-
మరమరాలతో వడ.. సింపుల్గా ఇలా చేసుకోండి
మరమరాల వడ.. తయారీకి కావలసిన పదార్ధాలు మరమరాలు – 3 కప్పులు (నీటిలో నానబెట్టి, గట్టిగా పిండి ఒక బౌల్ల్లోకి తీసుకోవాలి) పెరుగు – 3 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి – పావు కప్పు మైదా పిండి – పావు కప్పు అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సోంపు – 1 టీ స్పూన్ చొప్పున తెల్ల నువ్వులు – 1 టీ స్పూన్ + గార్నిష్కి కారం – ఒకటిన్నర టీ స్పూన్, నీళ్లు – కొన్ని ఉప్పు – తగినంత, గరం మసాలా – పావు టీ స్పూన్, పంచదార – 2 టీ స్పూన్లు, నిమ్మ రసం – 1 టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర తురుము – కొద్దిగా తయారీ విధానం ముందుగా మరమరాలను గట్టిగా పిసికి, అందులో పెరుగు వేసుకుని బాగా కలిపి, 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. అనంతరం అందులో గోధుమ పిండి, మైదా పిండి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సోంపు, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు, కారం, ఉప్పు, గరం మసాలా, పంచదార, నిమ్మరసం, 3 టీ స్పూన్ల నూనె, కొత్తిమీర తురుము వేసుకుని బాగా ముద్దలా చేసుకోవాలి. అవసరమయితే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. ఆ ముద్దను చిన్న చిన్న కట్లెట్స్ మాదిరి చేసుకుని, ప్రతి కట్లెట్కి కాస్త తడి చేసి, పైన నువ్వులు పెట్టి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. -
పీనట్ ఐస్క్రీమ్ ఎప్పడైనా ట్రై చేశారా? సింపుల్ రెసిపి
పీనట్ ఐస్క్రీమ్ తయారీకి కావల్సినవి: స్వీటెండ్ కండెన్సడ్ మిల్క్ – 400 గ్రాములు హెవీ క్రీమ్ – 480 ఎమ్ఎల్,పీనట్ బటర్ – 250గ్రాములు వేరుశనగలు – 70 గ్రాములు (దోరగా వేయించి, తొక్క తీసి, కచ్చాబిచ్చా చేసుకోవాలి) తయారీ విధానమిలా: ముందుగా ఒక పెద్ద గిన్నెలో హెవీ క్రీమ్ వేసుకుని హ్యాండ్హెల్డ్ మిక్సర్తో బాగా నురుగు వచ్చేలా, క్రీమీగా చేసుకోవాలి. దానిలో కండెన్సడ్ మిల్క్, పీనట్ బటర్ వేసుకుని.. బాగా కలుపుకోవాలి. మెత్తగా క్రీమీగా మారిన తర్వాత.. దానిలో కచ్చాబిచ్చా చేసుకున్న వేరుశనగ ముక్కల్ని కలుపుకోవాలి. అనంతరం ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. సమాంతరంగా చేసుకోవాలి. 6 గంటలు పాటు ఫ్రిజ్లో పెట్టుకుని.. ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి. -
బేకరి స్టైల్లో స్వీట్ రైస్ కేక్.. ఇలా చేసుకోండి
స్వీట్ రైస్ కేక్ తయారీకి కావల్సినవి: బియ్యప్పిండి –100 గ్రాములు మైదాపిండి, మొక్కజొన్న పిండి – అర టేబుల్ స్పూన్ చొప్పున బ్రౌన్ షుగర్ – 60 గ్రాములు,నీళ్లు – 1 కప్పు (గోరువెచ్చగా చేసుకోవాలి) నూనె – 2 టేబుల్ స్పూన్లు,గుడ్డు – 1 తయారీ విధానమిలా: ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు గోరువెచ్చని నీటిలో బ్రౌన్ షుగర్ను కరిగించాలి. అందులో బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, మైదాపిండి ఒకదాని తర్వాత ఒకటి జల్లెడ పట్టుకోవాలి. అనంతరం ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులో నూనె జోడించి, హ్యాండ్హెల్డ్ మిక్సర్తో బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న కేక్ కంటైనర్ లోపల కొద్దిగా నూనె రాసి, అందులో ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. అనంతరం 45 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించుకోవాలి. కేక్ చల్లారాక రాత్రంతా ఫ్రిజ్లో పెట్టుకోవాలి. అనంతరం నచ్చిన విధంగా కట్ చేసుకుని.. వాటిని గుడ్డు మిశ్రమంలో ముంచి ఇరువైపులా పాన్ పై వేయించుకుని సర్వ్ చేసుకోవాలి. -
ఒడిశా పాపులర్ డిష్:హబీషా దాల్మా..సింపుల్గా, టేస్టీగా
హబీసా దాల్మా తయారీకి కావల్సినవి: పెసర పప్పు – కప్పు; అరటికాయ – పెద్దది ఒకటి; చేమదుంపలు – నాలుగు; టొమాటో – ఒకటి; పచ్చిబొ΄్పాయి – చిన్నది ఒకటి; అల్లం – అంగుళం ముక్క; నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకులు – నాలుగు; ఎండు మిర్చి – ఏడు; జీలకర్ర – మూడు టేబుల్ స్పూన్లు; ఆవాలు – టీస్పూను; పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: ►ముందుగా నాలుగు ఎండు మిర్చి, రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను దోరగా వేయించి పొడిచేసి పెట్టుకోవాలి. అరటికాయ, చేమ దుంపలు, బొప్పాయి తొక్కతీసి ముక్కలుగా తరగాలి. అల్లం, టొమాటోను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పెసరపప్పు కడిగి కుక్కర్లో వేయాలి.అందులో మూడు కప్పుల నీళ్లు, అరటి, చేమ, బొప్పాయి, అల్లం ముక్కలు, బిర్యానీ ఆకులు వేయాలి. ► రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టాలి. పెద్ద మంటమీద ఒక విజిల్ రానిచ్చి దించేయాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. వేడెక్కిన నెయ్యిలో మిగిలిన ఎండు మిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. ∙ఇవి వేగాక కుక్కర్లో ఉడికిన పప్పు మిశ్రమాన్ని వేసి కలపాలి. ∙ఇప్పుడు కొత్తిమీర తరుగు, పచ్చికొబ్బరి తరుము, మిర్చి, జీలకర్ర పొడి వేసి ఐదు నిమిషాలు మగ్గనిస్తే హబీసా దాల్మా రెడీ. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవాలి. -
స్వీట్ పొటాటోతో బిస్కెట్స్.. మీరెప్పుడైనా ట్రై చేశారా?
