-
వోగ్ మ్యాగజీన్ కవర్ పేజ్పై ఇషా అంబానీ..లుక్ మామూలుగా లేదుగా!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె, రిలయన్స్ రీటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ పిరామిల్ మరోసారి ప్రతిష్టాత్మక ఫ్యాషన్ అండ్ బ్యూటీ మేగజీన్ వోగ్ కవర్పేజీపై మరోసారి మెరిసారు. గార్డెన్ ప్రిన్సెస్గా మారిన ఇషా అంబానీ తన ఫ్యాషన్ స్టయిల్ను చాటుకున్నారు. మేగజీన్ కవర్పేజీ కోసం చేసిన ఫోటోషూట్ను వోగ్ ఇండియా ఇన్స్టాలో ఖాతాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) ప్రత్యేకంగా తయారుచేసిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ డియోర్ గోల్డెన్ ఫ్రాక్లో ఇషా అంబానీ లుక్ అదిరిపోయింది. మ్యాచింగ్ రెడ్ అండ్ పింక్ గులీబాలు అమరి, చేతిలో బోకే, యాష్-టోన్ గ్లోవ్స్, కొత్త హెయిర్ స్టయిల్హైలైట్గా నిలిచాయి. ఈ ఫోటో షూట్లో రెండో లుక్లో చాలా ఎలిగెంట్గా కనిపించారామె. ‘నా ఉంగరాలు జుట్టు అంతగా ఇష్టం ఉండేది కాదు.. అలాగే షూట్ కోసం నా జుట్టును సెట్ చేస్తోంటే... నా స్కూలు కష్టాలు గుర్తొచ్చాయి. ఉంగరాల జుట్టు కంట్రోల్లోఉండాలంటే.. నూనె రాసుకోవడం, కిందికి దువ్వుకోవడం ఇవ్వన్నీ చెప్పేవారు. కానీ ఎపుడూ అలా జరగలేదు. సో... మనం ఎలా ఉన్నామో అలాగే హ్యాపీగా కంఫర్ట్గా ఉండాలి’’ అంటూ ఇషా పిరామిల్ తన కర్లీ హెయిర్ కష్టాలను గుర్తు చేసుకున్నారు.కాగా గతంలో కూడా వోగ్ ఇండియా కవర్ స్టోరీపైనా, మెట్గాలా ఫ్యాషన్ ఈవెంట్లో కూడా ఇషా కనిపించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ రీటైల్ బాధ్యతల్లో ఇషా దూసుకుపోతోంది. కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలతో సంస్థను పరుగులు పెట్టిస్తోంది. తాజాగా రిలయన్స్ రీటైల్ తమ కిరాణా, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) ఉత్పత్తులను ముంబైలో గంటలో ఆర్డర్ డెలివరీ చేసేలా కొత్త పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
రిలయన్స్ కొత్త బిజినెస్
రిలయన్స్ రిటైల్ క్విక్ కామర్స్ బిజినెస్లోకి అడుగుపెట్టింది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన 30-45 నిమిషాల్లో తమ వినియోగదారులకు వస్తువులు అందిస్తామని కంపెనీ తెలిపింది. అయితే ఈ సర్వీస్ ప్రాథమికంగా ముంబయి, నవీ ముంబయిలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పింది. సమీప భవిష్యత్తులో క్రమంగా దీన్ని ఇతర నగరాలకు విస్తరిస్తామని పేర్కొంది.ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) ఉత్పత్తులను తక్షణమే డెలివరీ చేసేందుకు వీలుగా రిలయన్స్ రిటైల్ ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. జియోమార్ట్ మొబైల్ అప్లికేషన్లో ‘హైపర్లోకల్ డెలివరీ’ ఎంపిక చేసుకుని వస్తువులు ఆర్డర్ పెట్టవచ్చని కంపెనీ చెప్పింది. వినియోగదారులకు తమ వస్తువులను 30-45 నిమిషాల్లో అందిస్తామని పేర్కొంది. ఇందుకోసం రిలయన్స్ జియోమార్ట్ పార్టనర్ల చొరవ కీలకమని చెప్పింది.టాటా యాజమాన్యంలోని బిగ్బాస్కెట్, బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టో.. వంటి క్విక్ కామర్స్ కంపెనీలు తమ వినియోగదారులకు 10 నిమిషాల్లోనే వస్తువులు అందిస్తున్నాయి. కానీ రిలయన్స్ రిటైల్ మాత్రం వస్తువుల డెలివరీ సమయాన్ని 30-45 నిమిషాలుగా ప్రతిపాదించింది. ఈ అంశంపై స్పందిస్తూ..‘ప్రస్తుతం మార్కెట్లో క్విక్ కామర్స్ సేవలందిస్తున్న కంపెనీలు డార్క్ స్టోర్ల ద్వారా వస్తువులు డెలివరీ చేస్తున్నాయి. అందుకోసం కంపెనీ చాలా ఖర్చు చేయాలి. స్టోరేజీ ప్రదేశాలను ఏర్పాటు చేయాలి. పెద్దసంఖ్యలో డెలివరీ సిబ్బందిని నియమించుకోవాలి. దానికి బదులుగా, రిలయన్స్ జియోమార్ట్ పార్టనర్లను రిటైల్ డెలివరీకి వినియోగించుకోవాలని అనుకుంటున్నాం. దాంతో డెలివరీ సమయం కొంత పెరిగినా కంపెనీ బ్యాలెన్స్ షీట్ స్థిరంగా ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. కస్టమర్ల డెలివరీ మార్గాలను ఆప్టిమైజ్ చేయడానికి ఫైండ్(FYND), లోకస్(Locus) వంటి సాంకేతిక ప్లాట్ఫారమ్లను ఉపయోగిస్తున్నాం’ అని చెప్పింది.గతేడాది రిలయన్స్..జియోమార్ట్ ఎక్స్ప్రెస్ పేరుతో నవీ ముంబయిలో క్విక్ కామర్స్ సర్వీస్ను ప్రారంభించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సేవలను నిలిపేసింది. తిరిగి తాజాగా తన సర్వీస్లను మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ రిటైల్ కిరాణా వ్యాపారం కోసం కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దామోదర్ మాల్, జియోమార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ వరగంటితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. -
ఇషా అంబానీకి జియో బంపర్ డీల్! సక్సెస్ అయితే..
ఈషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ బంపర్ డీల్ అందుకుంటోంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ ముకేశ్ అంబానీకి చెందిన జియో లీజింగ్ సర్వీసెస్ ఈషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్తో రూ.35,904 కోట్ల డీల్ కుదుర్చుకోనుంది.టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం, జియో లీజింగ్ సర్వీసెస్ వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ .35, 904 కోట్ల విలువైన రౌటర్లు, సెల్ ఫోన్లు వంటి టెలికాం పరికరాలు, కస్టమర్ కేంద్రాల ఎక్విప్మెంట్ కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ డీల్ కు ఆమోదం పొందడానికి కంపెనీ వాటాదారులకు పోస్టల్ బ్యాలెట్ నోటీసును పంపినట్లు సమాచారం.జియో లీజింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎల్ఎస్ఎల్) రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వినియోగదారులకు అనుబంధ సేవలతో పాటు టెలికాం పరికరాలను లీజుకు ఇచ్చే వ్యాపారంలోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ డీల్ విజయవంతమైతే భారత టెలికాం రంగంలో ఇదే అతిపెద్ద ఎక్విప్మెంట్ లావాదేవీ అవుతుంది. నివేదిక ప్రకారం, జెఎల్ఎస్ఎల్ లీజింగ్ మోడల్ ద్వారా, ముఖేష్ అంబానీ లేటెస్ట్ 5జీ పరికరాలను ప్రజలకు అందుబాటు ధరలో అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మోడల్ ఆకాష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోకు మరింత మంది చందాదారులను ఆకర్షిస్తుంది. జియో ఇప్పటికే భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా ఉన్న విషయం తెలిసిందే. 2025 మార్చి నుంచి 2026 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరాల్లో ఈ లావాదేవీ జరగనుంది. -
ఇషా అంబానీ ప్రయత్నం ఫలిస్తుందా..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార సామ్రాజ్యంలో ముఖేశ్అంబానీ మూడోతరానికి పాలనా పగ్గాలు ఎప్పుడో అప్పజెప్పారు. తన వ్యాపార బాధ్యతలను చూసుకునే భవిష్యత్ లీడర్లు వీరేనంటూ వారసులు ఆకాశ్, ఈశా, అనంత్ అంబానీల పేర్లను గతంలోనే ప్రకటించారు. రిలయన్స్ రిటైల్ వ్యాపార బాధ్యతలు ఇషా అంబానీ చేతికి వచ్చిన తర్వాత కంపెనీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అంబానీ కుమార్తె అనేక విదేశాలకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్లను దేశంలోని వినియోగదారులకు పరిచయం చేస్తూ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నారు. రిలయన్స్ రిటైల్ ఇండస్ట్రీస్ బ్రిటీష్ ఫ్యాషన్ లేబుల్ ప్రిమార్క్ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం జరిగితే టాటాకు చెందిన జూడియో, ల్యాండ్ మార్క్ గ్రూప్నకు చెందిన మ్యాక్స్, షాపర్స్ స్టాప్.. వంటి ప్రత్యర్థులకు రిలయన్స్ ఫ్యాషన్ పోటీ ఇవ్వనుందని పరిశ్రమ వర్గాలు తెలియజేస్తున్నాయి. వాస్తవానికి బ్రిటీష్ ప్రిమార్క్ బ్రాండ్ ఖరీదైన దుస్తులు, పాదరక్షలకు ప్రసిద్ధి చెందింది. రిలయన్స్-ప్రిమార్క్ మధ్య జాయింట్ వెంచర్ లేదా లైసెన్సింగ్ ఒప్పందం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం వార్తలు రాకముందు ప్రిమార్క్ ఇండియాలో వ్యాపారాన్ని విస్తరించే దిశగా అడుగులువేసినట్లు తెలిసింది. ప్రత్యేక రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. బ్రిటిష్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని కంపెనీని మరింత లాభాల్లోకి తీసుకువెళ్లనున్నట్లు రిలయన్స్ రిటైల్ అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: అత్తకు తగ్గ కోడలు.. నాట్యంలో దిట్ట.. ప్రిమార్క్ కంపెనీ లండన్ లిస్టెడ్ అసోసియేటెడ్ బ్రిటిష్ ఫుడ్స్ యాజమాన్యం పరిధిలో ఉంది. ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 స్టోర్లను కలిగి ఉంది. 2026 చివరి నాటికి 530 అవుట్లెట్లను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ మెజారిటీ దుస్తులను చైనా నుంచి కొనుగోలు చేసి విక్రయిస్తోంది. కంపెనీ తన ఉత్పత్తులను తక్కువ ధరలకు విక్రయిస్తోంది. మహిళా కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ప్రిమార్క్ ఉత్పత్తులు తయారుచేస్తున్నారు. -
మరో వ్యాపారంలోకి అంబానీ!.. రూ.27 కోట్ల డీల్
'రావల్గావ్ షుగర్ ఫామ్' (Ravalgaon Sugar Farm) ఐకానిక్ క్యాండీ బ్రాండ్ త్వరలో 'ముకేశ్ అంబానీ' చేతుల్లోకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ కంపెనీ కొనుగోలుకు 'రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్' రూ. 27 కోట్ల డీల్ కూడా కుదుర్చుకున్నట్లు సమాచారం. మ్యాంగో మూడ్, కాఫీ బ్రేక్, టట్టీ ఫ్రూటీ, పాన్ పసంద్, చాకో క్రీమ్, సుప్రీమ్ వంటి ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన రావల్గావ్ షుగర్ ఫామ్, తన ట్రేడ్మార్క్లు, వంటకాలు వంటి అన్ని హక్కులను రిలయన్స్ కన్స్యూమర్కు విక్రయించినట్లు శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది. సుమారు రూ. 27 కోట్ల డీల్తో కంపెనీని విక్రయించడానికి డైరెక్టర్ల బోర్డు కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం. గత కొంతకాలంగా కంపెనీ మార్కెట్ వాటా తగ్గుముఖం పట్టడం వల్ల వ్యాపారాన్ని కొనసాగించడంలో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. పెరిగిన ముడిసరుకుల ధరల వల్ల పెట్టుబడి ఎక్కువవుతోండటంతో.. విక్రయానికి సిద్దమైపోతోంది. రావల్గావ్ షుగర్ ఫామ్ అనేది రావల్గావ్ వాల్చంద్ గ్రూప్లో భాగంగా 1933లో ఏర్పాటైంది. ప్రారంభంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొని నిలదొక్కుకున్నప్పటికీ క్రమంగా లాభాలు క్షీణించాయి. 2023 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం కేవలం 9.66 కోట్ల రూపాయలు మాత్రమే. ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి ఫాస్ట్ట్యాగ్లు పనిచేయవు! కారణం ఇదే.. కరోనా మహమ్మారి దేశంలో విజృంభించిన సమయంలో స్కూల్స్, ఆఫీసులు వంటివన్నీ నెలల తరబడి మూతపడి ఉన్నాయి. ఇది కంపెనీ వ్యాపారాన్ని గట్టిగా దెబ్బతీసింది. కరోనా తగ్గిన తరువాత కూడా కంపెనీ లాభాలు వృద్ధి చెందక పోవడం వల్ల సంస్థను అమ్మడానికి పూనుకుంది. -
రెండక్షరాల పేరు కోసం 254 కోట్లు చెల్లించిన ముఖేష్ అంబానీ!
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఓ కంపెనీ పేరు వాడుకోనేందుకు సదరు కంపెనీకి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ రూ.254 కోట్లు చెల్లించారు. గత ఏడాది డిసెంబర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ‘రిలయన్స్ రీటైల్ వెంచర్స్’ జర్మనీ చెందిన మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియాను రూ.2,850 కోట్లకు కొనుగోలు చేసింది. క్రయ, విక్రయ సమయంలో జరిగిన ఒప్పందంలో భాగంగా మెట్రోకు చెందిన 31 హోల్సేల్ స్టోర్లు, 6 స్టోర్లలో ఉన్న స్థలాల్ని సైతం చేజిక్కించుకుంది. అయితే భారత్లో కొత్త యజమాని రిలయన్స్ వ్యాపారాన్ని నిర్వహించడానికి వీలుగా మెట్రో లైసెన్స్లు ఇచ్చింది. మెట్రో ఇండియా ఆస్తులతో పాటు ఆ పేరును వినియోగించుకునేందుకు రూ.254 కోట్లు చెల్లించింది. ఇకపై తన పేరును రియలన్స్ వాడుకోవచ్చని మెట్రో తన వార్షిక ఫలితాల విడుదల నివేదికలో తెలిపింది. 2003లో అడుగు పెట్టి జర్మనీ రీటైల్ సంస్థ మెట్రో ఇండియా 2003లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 నగరాల్లో 31 హోల్సేల్ పంపిణీ కేంద్రాలున్నాయి. 3,500 మంది ఉద్యోగులు ఉన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న రిటైలర్లు వంటి బిజినెస్ కస్టమర్లతో ఈ సంస్థ వ్యాపారం నిర్వహిస్తోంది. ‘క్యాష్-అండ్-క్యారీ’ వ్యాపార నమూనాతో భారత్లో కార్యకలాపాలు ప్రారంభించిన తొలి కంపెనీ ఇదే. ఈ పద్దతిలో ప్రస్తుత మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ఈ మెట్రో స్టోర్లో కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేయొచ్చు. -
ఇషా అంబానీకి చెందిన ఆ కంపెనీ విలువ రూ.8 లక్షల కోట్లు!
