీలోని మిలన్లో జరుగుతున్న 2022 EICMA షోలో ఈకొత్త బైక్ను అధికారికంగా ఆవిష్కరించింది. క్లాసికల్ క్రూయిజర్ డిజైన్తో రెండు వేరియంట్లలో (స్టాండర్డ్ ,టూరర్) మొదటిది ఐదు రంగులలో, రెండోది రెండు రంగుల్లో ఆకర్షణీయ లుక్లో అదరగొడుతోంది. ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 ఆధారంగా, 6 స్పీడ్ ట్రాన్స్మిషన్, 648 సీసీ ట్విన్ ఇంజీన్ను ఇందులో అమర్చింది. 7,250 ఆర్ఎంపీ వద్ద 47 హెచ్పీ పవర్ను, 5650 ఆర్ఎంపీ వద్ద 52 గరిష్క టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. టియర్ డ్రాప్ ఆకారంలో 15.7 లీటర్ల ఫ్యూయల్ ట్యాంకును అమర్చింది. 19 ఇంచెస్ ఫ్రంట్ వీల్, 16 అంగుళాల అల్లాయ్ వీల్ కాంబినేషన్, ఫ్రంట్ 320 మిమీ డిస్క్ బ్రేక్, రియర్లో 300 డిస్క్ తో డ్యూయల్ -ఛానల్ ఏబిసి ఉంది. రౌండ్ LED హెడ్ల్యాంప్, ట్రిప్పర్ నావిగేషన్తో కూడిన డ్యూయల్-పాడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ , డ్యూయల్ ఎగ్జాస్ట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.భారతదేశంలో దాదాపు రూ. 3.4 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర ఉంటుందని అంచనా.