స్వీట్ పొటాటో బిస్కెట్స్ తయారీకి కావల్సినవి: చిలగడ దుంపలు – పావు కేజీ; పాలు – ముప్పావు కప్పు; మైదా – ఒకటిన్నర కప్పులు; కార్న్ స్టార్చ్ – రెండు టేబుల్ స్పూన్లు; పంచదార – రెండున్నర టేబుల్ స్పూన్లు; వంటసోడా – టేబుల్ స్పూను; ఉప్పు – ఒకటింబావు టీస్పూన్లు; బటర్ – అరకప్పు. తయారీ విధానమిలా: ►చిలగడ దుంపలను ఉడికించి తొక్కతీసి చిదిమి, అందులో పాలుపోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మిక్సీజార్లో కార్న్ స్టార్చ్, పంచదార, మైదా, వంటసోడా వేసి రెండు నిమిషాలు గ్రైండ్ చేయాలి. ► ఇప్పుడు బటర్, ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో చిలగడ దుంప చిదుము వేసి పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేటులో పెట్టి ముప్పావు అంగుళం మందంలో ఉండేలాగా, సమంగా ఒకటే మందంలో ఉండేటట్లు సర్దాలి. ► ఇప్పుడు చాకుతో ఇష్టమైన ఆకారంలో ముక్కలుగా కట్ చేయాలి. పిండి చేతులకు అతుక్కుంటూ ఉంటే పొడి పిండి (మైదా) చల్లుకోవాలి. ఈ ముక్కలను బేకింగ్ ట్రేలో పెట్టి 360 డిగ్రీల ఉష్ణోగ్రతలో పదిహేను నిమిషాలు బేక్ చేయాలి. ముక్కలు గోల్డెన్ కలర్లోకి మారితే స్వీట్ పొటాటో బిస్కెట్స్ రెడీ ∙గాలి చొరబడని డబ్బాలో నిల్వచేస్తే మూడు నెలలు పాడవకుండా ఉంటాయి. -
కమ్మని కార్తీకం.. కొర్రలతో లడ్డూ, రోజుకి ఒకటి తింటే చాలు
కార్తీక మాసం కావడంతో... కోవెళ్లు, లోగిళ్లు దీపాలతో కళకళలాడిపోతున్నాయి. మరో రెండురోజుల్లో కార్తీకపౌర్ణమి. పగలంతా ఉపవాసం ఉన్నవారికి సాయంత్రం చంద్రోదయం కాగానే రుచిగా... శుచిగా కమ్మని వంటలతో ఉపవాస విరమణ చేయమని చెబుతోంది ఈ వారం వంటిల్లు. తినాయ్(కొర్ర) లడ్డు తయారీకి కావల్సినవి: కొర్రలు – కప్పు; పల్లీలు – కప్పు; బెల్లం తరుగు – కప్పు; యాలకులు – మూడు. తయారీ విధానమిలా: ►కొర్రలను శుభ్రంగా కడిగి అరగంట నానబెట్టాలి. అరగంట తరువాత నీటిని వంపేసి ఎండలో ఆరబోయాలి. తడిలేకుండా ఎండిన కొర్రలను బాణలిలో వేసి బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు దోరగా వేయించాలి. ► కొర్రలు వేగిన బాణలిలోనే పల్లీలను వేసి వేయించాలి. పల్లీలు చక్కగా వేగిన తరువాత పొట్టుతీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే బాణలిలో బెల్లం, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లుపోసి సన్నని మంట మీద పెట్టాలి. ►బెల్లం కరిగిన తరువాత వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కొర్రలు, పల్లీలు, యాలకులను మిక్సీజార్లో వేసి పొడి చేయాలి.కొర్రలు, పల్లీల పొడిని ప్లేటులో వేసుకుని, ఆ పొడిలో బెల్లం నీళ్లు వేస్తూ లడ్డులా చుట్టుకుంటే తినాయ్ లడ్డు రెడీ. బెల్లం ఇష్టపడని వారు తేనెతో లడ్డులూ చుట్టుకోవచ్చు. ఈ లడ్డు మూడు నాలుగురోజుల పాటు తాజాగా ఉంటుంది. -
ఆరేంజ్ జ్యూస్తో హల్వా.. ఎప్పుడైనా ట్రై చేశారా?