ఆసియాలోనే సంపన్నుడైన ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్ను విస్తరిస్తూ మార్కెట్ను ఏలుతున్నారు. నెమ్మదిగా ఆయన వ్యాపార బాధ్యతలు తన పిల్లలకు అప్పగిస్తున్నారు. అందులో ఇషాఅంబానీ తండ్రికి తగ్గ తనయగా గుర్తింపు పొందుతోంది. ఇషా రిలయన్స్ రిటైల్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కంపెనీని దశల వారీగా విస్తరిస్తూ ప్రస్తుతం రూ.8 లక్షల కోట్ల కంపెనీగా మలిచింది. కంపెనీ అనేక ప్రఖ్యాత విదేశీ బ్రాండ్లను దేశీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. దాదాపు 7వేల టౌన్ల్లో సుమారు 18వేల స్టోర్లతో దూసుకెళ్తున్న రిలయన్స్ రిటైల్ అభివృద్ధి వెనుక ఇషా అంబానీతోపాటు కంపెనీలో ఉన్నత స్థానంలోని వ్యక్తుల కృషి ఎంతో ఉందని ఆమె తెలిపారు. ఇప్పటికే బర్బెరీ, స్టీవ్ మాడెన్, అర్మానీ, బాలెన్సియాగా వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లతో రిలయన్స్ జతకట్టడానికి ఇషా అంబానీ ఎంతో కృషి చేసింది. రోజూ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కంపెనీకి సారథిగా ఉండడం కొంత కష్టమైన పని. అయితే కంపెనీలో కీలక నిర్ణయాలు తీసుకునే కొందరు విశ్వసనీయ సహాయకులను ఆమె నియమించుకున్నారు. రిలయన్స్ రిటైల్ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ అండ్ లైఫ్స్టైల్, గ్రాసరీ, ఫార్మా రిటైల్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. కంపెనీ తన మొదటి స్టోర్ను హైదరాబాద్లోనే ప్రారంభించింది. 2020లో అమెరికా పెట్టుబడి సంస్థ సిల్వర్లేక్ 1.75 శాతం వాటాను రూ.7500 కోట్లకు కొనుగోలు చేసింది. కంపెనీలో కేకేఆర్ సంస్థ 1.28 శాతం వాటా(రూ.5500 కోట్లు) కలిగి ఉంది. 2021లో ఫ్యూచర్గ్రూప్నకు చెందిన రిటైల్, హోల్సేల్, లాజిస్టిక్స్, వేర్హౌజింగ్ బిజినెస్ను రూ.24,713 కోట్లకు కొనుగోలు చేసింది. రిలయన్స్ రిటైల్ గత సంవత్సరం ఏకంగా 3,300 స్టోర్లను ప్రారంభించింది. 78 కోట్ల మంది ఈ స్టోర్లను కస్టమర్లు సందర్శిస్తుండగా.. 100 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో కంపెనీ ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు సందర్శిస్తున్న టాప్-10 రిటైల్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ఇదీ చదవండి: 10 నెలల్లో 110 మంది సీఈవోల రాజీనామా.. కారణం ఇదే..! రిలయన్స్ రిటైల్ గత రెండేళ్ల కాలంలో ఏకంగా రూ.82,646 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. ప్రస్తుతం దేశంలో 7000 టౌన్ల్లో మెుత్తం 18000 రిటైల్ స్టోర్లను కలిగి ఉంది. కంపెనీలో 2.45 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఇషా కంపెనీ పగ్గాలు చేపట్టిన తర్వాత రిలయన్స్ రిటైల్ విలువ భారీగా పెరిగింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.8.4 లక్షల కోట్లకు చేరుకుంది. -
హైదరాబాద్లో రిలయన్స్ ‘స్వదేశ్’.. నీతా అంబానీ చేతుల మీదుగా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగ దిగ్గజం రిలయన్స్ రిటైల్ ‘స్వదేశ్’ తొలి ఔట్లెట్ను హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఏర్పాటు చేసింది. రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్పర్సన్ నీతా అంబానీ చేతుల మీదుగా ఈ స్టోర్ ప్రారంభం కానుంది. సుమారు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది కొలువుదీరింది. చేనేత వస్త్రాలు, హస్తకళలు, ఫర్నిచర్, బొమ్మలు, ఆభర ణాలు, గృహాలంకరణ వస్తువులు, పెయింటింగ్స్, యాక్సెసరీస్తోపాటు వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తారు. దేశవ్యాప్తంగా చేతి వృత్తుల కళాకారులకు చెందిన గుర్తింపు ఉన్న సంఘాల నుంచి నేరుగా వీటిని సేకరిస్తారు. రూ.6 లక్షలకుపైగా ధర పలికే వస్తువులనూ విక్రయిస్తారు. -
రిలయన్స్ రిటైల్ చేతికి అరవింద్ బ్యూటీ బ్రాండ్స్
న్యూఢిల్లీ: వేగంగా వృద్ధి చెందుతున్న సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల (బీపీసీ) వ్యాపార కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అరవింద్ ఫ్యాషన్కి చెందిన అరవింద్ బ్యూటీ బ్రాండ్స్ రిటైల్ను కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఆర్ఆర్వీఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్తో షేర్ల కొనుగోలు ఒప్పందం (ఎస్పీఏ) కుదిరినట్లు అరవింద్ ఫ్యాషన్ వెల్లడించింది. ఈక్విటీ వాటా విక్రయ విలువ రూ. 99.02 కోట్లుగా ఉండనున్నట్లు పేర్కొంది. చెల్లించాల్సిన రుణాలు, ఈక్విటీ అంతా కలిపి సంస్థ మొత్తం విలువను రూ. 216 కోట్లుగా లెక్కగట్టినట్లు వివరించింది. డీల్లో భాగంగా అరవింద్ ఫ్యాషన్స్ నిర్వహిస్తున్న ఫ్రాన్స్ బ్యూటీ రిటైల్ బ్రాండ్ సెఫోరాకు భారత్లో ఉన్న 26 స్టోర్స్ కూడా ఆర్ఆర్వీఎల్కు దక్కుతాయి. ఇకపై తాము పూర్తిగా ఫ్యాషన్ (యూఎస్ పోలో, యారో మొదలైన 5 బ్రాండ్స్) పైనే దృష్టి పెట్టనున్నట్లు అరవింద్ ఫ్యాషన్స్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో అరవింద్ బ్యూటీ బ్రాండ్స్ రిటైల్ టర్నోవరు రూ. 336.70 కోట్లుగా నమోదైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్లోని రిటైల్ కంపెనీలన్నింటికీ ఆర్ఆర్వీఎల్ హోల్డింగ్ సంస్థగా ఉంది. బ్యూటీ రిటైల్ ప్లాట్ఫాం ’టిరా’ కొనుగోలుతో సౌందర్య సాధనాల వ్యాపారంలోకి ప్రవేశించింది. నైకా, టాటా, హిందుస్తాన్ యూనిలీవర్కి చెందిన లాక్మే మొదలైన దిగ్గజ బ్రాండ్స్తో పోటీపడుతోంది. రెడ్సీర్ స్ట్రాటెజీ కన్సల్టెంట్, పీక్ 15 సంయుక్త నివేదిక ప్రకారం 2022లో 19 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల మార్కెట్ 2027 నాటికి 30 బిలియన్ డాలర్లకు చేరనుంది. -
రిలయన్స్-ఎస్బీఐ క్రెడిట్ కార్డు.. రివార్డు పాయింట్లు, డిస్కౌంట్లు!