ఆరెంజ్ హల్వా తయారీకి కావల్సినవి: ఆరెంజ్ – 3 (జ్యూస్ తీసుకుని, వడ కట్టుకోవాలి) మొక్కజొన్న పిండి – అర కప్పు పంచదార – 1 కప్పు (నీళ్లు పోసుకుని లేతగా పాకం పట్టుకోవాలి) దాల్చినచెక్క పొడి – చిటికెడు ఫుడ్ కలర్ – ఆరెంజ్ కలర్ నట్స్ తరుగు – కొద్దిగా (గార్నిష్కి) తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో మొక్కజొన్న పిండి తీసుకుని.. అందులో ఆరెంజ్ జ్యూస్, ఫుడ్ కలర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. పంచదార పాకంలో నిమ్మరసం, దాల్చినచెక్క వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం దగ్గర పడుతున్న సమయంలో ఆరెంజ్ మిశ్రమాన్ని వేసుకుని తిప్పుతూ ఉండాలి. బాగా దగ్గరపడిన తర్వాత ఒక బౌల్కి నెయ్యి రాసి.. అందులో ఆ మిశ్రమాన్ని వేసుకుని, నట్స్ తరుగు జల్లుకుని చల్లారనివ్వాలి. దగ్గర పడిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి. -
క్రిస్పీ చికెన్ నూడుల్స్.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది
నూడుల్ చికెన్ తయారీకి కావల్సినవి: బోన్ లెస్ చికెన్ – అర కిలో (సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి) నూడుల్స్ – 2 కప్పులు (ఉడికించి, కాస్త చల్లార్చినవి) గుడ్డు – 1,చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ – పావు కప్పు+1 టేబుల్ స్పూన్ అల్లం–వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా – అర టేబుల్ స్పూన్ చొప్పున టొమాటో సాస్ – 2 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి – పావు టీ స్పూన్ ఉప్పు – తగినంత నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా చికెన్ ముక్కల్లో చిల్లీ సాస్, గరం మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, టొమాటో సాస్, కారం, మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్, గుడ్డు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలిపి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఉడికించిన నూడుల్స్లో కార్న్ పౌడర్ వేసుకుని అటూ ఇటూ గరిటెతో కలిపి.. ఒక ప్లేట్లో కొన్ని నూడుల్స్ పరచుకుని.. ఒక్కో చికెన్ ముక్కను అందులో పెట్టి చుట్టుకోవాలి. పుల్ల గుచ్చి.. ఒక్కొక్కటిగా కాగుతున్న నూనెలో వేసుకుని, దోరగా వేయించుకోవాలి. -
ఆమ్లా ఛుందా..ఇలా చేస్తే ఎక్కువకాలం తాజాగా ఉంటుంది
ఆమ్లఛుందా తయారీకి కావల్సినవి: ఉసిరికాయలు – అరకేజీ; బెల్లం – అరకేజీ; అల్లం – చిన్నముక్క; బ్లాక్సాల్ట్ – ఒకటిన్నర టీస్పూన్లు; మిరియాలు – టీస్పూను; యాలక్కాయలు – ఎనిమిది; దాల్చిన చెక్క – అంగుళం ముక్క; పసుపు – టీస్పూను; కశ్మీరీ కారం – ఒకటిన్నర టీస్పూన్లు; గరం మసాలా – అర టీస్పూను; నిమ్మకాయలు – రెండు. తయారీ విధానమిలా: ►ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, ఆవిరి మీద మెత్తగా (10 నిమిషాలు) ఉడికించాలి ∙అల్లాన్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి ∙యాలక్కాయలు, మిరియాలను విడివిడిగా దంచి పెట్టుకోవాలి ∙ఉడికిన ఉసిరికాయలు చల్లారాక గింజలు తీసి సన్నగా తురుముకోవాలి. ఉసిరి తురుములో బెల్లం వేసి మీడియం మంట మీద పెట్టాలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ►నీరు పైకి తేలగానే అల్లం తురుము, బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి, యాలకుల పొడిని వేయాలి ∙దాల్చిన చెక్కను తుంచి వేయాలి ∙చివరిగా పసుపు వేసి కలుపుతూ ఉడికించాలి ∙మీడియం మంట మీదే ఉంచి కలుపుతూ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు కారం, గరంమసాలా వేసి కలపాలి. బాగా కలిసిన తరువాత దించేసి, నిమ్మరసం పిండితే ఆమ్లా ఛుందా రెడీ. గమనిక: గాజు లేదా పింగాణీ పాత్రల్లో నిల్వ చేస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. -
క్యాన్సర్ ముప్పుని తగ్గించే ఉసిరి.. పచ్చడి పెట్టుకోండిలా
తిన్న తిండి ఒంటికి పట్టేలా చేయడంతో ఉసిరి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచడం, క్యాన్సర్ ముప్పుని తగ్గించడంలో ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇన్ని సుగుణాలు ఉన్న ఉసిరి ప్రస్తుతం మార్కెట్లో దండిగా దొరుకుతోంది. అందుకే ఊరించే ఉసిరిని మరింత రుచిగా ఇలా చేసుకోమని చెబుతోంది ఈ వారం మన వంటిల్లు... స్పైసీ పచ్చడి తయారికి కావలసినవి: ఉసిరికాయలు – ఆరు; పచ్చి శనగపప్పు – పావు కప్పు; పచ్చిమిర్చి – మూడు; వెలుల్లి రెబ్బలు – నాలుగు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – టీస్పూను; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీస్పూను; పసుపు – పావు టీస్పూను; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర తరుగు – కాస్తంత తయారీ విధానమిలా: పచ్చిశనగపప్పుని శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ∙ఉసిరికాయలను శుభ్రంగా కడిగి గింజలు తీసేసి ముక్కలుగా తరుగుకోవాలి. ∙ఉసిరికాయ ముక్కలు, నానిన శనగపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లుపోసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ అయిన పచ్చడిని గిన్నెలోకి తీసుకోవాలి ∙బాణలిలో నూనె వేసి, ఆవాలు జీలకర్ర, ఇంగువ, పసుపు, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి ∙ఈ తాలింపుని పచ్చడిలో వేసి కలపాలి. చివరిగా కొత్తిమీర తరుగు వేసి కలిపితే స్పైసీ పచ్చడి రెడీ. చపాతీ, రోటీ, అన్నంలోకి ఈ పచ్చడి చాలా బావుంటుంది. -
పిల్లలకు ఇష్టమైన బనానా మోదక్.. ఇలా ట్రై చేయండి
బనానా మోదక్ తయారికి కావలసినవి: గోధుమ పిండి – కప్పు; అరటిపండ్లు – రెండు; బెల్లం – మువు కప్పు; పచ్చికొబ్బరి తురుము – టేబుల్ స్పూను; అటుకులు – రెండు టేబుల్ స్పూన్లు; సూజీ రవ్వ – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – చిటికెడు; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు; యాలకుల పొడి – పావు టీస్పూను; నూనె – డీప్ఫ్రైకి సరిపడా. తయారీ విధానమిలా: అరటిపండ్లు, బెల్లం, కొబ్బరి తురుము, అటుకులు, సూజీరవ్వను మిక్సీజార్లో వేసి కొద్దిగా నీళ్లుపోసి పేస్టులా గ్రైండ్ చేయాలి ∙ఈ పేస్టుని పెద్దగిన్నెలో వేసి... గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి, యాలకుల పొడి అన్ని కలిసిపోయేలా చక్కగా కలపాలి ∙ఇప్పుడు ఈ పిండిని మోదక్లా లేదా నచ్చిన ఆకారంలో చేసుకుని మరుగుతోన్న నూనెలో వేసి డీప్ ఫ్రైచేయాలి ∙మీడియం మంట మీద రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రె చేస్తే బనానా మోదక్ రెడీ. -
పాలపొడితో దీపావళి కోసం స్పెషల్ స్వీట్.. చేసుకోండిలా
షీర్ పీరా తయారికి కావల్సినవి: పంచదార – కప్పు; పాల పొడి – రెండు కప్పులు; బాదం పలుకులు – టేబుల్ స్పూను; జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూను; పిస్తా పలుకులు – టేబుల్ స్పూను; కిస్మిస్ – టేబుల్ స్పూను; యాలకులు – నాలుగు; నెయ్యి – టేబుల్ స్పూను; గార్నిష్ కోసం.... పిస్తా, బాదం, జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూను (పెద్దసైజువి). తయారీ విధానమిలా: డ్రైఫ్రూట్స్ పలుకులు సన్నగా పొడవుగా ఉండేలా తీసుకోవాలి. మందపాటి బాణలిలో పంచదార, కప్పు నీళ్లుపోసి మంటమీద పెట్టాలి తీగపాకం వచ్చేంత వరకు మరిగించాలి.తీగపాకం వచ్చినప్పుడు సన్నమంటమీద ఉంచాలి ∙ఇప్పుడు పాల పొడిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి.పాలపొడి దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి ∙ దగ్గర పడుతున్నప్పుడు బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు, కిస్మిస్ ముక్కలను వేసి కలపాలి ∙చివరిగా యాలకులను పొడిచేసి వేయాలి ∙ప్లేటుకును నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేయాలి ∙ప్లేటంతా సమంగా పరుచుకుని పైన కొద్దిగా పిస్తా, బాదం, జీడిపప్పు పలుకులు చల్లాలి ∙స్పూను పెట్టి పైన కూడా సమంగా వత్తుకుని ప్లేటుని రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙రెండు గంటల తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కట్చేసి సర్వ్ చేసుకోవాలి. -
సాయంత్రం టీలోకి బెస్ట్ ఆప్షన్.. మక్ పారా ఫ్లవర్స్
మక్ పారా ఫ్లవర్స్ తయారికి కావల్సినవి: మైదా– 2 కప్పులు, పంచదార పొడి– అర కప్పు, మిరియాల పొడి– అర టీస్పూన్, ఉప్పు– కొద్దిగా నూనె– 3 టేబుల్ స్పూన్లు,చిక్కటి పాలు– సరిపడా (కాచి చల్లారిన వి) నూనె– డీప్ ఫైకి సరిపడా, లవంగమొగ్గలు– కొన్ని(అభిరుచిని బట్టి) తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, మిరియాలపొడి, పంచదార పొడి, తగినంత ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా పాలు పోసుకుంటూ ముద్దల్లా చేసుకుని.. 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అనంతరం నచిన విధంగా ఫ్లవర్లా చేసుకోవచు. లేదా అభిరుచిని బట్టి ఒక ఫ్లవర్పై మరో ఫ్లవర్ ఉంచి, మధ్యలో ఒక్కో లవంగమొగ్గ గుచ్చి, కదలకుండా పెట్టుకోవచ్చు. అనంతరం వాటిని నూనెలో డీప్ ఫై చేసుకుంటే సరిపోతుంది. -