ముంబై: రిటైల్ దిగ్గజం రిలయన్స్ రిటైల్, ఎస్బీఐ కార్డు చేతులు కలిపాయి. తాజాగా రిలయన్స్ ఎస్బీఐ కార్డు పేరిట కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించాయి. దీనితో రిలయన్స్ రిటైల్ స్టోర్స్లో జరిపే కొనుగోళ్లపై రివార్డు పాయింట్లు, డిస్కౌంట్లు వంటి ప్రయోజనాలు పొందవచ్చని సంస్థ డైరెక్టర్ వి. సుబ్రమణియం తెలిపారు. అటు ఎస్బీఐ కార్డు అందించే ప్రత్యేక ఆఫర్లను కూడా అందుకోవచ్చు. వినియోగాన్ని బట్టి రెన్యువల్ ఫీజు నుంచి మినహాయింపు, రిలయన్స్ రిటైల్ వోచర్లు మొదలైనవి ఈ ప్రయోజనాల్లో ఉంటాయి. ఈ కార్డు రెండు వేరియంట్లలో (రిలయన్స్ ఎస్బీఐ కార్డు, రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్) లభిస్తుంది. వార్షిక రెన్యువల్ ఫీజు విషయానికొస్తే ప్రైమ్ కార్డుకి రూ. 2,999 గాను, రిలయన్స్ ఎస్బీఐ కార్డుకి రూ. 499 (పన్నులు అదనం) వర్తిస్తాయి. ప్రైమ్ కార్డుపై ఏటా రూ. 3,00,000 పైగా, రిలయన్స్ ఎస్బీఐ కార్డుపై రూ. 1,00,000 పైగా ఖర్చు చేస్తే రెన్యువల్ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. -
RIL: 29.7 శాతం పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం 29.7 శాతం పెరిగింది. దాంతో రూ.19,878 కోట్లు ఆర్జించినట్లు వెల్లడించింది. కంపెనీ తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్తోపాటు జియో, రిటైల్ వ్యాపారం మంచి పనితీరు కారణంగా కంపెనీ లాభాల్లో పయనిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ స్థూల ఆదాయం 1.2 శాతం పెరిగి రూ.2,55,996 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ డిజిటల్ విభాగమైన జియో ప్లాట్ఫామ్లు సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం 12 శాతం పెరిగి రూ.5,297 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.4,729 కోట్లుగా ఉంది. కొత్తగా చేరే సబ్స్క్రైబర్ బేస్లో 7.5 శాతం పెరుగుదల నమోదైంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ నికర లాభం 21 శాతం పెరిగి రూ.2,790 కోట్లకు చేరుకుంది. ఆదాయం 18.8 శాతం పెరిగి రూ.77,148 కోట్లుగా నిలిచింది. శుక్రవారం బీఎస్ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 1.75 శాతం పెరిగి రూ.2,265.25 వద్ద స్థిరపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ..డిసెంబర్ 2023 నాటికి దేశవ్యాప్తంగా వేగంగా 5జీ సేవలు విస్తరిస్తామన్నారు. రిలయన్స్ రిటైల్ విస్తరణను కొనసాగిస్తామని చెప్పారు. ఇంధన మార్కెట్లలో అస్థిరత ఉన్నప్పటికీ ఆయిల్2కెమికల్ విభాగానికి డిమాండ్ పెరిగిందన్నారు. -
అంబానీ కంపెనీతో ఏడీఏఐ డీల్.. వేలకోట్లు పెట్టుబడికి సిద్ధం!
అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ADIA).. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్లో 0.59 శాతం వాటా కోసం రూ. 4,966.80 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ఇది దేశంలోని ఈక్విటీ విలువ ప్రకారం మొదటి నాలుగు కంపెనీలలో ఒకటిగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కింద ఉన్న 'రిలయన్స్ రిటైల్' సంస్థ ఇషా అంబానీ ఆధ్వర్యంలో ముందుకు సాగుతోంది. ఈమె గత కొన్ని సంవత్సరాలుగా తన వ్యాపారాన్ని జోరుగా ముందుకు తీసుకెళ్లడం మీద దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే రిలయన్స్ రిటైల్ దాని అనుబంధ సంస్థలు, అసోసియేట్స్ ద్వారా వేగంగా డెవలప్ అవుతోంది. కొన్ని నివేదికల ప్రకారం.. రిలయన్స్ రిటైల్ కంపెనీ కింద ఏకంగా 18,500 కంటే ఎక్కువ స్టోర్స్ ఉన్నట్లు.. దీని ద్వారా సుమారు 26.7 కోట్ల మంది వినియోగదారులకు సేవలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్లో భాగస్వామి అయిన అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ADIA)కి ఎల్లప్పుడూ మా మద్దతు ఉంటుందని, ఈ పెట్టుబడి భారత ఆర్థిక వ్యవస్థ, మా వ్యాపార ప్రాథమిక అంశాలు, వ్యూహం, అమలు సామర్థ్యాలపై మీద ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని ఇషా అంబానీ అన్నారు. రానున్న రోజుల్లో రిటైల్ రంగంలో మార్పులు వేగవంతంగా పెరిగే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ఉద్యోగం పోయి చాలా రోజులైంది.. అప్పటి నుంచి.. మెటా మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్! ఇక ఏడీఐఏ ప్రైవేట్ ఈక్విటీ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హమద్ షాహ్వాన్ అల్ధహేరి మాట్లాడుతూ.. రోజు రోజుకి వేగంగా అభివృద్ధి చెందుతున్న రిలయన్స్ రిటైల్స్లో పెట్టుబడి పెట్టడం ఆనందంగా ఉందని, ఈ పెట్టుబడి సంస్థలో ప్రత్యేక మార్పును తీసుకువస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ డీల్ కోసం మోర్గాన్ స్టాన్లీ ఆర్థిక సలహాదారుగా వ్యవహరించనున్నట్లు సమాచారం. -
సూపర్డ్రైతో రిలయన్స్ జత
న్యూఢిల్లీ: దక్షిణాసియా మేధో హక్కుల(ఐపీ ఆస్తులు) విక్రయానికి రిలయన్స్ రిటైల్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూకే ఫ్యాషన్ రిటైలర్ సూపర్డ్రై తాజాగా పేర్కొంది. ఇందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ) ద్వారా రిలయన్స్ రిటైల్ 4 కోట్ల పౌండ్లు(రూ. 402 కోట్లు) వెచి్చంచనున్నట్లు వెల్లడించింది. ప్రధానంగా స్వెట్షర్టులు, హుడీస్, జాకెట్స్ తదితర ఫ్యాషన్ ప్రొడక్టులను రూపొందిస్తున్న సూపర్డ్రై.. జేవీలో 24 శాతం వాటాను పొందనుంది. మిగిలిన 76 శాతం వాటా రిలయన్స్ రిటైల్ చేతిలో ఉంటుంది. ఒప్పందం ప్రకారం సూపర్డ్రై బ్రాండ్ ఐపీ ఆస్తులు కొత్తగా ఏర్పాటు చేయనున్న జేవీకి శాశ్వతంగా బదిలీకానున్నాయి. రిలయన్స్ బ్రాండ్స్ హోల్డింగ్ యూకేతో ఐపీ జేవీ ఏర్పాటుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సూపర్డ్రై పీఎల్సీ.. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీకి తెలియజేసింది. తద్వారా భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్లలో సూపర్డ్రై బ్రాండుసహా.. సంబంధిత ట్రేడ్మార్క్లను జేవీకి బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. నిధుల ఆవశ్యకత: సూపర్డ్రై ఇటీవల హోల్సేల్ కస్టమర్ల నుంచి బలహీన ఆర్డర్ల కారణంగా స్టాక్ నిల్వలు, లిక్విడిటీ తదితర అంశాలలో సవాళ్లు ఎదుర్కొంటోంది. దీంతో జేవీకి తెరతీసింది. దీంతో స్థూలంగా 3.04 కోట్ల పౌండ్ల నగదు లభించనుందని అంచనా వేస్తోంది. కాగా.. తాజా ఒప్పందంతో రిలయన్స్ దక్షిణాసియాలోని మూడు దేశాలలో కార్యకలాపాలు చేపట్టనున్నట్లు సూపర్డ్రై తెలియజేసింది. జేవీలో సూపర్డ్రై వాటాను కొనసాగించడంతోపాటు.. తమ నైపుణ్యం ద్వారా బ్రాండ్ డెవలప్మెంట్, డిజైన్, మార్కెటింగ్లలో మద్దతిస్తుందని రిలయన్స్ బ్రాండ్స్ ఎండీ దర్శన్ మెహతా చెప్పారు. భారత్ భారీ అవకాశాల మార్కెట్కాగా.. రిలయన్స్తో పటిష్ట బంధమున్నట్లు సూపర్డ్రై వ్యవస్థాపకుడు, సీఈవో జూలియన్ డంకెర్టన్ పేర్కొన్నారు. -
కష్టాల్లో స్టార్టప్: గుడ్బై చెప్పిన కో-ఫౌండర్