స్నాక్స్ కోసం బెస్ట్ రెసిపి.. పోహా వెజ్ కట్లెట్
పోహా వెజ్ కట్లెట్ తయారికి కావల్సినవి: అటుకులు – కప్పు; ఉడికించిన బంగాళ దుంపలు – రెండు; క్యాప్సికం తరుగు – రెండు టీస్పూన్లు; క్యారట్ తురుము – రెండు టీస్పూన్లు; పచ్చిబఠాణి – రెండు టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి – టీస్పూను; చాట్ మసాలా – టీస్పూను; కారం – టీస్పూను; పచ్చిమిర్చి పేస్టు – టీస్పూను; కార్న్ఫ్లోర్ – రెండు టేబుల్ స్పూన్లు; బ్రెడ్ ముక్కల పొడి – కప్పు; ఉప్పు – రుచికి సరిపడా;నూనె – డీప్ఫ్రైకి సరిపడా. తయారీ విధానమిలా: ►అటుకులను శుభ్రంగా కడిగి పదినిమిషాలు నానబెట్టుకోవాలి ∙పదినిమిషాల తరువాత నానిన అటుకుల్లో తొక్కతీసిన దుంపలు, బఠాణి, క్యాప్సికం, క్యారట్, కొత్తిమీర తరుగు వేయాలి ∙ ► పచ్చిమిర్చి పేస్టు, చాట్ మసాలా, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పువేసి ముద్దలా కలపాలి ∙పిండిని ఉండలుగా చేసి, కట్లెట్లా వత్తుకుని పక్కన పెట్టుకోవాలి ∙కార్న్ఫ్లోర్లో నీళ్లు పోసి పేస్టులా కలపాలి. ► ఒక్కో కట్లెట్ను కార్న్ఫ్లోర్ పేస్టులో ముంచి, తరువాత బ్రెడ్ ముక్కల పొడిని అద్దాలి ∙బ్రెడ్ ముక్కల పొడి అద్దిన తరువాత డీప్ ఫ్రై చేసుకోవాలి ∙గోల్డెన్ కలర్లోకి మారాక తీసి సాస్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయాలి. -
గుడ్డుతో పొంగనాలు.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
మసాలా ఎగ్ పనియరం తయారీకి కావల్సినవి: గడ్డ పెరుగు – 2 కప్పులు గుడ్డు – 3, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు – 1 టేబుల్ స్పూన్ చొప్పున కొత్తిమీర తురుము – కొద్దిగా అల్లం తురుము – అర టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ మిరియాల పొడి – పావు టీ స్పూన్ ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా పెరుగును రెండుమూడు సార్లు అటూ ఇటూ తిరగబోసుకుని సాఫ్ట్గా అయ్యేలా చేసుకోవాలి. అందులో గుడ్లు పగలగొట్టుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని.. దానిపై పొంగనాల పెనం పెట్టుకుని.. ప్రతి గుంతలో కొద్దికొద్దిగా నూనె వేసుకుని.. కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని వాటిలో వేసుకుని ఇరువైపులా వేయించుకోవాలి. వీటిని.. నచ్చిన చట్నీలో వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. -
కోకోనట్ మిల్క్ కేక్.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
కోకోనట్ మిల్క్ కేక్ తయారీకి కావల్సినవి: కొబ్బరి పాలు – అర లీటరు, పాలు – పావు లీటరు, పంచదార – పావు కప్పు, నిమ్మరసం – 1 టీ స్పూన్ పిస్తా, బాదం తురుము – గుప్పెడు(అభిరుచిని బట్టి మరిన్ని, నేతిలో వేయించుకోవాలి) తయారీ విధానమిలా: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. ఒక పాత్రలో పాలు పోసి.. చిన్న మంట మీద మరిగించాలి. తర్వాత కాసేపటికి నిమ్మరసాన్ని ఒక టేబుల్ స్పూన్ నీళ్లలో బాగా కలిపి.. మరుగుతున్న పాలలో చుక్క చుక్క చొప్పున వేస్తూ ఉండాలి. పాలు చిక్కబడే వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి. పాలు చిక్కబడుతున్నప్పుడు అందులో కొబ్బరిపాలు, పంచదార కలపాలి. కోవాలా అయ్యే వరకు మరిగించాలి. దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బౌల్ తీసుకుని, దాని లోపల నెయ్యి రాసి, ఈ మిశ్రమం మొత్తం వేసుకుని.. బాదం పిస్తా పలుకులు చల్లాలి. చల్లారిన తర్వాత నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. లేదంటే నచ్చిన విధంగా క్రీమ్స్తో గార్నిష్ చేసుకుని బర్త్డే కేక్లా తయారుచేసుకోవచ్చు. -
పాలక్ మేథీ పూరీ..ఇలా చేస్తే లొట్టలేసుకొని తింటారు