బెంగళూరుకు చెందిన ఆన్-డిమాండ్ డెలివరీ ప్లాట్ఫామ్ డన్జోకు భారీ షాక్ తగిలింది. లిక్విడిటీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో డన్జో సహ వ్యవస్థాపకుడు దల్వీర్ సూరి కంపెనీకి గుడ్బై చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్దతున్న స్టార్టప్ భారీ పునర్నిర్మాణ ప్లాన్ ప్రకటించిన తరువాత నలుగురు సహ వ్యవస్థాపకులలో ఒకరైన దల్వీర్ సూరి సంస్థ నుంచి నిష్క్రమించడం చర్చకు దారి తీసింది. ఈ విషయాన్ని డన్జో CEO కబీర్ బిస్వాస్ సోమవారం ఉదయం ఇమెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. సూరి కొంత కాలంగా విరామం తీసుకోవాలని భావిస్తున్నారని, సరికొత్తగా ముందుకు సాగాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ త్రైమాసికం నుండే వ్యాపార పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కొన్ని మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. (కిర్రాక్ కుర్రోడు: రూ. 45 వేలకే ‘రోల్స్ రాయిస్’! వైరల్ వీడియో) 2015 మే నుంచిస్టార్టప్ కంపెనీకి కో-ఫౌండర్గా సూరి ఆరేళ్లకు పైగా పనిచేశారు. అలాగే డంజో మర్చంట్ సర్వీసెస్ (DMS)తో సహా కొత్త వ్యాపారాలను పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా గత కొన్ని నెలలుగా నిధుల సమీకరణం కోస కష్టపడుతోంది. ఈ కష్టాల నేపథ్యంలో గత కొన్ని నెలలుగా కంపెనీ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. నగదు కొరతతో సతమతమవుతున్న ఈ సంస్థకు నిధులు రాకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. వీటన్నింటికి తోడు నష్టాలను చవిచూస్తోంది. జీతాలు చెల్లించడానికి కూడా డబ్బు లేదు. జీతాల చెల్లింపులను పలుమార్లు వాయిదా వేసిన సంస్థ గత నెలలో, Dunzo ఆగస్టు నెల జీతాలకుగాను పేరోల్ ఫైనాన్సింగ్ కంపెనీ OneTapతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కంపెనీ రెండో అతిపెద్ద పెట్టుబడిదారు అయిన గూగుల్ , బకాయిలు చెల్లించమని కోరుతూ కంపెనీకి లీగల్ నోటీసు పంపిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయవచ్చు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ సంస్థ నీలెన్సో , గూగుల్ కలిపి దాదాపు రూ.4 కోట్లు బకాయినోటీసులిచ్చాయి. అయితే ఎపుడు సూరి పదవీకాలం ముగిసేది, అతని స్థానంలో ఎవరు రాబోతున్నారనేది వెల్లడించలేదు. సూరి, బిశ్వాస్తోపాటు అంకుర్ అగర్వాల్ , ముకుంద్ ఝా కంపెనీ ఇతర సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. అయితే ఈ నలుగురిలో బిస్వాస్కు మాత్రమే కంపెనీలో 3.57 శాతం ఈక్విటీ వాటా ఉంది. సూరికి ఈక్విటీ లేదు జీతం కూడా లేని కారణంగానే తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు Dunzo ఇప్పటివరకు Reliance, Google, Lightrock, Lightbox, Blume Ventures ఇతర కంపెనీల నుంచి 2015 నుండి దాదాపు 500 మిలియన్ డాలర్లను సేకరించింది. రిలయన్స్ కంపెనీలో 25.8 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉంది. ప్రైవేట్ మార్కెట్ డేటా ప్రొవైడర్ Tracxn ప్రకారం, ప్రస్తుతం Dunzoలో 19 శాతం యాజమాన్యంతో Google రెండో అతిపెద్ద వాటాదారు. డంజో దాదాపు రూ.250 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. -
రిలయన్స్ రిటైల్లో పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కేకేఆర్ దాదాపు రూ. 2,070 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఇందుకుగాను కేకేఆర్కు 1,71,58,752 ఈక్విటీ షేర్లను జారీ చేసినట్లు రిలయన్స్ రిటైల్ వెల్లడించింది. దీంతో రిలయన్స్ రిటైల్లో కేకేఆర్ వాటా 1.17 శాతం నుంచి 1.42 శాతానికి బలపడింది. ఈ నెల మొదట్లో అనుబంధ రిటైల్ సంస్థలో కేకేఆర్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) పేర్కొన్న సంగతి తెలిసిందే. 1976లో ఏర్పాటైన కేకేఆర్ 2023 జూన్కల్లా 519 బిలియన్ డాలర్ల విలువైన నిర్వహణలోని ఆస్తులను కలిగి ఉంది. కాగా.. ఈ నెల మొదట్లోనే ఆర్ఐఎల్ ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(క్యూఐఏ) నుంచి రూ. 8,278 కోట్ల పెట్టుబడులను అందుకుంది. తద్వారా రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో 1 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇక 2020లో వివిధ గ్లోబల్ పీఈ సంస్థలకు 10.09 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ. 47,265 కోట్లను సమకూర్చుకోవడం ప్రస్తావించదగ్గ విషయం! -
రిలయన్స్ ఇషా అంబానీ మరో భారీ డీల్: కేకేఆర్ పెట్టుబడులు
KKR invests Reliance Retail రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ భారీ పెట్టుబడులను సాధించింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ అమెరికాకు,చెందిన KKR, రిలయన్స్రీటైల్ వాటాను1.42 శాతానికి పెంచుకోనుంది. ఇందుకుగాను రిలయన్స్ రీటైల్లో రూ. 2,070 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీంతో రిలయన్స్ రీటైల్ ప్రీ-మనీ ఈక్విటీ విలువ రూ. 8.36 లక్షల కోట్లకు చేరిందని కంపెనీ సోమవారం ప్రకటించింది. దీంతో ఈక్విటీ విలువ పరంగా దేశంలోని మొదటి నాలుగు కంపెనీలలో ఒకటిగా నిలిచింది. గత నెలలో ముఖేష్ అంబానీ రిటైల్ సామ్రాజ్యంలో ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడితరువాత ఈ ఒప్పందం జరిగడం విశేషం. న్యూయార్క్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ప్రైవేట్ ఈక్విటీ సంస్థ KKR రిలయన్స్ రిటైల్లో 2020లో ఆర్ఆర్విఎల్లో 1.28 శాతం వాటాల కొనుగోలు ద్వారా రూ. 5,550 కోట్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కొనుగోలుతో మొత్తం ఈక్విటీ వాటా పూర్తిగా పలచన ప్రాతిపదికన 1.42శాతానికి పెరిగింది. 2020లో వివిధ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుండి మొత్తం రూ. 47,265 కోట్ల నిధుల సమీకరించింది. దీంతో పాటు KKR రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెలికాం యూనిట్ అయిన జియో ప్లాట్ఫారమ్ల లిమిటెడ్లో కూడా పెట్టుబడిదారుగా ఉంది. (జీ20 సమ్మిట్: దాదాపు రూ. 400కోట్లు నష్టం, వ్యాపారుల ఆందోళన) 1976లో స్థాపించబడిన, KKR జూన్ 30, 2023 నాటికి సుమారు 519 బిలియన్ల డాలర్లు ఆస్తులను కలిగి ఉంది. కేకేర్ ఫాలోఅన్ పెట్టుబడులపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా ముఖేష్ అంబానీ, ఇటు రిలయన్స్తో భాగస్వామ్యంపై KKR సహ-CEO జో బే ఈ డీల్పై సంతోషం ప్రకటించారు. భారతదేశంలో నిజమైన కార్పొరేట్ లీడర్, ఇన్నోవేటర్. ఈ బృందంతో భాగస్వామ్యాన్ని కొనసాగించే అవకాశం లభించడం సంతోషమని కెకెఆర్లోని ఆసియా పసిఫిక్ ప్రైవేట్ ఈక్విటీ హెడ్ గౌరవ్ ట్రెహాన్ పేర్కొన్నారు. (విమానంలో వెర్రి వేషాలు, నిద్ర నటించిన మహిళ ఏం చేసిందంటే?) -
ఇషా అంబానీతో జతకట్టిన అలియాభట్! ఇక దూకుడే..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt), రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ ( Isha Ambani) జతకట్టారు. ఎడ్-ఎ-మమ్మా అనే వ్యాపార సంస్థతో బిజినెస్ రంగంలోనూ పేరుగాంచిన అలియాభట్, రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్తో చేతులు కలిపారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు అలియాభట్. ఇషా అంబానీతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘బూట్స్ట్రాప్డ్ వెంచర్ ఎడ్-ఎ-మమ్మా (Ed-a-Mamma), భారతదేశపు అతిపెద్ద రిటైలర్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ( Reliance Retail Ventures Ltd) సంస్థలు చేతులు కలిపాయి. ఇక రెండూ కలిసి వ్యాపారం సాగిస్తాయి’ అని అలియాభట్ పేర్కొన్నారు. ఇద్దరు తల్లులమైన తాము ఇలా చేతులు కలపడం మరింత ప్రత్యేకమైందని వివరించారు. (తండ్రికి తగ్గ తనయ.. ఆకట్టుకున్న ఇషా అంబానీ మాటలు!) ఎడ్-ఎ-మమ్మా కంపెనీని 2020లో ఏర్పాటు చేశారు అలియా భట్. ఇది ప్రత్యేకంగా పిల్లలు, టీనేజనర్ల దుస్తులు, ప్రసూతి తల్లులకు సంబంధించిన దస్తులు విక్రయించే ఆన్లైన్ షాపింగ్ సంస్థ. ఇక అర్మానీ ఎక్స్ఛేంజ్, బుర్బెర్రీ, జిమ్మీ చూ వంటి ప్రముఖ బ్రాండ్ల సహకారంతో రిలయన్స్ రిటైల్ భారతదేశంలో అతిపెద్ద రిటైలర్లలో ఒకటిగా ఉంది. దీనికి డైరెక్టర్గా ఉన్న ఇషా అంబానీ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
ఇషా అంబానీకి కొత్త బాధ్యతలు: కుమార్తెపై నీతా నమ్మకం అలాంటిది!
Isha Ambani రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె, రిలయన్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇషా అంబానీ మరో కీలకమైన పదవికి ఎంపికైనారు. అంబానీ భార్య , రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్, ఛైర్ పర్సన్ నీతా అంబానీ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్య, కళలు, క్రీడలు పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తూ, అనేక సామాజిక కార్యకలాపాలను నిర్వించే నీతా తన ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్ను మరింత విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలోనే తన కొత్త వెంచర్ బాధ్యతలను కుమార్తె ఇషాకు అప్పగించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) 46వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) నీతా అంబానీ , నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ ద్వారా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ను విస్తరించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇషా అంబానీ నేతృత్వంలో ఈ పాఠశాల భారతీయ ఆత్మతో భవిష్యత్తులో ఒక మోడల్ స్కూల్గా తీర్చిదిద్దనున్నట్టు కూడా వెల్లడించారు. రిలయన్స్ ఫౌండేషన్ రాబోయే 10 సంవత్సరాలలో రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ల ద్వారా 50వేల మంది విద్యార్థులకు మద్దతు ఇవ్వనున్నామని, ఈ సంవత్సరంలోనే, సంస్థ 5000 స్కాలర్షిప్లను ప్రదానం చేశామని కూడా తెలిపారు. రిలయన్స్ రీటైల్ హెడ్గా దూసుకుపోతున్న ఇషా అంబానీ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్కి వైస్ చైర్పర్సన్ కూడా. ఇపుడిక నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ బాధ్యతలను చేపట్టానున్నారు. అలాగే రిలయన్స్ రీటైల్కు సంబంధించి ఇప్పటికే పలు విదేశీ రిటైల్ బ్రాండ్లతో కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. -
తండ్రికి తగ్గ తనయ.. ఆకట్టుకున్న ఇషా అంబానీ మాటలు!
Isha Ambani at Reliance AGM 2023: రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ వ్యాపారం, పెట్టుబడులు.. ఇలా అన్ని అంశాల్లోనూ దూసుకెళ్తోంది. ముఖేష్ అంబానీ తనయ ఇషా అంబానీ నాయకత్వంలో రిటైల్ బిజినెస్ పరుగులు పెడుతోంది. తాజాగా జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ రిటైల్ ప్రగతిని ఇషా అంబానీ వివరించారు. రిలయన్స్ రిటైల్ 2023 ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల లావాదేవీల మైలురాయిని దాటింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 42 శాతం పెరిగింది. సంస్థ రిజిస్టర్డ్ కస్టమర్ బేస్ 249 మిలియన్లకు చేరుకుంది. 3,300 కొత్త స్టోర్లు ఏర్పాటయ్యాయి. మొత్తంగా 65.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 18,040 స్టోర్లకు రిటైల్ విస్తరణ చేరుకుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ వివరించారు. ల్యాండ్మార్క్ ఇయర్ కంపెనీ డిజిటల్ కామర్స్, ఇతర కొత్త వ్యాపారాలు దాదాపు రూ.50,000 కోట్ల ఆదాయాన్ని అందించాయి. అంటే మొత్తం రెవెన్యూలో ఇది ఐదో వంతు. "మేము గత రెండు సంవత్సరాలలో 10 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.82 వేల కోట్లు)కుపైగా పెట్టుబడి పెట్టాం. సమ్మిళిత వృద్ధి, అంతర్గత బ్రాండ్లను పెంచుకోవడం, సప్లయి చైన్ నెట్వర్క్లను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెడుతున్నాం" అని ఇషా అంబానీ చెప్పారు. రిటైల్ వ్యాపారానికి 2023 ఆర్థిక సంవత్సరాన్ని ఒక మైలురాయి సంవత్సరంగా ఆమె అభివర్ణించారు. ఇదీ చదవండి: తక్కువ ధరలతో రిలయన్స్ కొత్త ఫ్యాషన్ బ్రాండ్.. తొలి స్టోర్ హైదరాబాద్లోనే.. “మేము గత సంవత్సరం 3,300 కొత్త స్టోర్లను ప్రారంభించాం. మొత్తం స్టోర్లు 18,040లకు చేరుకున్నాయి. 6.56 కోట్ల చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని కవర్ చేశాం. ఈ స్టోర్లలో మూడింట రెండొంతులు టైర్ 2, టైర్ 3 నగరాలు, చిన్న పట్టణాల్లోనే ఉన్నాయి" అని ఇషా అంబానీ పేర్కొన్నారు. తమ బ్యాకెండ్ వేర్హౌసింగ్, లాజిస్టిక్స్ ఆస్తులలో కూడా కంపెనీ పెట్టుబడి పెడుతోంది. రిలయన్స్ రిటైల్ బలమైన వృద్ధి భారతదేశంలో ఈ-కామర్స్, ఆన్లైన్ షాపింగ్కు పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనం. కంపెనీ తన ఫిజికల్ స్టోర్ నెట్వర్క్ను టైర్ 2, టైర్3 మార్కెట్లలోకి విస్తరించడం ద్వారా కూడా ప్రయోజనం పొందుతోంది. భారతదేశంలోని 30 శాతానికి పైగా జనాభాకు తమ ఉత్పత్తులను అందిస్తున్నట్లు ఇషా అంబానీ చెప్పారు. ఇవన్నీ రిలయన్స్ రిటైల్ను ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే టాప్-10 రిటైలర్లలో ఒకటిగా నిలిపాయని వివరించారు. నాలుగు ‘సీ’ల సూత్రంపైనే.. రిటైల్ వ్యాపారం కొలాబరేషన్, కన్జ్యూమర్ ఎంగేజ్మెంట్, క్రియేటివిటీ, కేర్ అనే 4 సీ(C)ల సూత్రంపై ఆధారపడి ఉంటుంది. రిలయన్స్ రిటైల్ భారతీయ కుటుంబాల రోజువారీ అవసరాలను 90 శాతానికి పైగా తీర్చేలా ఉత్పత్తులను అందిస్తోంది. కిరాణా వ్యాపారంలో ఈ సంవత్సరంలో 18 లక్షల మెట్రిక్ టన్నుల కిరాణా సామగ్రిని విక్రయించాం. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్లో సంవత్సరంలో దాదాపు 5 లక్షల ల్యాప్టాప్లు, 23 లక్షలకు పైగా ఉపకరణాలను విక్రయించాం. ఇక ఫ్యాషన్ & లైఫ్స్టైల్ వ్యాపారంలో ఈ సంవత్సరంలో రికార్డు స్థాయిలో 50 కోట్ల వస్త్రాలను విక్రయించినట్లు ఇషా అంబానీ చెప్పారు. కంపెనీ ఇటీవల యువత లక్ష్యంగా ఫ్యాషన్ రిటైల్ ఫార్మాట్ యూస్టాను ప్రారంభించింది. హైదరాబాద్లోని శరత్ సిటీ మాల్లో తన మొదటి స్టోర్ను ప్రారంభించింది. ఇది యువతకు సరసమైన ధరలలో ఫ్యాషన్ ఉత్పత్తులు అందిస్తుంది. ఇదీ చదవండి: అంబానీ కంపెనీ దూకుడు! భారీగా పెరిగిన నికర రుణం.. అయినా తగ్గేదేలే.. -
అంబానీ కంపెనీ దూకుడు! భారీగా పెరిగిన నికర రుణం