పాలక్ మేథీ పూరీ తయారీకి కావల్సినవి: జీలకర్ర – టేబుల్ స్పూను; సోంపు – టేబుల్ స్పూను; వాము – టీస్పూను; నువ్వులు – టేబుల్ స్పూను; ధనియాల పొడి – టేబుల్ స్పూను; రెండు కప్పులు; శనగపిండి – పావు కప్పు; పసుపు – అరటేబుల్ స్పూను; ఉప్పు – రుచికి సరిపడా; కారం – టేబుల్ స్పూను; నూనె –డీప్ఫ్రైకి సరిపడా పచ్చిమిర్చి – మూడు; అల్లం తరుగు – టీస్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; పాలకూర తరుగు – రెండు కప్పులు; మెంతికూర తరుగు – కప్పు; గోధుమ పిండి –రెండు కప్పులు తయారీ విధానం: జీలకర్ర, సోంపు, నువ్వులు, వాము, ధనియాల పొడి, పచ్చిమిర్చి; అల్లం తరుగు, కరివేపాకుని మిక్సీజార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాలకూర, మెంతికూర తరుగుని గిన్నెలో వేయాలి. దీనిలోనే గోధుమపిండి, శనగపిండి, కారం, పసుపు, గ్రైండ్ చేసిన మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, టేబుల్ స్పూను నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేడినీళ్లు చల్లుకుంటూ ముద్దలా కలపాలి ∙పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీలా మందంగా వత్తుకోవాలి ∙గుండ్రని గిన్నె లేదా చిన్న గ్లాసుతో పూరీని చిన్న చిన్న చెక్కల్లా కట్ చేయాలి ∙అన్నీ రెడీ అయ్యాక క్రిస్పీగా మారేంత వరకు డీప్ ఫ్రై చేస్తే రుచికరమైన పాలక్ మేథీ పూరీ రెడీ. -
బెస్ట్ స్నాక్ రెసిపి.. పనీర్ కుర్కురే, ఎప్పుడైనా ట్రై చేశారా?
పనీర్ కుర్కురే తయారీకి కావల్సినవి: నిలువుగా కోసిన పనీర్ ముక్కలు – రెండు కప్పులు; పసుపు – టీస్పూను; కారం – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; కసూరీ మేథీ – టేబుల్ స్పూన్; వాము – అరటీస్పూను; చాట్ మసాలా – టీస్పూను; గరం మసాలా – టీస్పూను; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; అల్లం వెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను; కార్న్ఫ్లేక్స్ – రెండు కప్పులు; శనగపిండి – రెండు కప్పులు; నూనె – డీప్ఫ్రైకి సరిపడా. తయారీ విధానమిలా: ►పనీర్ ముక్కలపైన చిటికెడు సాల్ట్, కారం, టేబుల్ స్పూను కొత్తిమీర తరుగు, చాట్ మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ► పెద్ద గిన్నె తీసుకుని శనగపిండి, వాము, అల్లం వెల్లుల్లి పేస్టు, కసూరీ మేథీ, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ► ఇప్పుడు నీళ్లు పోసి బజ్జీపిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ∙ఒక ప్లేటులో కార్న్ ఫ్లేక్స్ను నలిపి పెట్టుకోవాలి ► ఇప్పుడు ఒక్కో పనీర్ ముక్కను తీసుకుని ముందుగా శనగపిండి మిశ్రమంలో ముంచాలి. తరువాత కార్న్ఫ్లేక్స్ను అద్ది సలసలా కాగుతోన్న నూనెలో వేసి డీప్ఫ్రై చేయాలి ∙పనీర్ ముక్క క్రిస్పీగా మారితే పన్నీర్ కుర్కురే రెడీ. -
కర్ణాటక పాపులర్ స్వీట్ రెసిపి మండిగె.. టేస్ట్ అదిరిపోతుంది
మండిగే తయారీకి కావల్సినవి: బొంబాయి రవ్వ – రెండు కప్పులు; గోధుమ పిండి – కప్పు; ఉప్పు – చిటికెడు; బెల్లం తరుగు – అరకప్పు; నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు; పచ్చకర్పూరం – చిటికెడు. తయారీ విధానం ఇలా: పెద్ద గిన్నెలో బొంబాయి రవ్వ, గోధుమ పిండి, ఉప్పు, టేబుల్ స్పూను నెయ్యివేసి కలపాలి. ఇప్పుడు నీళ్లు చల్లుకుంటూ చపాతీ ముద్దలా చేసుకోవాలి. దీనిపైన మూతపెట్టి ఇరవై నిమిషాలు పక్కన పెట్టాలి. బెల్లంలో మిగిలిన నెయ్యి, పచ్చకర్పూరం వేసి, కలిపి పక్కన పెట్టుకోవాలి ∙20 నిమిషాల తరువాత పిండిముద్దను ఉండలుగా చుట్టి, చపాతీలా వత్తుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ తీసుకుని,పైన రెండు టీస్పూన్ల బెల్లం మిశ్రమం వేసి చపాతీ అంతా పరచాలి. బెల్లం పరిచిన చపాతీపై మరో చపాతీని వేసి చ΄ాతీకర్రతో ఒకసారి వత్తుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని పెనం మీద వేసి రెండు వైపులా క్రిస్పీగా మారేంత వరకు కాల్చి తీసేయాలి. ఇలా కాలిన మండిగేను రెండు మూడు మడతలు వేసి సర్వ్ చేసుకోవాలి. -
అటుకులతో స్వీట్ రెసిపి.. టేస్ట్ బావుంటుంది ట్రై చేయండి
అటుకుల శక్కర్ పారే తయారీకి కావల్సినవి: అటుకులు – అర కప్పు (మిక్సీ పట్టుకుని పొడిలా చేసుకోవాలి) మైదా – 2 కప్పులు పంచదార – అర కప్పు నెయ్యి – 6 టేబుల్ స్పూన్లు నీళ్లు – కావాల్సినన్ని నువ్వులు – కొద్దిగా నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పంచదార, కొద్దిగా నీళ్లు పోసుకుని పంచదార కరిగేవరకు కలుపుకోవాలి. ఇప్పుడు అందులో నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత మైదా పిండి, అటుకుల పొడి, నువ్వులు వేసుకుని ముద్దలా చేసుకుని సుమారు గంటన్నర సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీల్లా ఒత్తుకుని నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. వాటిని నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. -
బ్రెడ్ తో రుచికరమైన స్నాక్స్..