దూకుడు మూలధన వ్యయం కారణంగా 2023 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ( Reliance Industries Ltd )కు చెందిన రిటైల్ విభాగం నికర రుణం అనేక రెట్లు పెరిగింది. ఏడాది క్రితం రూ.1,600 కోట్లు ఉన్న రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ( Reliance Retail Ventures Ltd ) నికర రుణం 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.37,500 కోట్లకు పెరిగినట్లుగా కంపెనీ ఫైలింగ్స్ ద్వారా తెలుస్తోంది. కంపెనీ మూలధన వ్యయంలో భారీ పెరుగుదలే నికర రుణం ఈ స్థాయిలో పెరగడానికి కారణంగా తెలుస్తోంది. కంపెనీ క్యాపెక్స్ 70 శాతం పెరిగి రూ.51,400 కోట్లకు చేరింది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొత్తం మూలధన వ్యయంలో మూడవ వంతు. రిలయన్స్ మూలధన వ్యయం గత ఏడు సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా 2023 ఆర్థిక సంవత్సరంలో 85 ఉందని జెఫ్రీస్ ఫైనాన్షియల్ గ్రూప్ ఒక పరిశోధనా నోట్లో తెలిపింది. ఇక కంపెనీ రిటైల్ సెగ్మెంట్ మూలధన వ్యయం గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 1 లక్ష కోట్లకుపైగా ఉంది. స్థాయితో సంబంధం లేకుండా పోర్ట్ఫోలియో స్ప్రెడ్లో రిలయన్స్ రిటైల్ దూసుకెళ్తోంది. ఇదీ చదవండి: Yousta: తక్కువ ధరలతో రిలయన్స్ కొత్త ఫ్యాషన్ బ్రాండ్.. తొలి స్టోర్ హైదరాబాద్లోనే.. -
తక్కువ ధరలతో రిలయన్స్ కొత్త ఫ్యాషన్ బ్రాండ్.. తొలి స్టోర్ హైదరాబాద్లోనే..
రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ ( Reliance Retail Ltd ) వ్యాల్యూ అపరెల్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇప్పటికే ప్రసిద్ధి చెందిన టాటా జూడియో ( Tata Zudio ) చైన్, ల్యాండ్మార్క్ గ్రూప్ యాజమాన్యంలోని మ్యాక్స్, షాపర్స్ స్టాప్కు చెందిన ఇక్ ట్యూన్కి పోటీగా కొత్త బ్రాండ్ యూస్టా ( Yousta )ని ప్రారంభించింది. అన్ని ఉత్పత్తులు రూ. 999 లోపే సమకాలీన టెక్-ఎనేబుల్డ్ స్టోర్ లేఅవుట్లతో, యువ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సరసమైన ధరలకు యూస్టా హై ఫ్యాషన్ ఉత్పత్తులను అందిజేస్తుందని కంపెనీ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్టోర్లో అన్ని ఉత్పత్తులు రూ. 999 కంటే తక్కువ ధరకే లభిస్తాయి. అందులోనూ ఎక్కువ భాగం రూ. 499 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంచడం విశేషం. హైదరాబాద్లో తొలి స్టోర్ రిలయన్స్ యూస్టా తమ తొలి స్టోర్ను హైదరాబాద్లోని శరత్ సిటీ మాల్లో ప్రారంభించింది. యూస్టా స్టోర్లను అనేక టెక్ టచ్ పాయింట్లను అమర్చారు. క్యూఆర్ స్క్రీన్లు, సెల్ఫ్-చెక్అవుట్ కౌంటర్లు, కాంప్లిమెంటరీ వైఫై, ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ యూస్టా ఉత్పత్తులను అజియో ( Ajio ), జియో మార్ట్ ( JioMart ) ద్వారా కూడా ఆన్లైన్లో యాక్సెస్ చేయవచ్చు. -
ఇషా అంబానీ దూకుడు: ఖతార్ నుంచి రూ.8 వేల కోట్ల పెట్టుబడులు
బిలియనీర్,రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పెట్టుబడుల విషయంలో దూసుకుపోతోంది. రిలయన్స్కు చెందిన రీటైల్ విభాగం భారీ పెట్టుబడులను సాధించింది. ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (QIA) రిలయన్స్ రీటైల్లో రూ. 8,278 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడి నిమిత్తం సంస్థలో దాదాపు ఒక శాతం వాటాను తీసుకుంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్), ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ద్వారా, అనుబంధ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్విఎల్)లో రూ. 8,278 కోట్ల పెట్టుబడి పెట్టనుందని రిలయన్స్ బీఎస్ఈ ఫైలింగ్లోతెలిపింది. ఇది రిలయన్స్ రిటైల్లో 0.99 శాతం వాటాను కొనుగోలుతో మైనారిటీ ఈక్విటీ వాటాగా మారుతుంది. ఈ పెట్టుబడి ప్రీ-మనీ ఈక్విటీ వాల్యూ రూ. 8.278 లక్షల కోట్లు అనిఆగస్టు 23న విడుదల చేసిన ప్రకటనలో రిలయన్స్ వెల్లడించింది. ఇషా అంబానీ ఏమన్నారంటే రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్లో క్యూఐఏ పెట్టుబడులపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా ముఖేష్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. తమ సంస్థను ప్రపంచ స్థాయి సంస్థగా మరింత అభివృద్ధి చేయడం ద్వారా, భారతీయ రిటైల్ రంగాన్ని మార్చేందుకు, క్యూఐఏ గ్లోబల్ అనుభవం బలమైన ట్రాక్ రికార్డ్ తమకు లబ్ది చేకూరుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియా రిటైల్ మార్కెట్లో, విభిన్నమైన పెట్టుబడుల పోర్ట్ఫోలియోలో చేరడంపై ఆనందంగా ఉందని క్యూఐఏ సీఈఓ మన్సూర్ ఇబ్రహీం అల్-మహమూద్ అన్నారు. కాగా ఆర్ఆర్విఎల్ 2020లో వివిధ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుండి రూ. 4.21 లక్షల కోట్ల ప్రీ-మనీ ఈక్విటీ వాటాగా మొత్తం రూ. 47,265 కోట్ల నిధుల సమీకరించిన సంగతి తెలిసిందే. -
అంబానీ ప్లాన్లు మామూలుగా లేవుగా: రూ.40 వేల కోట్లపై కన్ను
ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో భారీ ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. ఆయిల్ నుంచి టెలికాం దాకా పట్టిందల్లా బంగారంలా దూసుకు పోతున్న అంబానీ తాజాగా వేల కోట్ల నిధుల సమీకరణపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు దీనికి సంబంధించిన ప్రపోజల్ను మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ముందు ఉంచినట్టు సమాచారం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (InvIT) ద్వారా ప్రాథమికంగా రూ.400 కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తోంది.దీనికి సంబంధించిన ప్రతిపాదనను సెబీ వద్ద దాఖలు చేసినట్లు ఇండియా రిటైలింగ్ రిపోర్ట్ చేసింది. రిలయన్స్ రిటైల్ ఇన్విట్ రానున్న రెండు నెలల్లో ప్రారంభంలో సుమారు రూ.400 కోట్లను సమీకరించనుంది. మొదటి రౌండ్ నిధులతో ట్రస్ట్ను ఏర్పాటు చేయనున్నాయి. అయితే ఈ ఏడాది క్యూ4 నాటికి మొత్తంగా రూ.25,000-40,000 కోట్ల దాకా నిధులను సేకరించాలనేది ప్రణాళిక. అయితే ఈ వార్తలపై రిలయన్స్ అధికారంగా స్పందించాల్సి ఉంది. (అంబానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఎల్ఐసీ భారీ వాటా కొనుగోలు) 2.4-3 బిలియన్ డాలర్ల ట్రస్ట్తో రిటైల్ వేర్హౌసింగ్ ఆస్తులను మోనటైజ్ చేయడానికి సిద్ధమవుతోందన్న వార్తలు గత ఏప్రిల్ నుంచే హల్చల్చేస్తున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ రిటైల్ విభాగం ఇటీవలి కాలంలో ఆఫ్లైన్ సెగ్మెంట్లో భారీగా విస్తరిస్తోంది.ఈ క్రమంలో రిలయన్స్ రిటైల్ ఇతర కీలకమైన అంబానీ సంస్థలను అధిగమించి 112 బిలియన్ డాలర్ల విలువగా బ్రోకరేజ్ సంస్థ బెర్న్స్టెయిన్ ఇటీవల నివేదించడం గమనార్హం. దీంతో ఈ వార్తలు మరింత బలం చేకూరుతోంది. కాగా 2022 ఆగస్టులో రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్ పగ్గాలను ఇషా అంబానీ చేపట్టారు. ఆమెనేతృత్వంలోని రిలయన్స్ రిటైల్లో పెట్టుబడి రూ. 25,000 కోట్లకు పైమాటే.దీనికి అదనంగా రూ. 15000 కోట్లుపెట్టుబడులను రిలయన్స్ అందించనుంది. -
తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ
దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనిక పారిశ్రామికవేత్తగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇపుడు కుటుంబ వారసురాలిగా బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చిన అంబానీ తనయ ఇషా అంబానీ కూడా సంచలనం సృష్టించారు. రిలయన్స్ రిటైల్ విభాగం, రిలయన్స్ రిటైల్ లాభాల్లో మాతృ సంస్థనే అధిగమించింది. దశాబ్దాల చరిత్ర కలిగిన రిలయన్స్తో పోలిస్తే దాదాపు రెండింతలు విలువను కలిగి ఉందట. బాధ్యతలను స్వీకరించిన అనతి కాలంలోనే రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని శరవేగంగా పరుగులు పెట్టిస్తూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్నారు ఇషా. బ్రోకరేజ్ సంస్థ బెర్న్స్టెయిన్ తాజా నివేదిక ప్రకారం ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ విలువను రూ.9,26,055 కోట్లుగా (112 బిలియన్ డాలర్లు) అంచనా వేసింది. ఆయిల్ టు కెమికల్స్ రిలయన్స్ వ్యాపారం రూ.4,71,295 కోట్ల కంటే రెండు రెట్లు ఎక్కువ అని తెలిపింది. (పల్సర్ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?) రిలయన్స్ రిటైల్ అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు, భారీ పెట్టుబడులతో సరికొత్త విస్తరణలతో కంపెనీని కొత్త పుంతలు తొక్కిస్తోంది. రిలయన్స్ EBITDA భారీ పెరుగుదలకు డిజిటల్ రిటైల్, న్యూ ఎనర్జీతో సాధ్యమైందని బెర్న్స్టెయిన్ వెల్లడించింది. అంతేకాదు 2027 రిలయన్స్ రిటైల్ వ్యయం రూ.18,900 కోట్లకు చేరుకుంటుందని అంచనావేసింది. రిలయన్స్ మొత్తం మూలధన వ్యయంలో 19శాతం వాటాను కలిగి ఉంటుందని కూడా అంచనా వేసింది.రిలయన్స్ రిటైల్ మార్కెట్ నాయకత్వం స్టోర్ నెట్వర్క్ను విస్తరించడం (గత రెండు సంవత్సరాల్లో 1.5 రెట్లు), కొత్త బ్రాండ్లను (1.2 బిలియన్ డాలర్లుపెట్టుబడులు), ఇ-కామర్స్/న్యూ కామర్స్ (రూ. 18 శాతం మిశ్రమం) కొనుగోళ్లతో 7.7 శాతం ఆరోగ్యకరమైన మార్జిన్లతో ప్రత్యర్థులతో పోలిస్తే వార్షిక ప్రాతిపదిక (రూ. 20 శాతం)బలమైన వృద్ధిసాధిస్తోందని పేర్కొంది. (ఇండియాలో అత్యధికంగా అమ్ముడుబోయిన కారు ఇదే: ఎన్ని కార్లు తెలుసా?) రిలయన్స్ రిటైల్ దేశంలో అతిపెద్ద ఆర్గనైజ్డ్ రీటైలర్ అని పేర్కొన్న బ్రోకరేజ్ సంస్థ, కంపెనీ ఆదాయం 30 బిలియన్ల డాలర్లతో దేశంలోని మూడు రిటైలర్ల ఉమ్మడి స్కేల్ కంటే 2.5 రెట్లు ఎక్కువఅని వ్యాఖ్యానించింది. 2022, ఆగస్టులో రిలయన్స్ రిటైల్ లీడర్గా ఇషా అంబానీ నియమితులైన సంగతి తెలిసిందే. -
ఆ వార్తల్లో వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన రిలయన్స్
ఆన్లైన్ మిల్క్, గ్రోసరి డెలివరీ సంస్థ మిల్క్బాస్కెట్ ఉద్యోగుల్ని తొలగించనుందంటూ వస్తున్న నివేదికలపై ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ స్పందించింది. గ్రోసరీ డెలివరీ సంస్థలో ఉద్యోగుల్ని తొలగించడం లేదని స్పష్టం చేసింది. రియలన్స్ సంస్థ 2021లో మిల్క్ బాస్కెట్ను 40 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే, వ్యాపార విస్తరణలో భాగంగా రిలయన్స్ సంస్థ ఈ మిల్క్ బాస్కెట్ను తన రీటైల్ సంస్థ జియో మార్ట్లో కలపనుందని పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. ఇంటిగ్రేట్లో భాగంగా గ్రోసరీ డెలివరీకి చెందిన ఉద్యోగుల స్థానాల్ని పునర్వ్యవస్థీకరించనున్నట్లు మిల్క్ బిస్కెట్ ప్రతినిధి తెలిపారు. అంతే తప్పా ఉద్యోగుల్ని తొలగించడం లేదని అన్నారు. లేఆఫ్స్పై వస్తున్న నివేదికల్ని కొట్టి పారేశారు. ఈ సందర్భంగా ‘మిల్క్ బిస్కెట్ ప్రస్తుతం, 24 నగరాల్లో కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. టైర్-1 సిటీల్లో డైలీ సబ్స్క్రిప్షన్ సర్వీసుల్ని అందించడమే తమ లక్ష్యమని’ పేర్కొన్నారు. ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం, రిలయన్స్ మిల్క్బాస్కెట్ బ్రాండింగ్ను రీటైల్ విభాగంలో కలిపేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, కొంత కాలం మిల్క్బాస్కెట్ బ్రాండ్గా కొనసాగనుంది. మిల్క్ బాస్కెట్ను విడిచి పెట్టిన ఇటీల మిల్క్ బాస్కెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యతీష్ తల్వాడియా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభినవ్ ఇమండీ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గౌరవ్ శ్రీవాస్తవ కంపెనీని విడిచిపెట్టారు. సంస్థను విడిచిపెట్టిన చివరి కోఫౌండర్ తల్వాడియా కాగా, ఇతర సహ వ్యవస్థాపకులు ఆశిష్ గోయెల్, అనురాగ్ జైన్, అనంత్ గోయెల్లు 2021లో ఆ సంస్థను రియలన్స్ కొనుగోలు చేసిన తర్వాత నిష్క్రమించారు. కాగా, మిల్క్ బాస్కెట్లో మొత్తం 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.