కావలసినవి: బ్రెడ్ ముక్కలు – 1 కప్పు, ధనియాలు, జీలకర్ర – 1 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మెంతులు, మిరియాలు – పావు టీ స్పూన్ చొప్పున ఎండుమిర్చి – 3 లేదా 4. వెల్లుల్లి రెబ్బలు – 5, చింతపండు గుజ్జు – 1 టీ స్పూన్, పెరుగు – 5 టేబుల్ స్పూన్లు, పసుపు – అర టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు (చిన్నగా కట్ చేసుకోవాలి) కరివేపాకు – కొద్దిగా, నిమ్మకాయ రసం – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా ఒక పాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి.. అందులో ధనియాలు, జీలకర్ర , ఆవాలు, మెంతులు, మిరియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దోరగా వేయించి.. మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని.. అందులో బ్రెడ్ ముక్కలు, మిక్సీ పట్టుకున్న ధనియాలు–వెల్లుల్లి మిశ్రమం, పసుపు, పెరుగు, నిమ్మరసం వేసుకుని ముక్కలకు ఆ మిశ్రమం మొత్తం పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని.. అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని దోరగా వేగిన తర్వాత ధనియాలు–వెల్లుల్లి మిశ్రమం పట్టించిన బ్రెడ్ ముక్కలను వేసుకుని 2 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ ఉండాలి. అభిరుచిని బట్టి చివరిలో తాలింపు వేసుకుని కలియ తిప్పి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. (చదవండి: ఈ శాండ్విచ్ ధర వింటే..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం! ) -
బెంగాల్ పాపులర్ స్వీట్ లవంగ్ లతిక ఎప్పుడైనా ట్రై చేశారా?
లవంగ్ లతిక తయారీకి కావల్సినవి: మైదా – ముప్పావు కప్పు; ఉప్పు – రుచికి సరిపడా; పంచదార – కప్పు; లవంగాలు – పన్నెండు; నెయ్యి – డీప్ఫ్రైకి సరిపడా. స్టఫింగ్ కోసం: కోవా తురుము – ముప్పావు కప్పు; బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు – అరకప్పు; వేడిపాలు – అరటీస్పూను; కుంకుమ పువ్వు రేకులు – పావు టీస్పూను; పంచదార పొడి – పావు టీస్పూను; యాలకుల పొడి – అరటీస్పూను. తయారీ విధానమిలా: మైదాలో టేబుల్ స్పూను నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి ∙పంచదారలో ఒకటిన్నర కప్పుల నీళ్లుపోసి మీడియం మంట మీద తిప్పుతూ సిరప్ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ∙స్టఫింగ్ కోసం తీసుకున్న పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి కలిపి పెట్టుకోవాలి.నానిన పిండిముద్దను ఉండలుగా చుట్టుకోవాలి. ఈ ఉండలను పూరీల్లా వత్తుకుని మధ్యలో రెండు రెండు టీస్పూన్ల స్టఫింగ్ను వేయాలి ∙ఇప్పుడు స్టఫింగ్ బయటకు రాకుండా రెండు పక్కలా పూరీని మూయాలి పూరీని తిరగేసి తెరచి ఉన్న మరోవైపుని కొద్దిగా తడిచేసి మూసివేయాలి. మడత ఊడి΄ోకుండా లవంగం గుచ్చాలి ఇలా అన్ని లతికలను తయారు చేసుకోవాలి. ఇప్పుడు సలల కాగుతోన్న నెయ్యిలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్ఫ్రై చేయాలి ∙చక్కగా వేగిన లతికలను టిష్యూపేపర్ మీద వేసుకోవాలి వీటిని తినాలనుకున్నప్పుడు పంచదార సిరప్ను వేడిచేసి దానిలో లతికలను వేసి పదిహేను నిమిషాలు ఉంచి, ఆ తరువాత సర్వ్ చేయాలి. -
మిల్లెట్స్తో హెల్దీగా కుకీస్.. పిల్లలు ఇష్టంగా తింటారు
ఊదల కుకీస్ తయారీకి కావల్సినవి: మైదా – 1 కప్పు, ఊదల పిండి – ఒకటిన్నర కప్పులు, బాదం పప్పు పొడి – ముప్పావు కప్పు సాల్టెడ్ బటర్, పీనట్ బటర్ – 100 గ్రా. చొప్పున చిక్కటి పాలు – కొద్దిగా, చాక్లెట్ క్రీమ్ – 1 కప్పు (చిప్స్ లేదా బిట్స్ని ఓవెన్లో కరిగించి పెట్టుకోవాలి) తయారీ విధానమిలా: మొదట పెద్ద బౌల్ తీసుకుని పటికబెల్లం పొడిని జల్లెడ పట్టుకోవాలి. అందులో సాల్టెడ్ బటర్, పీనట్ బటర్ వేసుకుని హ్యాండ్ బ్లెండర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో ఊదల పిండి, బాదం పప్పు పొడి వేసుకుని చేత్తో ముద్దలా కలపాలి. అవసరాన్ని బట్టి.. సరిపడా గోరు వెచ్చని పాలు పోసి కలుపుకోవచ్చు. దీన్ని అరగంట పాటు ఫ్రిజ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత చేత్తో బిస్కట్స్లా ఒత్తుకుని, ప్రీ హీట్ చేసిన ఓవెన్లో 170 డిగ్రీల సెల్సియస్ వద్ద 20 లేదా 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అనంతరం... కరిగిన చాక్లెట్ క్రీమ్లో ముంచి తీసి, పైన చాక్లెట్ కోన్ సాయంతో నచ్చిన షేప్లో డిజైన్స్ వేసుకుని.. కాసేపు ఆరనిచ్చి సర్వ్ చేసుకోవాలి. -
సగ్గుబియ్యం టిక్కీ.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
సగ్గుబియ్యం టిక్కీ తయారీకి కావలసినవి: సగ్గుబియ్యం – కప్పు; వేయించిన పల్లీలు – కప్పు; బంగాళ దుంపలు – రెండు; అల్లం – రెండు అంగుళాల ముక్క; పచ్చిమిర్చి – రెండు; జీలకర్ర – టీస్పూను; కొత్తిమీర తరుగు – పావు కప్పు; నిమ్మకాయ – అరచెక్క; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: సగ్గుబియ్యాన్ని దోరగా వేయించి, చల్లారాక పొడిచేసి పెట్టుకోవాలి ∙పల్లీలను బరకగా గ్రైండ్ చేసి సగ్గుబియ్యం పొడిలో కలపాలి. బంగాళ దుంపలను తొక్కతీసి ముక్కలుగా తరగాలి. ∙పచ్చిమిర్చి, అల్లం కూడా ముక్కలుగా తరగాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర తరుగు వేసి గ్రైండ్ చేయాలి. నలిగిన మిశ్రమాన్నీ, సగ్గుబియ్యం పొడిలో వేసి, రుచికి సరిపడా ఉప్పు, నిమ్మచెక్కను పిండి రసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత పిండిని టిక్కీల ఆకారంలో వత్తుకుని డీప్ఫ్రై చేస్తే సగ్గుబియ్యం టిక్కీలు రెడీ ∙కొత్తిమీర చట్నీతో ఈ టిక్కీలు చాలా రుచిగా ఉంటాయి. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
చపాతీతో క్రిస్పీ రోల్స్.. వెరైటీగా చేసుకోండిలా
క్రిస్పీ రోల్స్ తయారీకి కావల్సినవి: చపాతీలు – మూడు ; కొత్తిమీర తరుగు – అరకప్పు ; ఉడికించిన బంగాళ దుంపలు – రెండు; కారం – అరటీస్పూను; ధనియాల పొడి – టీస్పూను; గరం మసాలా – రెండు టీస్పూన్లు ; పచ్చిమిర్చి – రెండు; ఉల్లిపాయ – ఒకటి; చాట్ మసాలా – ఒకటిన్నర టీస్పూన్లు; గోధుమ పిండి –అర కప్పు; బియ్యప్పిండి – స్పూను; కార్న్ఫ్లోర్ – మూడు టీ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – డీప్ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ►చపాతీలను సన్నగా పొడవుగా తరిగి, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమంపై కొద్దిగా నీళ్లుచల్లి మరోసారి కలపాలి ∙ఇప్పుడు మెత్తగా మారిన చపాతీ మిశ్రమంలో కార్న్ఫ్లోర్, బియ్యప్పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి. ∙ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నని ముక్కలుగా తరగాలి. ► బంగాళదుంపలు తొక్కతీసి చిదుముకోవాలి. దీనిలో ధనియాల పొడి, గరం మసాలా; పచ్చిమిర్చి, ఉల్లి తరుగు, ఛాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ► ఇప్పుడు చేతులకు కొద్దిగా నూనె రాసుకుని దుంప మిశ్రమాన్ని రోల్స్గా చుట్టుకోవాలి గోధుమపిండిలో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా కలపాలి ∙ఇప్పుడు దుంపరోల్స్ను గోధుమపిండిలో ముంచి, తరువాత చపాతీ మిశ్రమాన్ని రోల్కు అద్దాలి. ► ఇప్పుడు రోల్ను మరుగుతోన్న నూనెలో వేసి, గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించి తీయాలి ∙ఇలా రోల్స్ అన్నింటిని వేయిస్తే క్రిస్పీ రోల్స్ రెడీ.